కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ.. విద్యార్థులకు పాఠంగా మారనుంది. ఎన్ సీఆర్ టీ నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల్లో దీనిని ఒక విభాగంగా చేర్చనున్నారు. అయితే.. దీనిని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు ఎన్ సీ ఈఆర్టీ పేర్కొంది. సర్ ప్రక్రియను అత్యంత కీకలమైందిగా పేర్కొన్న ఎన్సీఆర్టీ.. దీనిపై భావితరాలకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సర్ ప్రక్రియలో …
Read More »యాపిల్ ధరలు పెరిగాయండోయ్
కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను ఏకంగా 20 నుంచి 42 శాతం వరకు పెంచేసింది. ఇండియాలో కూడా ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు M5 ప్రో చిప్ తో వచ్చే 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో లాంచ్ ప్రైస్ దాదాపు రెండున్నర లక్షలు ఉండగా, ఇప్పుడు …
Read More »దెబ్బ మీద దెబ్బ, ఆర్థిక మాంద్యం, అస్తవ్యస్తం… ఇపుడు భూకంపం
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పొరుగున ఉన్న వెనుజులా బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సంభవించిన భూకంపాలతో ఒక్కసారిగా చివురుటాకులా వణికి పోయింది. భారీ భూకంపం ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రపంచంలోనే తొలిసారి ఇంత పెద్ద భూకంపం సంభవించినట్టు అమెరికా భూగర్భ శాస్ట్ర విభాగం పేర్కొంది. ఈ ప్రమాదంలో వేల మంది పౌరులు మృతి చెంది ఉంటారని తెలిపింది. భవనాల శిధిలాల కింద శవాలగుట్టలు పేరుకుపోయిన ఫొటోలను ఈ విభాగం …
Read More »భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత 7.2 తీవ్రతతో, ఆ వెంటనే 39 సెకన్ల వ్యవధిలో మరో 7.5 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప కేంద్రం కరాకస్కు పశ్చిమాన ఉన్న మోరాన్ ప్రాంత సమీపంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భీకర ప్రకంపనల ధాటికి కరాకస్లో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాస …
Read More »ఇండియాలో పౌరసత్వానికి అసలైన ఆధారమేది?
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసమే తప్ప, అది భారతదేశ పౌరసత్వానికి అసలైన ఆధారమేమీ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సాధారణ జనాల్లో ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ప్రభుత్వమే ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చే పాస్పోర్టే …
Read More »టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి వైభవ్కు నో ఎంట్రీ
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడికి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పుడూ ఉండేందుకు పర్మిషన్ లేదు. జట్టులో ఒక ముఖ్యమైన సభ్యుడే అయినప్పటికీ ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెట్టిన కఠినమైన వయసు నిబంధనల వల్ల ఈ ఆంక్షలు విధించారు. దీనివల్ల స్టేడియంలో వైభవ్కు కేవలం అతని …
Read More »ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ అనే పాతికేళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని అందరూ భావించారు. తన పుట్టినరోజు వేడుకల కోసం కాబోయే భర్తతో కలిసి అక్కడికి వెళ్లానని, ఫొటోలు తీస్తుండగా కాలు జారి పడిపోయాడని అతని ప్రియురాలు సియా గోయల్ పోలీసులను నమ్మించే …
Read More »కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….
పెళ్లయిన తర్వాత.. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్. ఈ క్రమంలో ఒకప్పుడు భార్యలను చంపే భర్తల వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగు చూసేవి. అయితే.. ఇటీవల కాలంలో భార్యలే ముదిరిపోయారు. భర్తలను వారే వదిలించుకుంటున్నారు. తాజాగా దీనిని మించిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇంకా పెళ్లి కూడా కాని సమయంలోనే కాబోయే భర్తను ఓ యువతి దారుణంగా చంపేసింది. దీనికి ఆమె ప్రియుడి సహకారం కూడా తోడైంది.పైగా.. …
Read More »యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. వరుసగా ప్రధానులు మారుతుండటంతో అక్కడి రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్ ఇంత త్వరగా తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో …
Read More »రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. సమయం మించిపోయిందనే కారణంతో తన కుమార్తెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదంటూ ఓ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరోచోట పరీక్షకు అనుమతి ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్న తండ్రి దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. …
Read More »ఈ తప్పులకూ అంత పెద్ద శిక్షా…?
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది. వెరసి దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్తులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రానికి కాలేదన్న కారణంలో పరీక్ష రాయలేకపోయారు. ఈ సందర్బంగా చాలా ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. తమ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కాళ్లావేళ్లా పడిన తీరు …
Read More »అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది. తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates