భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మహా కుంభేళాలో 16వ రోజు అయిన బుధవారం తెల్లవారుజామున ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. మౌని అమావాస్య కావడంతో బుధవారం పుణ్య స్నానాలతో అంతా మంచే జరుగుతుందన్న భావనతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. మంగళవారం రాత్రికి ఇలా ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు అక్కడికి చేరుకున్నారట. ఈ …
Read More »మహా కుంభమేళాలో తొక్కిసలాట… 10 మందికి పైగా మృతి?
పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న …
Read More »అండర్-19 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ తెలుగమ్మాయిదే
సెంచరీతో త్రిష ప్రపంచ రికార్డ్అండర్-19 ప్రపంచ కప్ లో త్రిష అరుదైన రికార్డ్కౌలాలంపూర్లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్ లో వరుసుగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజు స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష సెంచరీ చేసి …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ.. బుమ్రా సెట్టవ్వకపోతే..
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో బుమ్రా హాజరుకావడం అనుమానంగా మారిందని సమాచారం. గతంలో గాయపడ్డ బుమ్రా, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు నుంచి బయటే ఉన్నాడు. ప్రస్తుతానికి అతను న్యూజిలాండ్లోని ప్రముఖ సర్జన్ రోవాన్ …
Read More »సూక్ష్మదర్శిని స్ఫూర్తితో మర్డర్ ప్లాన్ ?
సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి బోలెడు సంఘటనలు సాక్ష్యాల రూపంలో కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇటీవలే మీర్ పేట్ కు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి ఆచూకీ దొరక్కుండా చేసిన వైనం చదివిన వాళ్ళ ఒళ్ళు జలదరించేలా చేసింది. అంత భయానకంగా ఎలా చంపాడాని మానవ హక్కుల సంఘాలు …
Read More »ఇక వన్ నేషన్.. వన్ టైమ్!
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ.. అప్పటిదాకా అమల్లో ఉన్న పాత పద్దతులనే అమలు చేస్తూ వచ్చాయి. అయితే వారందరికీ భిన్నంగా సాగుతున్న మోదీ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి…వాటిలో అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా వన్ నేషన్… వన్ ఎలక్షన్ అన్న నూతన పద్ధతిపై …
Read More »బాత్రూమ్ లో కెమెరా.. భార్య ఇచ్చిన ట్విస్టుకు మైండ్ బ్లాక్!
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన అక్కడి స్థానికులను షాక్కు గురిచేసింది. గీజర్ రిపేర్ పేరుతో ఇంట్లోకి వచ్చిన ఓ యువకుడు, గీజర్లో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో తీశాడు అని, తన భార్య నగ్న వీడియో నెట్లో ప్రత్యక్షం అవుతుందన్న అనుమానంతో భర్త ఆ యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాకుండా తన భార్యను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నం చేశాడని చితకబాదిన తర్వాత అతన్ని పోలీసులకు …
Read More »హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం… తప్పిన ప్రాణ నష్టం
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి …
Read More »ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ‘ఏటికొప్పాక’ వైభవం
భారత 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేయగా… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల, విపక్ష నేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలను తిలకించారు. ఈ సందర్బంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఢిల్లీకి వచ్చిన …
Read More »సింగర్ తో సిరాజ్.. గాసిప్స్ లో నిజమెంత?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనై భోస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలలో సిరాజ్ను హైలెట్ చేయడమే. ఇటీవల జనై భోస్లే తన పుట్టిన రోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో సిరాజ్తో ఆమె క్లోజ్గా ఉన్న ఫొటో హైలెట్ అయ్యింది. …
Read More »కోహ్లీ రికార్డు కూడా కొట్టేసిన తిలక్
భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. అతడి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది. ఈ ప్రదర్శనతో తిలక్ అరుదైన రికార్డును సొంతం చేసుకొని, టీమిండియాలో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ …
Read More »‘పద్మ’ పురస్కారాలను అందుకోనున్న తెలుగువారు వీరే…
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది. ఈ మేరకు శనివారం రాత్రి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో భారత రత్న తర్వాత అతున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తున్న పద్మ విభూషణ్ అవార్డులకు తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డితో పాటు మరో ఆరుగురు ఎంపికయ్యారు. ఇక నందమూరి నటసింహం, …
Read More »