జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు భారత క్రికెట్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు పడడం వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అతని అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ సచౌటెన్ను సంప్రదించినట్టు సమాచారం. బీసీసీఐ మెడికల్ టీమ్తో కలిసి బుమ్రా సమస్య తీవ్రతను అంచనా వేస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ తుది జట్టుకు …
Read More »తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇకపై దొరకవు
మద్యం ప్రియులకు… ప్రత్యేకించి బీరు ప్రియులకు కింగ్ ఫిషర్ పేరు వింటే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఆల్కహాల్ శాతాల్లో కాస్తంత తేడాలతో పలు రూపాల్లో లభించే కేఎఫ్ బీర్ల కోసం మద్యం ప్రియులు అర్రులు చాస్తూ ఉంటారు. అవి దొరికినంతనే… లొట్టలు వేసుకుంటూ మరీ ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి కేఎఫ్ బీర్లకు ఇప్పుడు తెలంగాణలో కరువు వచ్చేసినట్టేనని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా కేఎఫ్ బీర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆ …
Read More »అదనపు 20 నిమిషాలతో రీ లోడ్… 2000 కోట్ల టార్గెట్??
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ ని జోడించి జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. సరిగ్గా సంక్రాంతి పండగ టైంలో ఇలాంటి ఎత్తుగడ బిజినెస్ కోణంలో మంచి ఫలితం ఇచ్చే అవకాశం లేకపోలేదు. సినిమా ప్రారంభంలో అసంపూర్ణంగా ఉన్న జపాన్ ఎపిసోడ్, చైల్డ్ …
Read More »కంపెనీని అమ్మేస్తే రూ.8 వేల కోట్లు వచ్చాయి.. యువకుడి పోస్టు వైరల్
అతడి వయసు 35 ఏళ్ల కంటే తక్కువే. అయితే.. టెక్నాలజీ మీద తనకున్న పట్టుతో ఈ భారత సంతతికి చెందిన యువకుడు తన కంపెనీని రూ.8వేల కోట్లకు పైనే అమ్మేశాడు. అంత సంపాదించిన వ్యక్తి ఇప్పుడెలా ఉంటాడు? అన్న ప్రశ్నకు దర్జాగా ఉంటాడని అనుకోవచ్చు. అలా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. తనకు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ అతను పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా …
Read More »నేపాల్-టిబెట్ సరిహద్దులో పెను భూకంపం: భారీ నష్టం
మంగళవారం తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం సంభవించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. పలు భవనాలు కూలిపోగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడినట్లు టిబెట్ అధికారులు తెలిపారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ భూకంపం ప్రభావం నేపాల్తో పాటు భారత్లోని …
Read More »హెఎంపీవీ వైరస్…ఇండియాది, చైనాది వేర్వేరా?
కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎంత ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. బెంగుళూరులో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ అధికారికంగా ధృవీకరించింది. అయితే, హెఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని, 20 ఏళ్ల నుంచి ఇండియాతోపాటు పలు దేశాలలో అడపాదడపా ఆ కేసులు నమోదవుతుంటాయని కర్ణాటక …
Read More »భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?
సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో …
Read More »ఆ ఒక్క చేప ఖరీదు 11 కోట్లు!
ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి …
Read More »ఓయో కొత్త రూల్స్: పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ!
ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా ఐడీ ప్రూఫ్ చూపించి రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రత్యేకంగా ప్రేమజంటలకు ఇది ఫస్ట్ ఆప్షన్గా నిలిచింది. అయితే నూతన సంవత్సరంలో ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై ఓయోలో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమ …
Read More »వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్.. భారత్ ఆశలు ఆవిరి
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఈ పరాజయంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 50 పీసీటీ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన భారత్ ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. ఆస్ట్రేలియా 63.73 పీసీటీ పాయింట్లతో తొలిస్థానంలో …
Read More »ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారికి సుప్రీం షాక్
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి వారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. గిప్ట్ డీడ్ కింద ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి.. వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తుల్నితిరిగి పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ …
Read More »పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు …
Read More »