Trends

ఇన్కమ్ టాక్స్ ఉద్యోగి.. 600 లంచం.. ఏడాది జైలు శిక్ష!

కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్‌ ప్రాసెస్‌ చేయడానికి రూ.600 లంచం తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగికి పట్నా హైకోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసు 2011లో వెలుగులోకి వచ్చింది. పన్ను రిఫండ్‌ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌’ రూ.600 లంచం ఇవ్వాలని …

Read More »

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: పనిమంతులకు కలిసొచ్చిన 2025!

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. పనిచేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండి ప్రజలకు చేరువయ్యారు. అదే సమయంలో అభివృద్ధిని నమ్ముకుని ముందుకు సాగుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగడమే కాక ప్రజలతో దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది. తాడికొండ …

Read More »

చెన్నైలో నాన్ లోకల్ పరిస్థితి ఇదా?

లోకల్ వెర్సస్ నాన్ లోకల్ గొడవలు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు తమ ఉపాధిని దెబ్బ కొడుతున్నారనో.. వాళ్ల వల్ల అశాంతి నెలకొంటోందనో.. ఇంకో కారణంతోనో స్థానికులు వారి మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటారు. ఐతే ఈ వ్యతిరేకత మాటల వరకు పరిమితమైతే పర్వాలేదు. కానీ చేతల్లోకి వెళ్లి దాడులకు పాల్పడడమే దారుణం. భాష, ప్రాంతాభిమానం అధికంగా ఉండే తమిళనాట.. ఇతర రాష్ట్రాల వాళ్ల పట్ల ఎంత …

Read More »

న్యూ ఇయర్ ఆఫర్: మందుబాబుల‌కు ఉచిత ప్ర‌యాణం!

నూత‌న సంవ‌త్స‌రం 2026కు స్వాగ‌తం ప‌లుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వ‌హించుకునే కార్యక్ర‌మాల్లో మందు బాబులు రెచ్చిపోవ‌డం ఖాయం. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల్లో మందు పార్టీల‌కు నూతన సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పెట్టింది పేరు. దీంతో అనేక బార్లు, రెస్టారెంట్లు.. ఇప్ప‌టికే మందుబాబుల‌కు ఫుల్ బాటిళ్ల‌పై రాయితీలు కూడా ప్ర‌క‌టించాయి. అయితే.. నాణేనికి ఇది ఒక‌వైపే. మ‌రోవైపు.. మందు తాగి చిందులు వేస్తే ఊరుకునేది లేదని.. బుధ‌వారం పొద్దు …

Read More »

2025.. గ‌తానికి భిన్నంగా లోకేష్ అడుగులు..!

ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనను గమనిస్తే మంత్రి నారా లోకేష్ కేంద్రంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే నారా లోకేష్ నిలబడ్డారు. శాఖలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందించారు. తద్వారా ప్రభుత్వంలో లోటు రాకుండా ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎటువంటి గ్యాప్ పెరగకుండా కూడా నారా లోకేష్ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మెగా …

Read More »

న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ పేరుతో లింకులు… ఓపెన్ చేశారా అంతే!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు పంపించుకుంటున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమ మోసాలకు వాడుకుంటున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, గిఫ్ట్, ప్రత్యేక ఆఫర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపిస్తూ అమాయకులను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఆ ఫైల్‌ను ఓపెన్ చేస్తే ఫోన్‌లో హానికరమైన …

Read More »

ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కోనసీమ కొబ్బరి రైతులతో గత నెల మాట్లాడిన సందర్భంగా 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని ఇచ్చిన హామీని ఆయన 10 రోజుల ముందుగానే అమలు చేసి, 35 …

Read More »

హద్దు దాటి మాట్లాడి 2 లక్షల సబ్స్క్రైబర్లను పోగొట్టుకున్నాడు

సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే.. హద్దులు దాటి మాట్లాడితే ఏమవుతుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల విషయం నెలకొన్న వివాదం సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. కొందరు సమర్థించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం గురించి చెబుతూ.. తాను వాడిన అభ్యంతరకర పదాల విషయంలో శివాజీ సారీ చెప్పారు. ఐతే ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ …

Read More »

తెలంగాణ చరిత్రలో మొదటి ఉరిశిక్ష!

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఫ‌స్ట్ టైమ్ ఓ హ‌త్య కేసులో దోషిగా తేలిన వ్య‌క్తికి స్థానిక కోర్టు ఉరి శిక్ష విధించింది. కాగా.. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక నేరాలు జ‌రిగాయి. అనేక హ‌త్య‌లు కూడా చోటు చేసుకున్నాయి. ఇక‌, మ‌హిళ‌ల‌పై అత్యాచారం కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే.. కొన్ని కేసుల్లో నిందితులు ఎన్ కౌంట‌ర్ అయ్యారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ల‌మైన ఇలాంటి నేరాల కేసుల్లో ఉరి లేదా …

Read More »

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖలు, బీజేపీ నేతపై కేసు

మతపరమైన అంశాలపై  వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలుచుకునే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కేసులు ఎదుర్కోవడం తరచుగా జరుగుతోంది. తాజాగా  షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పులువురిపై కేసులు నమోదయ్యాయి. నటి మాధవీ లతపై ఎఫ్ఐఆర్ చేశారు. పలువురు యూట్యూబర్లపై కూడా కేసులు ఫైల్అయ్యాయి. వీరంతా సరూర్ నగర్ లో విచారణలకు కావాలని ఆదేశించారు. మాధవీలత ఒక్కరిపైనే కాకుండా, ఆమె …

Read More »

చావు ఇంట్లో విందు.. ఆ రైతా తిన్నవాళ్లకు ఏమైందంటే?

ఉత్తర ప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ బాధలో ఉంటారు, కర్మకాండల తర్వాత భోజనాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆ భోజనమే ఇప్పుడు ఊరంతటికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంత్యక్రియల సమయంలో వడ్డించిన రైతా తిన్న దాదాపు 200 మంది గ్రామస్తులు ఇప్పుడు ఆసుపత్రి బాట పట్టారు. పిప్రౌలి అనే గ్రామంలో డిసెంబర్ 23న జరిగిన ఒక …

Read More »

అందాల అరకు హౌస్ ఫుల్

తూర్పు కనుమల నడుమ ప్రకృతి సోయగాలతో విరజిల్లుతున్న అరకు వ్యాలీ వరుస సెలవులు, ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. విశాఖపట్నం‌కు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక కేంద్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో అరకు లోయ పూర్తిగా హౌస్‌ఫుల్‌గా మారగా, హోటళ్లు, లాడ్జీలు …

Read More »