Political News

బీజేపీది ఆశనా? దురాశనా? అసలు డిపాజిట్ వస్తుందా ?

తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచినట్లే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా బీజేపీ గెలుస్తుందని ఏపి ఇన్చార్జీ సునీల్ దేవదర్ ప్రకటించేశారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం జరిగింది లేండి. ఈ సందర్భంగా కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలనో ఏమో కానీ సునీల్ చాలా పెద్ద మాటలే మాట్లాడేశారు. ఏకంగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ సుమారు 2.28 …

Read More »

జ‌గ‌న్‌కు పొంచి ఉన్న మిత్రుడి ముప్పు!

రాజ‌కీయాల్లో నిన్న‌టి మిత్రుడు రేప‌టికి శ‌త్రువు కావొచ్చు. లేదా ఈరోజు శ‌త్రువు.. రేప‌టికి మిత్రుడూ కావొ చ్చు. ఏ నిముషానికి ఏమి జ‌రుగుతుందో.. రాజ‌కీయాల్లో ఏ ఒక్క‌రూ చెప్పే ప‌రిస్థితి లేదు. అధికారం.. ప‌రమావ‌ధి.. అవ‌కాశం ప్ర‌తి ఒక్కరి అవ‌కాశం! ఈ ప‌రిస్థితే.. ఏపీఅధికార పార్టీలోనూ గుబులు రేపుతోంది. బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. అస‌లు ఏపీతో సంబంధం లేని ఈ ఎన్నిక‌ల‌పై ఇక్క‌డ ఏపీలో వైసీపీ త‌ర్జ‌న …

Read More »

12 వేల ఓట్లు.. ఆ యువనేతను సీఎం కాకుండా చేశాయ్

ఎన్నికల్లో అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. గెలుపు.. ఓటముల మధ్య రేఖ ఎంత పలుచగా ఉందో కొన్ని సందర్భాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. తాజాగా బిహార్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే మరింత బాగా అర్థం కావటం ఖాయం. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాస్తంత మెజార్టీ అంటేనే పదివేల ఓట్ల అధిక్యత ఉంటుంది. అలాంటి పన్నెండు వేల ఓట్లు.. ఒక యువనేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డాయంటే పరిస్థితి ఎలా …

Read More »

నితీష్ కుమార్ షాకింగ్ యూ టర్న్ !

బీహార్ ముఖ్యమంత్రి, సిఎం అభ్యర్ది నితీష్ కుమార్ కూడా నాలుక మడతేసి యూటర్న్ తీసేసుకున్నారు. తాను కూడా సగటు రాజకీయ నేతనే అని నిరూపించుకున్నారు.  బీహార్ మూడో దశ ఎన్నికల ప్రచార సభ ముగింపులో మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలంటు చేసిన ప్రకటన బీహార్లో సంచలనం సృష్టించింది. మొదటి రెండు దశల్లోను వెనకబడిన ఎన్డీయే కూటమి మూడో దశలో అయినా పుంజుకునేందుకే నీతీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానలు …

Read More »

బొజ్జ‌ల కుటుంబం ఎక్క‌డ‌? రాజ‌కీయాల‌కు తెర‌ప‌డిన‌ట్టేనా?

ఆయ‌న వివాద ర‌హిత నేత‌. ఏంద‌బ్బాయ్! అంటూ ప్ర‌తి ఒక్క‌రినీ.. ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన నాయ‌కుడు. మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టినా.. ఎమ్మెల్యేగానే కొన‌సాగినా. ఆయ‌న ఎక్క‌డా వివాదాలు కొనితెచ్చుకోలేదు. టీడీపీలో ఎంతో సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఆది నుంచి ఒకే పార్టీ, ఒకే జెండా అనేలా ముందుకు సాగారు. ఆయ‌నే చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తికి చెందిన బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి కుటుంబం. టీడీపీ ఆవిర్భా వంలోనే ఆయ‌న పార్టీలోకి వ‌చ్చారు. ఈ …

Read More »

కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లివ్వటమే తప్పయిపోయిందా ?

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న విశ్లేషణల తర్వాత ఇదే నిజమనిపిస్తోంది. 243 అసెంబ్లీ సీట్ల అసెంబ్లీలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కలిసి మహాగట బంధన్ అనే కూటమిగా పోటీ చేశాయి. అయితే అంతిమ ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే తప్పు ఎక్కడ జిరిగిందో అర్ధమైపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వటమే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ చేసిన …

Read More »

మరో వివాదంలో వైసీపీ ఎంఎల్ఏ

అధికార వైసీపీ తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెడ్డి సామాజికవవర్గంలోని వాళ్ళను ఎంఎల్ఏ కించపరుస్తు వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంఎల్ఏగా గెలిచన దగ్గర నుండి శ్రీదేవి ఏదో ఓ వివాదంలో ఇరుక్కొంటునే ఉన్నారు. మొదట్లో ఎంఎల్ఏ అసలు ఎస్సీనే కాదనే వివాదం మొదలైంది. తర్వాత ఎస్సీ ఎంఎల్ఏగా ఉండి అంబేద్కర్ ను కించపరుస్తు మాట్లాడారనే వివాదం …

Read More »

చిరాగ్… పవర్ స్టార్… ఒకటేనా

అవును వీళ్ళద్దరు సేమ్ టు సేమ్ అనే అనిపిస్తోంది. ఒకళ్ళేమో ఏపిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరొకరేమో బీహార్ లోని ఎల్జీపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. ఎక్కడో బీహార్లో ఉన్న చిరాగ్ ఇంకెక్కడో ఉన్న పవన్ కు ఏమిటి పోలిక అనే డౌట్ వస్తోంది. ఇద్దరు వారసులుగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరు ఒకేలాగ దెబ్బతిన్నారు. కాకపోతే ఇద్దరిలో చిన్న తేడా ఉంది. …

Read More »

గంటాకు బ్యాంకు షాక్ ఇచ్చినట్లేనా ?

ఉత్తరాంధ్రలో సీనియర్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యంకు పెద్ద షాకే ఇచ్చింది. ఎందుకంటే గంటా కీలకంగా వ్యవహరించిన చాలా సంస్ధలకు చెందిన ఆస్తులను వేలం వేయబోతున్నట్లు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈనెల 23వ తేదీ వరకు ఈ- వేలం పాటలో పాల్గొనే వాళ్ళు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. 25వ తేదీన టెండర్లను బ్యాంకు ఓపెన్ చేస్తుంది. ప్రత్యూషా గ్రూప్ ఆఫ్ …

Read More »

తన తర్వాతి టార్గెట్ ఏమిటో చెప్పేసిన అసదుద్దీన్ ఓవైసీ

దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీపై తరచూ విరుచుకుపడే రాజకీయ పార్టీలు.. కేవలం మతం ఆధారంగానే రాజకీయాలు చేయటమే కాదు.. తమ మతస్తుల గురించి మాత్రమే మాట్లాడే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురించి కానీ ఆయన పార్టీ గురించి పెద్దగా మాట్లాడరు. ఆ మాటకు వస్తే..ఆయన్నుపెద్దగా పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్యన మహారాష్ట్ర.. ఇప్పుడు బిహార్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ …

Read More »

నేత‌లు మ‌రో రూట్ వెతుక్కోవాల్సిందే.. ఆ కార్డు ప‌నిచేయ‌దు!

రాజ‌కీయాల్లో సింప‌తీ పాలిటిక్స్‌కు ఉండే ప్రాధాన్యమే వేరు. నాయ‌కులు,పార్టీలు కూడా సింప‌తీతో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనేక సంద‌ర్భాల్లో ఈ దేశంలో అవి రుజ‌వ‌య్యాయి కూడా! ఇందిర‌మ్మ హ‌త్య‌కు గురైన‌ప్పుడు.. దేశం మొత్తం రాజీవ్ బాట న‌డిచింది. ఆ త‌ర్వాత రాజీవ్‌గాంధీ హ‌త్య‌కు గురైన‌ప్పుడు కూడా దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు అండ‌గా నిలిచారు. భారీ స్థాయిలో గెలిపించారు. ఈ ప‌రిణామాలే కాదు.. అనేక రాష్ట్రాల్లో నాయ‌కులు చ‌నిపోతే.. ఆ …

Read More »

ఆర్జేడీపై ఎంఐఎం దెబ్బ పడిందా ?

ఫలితాలు వచ్చి విశ్లేఫణలు మొదలైన తర్వాత చూస్తుంటే ఆర్జేడీపై ఏఐఎంఐఎం పార్టీ దెబ్బ గట్టిగానే పడిందని అర్ధమైపోతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంఐఎం 5 నియోజకవర్గాల్లో గెలిచింది. ఎంఐఎం తరపున 25 నియోజకవర్గాల్లో పోటీ చేసింది మొత్తం ముస్లిం అభ్యర్ధులే అన్నది గుర్తుంచుకోవాలి. మామూలుగా అయితే బీహార్ లో ముస్లిం, యాదవ్ సామాజికవర్గాలు మొదటి నుండి ఆర్జేడీతోనే ఉన్నారు. ఇపుడు కూడా పై సామాజికవర్గాలు ఆర్జేడీతోనే ఉన్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో …

Read More »