పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్ (50), అతని భార్య దుర్గావతి (47)లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఆధారాలపై దోషులుగా తేల్చి మరణదండన విధించింది. పోక్సో చట్టం, భారతీయ దండన చట్టంలోని పలు సెక్షన్ల కింద దంపతులను దోషులుగా …
Read More »మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో తన గుంపును విడిచిపెట్టి, మంచు పర్వతాల వైపు ఒంటరిగా ప్రయాణిస్తున్న ఈ పెంగ్విన్ వీడియో అనేక ప్లాట్ఫారమ్లలో వైరల్ అయింది. తన గమ్యం మరణమని తెలిసినా అది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లడం, మనుషుల్లోని ఒంటరితనాన్ని, “అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనే” వైరాగ్యాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్లు భావించారు. పంచ్ కోతి …
Read More »19 ఏళ్ల తర్వాత.. అయేషా అంత్యక్రియలు.. ఏం జరిగింది?
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో నిందితులు ఎవరు? అసలీ దారుణం ఎలా జరిగింది? అనే విషయాలు ఇప్పటికీ తేలలేదు. విచారణపై విచారణ జరిగినా.. ఇప్పటికీ అయేషా మీరా కేసు మిలియన్ డాలర్ల సస్పెన్సుగానే ఉంది. రాష్ట్ర పోలీసులు.. సీఐడీ అధికారులు.. కేంద్రం పర్యవేక్షణలోని సీబీఐ అధికారులు సైతం ఈ కేసును విచారించారు. అయినా.. ఇప్పటికీ …
Read More »ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్ అవ్వగా.. అందులో గ్రూప్ 1 ఇప్పుడందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లు కూడా లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ‘అన్బీటెన్’గా దూసుకొచ్చినవే. భారత్ తో పాటు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే జట్లు ఈ గ్రూపులో ఉండటంతో పోరు అత్యంత కఠినంగా …
Read More »అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్లోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు. మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భవనం సమీపంలోనే ఉన్న హైదరాబాద్ మెట్రో మార్గం వద్ద ఈ ఘటన …
Read More »అన్వేషణ హద్దు దాటేస్తుందా?
నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది…! యూట్యూబర్గా అందరికీ సుపరిచితమే. వందలాది దేశాలు తిరిగి అక్కడి నుంచి వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను దాని మాతృ సంస్థ మెటా నిలిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో ఆయనకు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిందూ దేవతలపై …
Read More »కేవలం ‘టీవీ సౌండ్’ గొడవ వల్లే భర్తను భార్య పొడిచిందా?
కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు, చివరికి ఇలాంటి విషాదాలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్( 26) ఏసీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం పెళ్లికి దారితీసింది. అయితే, ఆమెకు గతంలోనే వివాహం జరిగిందని, …
Read More »ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా విప్లవాన్ని తెచ్చేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఆయన ఒక భారీ ప్రకటన చేశారు. రాబోయే ఏడేళ్లలో ఏఐ రంగంలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం వ్యాపారం కోసం చేస్తున్న పెట్టుబడి కాదు, దేశ …
Read More »మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. గాజువాక సమీపంలోని గంగవరం పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారిని యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిస్కెట్లు, తినుబండారాలు కొనిపెడతానని నమ్మబలికి చిన్నారిని …
Read More »బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల మధ్య కూర్చున్న ఒక వ్యక్తిని చూసి బస్టాండ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అతను మహిళ కాదు, ఒక యువకుడని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్టాండ్ ఆవరణలో మహిళల కోసం కేటాయించిన …
Read More »డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ‘ఓరియన్’ అని పిలుచుకుంటున్న ఈ రోబోను తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సొంతంగా తయారు చేశామని ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు మీడియా ముందు చెప్పడం ఈ గొడవకు కారణమైంది. అయితే అది చూసిన నెటిజన్లు, ఇది చైనాకు చెందిన ‘Unitree’ కంపెనీ తయారు చేసిన రోబో …
Read More »రీల్స్ పిచ్చికి రీల్స్ తోనే సమాధానం
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ఓ వర్గం యువత ఎంతకైనా తెగిస్తోంది. ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా, తోటి ప్రయాణికుల భద్రతను కూడా గాలికి వదిలేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. బైక్పై వెళ్తూ పక్కనే వెళ్తున్న బస్సులు, ఆటో డోర్లను బలవంతంగా తీస్తూ వీరంగం సృష్టించిన ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates