యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. అయితే రాత్రికి రాత్రే గ్యాస్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు కారణంగా కనిపిస్తోంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. దీంతో హైదరాబాద్లో గృహ …
Read More »సజ్జనార్ మాటలు వింటారా?
సోషల్ మీడియా యావలో పడిన చాలా మంది యువకులు, యవతులు తమ ప్రాణాలను కూడా బలి చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఇలాంటి అనేక సంఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కేవలం లైకులు, వ్యూస్ కోసం యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అనేక మంది ప్రముఖులు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. కేవలం రీల్స్ కోసమో.. వీడియోల కోసమో.. జీవితాలను బలి చేసుకోవడం సరికాదని చెబుతున్నారు. తాజాగా …
Read More »ఫస్ట్టైమ్: టీఆర్పీలకు కేంద్రం బ్రేక్.. రీజన్ ఇదే!
దేశంలోనే తొలిసారిగా.. టీవీ ఛానల్ రేటింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు వారాలు లేదా ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ముగిసే వరకు టీవీ ఛానళ్లకు ఇచ్చే రేటింగ్ను నిలుపుదల చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారాలతో రేటింగ్ పెంచుకోవాలని చూస్తున్నట్టు పేర్కొంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ …
Read More »వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!
చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్లైన్ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధిక స్క్రీన్ టైమ్ …
Read More »ఇండియాకు అంత ఈజీ కాదండోయ్
తడబడుతూ అడుగులు వేస్తూనే.. ఎలాగోలా టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు వచ్చేసింది ఇండియన్ టీం. సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన తీరు చూస్తే.. ఇండియా సెమీస్కు వస్తుందన్న నమ్మకం కూడా లేకపోయింది. వెస్టిండీస్తో చివరి సూపర్-8 మ్యాచ్లో గెలవడమూ సందేహంగానే కనిపించింది. కానీ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత జట్టు గట్టెక్కేసింది. సెమీఫైనల్లో సైతం సంజు మరో మేటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా కూడా …
Read More »499 పరుగులు.. 73 బౌండరీలు… ఆల్ టైమ్ రికార్డ్!
వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై ఇరు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు రాబట్టడం విశేషం. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడినా, భారత బౌలర్ల …
Read More »యుద్ధ సమయంలోనూ పసిడి ధర ఎలా తగ్గింది?
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భావిస్తారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి ఇలాంటి సమయంలో డిమాండ్ పెరిగి, ధరలు వేలల్లో పెరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల్లో సీన్ రివర్స్ అయ్యింది. ధరలు పెరగకపోగా, స్వల్పంగా తగ్గడం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది భారీ పతనం కాకపోయినా, …
Read More »మన ‘రూపాయి’ విలువ మరింత పతనమవుతుందా?
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఇరాన్ యుద్ధ ప్రభావం.. ప్రపంచ దేశలపై భారీగా పడనుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా 142 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న భారత్ వంటి దేశంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. రూపాయి భారీగా.. …
Read More »లక్షన్నర ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 9 లక్షలు ఎందుకుంది?
ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ మాత్రం సంబంధం లేని దేశాల మధ్య పంచాయితీకి మిగిలిన ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్న దుస్థితి. కొవిడ్ తర్వాత నుంచి పలు దేశాల మధ్య మొదలైన యుద్ధాలతో ప్రపంచం తల్లడిల్లుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా మొదలైన ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన …
Read More »చాంపియన్ అవుతారనుకుంటే చెత్తగా ఓడారు..
టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్కు వచ్చిన ఆ జట్టు.. కీలక పోరులో న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టోర్నీలో మొన్నటివరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రొటీస్ జట్టు, అత్యంత కీలకమైన మ్యాచ్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో పూర్తిగా విఫలమైంది. గ్రూప్ దశలో భారత్ వంటి పటిష్ట జట్లనే ఓడించిన సౌతాఫ్రికా, సెమీస్లో ఇలా చేతులెత్తేయడం …
Read More »కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలోని హోరును ఆపి, అక్కడి ప్రేక్షకులను మౌనంగా ఉండేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రౌండ్లో నిశ్శబ్దం నెలకొంటే, తాము మ్యాచ్ గెలుస్తున్నామని అర్థమని ఆయన చెప్పుకొచ్చారు. కరన్ …
Read More »ఈ చైనా సరుకులు ఎప్పుడూ పనిచేయవా?
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు. ఒకేసారి ఎన్నో లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి అంటారు. కానీ అసలు పరీక్ష యుద్ధభూమిలో పడితే మాత్రం కథ వేరేలా మారుతోంది. ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates