షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోక్సో కేసులో అరెస్టైన కుమార్ బెయిల్ పై విడుదలైన వెంటనే బాధిత బాలిక, ఆమె తల్లి, ఆమె నాయనమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. కుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలని, …
Read More »ఆరేళ్ల మనుమరాలితో కారు డ్రైవింగ్… ఎస్ఐ సస్పెండ్
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై పూజారి తిరుపతి వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. రద్దీగా ఉండే రోడ్డుపై మైనర్ బాలిక చేతికి స్టీరింగ్ అప్పగించి డ్రైవింగ్ చేయించడం, దీనిని ప్రశ్నించిన స్థానికులతో వాగ్వాదానికి దిగడం, అనంతరం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు శాఖ సీరియస్గా …
Read More »విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి చెందగా వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన మరికొందరు తెలుగువారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. …
Read More »ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భారతీయులు… అందులోనూ తెలుగు వారి తిప్పలు వర్ణనాతీతమనే చెప్పాలి. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కాగా… తమ మాతృభూమిలో వివాహం చేసుకోవాలని భావించిన తెలుగు జంట వీడియో కాల్ లోనే నిశ్చితార్థం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆగస్టులో జరగనున్న వీరి వివాహం కూడా అక్కడే …
Read More »విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆ దేశంలో విహార యాత్రకు వెళ్లిన 15 మంది భారతీయులు దుర్మరణం చెందారు. మరో 23 మంది క్షతగాత్రులుగా మిగిలారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటుగా తమిళనాడుకు చెందిన వారూ ఉన్నారు. ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ లావా ఏర్పాటు చేసిన విహార యాత్రలో …
Read More »ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తులతో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో అతని భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు, పోక్సో కేసు బాధిత బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రత్తమ్మ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజ్కుమార్ వేధింపులకు పాల్పడడంతో బాధిత బాలిక కుటుంబం …
Read More »వైరల్ వీడియో: వరద నీటిలో వేలాది గ్యాస్ సిలిండర్లు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండడంతో అక్కడ పాతాళ గంగ నది పొంగిపొర్లుతోంది. దీంతో, పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. అంతేకాదు, వరద నీటి ఉధృతికి హెచ్ పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ నుంచి ఎల్పీజీ సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఖాలాపూర్ తాలూకాలోని చావణే ప్రాంతంలో ఉన్న హెచ్ పీసీఎల్ ప్లాంట్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. కొండ …
Read More »టీమిండియాకు వరస్ట్ డే… దారుణమైన రికార్డులు!
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన మ్యాచ్ లో ఆడిన విధానం అస్సలు బాలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు మన బ్యాటింగ్ లైనప్ మొత్తం కొట్టుకుపోయింది. అసలు ఇండియా టీమ్ ఇలా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఒక్క ఓటమితో మన టీమ్ పేరిట నాలుగు చెత్త రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ …
Read More »మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ…?
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ.. అంటూ మాజీ మంత్రిని ఓ వ్యక్తి ఫోన్లో అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి, పలకడానికి కొత్తగా అనిపించిన ఈ పదం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, సెటైర్లు, జోకులు హోరెత్తిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, …
Read More »కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఇమేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఈ మధ్యే ‘భారత భాగ్య విదాత’ అని ఓ మంచి సినిమా చేస్తే పట్టుమని పది కోట్ల వసూళ్లు కూడా రాలేదు. గత కొన్నేళ్లలో కంగనా నటించిన సినిమాలన్నింటి పరిస్థితీ ఇదే. ఐతే చాన్నాళ్ల తర్వాత ఆమె నుంచి ఒక ప్రామిసింగ్ …
Read More »ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో మొదలుపెడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి వాళ్లతో స్క్వాడ్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ తోనే నిండిపోయింది. టాప్ ఆర్డర్ మొదలుకుని లోయర్ ఆర్డర్ దాకా ఒకే రకమైన బ్యాటర్లను నింపడం వెనుక సెలెక్టర్ల వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం …
Read More »కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో ఈ దిగ్గజ ఆటగాడి కల చెదిరిపోయింది. మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఇదే తన ఆఖరి ప్రపంచకప్ అని చాలా గర్వంగా ప్రకటించిన రొనాల్డో.. మైదానంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఆట ఆఖరి నిమిషం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates