Political News

ఎంత నిజం- ఎన్డీఏలోకి వైసిపి..షరతులు వర్తిస్తాయి

ప్రధానమంత్రి నరేంద్రమోడి-జగన్మోహన్ రెడ్డి భేటి తర్వాత ఈ అంశంపై ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్డీఏలో చేరాల్సిందిగా జగన్ను ప్రధానమంత్రి కోరినట్లు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. తాను ఎన్డీఏలో చేరాలంటే ముందు కొన్ని డిమాండ్లు నెరవేర్చాలని జగన్ ప్రధానితో స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరితే వైసిపికి రెండు క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు స్వతంత్రంగా వ్యవహరించే ఓ సహాయమంత్రి పదవిని ప్రధాని ఆఫర్ చేసినట్లు …

Read More »

సంచలనం సృష్టిస్తున్న ఎంఎల్ఏ పెళ్ళి

తమిళనాడులోని ఓ ఎంఎల్ఏ పెళ్ళి సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడులోని కళ్ళకురిచ్చి నియోజకవర్గం ఎంఎల్ఏ ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దళిత సామాజికవర్గానికి చెందిన ఎంఎల్ఏ బ్రాహ్మణ కులానికి చెందిన సౌందర్యను వివాహం చేసుకోవటం తర్వాత అది వివాదాస్పదం కావటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. 36 సంవత్సరాల వయస్సున్న ఎంఎల్ఏ దేవాలయంలో ఓ పూజారి సంతానమైన 19 ఏళ్ళ కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ముందే ఎంఎల్ఏ ఇంటికి …

Read More »

బిహార్ సీఎం అభ్యర్థి ఖరారు చేసిన జేడీయూ-బీజేపీ కూటమి

బిహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభ సమయంలో దేశంలో నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగునుండగా…నవంబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపు, టికెట్ల పంపకాలలో బిజీగా ఉన్నాయి. సమయం …

Read More »

ఇకపై ఏపీలో ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం

తన హయాంలో ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తానని, ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 1-5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కేంద్రం నూతన విద్యా పాలసీని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే 6వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉంది. మరోవైపు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఏపీ …

Read More »

ఎన్డీఏలో వైసీపీ చేరితే వీళ్ళకు కష్టమేనా ?

ఇపుడిదే విషయంపై చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అయ్యారో లేదో వెంటనే ఎన్డీఏలో జగన్ చేరిపోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. వైసిపికి ఓ క్యాబినెట్ మంత్రిపదవితో పాటు స్వతంత్రహోదాలో రెండు సహాయమంత్రి పదవులు కూడా రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల హడావుడి మొదలైపోయింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ? అన్నది పక్కన పెట్టేస్తే ఎన్డీఏలో చేరటానికి వైసిపికి అవకాశాలు అయితే ఉన్నాయన్నది వాస్తవం. ఒకవేళ ఎన్డీఏలో …

Read More »

ట్రాక్టర్‌పై సోఫా.. రాహుల్‌ను విలేకరి ప్రశ్నిస్తే?

రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్తేమీ కాదు. అతను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తనను కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం మొదలైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్‌లో పని చేసే వాళ్లు, ఆ పార్టీ మద్దతుదారులు ఎప్పుడూ ఇదే పనిలో ఉంటారు. తాజాగా రాహుల్ మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. అతను యూపీలో …

Read More »

సోము రాజ‌కీయం.. ఏపీ కోస‌మా? తెలంగాణ కోస‌మా?

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వింత రాజ‌కీయం చేస్తున్నారా? ఆయ‌న వేస్తున్న అడుగులు సొంత పార్టీలోనే ఎబ్బెట్టుగా ఉన్నాయ‌నే టాక్ వ‌స్తోందా? ఏపీలో ఉంటూ.. పొరుగు రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీలోని ఓ వ‌ర్గం. ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. ఏనేత అయినా.. తాను ఉన్న ప్రాంతానికి, తాను ఉన్న రాష్ట్రానికి మేలు జ‌రిగేలా కోరుకుంటారు. ఇదే ప్ర‌జా బ‌లానికి దారితీస్తుంది. అంతిమంగా నేత‌కు …

Read More »

వైసిపిలో గన్నవరం హీట్ పెరిగిపోతోందా ?

అధికార పార్టీ వైసిపిలో గన్నవరం రాజకీయాల హీట్ పెరిగిపోతోంది. మామూలుగా ప్రశంతాంగా ఉండే నియోజకవర్గంలో ఎంఎల్ఏ వల్లభేనేని వంశీ వైసీపీ చేరడంతో హీట్ పెరిగిపోతోందనే ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వంశీ చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు తర్వాత వైసిపికి దగ్గరైపోయారు. ఎప్పుడైతే వైసిపికి వంశీ దగ్గరైపోయారో వెంటనే అధికారపార్టీలో రాజకీయాలు మొదలైపోయాయి. దాంతో వంశీ కేంద్రంగా అధికారపార్టీలో రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి. వంశీ …

Read More »

క్యాబినెట్ సమావేశం ఎందుకు వాయిదా పడుతోంది ?

ఈనెల 8వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్ళీ వాయిదాపడింది. ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయానికి తగ్గట్లుగానే గడచిన 16 మాసాలుగా క్యాబినెట్ మీటింగ్ లు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. కానీ సెప్టెంబర్ లో జరగాల్సిన రెండో సమావేశం మాత్రం ఇప్పటికి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోయిన నెలలో రెండో క్యాబినెట్ మీటింగ్ 25వ తేదీన …

Read More »

అర్ధరాత్రి అంత్యక్రియులకు కారణమిదే..

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో అమ్మాయికి సంబంధించిన విషాదాంతం దేశాన్ని కుదిపిస్తోంది. నిర్భయ ఘటన తర్వాత అంతగా చర్చనీయాంశమవుతున్న ఉదంతమిది. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిపి, తీవ్రంగా గాయపరచడంతో ఆమె చనిపోయినట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తమ కూతురి విషయంలో జరిగిన దారుణానికి ఆ కుటుంబం ఎంతగా తల్లడిల్లుతూ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆ బాధ చాలదన్నట్లు ఆ అమ్మాయిని చివరి చూపు చూపించకుండా, కుటుంబ సభ్యులు లేకుండానే అర్ధరాత్రి దాటాక …

Read More »

జగన్ స్కూల్లో ఏ మంత్రికి ఎన్ని మార్కులు?

స్కూళ్లలో పిల్లలకు టీచర్లు పరీక్షలు పెట్టడం…మార్కులు వేయడం….ఆ సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుల్లో పర్ ఫార్మెన్స్ ని బట్టి తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయడం…లేదంటే డిమోట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు….ఫస్ట్ ర్యాంకులు సాధించి బెస్ట్ పిల్లలు పరేషాన్ అవుతుంటారు. ఇదే తరహాలో ఇకపై ఏపీలోని వైసీపీ పొలిటికల్ స్కూల్లో మంత్రులకు మార్కులు వేయబోతున్నారట సీఎం జగన్. టీచర్ అవతారమెత్తబోతోన్న జగన్ తన మంత్రి వర్గ సభ్యులను …

Read More »

మోడీతో జిన్ పింగ్ భేటీ…సర్వత్రా ఉత్కంఠ

కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత కూడా చైనా భారత సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తూనే ఉంది. తూర్పు లడఖ్‌లో చైనాకు చెందిన పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కవ్వింపు చర్యలతో గాలిలో …

Read More »