Trends

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే ఉన్న ఆమె మొన్న విడుదలైన ‘రాకస’ సినిమా నిర్మాతగా ఆమెకు మంచి విజయం అందుకున్నారు. కమర్షియల్‌గా నిలబడటమే కాదు, కంటెంట్‌తో కూడా మెప్పించింది. తెర వెనుక బిజీగా ఉంటూనే, తెర ముందు తన గ్లామర్‌ని మాత్రం తగ్గనివ్వడం లేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హడావుడిలోంచి ‘పది నిమిషాలు దొంగిలించాను’ …

Read More »

ఐపీఎల్ లో ధోనీ… ఇదే ఫైనల్ ఆన్సరా?

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చెపాక్ మైదానంలో వరుసగా చేదు జ్ఞాపకాలు మిగిలేలా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడమే కాకుండా, ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై వచ్చిన ఒక అప్‌డేట్ ఫ్యాన్స్ గుండెల్ని పిండేస్తోంది. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 44 ఏళ్ల ధోనీ, చెపాక్‌లో జరిగిన చివరి మ్యాచ్ ముగిశాక గ్రౌండ్ లోకి వచ్చి అభిమానులకు అభివాదం …

Read More »

అల్లాడిస్తున్న `బుండి బుగ్యో`… విమానాలు బంద్‌!

బుండి బుగ్యో-పేరు చిన్న‌దే అయినా.. ఏదో పెట్ నేమ్‌లా అనిపించినా.. ఇది పెద్ద ఎత్తున ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డేలా కూడా చేసింది. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ప్ర‌భుత్వాలు క‌ట్ట‌డి చేసే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అదే.. ఎబోలా వైర‌స్ వేరియెంట్ రూప‌మైన బుండి బ్యుగో. ప్ర‌స్తుతం ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. క‌రోనా టైపేనా? అవును! బుండి బ్యుగో …

Read More »

బంగారం అయిపోయింది ఇక వెండి

ప్ర‌స్తుతం పొదుపు మంత్రం ప‌ఠిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం చ‌మురు స‌హా బంగారం వంటివాటిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌భుత్వ ప‌రిధిలో చ‌మురు వినియోగం త‌గ్గించేందుకు కాన్వాయ్‌ల‌ను ఇప్ప‌టికే త‌గ్గించారు. ఇక‌, బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయొద్ద‌ని ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు చెప్పారు. అనంత‌రం.. దీనిపై క‌స్ట‌మ్స్ సుంకాన్ని 6-15 శాతానికి పెంచారు. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక‌.. ఈప‌రంప‌ర‌లో తాజాగా వెండి దిగుమ‌తుల‌పై ఏకంగా నిషేధం …

Read More »

ఎట్ట‌కేల‌కు లొంగిపోయిన భ‌గీర‌థ్

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సైబ‌రాబాద్ సీపీ ర‌మేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయ‌న‌ను పేట్ బ‌షీరాబాద్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారిస్తామ‌ని చెప్పారు. కాగా.. గ‌త వారం కింద‌టే భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోదైంది. అయితే.. ఆయ‌న త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు. వెతికేందుకు ఐదు ప్ర‌త్యేక బృందాల‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనూహ్యంగా శ‌నివారం రాత్రి …

Read More »

మాఫియా పాత్రల ప్రభావంతో తల్లి ప్రాణమే తీశాడు..

రాజాంలో జరిగిన స్పందన హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవమాసాలు మోసి పెంచిన తల్లినే కన్నకొడుకు స్నేహితుడి సాయంతో హతమార్చడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన కేవలం ఓ కుటుంబంలో విషాదం మాత్రమే కాదు.. ఆధునిక సాంకేతిక ప్రభావం, నియంత్రణలేని సెల్‌ఫోన్‌ వినియోగం, హింసాత్మక కంటెంట్‌ చిన్నారుల మనస్తత్వంపై ఎంతటి ప్రభావం చూపుతుందో చూపించిన ఉదంతంగా మారింది. జపాన్‌ యానిమేషన్‌లు, డాన్‌ చిత్రాలు, మాఫియా పాత్రల …

Read More »

‘బౌండరీలు’ దాటుతున్న టికెట్ రేట్లు!

ఐపీఎల్‌-2026లో అత్యధిక క్రేజ్‌ దక్కించుకున్న మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు టికెట్ విక్రయాలు ప్రారంభమైన వెంటనే అభిమానుల ఆగ్రహం వెల్లువెత్తింది. భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను అసాధారణ స్థాయిలో పెంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్షల సంఖ్యలో అభిమానులు ఆన్‌లైన్ క్యూలో నిలిచినా, కొద్ది నిమిషాల్లోనే ‘సోల్డ్ …

Read More »

నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ కొందరు పేపర్ లీక్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ …

Read More »

హార్దిక్ న్యూ టీమ్.. SRH, చెన్నై అంటున్నారే?

​ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ముంబై ఇండియన్స్ జట్టులో పెను మార్పులు జరగబోతున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరుతో ఈ ఫ్రాంచైజీతో ముగిసిందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌లకు అతను దూరం కావడం, కనీసం టీమ్ మెంబర్స్‌తో కలిసి ప్రయాణించకపోవడం చూస్తుంటే మేనేజ్‌మెంట్‌కు, హార్దిక్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని అర్థమవుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ …

Read More »

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ ఇచ్చిన నేపాలీలు తదనంతరం ఇళ్లల్లో పని మనుషులుగా మారిపోయారు. ఆపై పనిమనుషులుగా ఉంటూనే ఆయా ఇళ్లల్లోని విలువైన వస్తువులను గుర్తించి వాటిని చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారిని నేపాలీలు చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో …

Read More »

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు కదా. ఈ స్నాక్స్ ఇప్పటిదాకా వివిధ రకాల రంగుల్లో పిల్లలు, పెద్దల కళ్లను ఇట్టే ఆకట్టుకునేవి. ఎంత వద్దనుకున్నా… ఆ ప్యాకెట్ల కలర్లే ఆ స్నాక్స్ ను కొనేలా చేశాయి. అయితే ఇప్పుడు ఆ స్నాక్స్ ప్యాకెట్లు కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే వస్తాయట. స్నాక్స్ …

Read More »

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా పేపర్ లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పరీక్షకు ముందు రోజు 100కు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి …

Read More »