Trends

రూ.1077 కోట్ల భవనం కార్చిచ్చుకు కాలి బూడిదైంది

కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ.. విలాసవంత జీవనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండే ఈ మహానగరం.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వేలాది ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు కారణంగా జరిగిన ఆస్తి నష్టం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లకు పైనే ఉంటుందని …

Read More »

పాక్ సుడి తిరిగింది: నదిలో 33 టన్నుల బంగారు నిల్వలు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు. వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. …

Read More »

చెప్పడానికి ఏం లేదు.. అంతా బూడిదే!!

అగ్ర‌రాజ్యం అమెరికాలో ధ‌నవంతులు నివ‌సించే ప్రాంతం అది! క‌డుక్కున్న కాళ్ల‌తో అక్క‌డ అడుగులు వేసినా ముద్ర‌ప‌డ‌తాయేమో.. మ‌ట్టి అంటుతుందేమో.. అని భావించేంత క్లీన్‌గా.. ముఖ‌మ‌ల్ వ‌స్త్రంతో తుడిచిన అద్దంగా అక్క‌డి ఇళ్లు మెరిసిపోతూ ఉంటాయి. ర‌హ‌దారులు కూడా క‌డిగిన కంచాల్లా.. త‌ళ‌త‌ళ మెరుస్తూ ఉంటాయి. ప్ర‌తి గంట‌కూ ఒక‌సారి రోడ్లు ప‌రిశుభ్రం చేస్తూనే ఉంటారు. ఆకు రాలినా.. కాయితం ప‌డినా.. వెంట‌నే తీసేస్తారు. అంత అందంగా.. అంత అద్దంగా మెరిసే …

Read More »

90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర: ఇచ్చిపడేశాడు!

కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పని-జీవిత సమతుల్యతపై చర్చలు జరుగుతుండగా, వారానికి 90 గంటల పని చేయాలని కొందరు కార్పొరేట్ ప్రముఖులు సూచించడం వివాదాస్పదంగా మారింది. లార్సెన్ అండ్ టూబ్రో (L&T) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ సైతం వీలైతే ఆదివారాలు కూడా పనికి హాజరవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల మధ్య …

Read More »

ఆపిల్ సీఈవో జీతం ఎంతో తెలుసా?

ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 …

Read More »

బుమ్రా లేని లోటును షమీ భర్తీ చేస్తాడా?

వరల్డ్ క్రికెట్ లో కీలక సిరీస్ గా పరిగణిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి మరెంతో సమయం లేదు. పిబ్రవరిలో ఈ సిరీస్ మొదలుకానుండగా… ఫేవరేట్ గా బరిలోకి దిగనున్న టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలినట్టైంది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో కీలకమైన లీగ్ మ్యాచ్ లకు దూరమైపోయాడు. వెన్నెముక నొప్పి కారణంగా అతడికి విశ్రాంతి అవసరమని భావించిన బీసీసీఐ బెంగళూరులోని క్రికెట్ అకాడెమీకి …

Read More »

బస్సు టిక్కెట్లకు విమానం ధరలు

తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. పండుగ పూట సొంతూరికి వెళ్లాలని భావిస్తున్న వారికీ ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ప్రత్యేక బస్సులు, రైళ్లు నింపాదిగా నిండిపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కానీ టికెట్ ధరలు చూస్తే విమాన టికెట్ ధరలతో సమానంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు అధిక …

Read More »

సింధుతో బరిలోకి దిగిన కేంద్ర మంత్రి

పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే. ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర …

Read More »

రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా బౌలర్

రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియాకు ఆడిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. తన దశాబ్ద కాలకాలం క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ పట్ల తన ప్రేమను, తనకు ఆ క్రీడ ఇచ్చిన అపార అనుభవాలను …

Read More »

స్వలింగ వివాహాలపై సుప్రీం సంచలన తీర్పు!

స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పున:సమీక్షించాలన్న వినతికి నో చెప్పేసింది. అంతేకాదు.. గతంలో ఈ …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రా లేకపోతే ఎలా?

జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలు భారత క్రికెట్‌లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు పడడం వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అతని అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ సచౌటెన్‌ను సంప్రదించినట్టు సమాచారం. బీసీసీఐ మెడికల్ టీమ్‌తో కలిసి బుమ్రా సమస్య తీవ్రతను అంచనా వేస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ తుది జట్టుకు …

Read More »

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇకపై దొరకవు

మద్యం ప్రియులకు… ప్రత్యేకించి బీరు ప్రియులకు కింగ్ ఫిషర్ పేరు వింటే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఆల్కహాల్ శాతాల్లో కాస్తంత తేడాలతో పలు రూపాల్లో లభించే కేఎఫ్ బీర్ల కోసం మద్యం ప్రియులు అర్రులు చాస్తూ ఉంటారు. అవి దొరికినంతనే… లొట్టలు వేసుకుంటూ మరీ ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి కేఎఫ్ బీర్లకు ఇప్పుడు తెలంగాణలో కరువు వచ్చేసినట్టేనని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా కేఎఫ్ బీర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆ …

Read More »