ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన ఒకే ఒక్కమాట మంత్రంగా పనిచేసింది. అప్పటి వరకు గుంటూరు మిర్చి యార్డులో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. చంద్రబాబు చెప్పిన మాటతో నిరసన విరమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు.. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని.. కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఉమ్మడి జిల్లాల్లో పండిన మిర్చిని తీసుకుని గుంటూరు మిర్చి …
Read More »అప్పుడు వినలేదు.. ఇప్పుడు వింటారా? : వైసీపీ టాక్!
వైసీపీ నాయకులు, కార్యకర్తల మాట వింటామని.. జగన్ 2.0లో వారికే ప్రధానంగా ప్రాధాన్యం ఇస్తామని మాజీ సీఎం జగన్ తరచుగా చెబుతున్నారు. ఆ మాట చెప్పగానే.. పలు జిల్లాల నుంచి నాయకులు తాడేపల్లి ప్యాలస్కు క్యూ కడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇంచార్జ్లుగా ఉన్నవారిని మార్పు చేయాలని వారు కోరుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు గత ఏడాది కూడా.. అనేక మంది నాయకులు ఇవే డిమాండ్లను తెరమీదికి తెచ్చారు. నియోజకవర్గాల్లో …
Read More »ఢిల్లీ వేదికగా జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజం
వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తడం గమనార్హం. ఇల్లీగల్ పనులు చేస్తాం.,..మాకు భద్రత ఇవ్వండి అంటే… ప్రభుత్వాలు వారికి భద్రత కల్పించాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రేపు రౌడీయిజం కూడా చేస్తాం,…మాకు భద్రత కల్పించండి అని అడుగుతారు?… …
Read More »ఢిల్లీ సీఎం… పూర్తి అధికారం ఎందుకు రాదో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర పాలిత ప్రాంత హోదా ఉన్నందున, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇక్కడి సీఎంకు తక్కువ పరిమిత అధికారాలు ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA ప్రకారం అమలు అవుతుంది. ఈ నిబంధనల ప్రకారం, ఢిల్లీకి శాసనసభ ఉన్నప్పటికీ, కొన్ని కీలక అధికారాలు కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. ప్రధానంగా, ఢిల్లీలోని భూమి పరిపాలన పూర్తిగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. భవన …
Read More »సీఎం హోదాలో కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ …
Read More »ఛీఛీ.. కుంభమేళాలో స్నానం చేసే మహిళల వీడియోలు విక్రయం!
కాదేదీ వ్యాపారానికి అనర్హం.. అన్నట్టుగా వికృత వ్యాపారాలు చేసేవారు.. పవిత్ర మహాకుంభమేళాను కూడా అపవిత్రం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులు యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మరీ.. కుంభ్ స్నానాలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఓపెన్ ప్లేస్లు కావడంతోపాటు.. యూట్యూబర్లు.. ఇతర సామాజిక మాధ్యమాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ సంచరిస్తున్నారు. ఈ క్రమంలో …
Read More »ఆ ఊహాగానాలకు పవన్ మార్కు రిప్లై ఇది!
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పాలనకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఓ కేబినెట్ సమావేశంతో పాటు మరో కీలక సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అంతేకాకుండా ఇటీవల చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు ఆయన హైదరాబాద్ నుంచే బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ చేసినా పవన్ నుంచి స్పందన రావడం లేదని వైసీపీ, …
Read More »జగన్ పై కేసు ఓకే… లేని పేర్నినీ ఇరికించారట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుంటూరు పరిధిలోని నల్లపాడు పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో జగన్ తో పాటు మరో 8 మంది వైసీపీ నేతల పేర్లను కూడా పోలీసులు చేర్చారు. అంటే… జగన్ తో కలిసి మొత్తంగా 9 మందిపై కేసు నమోదు అయిపోయిందన్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, …
Read More »వైసీపీ బెదిరింపులు ఈ రీతిన సాగాయా…?
వైసీపీ పాలనలో ఏపీలో దుర్మార్గ పాలన సాగిందని, దౌర్జన్య కాండ రాజ్యమేలిందని, గిట్టని వారిపై బెదిరింపులకు అయితే అడ్డే లేదని టీడీపీ సహా వైసీపీ వైరి వర్గాలు గొంతెత్తి అరిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ పాలన సాంతం దురాగతాలతోనే సాగిందని కూటమి పార్టీలు నెత్తీనోరు మొత్తుకున్నాయి. ఆ ఆరోపణలు ఏ మేర నిజమో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చెబుతున్న …
Read More »భారత విమానయాన రంగంలో ఇన్ని వేల ఉద్యోగాలా…
భారత పౌర విమానయాన రంగం ఓ రేంజిలో వృద్ధి చెందుతోంది. గడచిన పదేళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసిన భారత ఏవియేషన్ రంగం.. సమీప భవిష్యత్తులో మరింతగా విస్తరించనుంది. ప్రస్తుతం దేశంలో 157 విమానాశ్రయాలు ఉంటే… రానున్న ఐధేళ్లో వీటి సంఖ్య ఏకంగా 200 మార్కును దాటనుంది. రానున్న ఐదేళ్లలో కొత్తగా 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ యువనేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు …
Read More »కృష్ణుడు మేకోవర్ అదిరిపోయిందిగా!
ఇప్పటిదాకా కమెడియన్ వేషాలతోనే కాలం వెళ్లదీసిన సినీ నటుడు, వైసీపీ నేత అల్లూరి కృష్ణం రాజు అలియాస్ కృష్ణుడు బుధవారం రాత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముచ్చటపడి మరీ తీయించుకున్న ఫొటోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నిజంగానే కృష్ణుడి మేకోవర్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా లావుగా …
Read More »వీడియో : మోదీ తనని చూసి ఏమన్నారో చెప్పిన పవన్…
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చాక… మోదీ అక్కడికి చేరుకున్నారు. వేదికపై ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలకు నమస్కరిస్తూ సాగిన మోదీ… పవన్ వద్దకు వచ్చిన వెంటనే ఆయనకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates