Trends

పేద విద్యార్థిని బలిగొన్న మంచి మార్కులు

మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది. జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో …

Read More »

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయ్ పై కేసు నమోదు కాగా…ఆ తర్వాత ఆయన నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో, …

Read More »

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీవ్ర‌మైన క‌డుపు నొప్పిని భ‌రించ‌లేకే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చాలా చ‌క్క‌టి పిల్ల ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. త‌న‌ను ఆవేద‌న‌కు గురి చేసింద‌ని …

Read More »

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు కాదు ఒకే యువకుడిని ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా పేరొందిన ఇద్దరు సోదరీమణులు, వారి బంధువు కలిసి ఒకే యువకుడిని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. అమ్రోహా జిల్లాలోని …

Read More »

టీమిండియా… ఈసారి జింబాబ్వేతో కూడా కష్టమే

ఇటీవల వరుస వైట్‌బాల్ సిరీస్ ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు జింబాబ్వే సవాలుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచి హరారే వేదికగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చిలో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత టీమిండియా ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్‌తో 0-2, …

Read More »

మ్యాథ్స్ లో 51 మార్కులు… ఇప్పుడు నింగిలోకి రాకెట్ పంపాడు!

స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో తరగతి వరకు చదువులో అస్సలు రాణించని ఆ పిల్లాడు ఇప్పుడు ఏకంగా నింగిలోకి రాకెట్ పంపాడు. అతనే స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన. విక్రమ్-1 ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పవన్ ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీహరికోట నుంచి …

Read More »

ఐపీఎల్ కేసులో లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్

2009 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి అప్పీలేట్ ట్రైబ్యునల్ నుండి భారీ ఊరట లభించింది. సౌతాఫ్రికాలో ఐపీఎల్ 2 నిర్వహణ సమయంలో లలిత్ మోదీ వ్యక్తిగతంగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని జూలై 16న వెలువడిన తీర్పులో ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మోపిన జరిమానాల ఉత్తర్వులను పూర్తిగా …

Read More »

డేవిడ్ వార్నర్… జైలుకెళ్లడం ఖాయమేనా?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో సిడ్నీలో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన కేసులో వార్నర్ తన తప్పును అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడి లాయర్ బాబీ హిల్ స్వయంగా కోర్టుకు తెలియజేశారు. ఏప్రిల్ 5వ తేదీన సిడ్నీలోని ఈస్టర్న్ సబర్బ్స్ ప్రాంతంలో పోలీసులు రొటీన్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.  …

Read More »

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా భారీ సుంకాలను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఆగస్టు 1 నుండి రెండేళ్ల పాటు జీరో శాతం టారిఫ్ ఉంటుందని, 2028 ఆగస్టు నుండి ఏకంగా 100 శాతం, 2029 నుండి 200 శాతం సుంకం అమలు చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీలు …

Read More »

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన పడితే.. దాని నుంచి కోలుకోవటానికి కనిష్ఠంగా మూడు నెలలు.. గరిష్టంగా ఆర్నెల్ల పాటు నొప్పుల నరకాన్ని చూడటం తెలిసిందే. ఈ మాయదారి డెంగీకి చెక్ పెట్టే టీకా ఒకటి అందుబాటులోకి రానుంది. జపాన్ కు చెందిన ఒక ప్రముఖ బయో ఫార్మా సంస్థ డెవలప్ చేసిన వ్యాక్సిన్ కు.. …

Read More »

మరో రెండు నెలల్లో భారత నావికుడి పెళ్లి.. ఈలోపే…

రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా తీరానికి సమీపంలో వెళ్తున్న ‘ఎమ్‌వి గోల్డెన్ లియో’ అనే సరుకు రవాణా నౌకపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిల్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులు, ఐదుగురు సిరియా నావికులు సహా మొత్తం 10 మంది సిబ్బంది మరణించినట్లు సమాచారం. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా …

Read More »