Trends

స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ – ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది

విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ …

Read More »

‘గంభీర్ నిర్ణయాలు అస్సలు బాలేవు’

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు కొన్ని గొప్ప విజయాలు ఉన్నా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ ఓటమితో పలు విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన ఈ వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓటమి పాలవ్వడంపై, 1983 ప్రపంచకప్ విన్నర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. గంభీర్ తీసుకునే నిర్ణయాలు చాలా తొందరపాటుతో కూడినవని,  కోచింగ్‌లో జట్టు ఫలితాలు చాలా దారుణంగా ఉంటున్నాయని శ్రీకాంత్ విమర్శించారు. “గంభీర్ …

Read More »

యూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివే

యూరప్ ట్రిప్ అనేది చాలామంది కల. కానీ, పారిస్ వీధుల్లో తిరగాలని కలలు కనే వేలాది మంది ట్రావెలర్స్, చివరి నిమిషంలో షెంజెన్ వీసా రిజెక్షన్ ఎదుర్కొని షాక్‌కు గురవుతున్నారు. 2024లోనే ఏకంగా 1.7 మిలియన్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దీంతో పాటు, ఫీజుల రూపంలో 145 మిలియన్ల డాలర్ల డబ్బు కూడా పోయింది. ఈ ఆర్థిక నష్టాన్ని, నిరాశను తప్పించుకోవాలంటే, వీసా రిజెక్ట్ కావడానికి గల ముఖ్య కారణాలు …

Read More »

రోహిత్ కోహ్లీ.. ఇద్దరికీ నెక్ట్స్ బిగ్ ఛాలెంజ్ ఇదే!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ, అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఫామ్‌లోకి రావడం పెద్ద ఊరట. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న ఈ సీనియర్ ప్లేయర్లు, తమ బ్యాటింగ్‌తో సిడ్నీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి టీమ్‌కు విజయాన్ని అందించారు. అయితే, ఇప్పుడు వీరు మళ్లీ ఎప్పుడు మైదానంలో కనిపిస్తారు, 2027 ప్రపంచకప్‌ లక్ష్యంగా తమ ఫిట్‌నెస్, …

Read More »

‘లిథియం’ 3 వేల డిగ్రీల వేడి.. క‌ర్నూలు ఘ‌ట‌న‌ వెనుక రీజ‌నిదే!

క‌ర్నూలులోని చిన్న‌టేకూరు వ‌ద్ద శుక్ర‌వారం తెల్ల‌వారు జామున జ‌రిగిన ఘ‌రో ప్ర‌మాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు మంట‌ల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృత దేహాల‌ను కూడా గుర్తించేందుకు వీల్లేకుండా పోయింది. మాంస‌పు ముద్ద‌లు మాత్ర‌మే ల‌భించాయి. వీటిలోనూ ఒక‌రిద్ద‌రికి అయితే.. కేవ‌లం ఓ రాగి ముద్దంత ప‌రిమాణంలోనే శ‌రీరం ల‌భించిందంటే.. ప్ర‌మాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. ఈ వ్య‌వ‌హారంపై .. …

Read More »

ప్రెస్ క్ల‌బ్ పోరు: ⁠ మ‌న జ‌ర్న‌లిస్ట్ ⁠ ర‌మేష్‌ను గెలిపించుకుందాం!

క‌లం హాలికులుగా స‌మాజ చైత‌న్యానికి నిరంత‌రం చెమ‌టోడుస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా.. నేనున్నానంటూ ముందుకు వ‌చ్చే వారే ఆప‌న్నులు. నేనున్నానంటూ.. అండ‌గా నిలిచేవారే.. పాత్రికేయుల‌కు ఆప‌త్బాంధ‌వులు. అలాంటి వారిలో మిన్న‌గా.. ముందుండే.. జ‌ర్న‌లిస్టు.. వ‌రికుప్ప‌ల ర‌మేష్‌(ఈనాడు). సుదీర్ఘ కాలంగా పాత్రికేయ వృత్తిలో కొన‌సాగుతున్న ర‌మేష్‌.. జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు త‌ల్లో నాలుక అన‌డంలో సందేహం లేదు. ఎవ‌రికి ఎక్క‌డ ఆప‌ద వాటిల్లినా.. నేనున్నానంటూ ఆయ‌న స్పందిస్తారు. ఆప‌న్న‌హ‌స్తం అందిస్తారు. …

Read More »

పవర్ బ్యాంక్: విమానాల్లో నిషేధం?

విమాన ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో ఒక ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా నిప్పంటుకోవడంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పవర్ బ్యాంక్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం లేదా కఠిన నిబంధనలు విధించే ఆలోచనలో ఉంది. విమానం టేకాఫ్ కోసం టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఒక ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్‌లో ఉన్న పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం ఈ అనూహ్య …

Read More »

కోహ్లి.. టాటా చెప్పేయబోతున్నాడా?

విరాట్ కోహ్లి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి మేటి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఒక దశలో తన పరుగుల ప్రవాహం సచిన్‌ను కూడా మించిపోయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఎలాంటి ఆటగాడికైనా కెరీర్లో ఏదో ఒక దశలో పతనం తప్పదు. సచిన్ కూడా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. తన ప్రైమ్ 2019 …

Read More »

బాంబినో కుటుంబ ఆస్తుల వివాదం..

ఫాస్ట్-మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో బాంబినో బ్రాండ్ పేరు అందరికీ తెలిసిందే. ఈ సంస్థ స్థాపకుడు మాధం కిషన్ రావు 2021లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన మనవడు కార్తికేయ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి నలుగురు మహిళలపై రూ. 40 కోట్ల షేర్, ఆస్తుల మోసాల కేసు నమోదు చేసాడు. కిషన్ …

Read More »

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను మానసికంగా హింసించారని, డబ్బు విషయంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో, కంపెనీలో హరాస్‌మెంట్ వల్లే తన సోదరుడు చనిపోయాడని అరవింద్ సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు అగర్వాల్‌తో పాటు …

Read More »

నిజామాబాద్‌లో ఎన్‌కౌంట‌ర్‌: రియాజ్ హ‌తం

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ తీవ్ర సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్‌లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఈ కాల్పులు జ‌రిపినట్టు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి చెప్పారు. ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గా సంచ‌ల‌నం సృష్టించిన నేప‌థ్యంలో డీజీపీ స్పందించారు. నిజామాబాద్‌లోని ఆసుప‌త్రిలో రియాజ్‌ను వైద్య ప‌రీక్ష‌ల కోసం తీసుకువెళ్లామ‌న్నారు. అయితే.. …

Read More »

కొత్త మ్యాక్‌బుక్ ప్రో M5 ఎలా ఉందంటే..

యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన M5 మ్యాక్‌బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కొత్త 14 అంగుళాల మోడల్, ఆన్ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరును పెంచడానికి రూపొందించబడింది. ఇది గత సంవత్సరం వచ్చిన M4 మ్యాక్‌బుక్ ప్రోకు ఎంతవరకు అప్‌గ్రేడ్‌గా ఉంది, డిజైన్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. రెండు చిప్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం AI …

Read More »