Trends

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ 4.0 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,82,38,795 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న జనాభాను లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 66.05 శాతం పరీక్షలు నిర్వహించారు. సర్వేలో భాగంగా ఆగస్టు వరకు రాష్ట్రంలో మొత్తం 59.29 లక్షల …

Read More »

చీరలోనే 47 ఏళ్ల తల్లి పరుగు.. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం..

కాళ్లకు స్పోర్ట్స్‌ షూస్‌ లేవు.. ఒంటిపై ఖరీదైన క్రీడా దుస్తులు లేవు.. సాధారణ చీర, చెప్పులతోనే బరిలోకి దిగారు. పరుగులో చెప్పులు పదేపదే జారిపోవడంతో వాటిని చేతిలో పట్టుకుని.. రాళ్లు తేలిన రహదారిపై పరుగెత్తారు. చివరకు ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్‌ షూస్‌తో వచ్చిన యువతులను వెనక్కినెట్టి మారథాన్‌లో తొలి స్థానంలో నిలిచారు 47 ఏళ్ల రమాబాయి రణ్‌వీర్‌. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం ఆమె సాగించిన ఈ పరుగు ఇప్పుడు స్ఫూర్తిగా …

Read More »

గ‌ణేష్ వేడుక‌…`చిరు` చెప్పిన‌ట్టు చేద్దామా!

సామాజిక కార్య‌క్ర‌మాల విష‌యంలో చురుగ్గా ఉండే మెగా స్టార్ చిరంజీవి.. త‌ర‌చుగా ర‌క్త‌దానం, మొక్క‌ల పెంప‌కం, ప‌ర్యావ‌ర‌ణం గురించి ప్ర‌జ‌ల‌కు, ఆయ‌న అభిమానుల‌కు కూడా సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో 15 రోజుల్లో రానున్న గ‌ణేష్ వేడుక‌.. వినాయ‌క‌చ‌వితికి సంబంధించి కూడా కొన్ని సూచ‌న‌లు చేశారు. ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌నే కాదు.. మ‌రో కీల‌క సూచ‌న కూడా చేశారు. మ‌రి ఆయ‌న సూచ‌న‌లు …

Read More »

ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన.. 16 ఏళ్ల బాలికపై…

దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4 రాత్రి కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. కుటుంబ సభ్యులతో గొడవ నేపథ్యంలో నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్‌ నోయిడాలోని పరిచౌక్‌ వద్ద స్లీపర్‌ బస్సు …

Read More »

మీరు కొనే ఫుడ్ ప్యాకెట్‌పై `రెడ్` సింబ‌ల్ ఉందా… అయితే జాగ్ర‌త్త‌!

ఇన్ స్టెంట్ ఫుడ్ కొనుగోలు, వినియోగం కూడా మ‌న‌దేశంలో భారీగా పెరిగిపోయింది. అవి చిప్స్ నుంచి ఇత‌ర ప‌దార్థాల వ‌ర‌కు అనేక ఇన్ స్టెంట్ ఫుడ్స్‌ను మాల్స్‌, మార్ట్స్‌ల‌లో కొనుగోలు చేస్తుంటాం. అయితే.. వాటి నాణ్య‌త‌.. రుచి విష‌యంలో మ‌న‌కు తినేవ‌ర‌కుకూడా తెలియ‌దు. ఇక‌, ఆయా ప‌దార్థాల్లో క‌లిపిన చ‌క్కెర ఎంత‌? ఉప్పు ఎంత‌? కొవ్వు ఎంత ఉంద‌న్న‌ది.. వెతికితే త‌ప్ప‌.. ఎక్క‌డో మూల‌న అది కూడా చిన్న చిన్న …

Read More »

నేపాల్ వరదల్లో తెలుగువాళ్ళని కాపాడిన టీ

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టడని పెద్దలు చెప్పే మాట నిజమని మరోసారి రుజువయ్యింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం నేపాల్ వెళ్లిన మన తెలుగువారు తృటిలో తప్పించుకున్నారు. మార్గమధ్యలో టీ తాగేందుకు ఆగడమే వారికి శ్రీరామ రక్ష గా కాపాడింది. తెలుగు ప్రయాణికుల ప్రాణాలను ‘టీ ‘ కాపాడిందని జాతీయ మీడియా, సోషల్ మాధ్యం ప్రచారం చేస్తున్నాయి. తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు సైన్ ఇన్ ట్రావెల్స్ …

Read More »

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి సంస్థ‌(టీజీ ఐఐసీ) ప‌లు ప్రాంతాల్లో భూముల‌ను విక్ర‌యిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాయ‌దుర్గం భూములు బంగారాన్ని మించిపోయాయి. గ‌త వారం.. ఇక్క‌డ ఎక‌రం 264 కోట్ల రూపాయ‌లు ప‌ల‌క‌గా.. కేవ‌లం వారంలోనే మ‌రో ఐదు కోట్ల రూపాయ‌లు ఎగబాకి.. శుక్ర‌వారం ఏకంగా 269 …

Read More »

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. “భౌతికంగా మీరు మాకు సాయం చేసేందుకు వ‌స్తామ‌ని వ‌ర్త‌మానం పంపుతున్నారు. మంచిదే. కానీ, మీ భౌతిక సాయం మాకు వ‌ద్దు.“ అని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి బాలేంద్ర షా కార్యాల‌యం స‌హా.. విదేశాంగ శాఖ కూడా సంయుక్తంగా ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. అయితే.. ఇదేస‌మ‌యంలో డ‌బ్బులు సాయం …

Read More »

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద వదిలి దంపతులు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో వణుకుతూ ‘అమ్మా.. నాన్నా’ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కలచివేసింది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు. డ్రైవర్‌గా పనిచేసే సాయి అప్పుల పాలై వాటిని తీర్చలేక …

Read More »

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా పోయార‌ని.. అయితే.. వీరిలో 288 మంది మిన‌హా మిగిలిన వారి ఆచూకీ తెలిసింద‌ని.. వారిని నేపాల్ స‌హాయ‌క బృందాలు కాపాడాయ‌ని విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైశ్వాల్ ప్ర‌క‌టించారు. అయితే.. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీ కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఇక‌, …

Read More »

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో కొట్టుకొచ్చిన మృతదేహాల నుంచి నగలు అపహరించిన ఇద్దరిని నేపాల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. భోటెకోశి నది ఉప్పొంగడంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. బురద, శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బాధితుల చెవులకు ఉన్న ఆభరణాలను తొలగిస్తున్న దృశ్యాలు …

Read More »

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దీన స్థితి నెలకొంది. దీని ఫలితమే పశ్చిమ బెంగాల్ లో మాల్డా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో కేవలం 25 రోజుల్లో60 మంది నవజాత శిశువులు మృతి చెందారు. అందులో ఒకే ఒక్కరోజు 10 మంది చెందడంతో ఏమి జరుగుతుందో అర్ధం కాక వైద్యులు సైతం ఆందోళనకు …

Read More »