“ఇంత దురదృష్టకరమైన అధ్యక్షుడిని మేం ఎప్పుడూ చూడలేదు. ఇంత తీవ్ర సమయంలో ఆయన ఏం చేస్తున్నారు?“ ఇదీ.. అమెరికా ప్రజల మాట. రష్యా దూకుడుతో చివురుటాకులా ఒణికి పోతున్న ఉక్రెయిన్ను రక్షించాలని.. అమెరికా ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చారు. ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో అధ్యక్షుడు బైడెన్పై నిప్పులు చెరుగుతున్నారు. `ఇది గుడ్డి పాలన.. అంధ నిర్ణయాలకు వేదికగా మారింది. బైడెన్ చెత్త అధ్యక్షుడు“ అంటూ.. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. …
Read More »ఉక్రెయిన్.. రష్యా హస్తగతం.. ఏ క్షణమైనా ప్రకటన!
అనుకున్నది సాధించేందుకు మరికొన్ని నిముషాలే సమయం ఉంది. ఉక్రెయిన్ప పట్టు బిగించిన రష్యా ఇప్పటికే చాలా నగరాలను స్వాధీనంలోకి తెచ్చుకుంది. అయితే.. కీలకమైన రాజధాని నగరం కీవ్ను హస్తగతం చేసుకోవడ మే రష్యా అధినేత పుతిన్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలోనే ఆయన అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే సగానిపైగా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.. మరికొద్ది సేపట్లోనే పూర్తిగా ఉక్రెయిన్కు గుండె కాయ వంటి కీవ్ను ఆయన చేతుల్లోకి …
Read More »వారిని నమ్ముకుని నిండా మునిగిన ఉక్రెయిన్
నమ్మించి నట్టేట ముంచటమంటే ఉక్రెయిన్ కు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. తన శక్తి ఎంత అన్నది వదిలేసి అరువు కాళ్ళపైన ఆధారపడితే ఏమవుతుందో ఉక్రెయిన్ కు యుద్ధం రెండో రోజే బాగా తెలిసిపోయినట్లుంది. సైనిక శక్తిలో రష్యాను ఏ విధంగాను ఎదిరించి నిలిచేంత సీన్ ఉక్రెయిన్ కు లేదని యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా రష్యా మీదకు ఉక్రెయిన కాలుదువ్వింది. తమ మీదకు యుద్ధానికి వస్తే మీ కతేంటో చెబుతానంటూ ఉక్రెయిన్ …
Read More »యుద్ధం కారణంగా మనకు సెగ తప్పదా ?
ఎక్కడో ఉన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగిపోతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నదంటే దాని ప్రభావం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. యావత్ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయిన కారణంగా ప్రతి దేశంపైనా ఎంతో కొంత ప్రభావం పడితీరుతుంది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా ఎంత పరోక్షంగా ఎంత తీవ్రత చూపుతుందన్నదే సమస్యగా మారిపోతోంది. ఇపుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణాన్నే తీసుకుంటే మరో మూడు …
Read More »ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా – మార్కెట్లు మటాష్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ కతేంటో చూడాలని అనుకున్న రష్యా సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతించారు. దీనికి ప్రతిచర్యగా ఉక్రెయిన్ కూడా దాడికి సిద్ధమైపోయింది. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసేసింది. ఒకవైపు ఉక్రెయిన్ కు మూడు వైపులా తన సైన్యాలను, యుద్ధ ట్యాంకులను, క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ మోహరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 2 లక్షల సైన్యం ఉక్రెయిన్ను మూడువైపులా …
Read More »కులాంతర పెళ్లి చేసుకున్నా.. కుమార్తె బాధ్యత తండ్రిదే: హైకోర్టు
తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. లేదా.. కులాంతర వివాహం చేసుకుందని.. తల్లిదండ్రులు ఇక ఆమెను వదిలించుకుం టామంటే కుదరదు. ఆ యువతి రక్షణ, ఆర్థిక బాధ్యతలను తండ్రి చూడవలసిందే. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటనపై విచారణ జరిపిన కోర్టు యువతి తండ్రి అన్ని విధాలా ఆమెకు రక్షణ కల్పించాల్సిందేనని.. మైనార్టీ తీరిన తర్వాత.. వివాహం అనేది ఆ …
Read More »అమెరికా నుండి గంజాయి దిగుమతా ?
వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు, విదేశాలకు మన దగ్గర నుంచి గంజాయి ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ రివర్సులో విదేశాల నుంచి అందునా అమెరికా నుంచి గంజాయి దిగుమతి అవ్వటం మాత్రం ఇదే మొదటిసారి. దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు గంజాయి దిగుమతయ్యింది. అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయి పరుపుల మధ్య వచ్చింది. లక్డీకాపూల్ లోని ఒక పరుపులు అమ్మే …
Read More »యుట్యూబ్ కు హైకోర్టు డెడ్ లైన్
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అసభ్య పోస్టుల కేసుపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపిం ది. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్ను హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచ్ ప్రభాకర్ కేసుపై న్యాయవాది అశ్వినీ కుమార్ మెమో దాఖలు చేశారు. …
Read More »ఒక వైపు అంత్యక్రియలు.. మరో వైపు విధ్వంసాలు
కర్ణాటక శివమొగ్గలో దారుణ హత్యకు గురైన భజరంగ్ దళ్ కార్యకర్త అంత్యక్రియల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. అంతిమయాత్ర సమయంలో కొందరు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటనలో 10కిపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి. అల్లరి మూకల చర్యలతో శివమొగ్గ ఓడీ రోడ్డులో భీతావహ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆదివారం రాత్రి నుంచే శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు అధికారులు. …
Read More »హిజాబ్ కన్నా చదువే ముఖ్యం
హిజాబ్ కన్నా ముస్లింలకు చదువులే ముఖ్యమని ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) చెప్పింది. విద్యాసంస్దల్లో హిజాబ్ ధరించామా లేదా అన్న విషయం కన్నా చక్కగా చదువుకునే విషయంపైనే ముస్లిం అమ్మాయిలు దృష్టి పెట్టాలని ఎంఆర్ఎం కీలక నేతలు హితవుచెప్పారు. పిల్లల భవిష్యత్తుకు హిజాబ్ కన్నా చదువే ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జాతీయ కన్వీనర్ అధికార ప్రతినిధి షాహిద్ సయూద్ తెలిపారు. కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన …
Read More »అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి మరణ శిక్ష
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలనతీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో …
Read More »లాయర్లకు తలంటిన న్యాయస్ధానం
లాయర్లకు న్యాయస్థానం ఫుల్లుగా తలంటింది. కోర్టులపైన, న్యాయమూర్తులపైన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దూషించటం, అనుచిత వ్యాఖ్యలు చేయటంపై హైకోర్టు బాగా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, కేసుల్లో ఇచ్చిన తీర్పులపై కొందరికి ఒళ్ళు మండిపోయి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోర్టు చాలా సీరియస్ అయిపోయింది. కోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ కేసులు నమోదు చేసి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates