Trends

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనేది అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం ముంబై వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాతావరణం సహకరించకుంటే మాత్రం దానిపై టోర్నీ నిబంధనలు క్లియర్‌గా ఉన్నాయి. ఆట సాధ్యం కాని పక్షంలో టీమ్ …

Read More »

లక్షల్లో జీతాలు… అయినా వద్దంటున్న డాక్టర్లు

భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా చూడటానికి ఇష్టపడటం లేదు. దాదాపు 91 శాతం మంది భారతీయ వైద్యులు తమ వారసులు మెడిసిన్ కెరీర్‌ను ఎంచుకోవద్దని కోరుకుంటున్నట్లు డెబబ్రత మితాలి ఆరో ఫౌండేషన్ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. 1,200 మంది ఫిజీషియన్లపై జరిపిన ఈ అధ్యయనంలో మెజారిటీ డాక్టర్లు విపరీతమైన పని ఒత్తిడి, దాడుల …

Read More »

ఇంగ్లాండ్‌పై భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా?

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 5న గురువారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ నంబర్ 1, నంబర్ 2 జట్ల మధ్య జరిగే ఈ పోరులో గెలిచిన జట్టు.. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్ లేదా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ప్రస్తుత టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ రెండు …

Read More »

ఖమేనీ మరణం – భారత్ మౌనం వెనుక మర్మమేమిటి?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు వార్తలు వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సంతాప ప్రకటన విడుదల చేయలేదు. కేవలం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది కేవలం మన దేశ నిర్ణయం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న …

Read More »

టెకీ ఆత్మ‌హ‌త్య‌.. ఇంత మూఢ‌న‌మ్మ‌క‌మా?

ఎంత నేర్చినా.. ఎంత వార‌లైనా.. ఇప్ప‌టికీ మూఢ‌న‌మ్మ‌కాల‌కు, రాశిఫ‌లాల‌కు, జ్యోతిష్యాల‌కు దాసులుగా నే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం రాగానే.. ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌ల‌కంటే కూడా.. ఆయా ప‌త్రిక‌ల్లో వ‌చ్చే రాశిఫ‌లాల‌ను న‌మ్ముతున్న వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంద‌ని ఇటీవ‌ల ఓ ప‌రిశోధ‌న తెలిపింది. ఇక‌, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా.. జ్యోతిష్యాలు చెప్పించుకునేవారు కూడా పెరిగిపోతున్నారు. పోనీ.. ఇవేవైనా నిజంగానే జ‌రుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉందా.. అంటే ఆ చెప్పే వారే …

Read More »

నిన్న ఏపీ… నేడు నాగ్‌పూర్

వరుస పేలుళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే, ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మరో భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 21 మంది మరణించగా, నాగ్‌పూర్ జిల్లా కటోల్ తాలూకాలోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల కర్మాగారంలో జరిగిన ప్రమాదం 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కేవలం …

Read More »

వరల్డ్ కప్ పై వార్ ఎఫెక్ట్… ఐసీసీ ప్లాన్ B

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌పై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఆటగాళ్లు, అధికారులను సురక్షితంగా వారి స్వదేశాలకు పంపడం అంతర్జాతీయ క్రికెట్ మండలికి (ICC) ఇప్పుడు సవాలుగా మారింది. దీని కోసం ఐసీసీ తన ‘ప్లాన్ బి’ని సిద్ధం …

Read More »

ఇరాన్ – ఇజ్రాయెల్ వార్: పెట్రోల్.. బంగారం.. పరిస్థితేంటి?

భారత స్టాక్ మార్కెట్‌కు ఈ వారం మరో చాలెంజ్ ఎదురైంది. గత శుక్రవారం సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్లు పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ పరిణామాలు సోమవారం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ వారం …

Read More »

తేల్చేశారు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం

దశాబ్దాల కాలంగా మధ్య ప్రాచ్య దేశాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిసింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసం, కార్యాలయంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. మొదట అబద్ధమని వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారిక వార్తలతో నిజం బయటపడింది. 1989 నుంచి …

Read More »

భారీ పేలుడు.. 18 మంది సజీవ దహనం

కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం–జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో కనీసం 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. మృతుల్లో అధిక శాతం మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కార్మికులు బాణసంచా తయారీ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా …

Read More »

భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు నెట్ రన్ రేట్ -0.100 కు చేరి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, సౌత్ ఆఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడంతో భారత్‌పై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఇప్పుడు …

Read More »

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదానికి గురైన ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ …

Read More »