Trends

మోడీపై స్వామి భ‌క్తి.. 250 అడుగుల విగ్ర‌హం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఓ వ్యాపార వేత్త స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధికారంలోకి వ‌చ్చాక అనూహ్యంగా త‌న వ్యాపారాలు పుంజుకున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అందుకే ఆయ‌న‌పై ఉన్న భ‌క్తి, ప్రేమ‌ల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవించి ఉండ‌గానే ఆయ‌న భారీ విగ్ర‌హం నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. ఆయ‌నే.. ఈశాన్య రాష్ట్రం అస్సాంకు చెందిన న‌వీన్ చంద్ర‌బోరా. ఈయ‌న ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ , స‌హా.. గ‌నుల …

Read More »

షాకింగ్‌.. పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌కు ఏమైంది?

తెలంగాణలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. అనేక సంచ‌నాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోప‌ణ‌లు, వివాదాల‌ను ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎక్క‌డా స‌హించ‌డం లేదు. ఏ చిన్న వివాదమైనా.. పెద్ద వివాద మైనా కూక‌టి వేళ్ల‌తో స‌హా తొల‌గించేయాలనేది రేవంత్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా వివాదాల్లో చిక్కుకున్న పంజాగుట్ట పోలీసు స్టేష‌న్ అధికారులు, సిబ్బందిపై గుండుగుత్త‌గా వేటు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్రంలోనూ ఇలా …

Read More »

కుమారీ ఆంటీ హోట‌ల్ బంద్‌.. పోలీసుల కేసు కూడా

సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన‌.. కుమారీ ఆంటీ హోట‌ల్ మూత ప‌డింది. ఎక్క‌డెక్క‌డి నుంచో ఆమె హోట‌ల్‌కు క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ‌ర్లు.. చేసిన వీడియోలు, రీల్స్‌తో కుమారి హోట‌ల్ ఇటీవ‌ల కాలంలో బాగా ఫేమ‌స్ అయిపోయింది. కేవ‌లం నాన్ వెజ్ రెసిపీల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చే కుమారి.. అన్ని ర‌కాల కూర‌ల‌ను వేడివేడిగా వ‌డ్డించ‌డం.. క‌ల‌గ‌లుపుగా అంద‌రితోనూ నాన్నా.. అమ్మా.. త‌మ్ముడు అంటూ.. ప‌ల‌కరించ‌డతో ఆమె …

Read More »

సక్సెస్ ఫుల్ గా మనిషి మెదడులో చిప్.. ఎలాన్ మస్క్ ప్రకటన

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వాద ప్రతివాదనలు.. అనుకూలతలు.. వ్యతిరేకతలు గట్టిగా ఎదురయ్యే అంశం ఒకటి గుట్టుచప్పుడు కాకుండా పూర్తైంది. మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ప్రపంచ కుబేరుడు.. న్యూరాలింక్ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్ తాజాగా వెల్లడించారు. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో కీలక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్లు …

Read More »

బాల రాముని విగ్ర‌హం వెనుక.. ‘తాళి బొట్టు తాక‌ట్టు’ వ్య‌థ‌!

శీర్షిక చూడ‌గానే ఆశ్చ‌ర్యం వేసిందా? విస్మ‌యం క‌లిగిందా? ఔను.. నిజ‌మే. మ‌నం కంటితో చూస్తున్న ప్ర‌తి ద‌శ్యం వెనుక అనేక క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉంటాయి. అలానే.. ఈ నెల 22న చూడ‌ముచ్చ‌టైన రూపంలో అయో ధ్య‌లో కొలువు దీరిన బాల‌రామ‌య్య విగ్ర‌హం వెనుక కూడా.. పెద్ద వ్య‌థే గూడుక‌ట్టుకుంది. రాతిని మ‌లిచి.. రామ‌య్య‌గా కొలువుదీర్చిన ఈ ప్ర‌ధాన ఘ‌ట్టంలో తెర‌వెనుక మ‌రుగుప‌డిన ఓ హృద‌య విదార‌క అంశం తాజాగా వెలుగు …

Read More »

బెంగళూరు ట్రాఫిక్ జాంలో వధువు.. కట్ చేస్తే..

కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. …

Read More »

బాల రాముని ప్ర‌తిష్ట‌.. దేశ బ‌హిష్క‌ర‌ణ వేటు

భార‌త దేశంలో 500 ఏళ్లనాటి అయోధ్య వివాదానికి తెర‌దించుతూ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇక్క‌డ రామాల‌యం నిర్మించ‌డం.. బాల‌రాముని విగ్ర‌హానికి ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌డం తెలిసిందే. దీనిని కేవలం దేశానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులు.. కూడా సంబ‌రాల్లో పాల్గొనాల‌ని ప్ర‌ధాని స్వ‌యంగా పిలుపునిచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన భార‌తీయ‌లు ఎక్క‌డెక్క‌డున్నా.. బాల‌రామ‌య్య ప్ర‌తిష్టాప‌నా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. అయితే.. ఇదే కువైత్‌లో ఉన్న భార‌తీయుల‌కు …

Read More »

షోయబ్ మాలిక్ రెండో పెళ్లి..వైరల్ ఫొటో

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న …

Read More »

ర‌న్‌వేపై డిన్న‌ర్‌.. ఇండిగోకు షాక్‌

విమానాలు ప్ర‌యాణించే ర‌న్‌వేపై కాకిని సైతం వాల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ర‌న్‌వేల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చే విమానాల‌కు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. క‌డిగిన ముత్యంలా ర‌న్‌వేల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి ర‌న్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజ‌నాలు ఏర్పాటు చేస్తే.. ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు.. ఏకంగా 150 మంది ప్ర‌యాణికుల‌ను ర‌న్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. …

Read More »

ఉద్యోగాల‌కు భారీ ఎస‌రు.. `ఏఐ` కొంప ముంచేస్తుందా?

ప్ర‌పంచ వ్యాప్తంగా.. నిరుద్యోగం ముసురుకున్న విష‌యం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశం.. అని చెంద ని దేశ‌మ‌ని.. ఈ విష‌యంలో తేడా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌దీ ఇదే ప‌రిస్థితి. ఉద్యోగాల క‌ల్ప‌న‌.. అనేది అది ప్రైవేటైనా.. ప్ర‌భుత్వ‌మైనా.. దేశాల‌కు తీవ్ర స‌వాల్‌గా ప‌రిణ‌మించింది. ఇక‌, సాఫ్ట్‌వేర్ రంగం అయితే.. చెప్పాల్పిన ప‌నిలేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో …

Read More »

`భాగ్య‌న‌గ‌ర` విలాపం.. ప‌ల‌క‌రించేవారే లేరా?!

నిత్యం వంద‌లాది కార్లు.. ఇసుక వేసినా రాల‌నంత‌గా జ‌నాలు.. ఎటు చూసినా హ‌డావుడే.. కాలు క‌ద‌పాల న్నా.. ట్రాఫిక్ జామ్‌లే. ఇదీ.. హైద‌రాబాద్ ఉర‌ఫ్ భాగ్య‌న‌గ‌రం గురించి.. రెండు ముక్క‌ల్లో చెప్పే మాట‌. మ‌రి ఇలాంటి న‌గరం.. ఇప్పుడు ప‌ల‌క‌రించేవారు లేక బోసిపోతోంది. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, ప్రాంతాల్లో వీధుల‌న్నీ నిర్మానుష్యంగా క‌నిపిస్తున్నాయి. ఇళ్ల‌కు వేసిన తాళాలు వేసిన‌ట్టే ఉన్నాయి. ఎక్క‌డా అల‌జ‌డి లేదు… చాయ్ కొట్ల ద‌గ్గ‌ర సంద‌డి …

Read More »

టార్గెట్ 22.. ఆ రోజే పిల్ల‌ల్ని కంటాం ప్లీజ్‌!

ఇదేదో త‌మాషా విష‌యం కాదు.. నిజ‌మే. ఈ నెల 22వ తేదీనే పిల్ల‌ల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజ‌రాత్ స‌హా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని గ‌ర్భిణులు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వంద‌ల సంఖ్య‌లో ఉన్న గ‌ర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాల‌ని వారు అభ్య‌ర్థిస్తున్నారు. ఇక‌, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించ‌బోయే త‌మ వ్యాపారాల‌కు ఈ నెల 22నే …

Read More »