Trends

ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 28 నుంచి ఈ సరికొత్త సేవలు ప్రారంభం కానున్నాయి. యూఐడీఏఐ డే వేడుకల సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే …

Read More »

ప్రముఖ దేవాలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం?

ఉత్తరాఖండ్‌లోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. చార్‌ధామ్ పరిధిలోని ఈ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలనే అంశాన్ని బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) బోర్డు సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. ఆలయాల …

Read More »

శిష్యుడికి యువరాజ్ ఛాలెంజ్

భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వారసుడు దొరికాడనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును దాదాపుగా తాకినంత పని చేశాడు. గురువు శిక్షణలో రాటుదేలిన ఈ శిష్యుడు మైదానంలో …

Read More »

ఇలా ఐతే కష్టమే సంజూ!

టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది. అతనికి టీమ్ ఇండియాలో సరైన అవకాశాలు రావడం లేదని అభిమానులు ఎప్పుడూ వాదిస్తూనే ఉంటారు. అయితే, ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో సంజు దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజీలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహతిలో జరిగిన మూడో టి20లో సంజు గోల్డెన్ డకౌట్ అవ్వడం …

Read More »

వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా, కేవలం సెక్స్ కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తూ కొందరు పెళ్లయిన ప్రియురాళ్లు చేస్తున్న ఘాతుకాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో నాలుగు ఘటనలు ఇలాంటివే వెలుగు చూడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. …

Read More »

పది ఓవర్లలోనే చిత్తు చేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టి20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది సూర్య సేన. ఈ …

Read More »

తెలుగు ‘పద్మాలు’ వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(మరణానంతరం) పద్మ విభూషణ్, …

Read More »

ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తుంటే… ఆయన్ను ప్రకృతి వణికిస్తోంది

ఏ ముహుర్తంలో డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారో కానీ.. అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు ఆయనో పెద్ద పీడగా మారారు. అమెరికా ఫస్ట్ పేరుతో ఆయన చేస్తున్న చేష్టలు.. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి కొత్త తిప్పలు తీసుకొస్తున్న పరిస్జితి. అమెరికా శ్రేయస్సు కోసం.. దాని భవిష్యత్తు కోసం అవసరమైతే తాము కోరుకున్న ఏ దేశమైనా తమలో కలిసిపోవాలి.. తమ పాదాక్రాంతం కావాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు …

Read More »

ఇద్దరు తెలుగువారిని వరించిన ‘పద్మశ్రీ’

మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లోని వ్యక్తులు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే2026 ఏడాదికి 45 మందిని …

Read More »

భర్తకు బెయిల్ ఇప్పించి మరీ…

​ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో ఒక మహిళ చేసిన కిరాతకం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చి మరీ కిరాయి హంతకులతో హత్య చేయించింది. ప్రియుడి వ్యామోహంలో పడి కట్టుకున్న వాడినే కాలయముడిలా మారి అంతమొందించింది. ​ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాలకు చెందిన శ్రీనుకు, ఝాన్సీకి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఝాన్సీ మరొకరితో …

Read More »

ప‌లాష్‌ను కొట్టిన మ‌హిళా క్రికెట‌ర్లు?

రెండు నెల కింద‌ట‌ భార‌త అగ్ర‌శ్రేణి మ‌హిళా క్రికెట‌ర్‌ స్మృతి మంధాన పెళ్లి అర్ధంత‌రంగా ఆగిపోవ‌డంపై ఎంత చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. స్మృతి తండ్రి అనారోగ్యం పాల‌వ‌డం వ‌ల్లే ఈ పెళ్లికి బ్రేక్ ప‌డిన‌ట్లు ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ రోజులు గ‌డిచేకొద్దీ ఈ వ్య‌వ‌హారం అనేక సందేహాలకు తావిచ్చింది. పెళ్లి వాయిదా ప‌డడం కాకుండా మొత్తంగా ఆగిపోవ‌డంతో అందుకు దారి తీసిన కార‌ణాలేంట‌నే చ‌ర్చ విస్తృతంగా జ‌రిగింది.  ప‌లాష్ …

Read More »

ఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటే

పెళ్లంటే ఆడంబ‌రాల‌కు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఎంత ఘ‌నంగా చేసుకుంటే అంత గొప్ప అన్న‌ట్లు అయిపోయింది. పెద్ద‌గా డ‌బ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘ‌నంగా పెళ్లిళ్లు చేయ‌డానికి చూస్తున్నారు. ఇలా చేయ‌డం క‌రెక్టా కాదా అన్న‌ది వేరే చ‌ర్చ‌. కుటుంబంలో ఎన్నో ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే శుభ‌కార్యాన్ని కొంచెం ఘ‌నంగా చేసుకుంటే త‌ప్పేంటి అనే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. …

Read More »