Trends

మార్కెట్ పతనం.. భారత సంపన్నులు ఎంత కోల్పోయారు?

ఒక్క రోజు మార్కెట్ పతనంతో ప్రపంచ కుబేరులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం స్టాక్ మార్కెట్లను హడలెత్తించింది. దాంతో పాటు దేశీయంగా కూడా మార్కెట్లు నేలచూపులు చూశాయి. దీంతో భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు తమ సంపదలో భారీగా కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే భారత కుబేరులు …

Read More »

10,000 ఏళ్ల తరువాత పునర్జన్మించిన నక్కలు.. ఎలా సాధ్యమైంది?

అమెరికాలోని శాస్త్రవేత్తలు చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయాన్ని తిరిగి రాశారు. ఐస్ ఏజ్‌లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో గర్జించిన ‘డైర్ వుఫ్స్‌’కు సంబంధించిన జీనెటిక్స్‌ను తిరిగి సృష్టించడంలో ఘన విజయాన్ని సాధించారు. కోలస్సల్ బయోసైన్సెస్‌ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధకులు జీన్లు సవరించి, మూడు డైర్ వుఫ్‌లలాంటి నక్క పిల్లలను అభివృద్ధి చేశారు. వీటి వయస్సు మూడు నుండి ఆరు నెలల మధ్య ఉండగా, ప్రస్తుతం అమెరికాలో ఓ …

Read More »

రోహిత్ – హార్దిక్.. ఎదురుగా కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్స్!

ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్‌తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ పట్టలేని ఆనందం, మరోవైపు హార్దిక్ పాండ్య దిగులుతో కూర్చున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారితో పాటు ముంబయి స్టార్ రోహిత్ శర్మ స్పందన కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురు క్రికెటర్లు టీమిండియా తరఫున కలసి ఎన్నో …

Read More »

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే.. కాస్తంత కఠినమైనా ఈ తరహా మాటలే సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఘటన గురించి వింటే…ఈ మాటలు కూడా తక్కువేనేమోనని చెప్పాలి. ఎందుకంటే… సీనియర్ ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై 23 మంది మానవ మృగాలు కీలక పర్వాన్ని కొనసాగించాయి. అది కూడా ఏకంగా 7 రోజుల …

Read More »

ఈ కండక్టర్ టికెట్లు కొట్టడం కష్టమే!

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం ఆయనకు చేత కాదు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆయనకు అంతకంటే కూడా కష్టమేమీ కాదు. వచ్చిన చిక్కల్లా… తలను ఓ పక్కకు వేలాడేసి.. అలా సొరుగుతూ సొరుగుతూ బస్సులో ఆ చివర నుంచి ఈ చివర దాకా, ఈ చివర నుంచి ఆ చివర దాకా …

Read More »

బ‌ట్ట‌త‌ల‌ పై జుట్టు: ఎంతమంది బకరాలో చూడండి

తిమిరి ఇసుక‌న తైలంబు తీయ‌వ‌చ్చు.. అని భ‌తృహ‌రి శుభాషితం చెబుతున్నా.. బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు మొలిపించ‌డం మాత్రం ఎవ‌రికీ సాధ్యం కాదనేది అంద‌రికీ తెలిసిందే. లేక‌పోతే.. ప్ర‌పంచ కుబేరులు సైతం.. బ‌ట్ట‌త‌ల‌తోనే ఎందుకు బ‌తుకుతారు? అనేది ప్ర‌శ్న‌. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారుకూడా.. విగ్గుల‌ను ఎందుకు ఆశ్ర‌యిస్తార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సో.. బ‌ట్ట‌త‌ల‌ పై వెంట్రుక‌లు మొలిపించ‌డం అన్న‌ది సాధ్యం కాదు. ఈ విష‌యం తెలిసి కూడా.. కొంద‌రు మోస‌పోతూనే ఉన్నారు. మోస‌కారులు …

Read More »

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి… చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిణి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా సుగాలి రమ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పీలేరు కేంద్రంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం …

Read More »

సన్ రైజర్స్.. ఎవరయ్యా ఈ సిమర్‌జీత్‌ సింగ్‌?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోర్లా పడుతోందనే విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్‌లో బలహీనంగా మారిన ఆరెంజ్ ఆర్మీ, నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హోం మ్యాచ్‌లో మరోసారి తడిసిముద్దైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి ప్రధాన కారణం ఒక్క బౌలర్‌గా హైలైట్ అయ్యాడు.. అతనే సిమర్‌జీత్‌ సింగ్‌. మొదటి ఐదు ఓవర్లలో పట్టు సాధించిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఒక్క ఓవర్‌తో మొత్తం …

Read More »

మార్కెట్ దారుణంగా పడిన వేళలో.. బఫెట్ ఆస్తి రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో తెలిసిందే.ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ ఆగమాగం అవుతోంది. ఓవైపు యుద్ధ భయాలు. మరోవైపు ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలతో ప్రపంచంలో తోపు కంపెనీల షేర్లు సైతం దారుణంగా నష్టపోవటం తెలిసిందే. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. నష్టాల బాట పట్టిన …

Read More »

సెలబ్రేషన్‌కి ఫైన్.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో వార్తల్లోకెక్కాడు. ముంబయి ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నామన్ ధీర్ వికెట్ తీసిన అనంతరం ఆయన మళ్లీ అదే సెలబ్రేషన్ చేశారు. గతంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత రాథి ఇదే పద్ధతిలో సెలబ్రేట్ చేయగా, బీసీసీఐ అతడిపై 25 శాతం మ్యాచ్ ఫీజు …

Read More »

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది. మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా …

Read More »

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ తరవాత పూర్తిగా తడబడింది. వరుసగా మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరికి జారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలవడంతో రెండు పాయింట్లకే పరిమితమైంది. నేడు గుజరాత్ టైటన్స్‌తో హోం గ్రౌండ్‌లో తలపడబోతుండగా, ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకం. బ్యాటింగ్‌లో ఒక్క మ్యాచ్ తప్ప …

Read More »