Political News

‘చంద్రబాబు, విజయసాయిరెడ్డి చేతిలో చేయి వేసి మాటామంతీ’

టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే ఒంటి కాలు మీద లేస్తారు వైసీపీ నంబర్ 2 విజయసాయిరెడ్డి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కూడా విజయసాయిరెడ్డిపై అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసిన సందర్భం, మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నందమూరి తారకరత్న మృతి సందర్భంగా పరామర్శించేందుకు వచ్చిన ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో …

Read More »

తారకరత్నకు ఛాన్స్ ఇద్దామనుకున్నాం – చంద్రబాబు

సినిమా కెరీర్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాక.. రాజకీయాల వైపు అడుగులు వేసి.. అందులోనైనా విజయవంతం కావాలని, మంచి స్థాయిని అందుకోవాలని అనుకున్నాడు నందమూరి తారకరత్న. కానీ అతడి ప్రయాణం ఆరంభంలోనే ఆగిపోయింది. నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర తొలి రోజు తన బావతో కలిసి అడుగులు వేస్తున్న సమయంలో తారకరత్నకు గుండెపోటు రావడం.. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మృత్యువుతో పోరాడడం.. చివరికి శివరాత్రి రోజు శివైక్యం …

Read More »

అప‌న‌మ్మ‌కం ఏపీలో ఏ పార్టీని ముంచేస్తుందో ?

ఏ రాజ‌కీయ పార్టీకైనా నాయ‌కులు చాలా ముఖ్యం క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్.. కీల‌క నేత‌ల స‌హ‌కారం.. లేక‌పోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన ప‌రిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయ‌కుల విష‌యంలో ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది గ‌తంలో ఉండేది. పార్టీలు నేత‌ల‌పై భారం వేచి ఊరుకునేవి. త‌మ ప‌ని తాము చేసుకునిపోయేవి. నిర్ణ‌యాలు తీసుకుని వ‌దిలేయ‌డం మిన‌హా.. నేత‌ల‌పై పెద్ద‌గా …

Read More »

షర్మిల అరెస్టు.. హైదరాబాద్ కు తరలింపు

అనుకున్నట్లే జరిగింది. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆమె పాదయాత్రను కూడా రద్దు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహబూబాబాద్ లో ఆమె నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ను పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం షర్మిల కారవాన్ వద్దకు …

Read More »

జంపింగులు పెరిగితే న‌ష్టం వైసీపీకా… టీడీపీకా…!

ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేత‌ల సంఖ్య పెరుగుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువ‌గా జంప్ చేసే నేత‌లు పెరుగుతున్నార‌ని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేత‌ల‌కు లేకుండా పోయింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు …

Read More »

అంతా స‌జ్జ‌ల డైరెక్ష‌న్‌లోనే.. చంద్ర‌బాబు ఫైర్‌

త‌న ప‌ర్య‌ట‌న‌లో పోలీసులు అడుగ‌డుగునా ఉక్కుపాదం మోప‌డం, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయడం.. స‌భ‌ను అడ్డుకోవ‌డం అన్నీ కూడా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లోనే సాగుతున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. “ప్రజల్లో వ్యతిరేకత గమనించే జ‌గ‌న్‌ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి… అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో …

Read More »

ఇక్కడ ప్రతిపక్ష నేతలను హీరోలను చేయబడును

కొన్ని నెలల కిందట విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఏదో సభ పెట్టిన సందర్భంలోనే పవన్ తన పర్యటన పెట్టుకున్నారు. చాలా రోజుల ముందే షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమం అది. మామూలుగా అయితే పవన్ వచ్చేవాడు. ఆ కార్యక్రమం ఏదో పూర్తి చేసుకుని వెళ్లిపోయేవాడు. మీడియాలో ఓ మోస్తరుగా కవరేజీ వచ్చేదంతే. కానీ ఆయన …

Read More »

జ‌గ‌న్ కేబినెట్లోకి కొడాలి నాని, తోట త్రిమూర్తులు…?

అంద‌రూ అనుకున్న విధంగానే.. రెండు కీల‌క విష‌యాల్లో సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి మ‌రోసారి త‌న కేబినెట్‌ను విస్త‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ముందస్తుగా ఎన్నిక‌లకు కూడా వెళ్లాల‌ని చూస్తున్నారు. అయితే.. ఈ రెండు విష‌యాల‌పైనా కొన్నాళ్లుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న అయితే సాగుతోంది. ఎటూ నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు.. సీఎం జ‌గ‌న్ ఆ దిశ‌గానే అడుగులు …

Read More »

టీడీపీలోకి మ‌హాసేన రాజేష్ .. ఆ టికెట్ కోస‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో యూట్యూర్‌, విమ‌ర్శ‌కుడు.. మ‌హాసేన పేరుతో యూట్యూబ్ నిర్వ‌హి స్తున్న రాజేష్ టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. రాజేష్ త‌ర‌చుగా వైసీపీ విధానాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అనేక విధానాల‌ను, ముఖ్యంగా రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కారంటూ.. రాజేష్ చేసిన వీడియోల‌ను వీక్ష‌కులు బాగానే ఆద‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన వైపు చూశారు. అయితే.. అటు వైపు నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ రాక‌పోవ‌డంతో టీడీపీ సైకిల్ …

Read More »

అన‌ప‌ర్తి ఘ‌ట‌న‌.. అంతా టీడీపీనే చేసిందట

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎంత అగౌర‌వం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. క‌నీసం.. జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌లో ఉన్న ఆయ‌న న‌డుచుకుంటూ వెళ్లినా.. పోలీసులు ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఆయ‌న ప్ర‌సంగించేందుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. కాద‌ని… ప్ర‌సంగించిన చంద్ర‌బాబు పోలీసుల‌పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. అయితే.. బాబు స‌భ ముగియ‌గానే ఆయ‌న ప్ర‌సంగించిన వాహ‌నాన్ని.. మైకును కూడా స్వాధీనం చేసుకుని పోలీసు …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ను కలిసేందుకు ఇష్టపడటం లేదట

వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో మాట కలిపేందుకు ఇష్టపడటం లేదు. సాధ్యమైనంత వరకూ దూరం ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు. ఎన్నికల నాటికి జారుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడటం మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు.. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారారు. సీఎం జగన్ సమీక్ష అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు బిక్కుబిక్కుమంటూ వెళ్తుంటే.. మద్దిశెట్టి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా …

Read More »

చంద్రబాబులా నేనూ బాధితుడినే..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవ‌డం.. ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టించ‌డం.. వంటి ప‌రిణామాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయి లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు? అంతేకాదు.. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. …

Read More »