టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు.. అప్పటి నుంచి తటస్థంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు ఆయన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చుతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. ఎందుకో.. గంటా ఎటూ నిర్ణయం తీసుకోలేదు. ఇక, …
Read More »పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్.. నిమ్మగడ్డ సంచలన ఆదేశం
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వరకు హౌస్ అరెస్టు చేయాలని.. డీజీపీ గౌతం సవాంగ్ను ఆదేశిస్తూ.. ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ …
Read More »కేంద్రం దెబ్బకు అడ్రస్ లేని బీజేపీ నేతలు
కేంద్రప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. కేంద్రం నిర్ణయాలను సమర్ధించలేక అలాగని వ్యతిరేకించి రోడ్లపైకి రాలేక నానా అవస్తలు పడుతున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏదైనా రాష్ట్రంలో ఉపయోగం ఉంటుందని అనుకుంటేనే నిధులు ఇస్తోంది, ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏపి విషయంలో జరుగుతున్నదిదే. తాజాగా …
Read More »వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తారా ? జగన్ కు పరీక్షే
అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ళకు జగన్మోహన్ రెడ్డికి అసలైన పరీక్ష ఎదురైంది. అదే విశాఖపట్నం స్టీల్ పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయటం. విశాఖ స్టీల్స్ ను ప్రైవేటు చేతుల్లో పెట్టేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసేసింది. నిజానికి ఈ ఫ్యాక్టరీని బలోపేతం చేయటంపై కేంద్రం గనుక శ్రద్ధచూపిస్తే మంచి లాభాల్లో నడిచే అవకాశాలు పుష్కలంగా ఉంది. దాదాపు 90 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధిని చూపిస్తున్న విశాక స్టీల్స్ …
Read More »పాత చేతక్ స్కూటర్ అమ్మమని మంత్రి అడిగితే నో చెప్పాడు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి రూటు కాస్త సపరేటుగా ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కుర్రాళ్లకు ధీటుగా హుషారుగా వ్యవహరిస్తారు. తాను మంత్రినన్న భావన పెద్దగా కనిపించనివ్వడు. పిల్లల్లోఉన్నప్పుడు వారితో కలిసి పోవటం.. పెద్దలతో కూర్చున్నప్పుడు పెద్ద మనిషిగా వ్యవహరించటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మల్లారెడ్డి తాజాగా ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ మీద మనసు పడ్డారు. సదరు స్కూటర్ ను తనకు అమ్మాలని …
Read More »నిమ్మగడ్డ చిన్న మెదడు చితికిపోయిందా- రోజా
రాజకీయాలన్నాక మొహమాటాలు అస్సలు ఉండవు. ఆ రంగంలో ఉన్నంత కర్కసత్వం మరెక్కడా కనిపించదంటారు. అందుకే.. సున్నిత మనస్కులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదన్న సలహా తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం.. ఘాటు వ్యాఖ్యలు చేయటం మామూలే. కీలక స్థానంలో ఉన్న వ్యక్తుల విషయంలో చేసే వ్యాఖ్యలు ఆచితూచి అన్నట్లు ఉండాలి.కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »టీడీపీ కోసం.. జగన్ త్యాగం.. షాకింగ్ డెసిషన్!
అదేంటి? టీడీపీ కోసం వైసీపీ అధినేత జగన్ త్యాగం చేయడమేంటి? టీడీపీ అంటేనే నిప్పులు తొక్కుతా రు కదా! అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మజా! అయితే.. ఇది.. టీడీపీని అణగదొక్కేందు కు జగన్ చేస్తున్న త్యాగం. బలమైన నేతను సైతం… టీడీపీకి చెక్ పెట్టేందుకు త్యాగం చేస్తున్నారట. విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. కాపు నాయకుడుగా …
Read More »అమరావతి ఉద్యమానికి తికాయత్ మద్దతు.. వైసీపీకి తిప్పలు ?
రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు అక్కడి రైతులు, మహిళలు, యువత, కూలీలు చేస్తున్న ఉ ద్యమం.. మరింత హీటెక్కనుంది. జగన్ సర్కారు ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా సాగు తున్న ఈ ఉద్యమం.. ఏడాది కాలం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. అదే దూకుడు, అదే డిమాండ్ను వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు రాజధానులకు అనుమతించేది లేదని.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో …
Read More »జగన్కు భారీ షాక్: విఫలమైన కీలక పథకం
వైసీపీ అధినేత జగన్కు భారీ షాక్ తగిలింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కీలక పథకాలను ఆయన అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం.. ఇంటింటికీ రేషన్ పంపిణీ. వైసీపీ నేతలు, సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే.. ఈ పథకం దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. నిజమే! ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటికీ.. …
Read More »తండ్రి, కొడుకులు అఖిలను వదిలేసినట్లేనా ?
తెలుగుదేశం పార్టిలో జైలుపాలై విడుదలైన వారిని లేకపోతే వారి కుటుంబసభ్యులను చంద్రబాబునాయుడు, లోకేష్ పరామర్శిస్తున్నారు. నేతల్లో ఆత్మస్ధైర్యం నింపటానికి ఆపత్ సమయంలో కష్టాల్లో ఉన్న నేతలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పటానికే అగ్రనేతలు, అధినేతలు ఇటువంటి పరామర్శలు పెట్టుకుంటారు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు. అవినీతి కేసులో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు, హత్యారోపణలపై అరెస్టయిన మరో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అక్రమాలు చేసి దొరికిపోయి అరెస్టయిన మాజీ ఎంఎల్ఏ …
Read More »జగన్ డిసైడ్ అయితే.. ఆంధ్రుల హక్కును కాపాడుకోవటం కష్టం కాదు
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగోళ్లు ఎలుగెత్తటమే కాదు.. ఈ కర్మాగారం కోసం ఏకంగా 34 మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలు వృధా కాకుండా ఉండేందుకు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏపీలో అతి పెద్ద సంస్థగా ఉన్న విశాఖ ఉక్కును కేంద్రం అమ్మకానికి పెట్టటం తెలిసిందే. 18 వేల మంది శాశ్విత ఉద్యోగులు.. 20వేల మంది ఒప్పంద కార్మికులతో ఉంటే ఈ సంస్థ …
Read More »వీర్రాజు సరికొత్త నినాదం..వర్కవుటవుతుందా ?
బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయంగా సరికొత్త నినాదాన్ని అందుకున్నారా ? తాజాగా ఆయన మాటలు వింటే ఇదే అనుమానం పెరుగిపోతోంది. జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకే రాజ్యాధికారం అంటు వీర్రాజు చేసిన ప్రకటనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే కాపు నేత అయిన వీర్రాజు బీసీలకే ముఖ్యమంత్రి పదవి అనే నినాదాన్ని ఎత్తుకోవటంటే అనుమానం రావటంలో వింతేముంది. కాకపోతే బీసీ నేతనే బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తుందని వీర్రాజు చేసిన ప్రకటన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates