కామం హద్దులు దాటింది… ప్రాణం పోయింది

సెక్సుకు కూడా ఒక హ‌ద్దు ఉండాలనేది భార‌తీయ సంప్ర‌దాయం. స‌రే.. ఇప్పుడుపాశ్చాత్య పోక‌డ‌లు వ‌చ్చిన త‌ర్వాత‌..ఒక‌రు కాదు ఇద్ద‌రు అంటున్నారు. పోనీ.. దానికైనా క‌ట్టుబ‌డి ఉండాలి క‌దా! అలా ఉండ‌క‌పోవ‌డ‌మే.. అత‌డి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఏకంగా ఇద్ద‌రిని పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వ్య‌క్తి.. మ‌రో మ‌హిళ‌పై క‌న్నేశాడు. చివ‌ర‌కు తొలి భార్య చేతిలో అత‌ను హ‌త‌మ‌య్యాడు! ఈ దారుణం తెలంగాణ‌లోనే జ‌రిగింది.

ఏం జ‌రిగిందంటే..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కాజీపేట డీజిల్‌ కాలనీకి చెందిన‌ జిన్నారపు వేణుకుమార్‌ (34) చిట్టిల వ్యాపారి. అతనికి రెండుపెళ్లిళ్లయి.. ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో తొలి భార్య రైల్వే ఉద్యోగం చేస్తోంది. రెండో ఆమె ఇంట్లో వంట వార్పు చూస్తోంది. ఇక‌, వీరిద్ద‌రినీ కూడా ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వేణు.. మ‌రో ప‌క్క చూపు చూశాడు. త‌న దైనందిన ప్ర‌యాణంలో మహబూబాబాద్‌కు చెందిన మరో మహిళ ప‌రిచ‌యం కావ‌డంతో ఆమెతోనూ రిలేష‌న్ పెట్టుకున్నాడు.

అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్‌కు రూ.4 లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. పథకం ప్రకారం సెప్టెంబర్‌ 30న మొద‌టి భార్య‌.. వేణుకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్‌ను గొంతు నులిమి హత్య చేశారు.

అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్‌ 2న భర్త వేణుకుమార్‌ కనిపించడం లేదంటూ మొద‌టి భార్య‌ కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో అనుమానం వచ్చిన పోలీసులు.. మొద‌టి భార్య కాల్‌ లిస్ట్ ను బ‌య‌ట‌కు తీశారు. ఇంకేముంది బండారం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆమెను, రెండో భార్య‌ను, వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌ను కూడా అరెస్టు చేశారు. అతి ఎప్ప‌టికైనా విషాదానికి దారితీస్తుంద‌ని ఊరికేనే చెప్పలేదు క‌దా! ఇదీ అంతే!!