Trends

భోగాపురం యువకులు హద్దులు దాటారు

నిన్నా మొన్నటి వరకు భోగాపురం పేరు వినగానే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయమే గుర్తుకు వచ్చేది. రెండు రోజులుగా భోగాపురం పేరు గుర్తుకు రాగానే మోటారు బైక్ మెకానిక్ మహేష్ రౌడీయిజం కళ్ళ ముందు కదులుతుంది. అంగబలం, ఆర్ధిక బలం చూసుకొని ఒక సామాన్యుడి మీద దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు మనం ఏ కాలంలో వున్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే… భోగాపురంలో రామచంద్ర రాజు …

Read More »

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్ గా మారింది. ఈ భవనంలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు హాస్టల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. …

Read More »

అప్పులు తీర్చడానికి గోదావరి ఒక్కటే మార్గమా?

అప్పులేని వాడు ధనవంతుడు కావచ్చు కానీ అప్పులు లేని ఒక్క ధనవంతుడు కూడా ఉండడు. మనదేశంలో అయితే అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన బడా పారిశ్రామిక వేత్తల సంఖ్య చాంతాడంత లిస్టు వుంది. దేశంలోని బ్యాంకుల్లో అప్పులు చేసి ఉద్దేశ్య పూర్వకంగా ఎగవేసిన వారు 28,318 మంది వున్నారు. 2014 వరకు వీరు ఎగవేసిన సొమ్ము 39,369 కోట్లు కాగా ఇప్పుడది 3.89 లక్షల కోట్లకు చేరింది. వీరిలో ఒక్కడు …

Read More »

కలుషిత నదిలోకి దిగి… ఒంటరిగా ప్రక్షాళన

ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్‌, చెత్తతో కలుషితమైన అజ్నార్‌ నదిని చూసి ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని ఎదురుచూడకుండా తానే రంగంలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా బియోరాకు చెందిన 20 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి సురేంద్ర సింగ్‌ చౌదరి. ‘బిట్టూ తబాహీ’గా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన అతడు జనవరి 26, 2026 నుంచి నదిని …

Read More »

నేపాల్ వరదల్లో చిక్కుకొని… 9 రోజుల తర్వాత బయటకు…

నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేదు. ఆశలు కోల్పోయిన కొంతమంది గల్లంతయిన తమవారి దిష్టి బొమ్మలు తయారు చేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇలాంటి విషాదకర పరిస్థితిలో శిధిలాలకింద చిక్కుకొని సజీవంగా వున్నవారి ఆచూకీ లభించడం, పూర్తిగా బురదలో కురుకొనిపోయిన కొంతమంది సజీవంగా ఉండటం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. ఈ క్రమంలో తొమ్మిది …

Read More »

స్టీరింగ్‌కు ముద్దుపెట్టి.. బస్సుకు సెల్యూట్‌ చేసి వీడ్కోలు

30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్‌ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) ఇడుక్కి జిల్లాలోని కుమిలి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాల్‌ కురియన్‌ సెప్టెంబరు 2న తన చివరి విధి నిర్వహించారు. చివరి ట్రిప్‌ ముగించుకుని బస్సును డిపోలో పార్క్‌ చేసిన అనంతరం ఆయన కొద్దిసేపు స్టీరింగ్‌ వద్దే ఉండిపోయారు. అనంతరం స్టీరింగ్‌కు …

Read More »

వరద నీటిలో పెళ్లి బాజాలు

ఒకవైపు కుండపోత వానలు, వరదలు.. ఎటు చూసినా నిండా మునిగిన పంట పొలాలు.. ఇళ్లల్లోకి చేరిన నీళ్లు.. అయినా సరే పెళ్లి బాజాలు మోగాయి. ఆ జంట ఒక్కటైంది. పిలిప్పీన్స్ లో నడుములోతు వరద నీటిలో పెళ్లి చేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 1 వ తేదీన మనీలాకు ఉత్తరాన వున్న బులకాన్ ప్రావిన్స్ లోని హగనోయ్ తీరప్రాంతంలో గల సెయింట్ జాన్ …

Read More »

ఒక చిన్న `క్లాజ్‌`… 2 ల‌క్ష‌లు ఫైన్ వేసింది.. మ‌న‌కూ తెలిస్తే మంచిది!

ఒక్క చిన్న క్లాజ్‌… ఒక మ‌హిళ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌గా.. మ‌రో అధికారికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల పెనాల్టీ విధించేలా చేసింది. అయితే.. ఈ కేసు `ఆమెకు` మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. స‌మ‌స్య ఆమెదే అయినా.. పాఠం అంద‌రికీ నేర్పుతోంది. అదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మ‌హిళ‌ల‌కు దిక్సూచిగా కూడా మారింది. భ‌విష్య‌త్తులో ఇలాంటి స‌మ‌స్య ఎదురైతే.. ఏం చేయాలో తేల్చి చెప్పింది. ర‌క్ష‌ణ క‌వ‌చంగా కూడా మారింది. …

Read More »

అప్పుడు పాక్‌కు చిక్కిన హీరో… ఇప్పుడు ప్రయాణికుల పైలట్

2019లో పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరుతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు అతను కొత్త కెరీర్ మొదలుపెట్టారు. దాదాపు 22 ఏళ్ల పాటు భారత వైమానిక దళంలో పనిచేసిన అభినందన్, ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఫ్లై91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న అభినందన్ మార్చి 31న ప్రీమేచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఆ తర్వాత గోవా కేంద్రంగా పనిచేసే ఫ్లై91లో చేరారు. …

Read More »

లింగమార్పిడి తరువాత ఆట తీరు మారింది

మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహిళల ప్రొఫెషనల్ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అక్కడ కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు అర్హత లభించింది. ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన అనయా 2024లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించారు. ట్రాన్సిషన్ తర్వాత …

Read More »

గజం భూమి 2.7 ల‌క్ష‌లు… మ‌ధ్య‌త‌ర‌గ‌తికి `హైద‌రాబాద్` దూరం!

గజం భూమి వేల‌ల్లో ఉంటేనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు లబోదిబోమనే ప‌రిస్థితి నెల‌కొంటుంది. అలాంటిది.. ల‌క్ష‌లు ప‌లికితే .. ఇంకేం చెప్పాలి. అది కూడా నివాస‌యోగ్య‌మైన స్థ‌లాలు.. జ‌న‌సమ్మ‌ర్థ ప్రాంతాల్లో గ‌జం భూమి(ఓపెన్ ఫ్లాట్ 2.7 ల‌క్ష‌ల రూపాయలు) ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్నంటితే.. సాధార‌ణ‌, దిగువ‌, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు గూడు బ‌రువేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇది ఆర్థిక అనిశ్చితికి కూడా దారి తీసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. …

Read More »

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన ఒక బాలిక మృతి చెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏమి జరిగిందో తెలియక అటు విద్యార్థుల తలిదండ్రులు, ఇటు వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్యారోగ్య శాఖను అప్రమత్తం …

Read More »