Trends

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు… ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన సమయం ఇది. జూన్ 12న స్పేస్ ఎక్స్ కంపెనీ నాస్డాక్ మార్కెట్లో అడుగుపెట్టినప్పుడు ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లు కొన్నారు. 135 డాలర్ల వద్ద ఇష్యూ ధర ఉంటే, 150 డాలర్ల వద్ద ఓపెన్ అయి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఒకానొక దశలో కంపెనీ మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ …

Read More »

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్షణిక లైంగిక సుఖం కోసం ఏ తప్పూ చేయని భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య నిజంగానే పెరుగుతోంది. తనకు జీవితాంతం తోడుంటానని మెడలో తాళి కట్టి… ఆలనాపాలనా చూసుకుంటున్న భర్తలు…భార్యలకు ఆ తర్వాత భారమైపోతున్నారు. లైంగిక ఆనందం కోసం కొత్త వ్యక్తులను వెతుక్కుని అడ్డదారులు తొక్కేస్తున్న భార్యలకు భర్తలు …

Read More »

116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ దర్శనం

116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సకల మర్యాదలు అందించింది. ఆ భక్తురాలికి తన తనివి తీరేలా స్వామి వారి దర్శనాన్ని కల్పించింది. స్వామి వారి వస్త్రం, ప్రసాదాలతో ఆమెను సత్కరించింది. వెరసి తిరుమలకు వస్తున్న వెంకన్న భక్తుల పట్ల టీటీడీ ఏ రీతిన స్పందిస్తుందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చూపింది. …

Read More »

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందన్నది తెలిస్తే మాత్రం ఇది చాలా పెద్ద వార్తే మరి. దినేశ్, విజయ్ ఇద్దరూ తమిళనాడు క్రికెటర్లే. టీమ్ ఇండియాకు సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరూ మంచి మిత్రులు. దేశవాళీ క్రికెట్ నుంచే వాళ్లిద్దరికీ అనుభంధం ఉంది.  కానీ ఈ ఇద్దరూ భారత జట్టుకు ఆడుతున్న సమయంలో …

Read More »

నాణానికి రెండు వైపులు ఉంటాయి

నిజమే… నాణేనికి రెండు వైపులూ ఉంటాయి. నాణెం ఎప్పుడూ ఒక వైపుతోనే ముద్రించబడదు. నాణేనికి ఓ వైపు బొమ్మ ఉంటే… మరోవైపున బొరుసు కూడా ఉంటుంది. అయితే మెజారిటీ సమాజం ఆ నాణేనికి ఉన్న బొమ్మను మాత్రమే గుర్తిస్తూ… బొరుసును గుర్తించదు. ఇది అసంకల్పితమే అయినప్పటికీ… బాధ్యత గల ప్రజా ప్రతినిధులు అయినా, అదికారులు అయినా… బొమ్మతో పాటు బొరుసునూ గుర్తిస్తారు. తొలుత తాము బొరుసును గుర్తించని వైనాన్ని నిజాయతీగా …

Read More »

తిరుమల కాలిబాటలో 116 ఏళ్ల వృద్ధురాలు

వయస్సు కేవలం నెంబర్ మాత్రమే అనే పదం ఇప్పుడు చాలా మంది అలా ఈజీగా వాడేస్తున్నారు. పూర్వకాలంలో మనిషి దీర్ఘాయుష్సుతో బతికినా… ప్రస్తుత కాలంలో చిన్న వయసుతోనే జీవితాలను చాలిస్తున్న పరిస్థితి. ఈ తరహా పరిస్థితికి చాలానే కారణాలు ఉన్నా.. అనాది కాలం నాటి జీవన స్థితిగతులను ఇప్పటికీ అనుసరిస్తున్న కొందరు వందేళ్లకు పైబడి బతుకుతున్న వైనం చూస్తున్నదే. ఈ కోవలోనే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న …

Read More »

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు అమ‌ర్‌దీప్ కుమార్‌.. ప్ర‌జ‌ల నుంచి 792 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయ‌న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ఈడీ అధికారులు ముందుకు …

Read More »

తండ్రి అంత్యక్రియలకు రాలేని పరిస్థితిలో దేశ అధ్యక్షుడు

మొజ్త‌బా ఖ‌మేనీ. ప్ర‌స్తుత ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌. కానీ.. పేరుకే ఇది ప‌రిమితం అయింది. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు.. ప్ర‌జ‌ల‌కు మొహం చూపించేందుకు కూడా అవ‌కాశం లేకుండా పోయింది. ఎంత‌గా అంటే.. చివ‌ర‌కు త‌న తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు కూడా క‌న్న కొడుకుగా హాజ‌రు కాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. వెంటాడుతున్న మృత్యువు. ఏక్ష‌ణాన ఏ రూపంలో ఎటు నుంచి వ‌స్తుందో తెలియ‌ని మృత్యువు ను ఎదుర్కొన‌లేని ప‌రిస్థితి ఇప్పుడు …

Read More »

‘చనిపోకపోతే ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా’

మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా సరికొత్త ఘటనలు నమోదు అవుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఓ సారి మగాడు చనిపోతుంటే… మరోసారి ఆడవారు బలైపోతున్నారు. వెరసి ఆడ, మగల మధ్య స్నేహం, ప్రేమల్లో దారుణాతి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ కొత్త ఘటనలో మగాడు మృగాడిగా …

Read More »

తమిళ హీరో కొడుకుతో మైత్రి సినిమా

తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ఈ ఇద్దరూ బహు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో నంబర్ వన్ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి గత రెండేళ్లలో తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అడుగు …

Read More »

తెలంగాణ‌లో వేడెక్కిన స‌వాళ్ల రాజ‌కీయం!

తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా సాగుతున్న స‌వాళ్లు.. గురువారం రోడ్డెక్కాయి. మీ స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామంటూ.. బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నతో ప్ర‌భుత్వ ప‌రంగా కూడా అంతే దీటుగా స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ముందుగానే గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అయితే.. మ‌రో …

Read More »

కుంభ‌మేళాలోనే అయోధ్య దోపిడీకి బీజం…?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయోధ్య బాల రామ‌య్య‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల దోపిడీ వ్య‌వ‌హారంలో కీల‌క విష‌యం వెలుగు చూసింది. ఈ దోపిడీకి స్కెచ్ ఇప్పుడు కాద‌ని.. గ‌త ఏడాది జ‌రిగిన కుంభ‌మేళా స‌మ‌యానికి ముందే స్కెచ్ వేశార‌ని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు ప్రాధ‌మిక నివేద‌కను అందించారు. మొత్తం 8 మంది నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు. …

Read More »