సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా వచ్చే ఐపీఎల్కు అందుబాటులో ఉండటం కష్టమే అని తెలుస్తోంది. దీంతో కమిన్స్ రాకుంటే ఆ ప్లేస్లో జట్టును నడిపించే లీడర్ ఎవరనే చర్చ నడుస్తోంది. ఈ రేసులో నలుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నా, వారి ప్లస్ మైనస్లు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సీనియర్ …
Read More »గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు మొబైల్ వాడొద్దని మందలించడంతో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఫ్లాట్ నంబర్ 907 బాల్కనీ నుంచి వీరు ముగ్గురూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకు దూకడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మృతులను పాఖి …
Read More »పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చినందుకు నిరసనగా, బంగ్లాకు మద్దతు తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా, దీని వెనుక పాక్ ఆడుతున్న పెద్ద రాజకీయ క్రీడ కనిపిస్తోంది. అయితే ఈ ‘సెలెక్టివ్ పార్టిసిపేషన్’ (నచ్చిన మ్యాచ్లే ఆడటం) …
Read More »ఆఖరి పోరులో కివీస్ను చిత్తు చేసిన టీమిండియా!
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, కివీస్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి …
Read More »భాగ్యనగరంలో గన్ కల్చర్.. డేంజరే!
తెలంగాణ ప్రభుత్వం… పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా తుపాకులు కలిగి ఉన్న జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అయితే.. తుపాకుల వినియోగం గత కొన్నాళ్ల వరకు పెద్దగా లేకపోయినా.. ఇటీవల కాలంలో ఇది పెరుగుతుండడం ప్రమాదకర సంకేతంగా మారింది. గత ఏడాది నిజామాబాద్లో నాటు తుపాకీల వినియోగం.. ఏకంగా పోలీసులపైనే కాల్పుల …
Read More »ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల ఫేమ్నే పెట్టుబడిగా తీసుకుని, తాము డబ్బులు పెట్టి వరుసగా హైదరాబాద్లో మల్టీప్లెక్స్లు కడుతోంది ఆ సంస్థ. ఈ దిశగా తొలి అడుగు పడింది గచ్చిబౌలిలోని ఏఎంబీ మల్టీప్లెక్స్తోనే. ఆ తర్వాత ఏఏఏ, ఏవీడీ, ఏఆర్టీ.. ఇలా వరుసగా మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. మహేష్ బాబుతో కలిసి మొదలుపెట్టిన ఏఎంబీ (గచ్చిబౌలి) …
Read More »పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం (జనవరి 31) పరాకాష్టకు చేరింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే బంగారంపై ఏకంగా రూ. 1.8 లక్షల మేర సంపద ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన బలహీన సంకేతాలే ఈ చారిత్రాత్మక పతనానికి ప్రధాన కారణమయ్యాయి. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు …
Read More »ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు అస్థిరంగా ఉంటాయనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అంతర్జాతీయంగా చోటుచేసుకునే రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయిస్తాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ …
Read More »‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర రాత్రికి మారిపోవటమే కాదు.. తర్వాతి రోజు ఎంతవరకు వెళుతుంది? ఎక్కడ క్లోజ్ అవుతుందన్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న బంగారు ధరలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇలా దూసుకెళుతున్న బంగారం ధరలతో రాబోయే రోజుల్లోతమ పరిస్థితేంటి? అంటూ సామాన్యులు షాక్ కు గురవుతున్నారు. బంగారం …
Read More »అర్ధరాత్రి అల్లకల్లోలం చేసిన కోహ్లీ
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా కోహ్లీకి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాదాపు 270 మిలియన్ల ఫాలోవర్లతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అందులో ఒక్క ప్రమోషన్ పోస్ట్ ఖరీదు కొన్ని కోట్లు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఐతే శుక్రవారం అర్ధరాత్రి ఈ …
Read More »10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక మొబైల్లో ఏకంగా 10,001 mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 ఇంచుల …
Read More »కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన
అమ్మాయిది అగ్రకులం… అబ్బాయిది వెనుకుబడిన కులం…ఇద్దరూ ప్రేమించుకున్నారు…కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు…ఆ తర్వాత ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది…అది చూసి ఓర్వలేని అమ్మాయి తరఫు వాళ్లు ఆ ఇద్దరినీ పరువు హత్య చేశారు..ఇటువంటి రియల్, రీల్ స్టోరీలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ, తన ప్రేమను అంగీకరించలేదని కన్న తల్లిదండ్రులనే కర్కశంగా కడతేర్చిన కసాయి కూతురి స్టోరీ ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపింది. వికారాబాద్ లోని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates