Trends

టీఎస్ కాదు.. టీజీఎస్.. ఆర్టీసీనే.. వినియోగ‌దారుల్లో ఆగ్ర‌హం!

తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌దేళ్ల బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పోయి.. కాంగ్రెస్ వ‌చ్చిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో కొన్ని కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను సమూలంగా మార్చుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ త‌ల్లి.. విగ్ర‌హంలోనూ కొన్ని మార్పులు చేశారు. ఇక‌, తెలంగాణ స్టేట్‌(టీఎస్‌)ను కాస్తా.. తెలంగాణ(టీజీ) చేశారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా.. ఈ నెల 15న నివేదిక పంపించి.. గెజిట్‌లోనూ పేర్కొన్నారు. అంటే.. ఇక …

Read More »

టీజీ 09 9999 నంబరు కోసం 25.50 లక్షలు

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న రవాణశాఖ అధికారి కార్యాలయం జాక్ పాట్ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక ఫ్యాన్సీ నంబరుకు రూ.25.50 లక్ష్లల రూపాయలు పలికింది. తమ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్ ఎక్స్ వాహనం కోసం టీజీ 09 9999 నంబరు కోసం వేలం పాటలో భారీ ధరను పాడి కొనుగోలు చేసింది సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్. ఫ్యాన్సీ నంబర్లకు ఫ్యాన్స్ పెరిగిపోయిన నేపథ్యంలో …

Read More »

విజ‌య‌వాడ మ‌హిళ‌.. కారిఫోర్నియా తొలి న్యాయ‌మూర్తిగా రికార్డ్‌!

ఎంద‌రో తెలుగు వారు.. విదేశాల్లో త‌మ కీర్తిని చాటుతూ.. దేశ కీర్తిని మ‌రింత ఇనుమ‌డింపజేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికాలో ఎంతో మంది తెలుగు వారు కీల‌క స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృతమైంది. విజ‌య‌వాడ‌కు చెందిన మ‌హిళ జ‌య బాడిగ‌.. అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జ‌య‌ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావ‌డం గ‌మ‌నార్హం. శాక్రమెంటో సుపీరియర్ కోర్టుకు …

Read More »

ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ వేశం వేసి రంగంలోకి దించుతాడు. అల్లరిమూకలు చుట్టూ ఉన్నది తమ వారు అనుకొని విధ్వంసానికి సిద్దం అవగానే రౌడీల డ్రస్సులో ఉన్న పోలీసులు తమ పైన ధరించిన డ్రస్సులను చించివేసి పోలీసు డ్రస్సులతో రౌడీ మూకలను చితకబాది వారి ప్రణాళికను భగ్నం చేస్తారు. ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ …

Read More »

బెంగ‌ళూరులో ‘రేవ్ పార్టీ’.. వైసీపీ మంత్రి వాహ‌నం గుర్తింపు

క‌ర్ణాటక రాజ‌ధాని బెంగ‌ళూరులో సంచ‌ల‌నం తెర‌మీదికి వ‌చ్చింది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇక్క‌డి ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్టు తెలిసింది. దీనిని స్థానిక సీసీబీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లోని న‌టి.. హేమ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే.. ఆమె దీనిని ఖండించారు. త‌నకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. త‌న‌నుఅన‌వ‌స‌రంగా ఈ రొచ్చులోకి …

Read More »

రూ.5 వేలకు ఓటమ్ముకున్న ఎస్సై !

అతడొక బాధ్యతగల అధికారి. అంతే కాదు ప్రజల రక్షణగా నిలిచే పోలీసు అధికారి. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేందుకు అండగా నిలవాల్సిన అధికారి. కానీ ఆయనే తన ఓటును రూ.5 వేలకు కక్కుర్తిపడి అమ్ముకున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే …

Read More »

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ ప‌రిస్థితిని ముందుగా అంచ‌నా వేయ‌లేక పోవ‌డంతోపాటు.. ద‌ట్ట‌మైన‌ అట‌వీ మార్గంలో హెలికా ప్ట‌ర్ ప్ర‌యాణించ‌డంతో ఆనాడు.. ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. నాటి వైఎస్ ఘ‌ట‌న‌.. నేటికీ చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా మ‌న పొరుగు దేశం ఇరాన్‌లో చోటు చేసుకుంది. ఇరాన్ అధ్య‌క్షుడు.. ఇబ్ర‌హీం …

Read More »

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు. ఎందుకంటే, ప్రపంచ మేటి ఆటగాళ్లు ఏబీ డీ విల్లియర్స్, విరాట్ కోహ్లీ లతో పాటు భీకర బ్యాట్స్ మన్లు, మంచి బౌలర్లు, ఫీల్డర్లు ఉన్నప్పటికీ 17 ఐపీఎల్ ఎడిషన్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఇక, ఈ ఐపీఎల్ 17వ సీజన్ లో అయితే …

Read More »

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం బ్యాంకులకు చెందుతుందని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా దానిపై అతను హైకోర్టును ఆశ్రయించినట్లు నిన్న వార్తలు రావడం తెలిసిందే. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. 2003లో కొన్న ఆ స్థలాన్ని జూనియర్ 2013లోనే విక్రయించాడని, ఆ స్థలంతో, ఆ వివాదంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని పేర్కొంటూ …

Read More »

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో ఒకసారి లిఫ్ట్ ప్రమాదం, రెండో సారి కారు ప్రమాదం తప్పించుకున్న ఆమె మూడోసారి ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన తెలుగు వ్యక్తి కారు ప్రమాదం నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇస్తుండగా ఆ వెనకనే …

Read More »

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే మహిళ నుండి కొనుగోలు చేశాడు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే దీని మీద వివాదం ఉన్న విషయం ఆ తరువాత తెలిసింది.  జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మడానికి ముందే 1996లో తమ వద్ద …

Read More »

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్‌ కుమార్‌(28) బెట్టింగ్‌, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌లో ముకేశ్‌ ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై కుమారుడు మృతి చెందాడు. ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో …

Read More »