ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా అయిపోతోంది. ప్రభుత్వాలు పార్టీల నేతృత్వంలోనే ఏర్పడినా పనులు మాత్రం వేరు. పాలిటిక్స్ను పార్టీలు చేయాలి… పాలన ప్రభుత్వాలు చేయాలి. పాలన, పాలిటిక్స్ మధ్య ఉన్న విభజన రేఖను పాలక పార్టీలు చెరిపేస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ జాడ్యం మరింత ఎక్కువైపోతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రశ్నించాల్సిన ప్రజలు కూడా అలాంటి అవకాశం ఏమాత్రం లేకపోవడంతో సర్దుకుపోవడానికి అలవాటుపడిపోతున్నారు. ఉద్యోగులు ఒకటో తారీఖున జీతం …
Read More »ఔను.. నిజంగా ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి!
కేవలం రెండు రోజుల్లో ఏపీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడమే. ఒకటి మాదకద్రవ్యాల రవాణా, వినియోగం వంటివాటిలో ఏపీ నెంబర్1 స్థానంలో ఉందని కేంద్రమే రెండు రోజలు కిందట వెల్లడించింది. దీంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇంతలోనే కేంద్రం మరో బాంబు పేల్చింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న, నమోదైన నేతల జాబితాలోనూ దేశంలో ఏపీ తొలి స్థానంలో ఉండడమే! గత ఐదేళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా …
Read More »తప్పదు.. కేసీఆర్ తగ్గాల్సిన టైం వచ్చేసింది!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర గవర్నర్పై ఇప్పటి వరకు ఉన్న మూతి బిగింపులు.. అలకల విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం.. వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎన్నికల ముంగిట పంతాలకు, పట్టింపులకు పోతే.. కీలకమైన బిల్లుల విషయంలో మరింత సాచివేత కొనసాగడం ఖాయం. దీంతో అంతిమంగా నష్టం వచ్చేది తెలంగాణ ప్రభుత్వానికే. సో.. అందుకే ఇప్పుడు కేసీఆర్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఈ …
Read More »బీసీ సభ ఓకే.. కానీ, ఈ విమర్శల మాటేంటి జగన్ సర్!
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు.. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభ జయమో.. పరాజయమో.. ఏదో ఒకటి సాధించింది. ప్రతిపక్షాలు పరాజయం అంటే.. అధికార పార్టీ సహజంగానే జయమని చెప్పడం రివాజు కనుక.. దీని జోలికి పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. అయితే.. సభ సందట్లో వచ్చిన విమర్శలు.. ఇక్కడ కనిపించిన సీన్లు.. ఇప్పుడు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు కూడా! ఇవీ..విమర్శలు.. జయహో …
Read More »ప్లీజ్… నన్నెవరైనా పార్టీలో చేర్చుకోండి
ఎలక్షన్ల ముందు ఏ పార్టీ గాలి వీస్తోందో కరెక్టుగా గెస్ చేసి ఆ పార్టీలోకి జంప్ చేసే గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో మాత్రం టీడీపీలో కంటిన్యూ అయి విపక్షంలో కూర్చున్నారు. ఫర్లేదులో ఎలక్షన్ల తరువాతైనా పార్టీ మారి అధికారిపక్షంలో చేరి మంత్రి పదవి కొట్టేయాలనుకున్నా ఆ హామీ దొరక్కపోవడంతో ఫిరాయింపు ప్లాన్ కాస్త పక్కనపెట్టేశారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీలు మారి పవర్ చేతిలో ఉంచుకునే గంటా ఎత్తుగడలకు వైసీపీ …
Read More »అయ్యో! సాయిరెడ్డికి ఎందుకిలా జరిగింది?
తెలుగు రాష్ట్రాలలో కేంద్రంలోని పెద్దల దగ్గర ఎంతోకొంత యాక్సెస్, లైజనింగ్ ఉన్న పొలిటీసియన్లలో విజయసాయిరెడ్డి ఒకరు. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా ఎక్కడో ఒక చోట ప్రధాని మోదీ ఆయన్ను పలకరించడం… ఆ ఫొటోలు షేర్ చేసి తన పలుకుబడిని ఆయన ప్రచారం చేసుకుంటుండడం జరుగుతున్నదే. అంతేకాదు.. ఏదో ఒక కమిటీలో కేంద్రం ఆయన్ను నియమిస్తుండడం వంటివి జరుగుతుండడంతో విజయసాయిరెడ్డికి కేంద్రంలో కాస్త ప్రయారిటీ ఉందని ఒప్పుకోకతప్పదు. అయితే… తాజాగా జరిగిన …
Read More »మాగుంట కొత్త తంటా
కవిత తర్వాత మాగుంటేనన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వర్గాల్లోనూ అదే భయం నెలకొంది. ఆయనకు తొందరలో నోటీసులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కవిత నుంచి ఈనెల 11న వివరణ తీసుకున్న తర్వాత దాని ఆధారంగా లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట …
Read More »జనసేన ఎన్నికల ప్రచార రథం రెడీ
ఏపీలో మరో ప్రతిపక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. వైసీపీ అవినీతి, అక్కమాలపై యుద్ధం చేస్తామని తరచుగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్టు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే, ఎందుకో ఇది వాయిదా పడింది. అయితే, తాజాగా.. ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. Pawan Kalyan చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఎన్నికల …
Read More »పబ్లిక్ టాక్: ప్రాంతాలు.. కులాలు.. ఏపీ గురించి ఇప్పటికి ఇంతే!
ఏపీ గురించి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఏం మిగిలింది? ఇదీ.. ఇప్పుడు పబ్లిక్ టాక్. ఎన్నికలకు సమ యం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రజలను కలుస్తున్నాయి. వారు ఏం చెబుతారా? అని మైకు గొట్టాలు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు చెబుతు న్న మాట చాలా ఆలోచనాత్మకంగా ఉండడం గమనార్హం. ఏం చెబుతాం.. ప్రాంతాలు.. కులాల మధ్య ఇప్పుడు వివాదాలు …
Read More »వైసీపీకి టీడీపీ చెక్.. ఏం చేసిందంటే
ఏపీ అధికార పార్టీ వైసీపీ విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు అదే సమయంలో ప్రతిపక్షం టీడీపీ చెక్ పెట్టింది. వైసీపీ నిర్వహించిన సభకు ప్రతిగా టీడీపీ తీసుకువచ్చిన JayahoBC అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా #TDPJayahoBC అనే హ్యాష్ట్యాగ్ టాప్లో ట్రెండ్ అయింది. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఐ-టీడీపీ విభాగం దీనిని ఆన్లైన్లో ట్రెండ్ చేసింది. …
Read More »టీడీపీలో లోకల్ పాలిటిక్స్
టీడీపీకి సమస్యలు తప్పడం లేదా … పోటీ విషయంలో నేతలు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయా…. తాజా పరిణామాలతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారా.. అందుకే మీటింగులు పెట్టి అధిష్టానానికి వినతులు పంపుతున్నారా.. నియోజకవర్గాల వారీగా నేస్థానికులకే టికెటివ్వాలని తీర్మానాలుఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో పోటీఎటూ తేల్చని టీడీపీ అధిష్టానంపొత్తులపైనా లేదు క్లారిటీఅనేక నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించని చంద్రబాబుఓటమికి కారణమైన నేతల్లో కొత్త భయాలు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి …
Read More »గడప గడపకు తరహాలో కొత్త స్కీమ్
ఏపీ అధికార పార్టీ వైసీపికి ఉన్న జనాదరణ రోజురోజుకు తగ్గిపోతోంది. దానితో జనంలో ఉంటూ తిరిగి వారి మద్దతును కూడగట్టుకునేందుకు సీఎం జగన్ రెడ్డి కొత్త వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు, ప్రతీ ఒక్కరికీ వాటి వల్ల కలిగిన ప్రయోజనాన్ని వైసీపీ అంచనా వేస్తోంది. ఆ దిశగానే ప్రచార కార్యక్రమం రూపొందిస్తోంది. ఎన్నికల నాటికి ఎలాగోలా ఓట్లు దండుకోవాలన్న ఆశతో వైసీపీ ప్రయత్నాలను ముమ్మరం …
Read More »