Political News

చంద్రబాబులో మార్పు రాదా ?

ఎవరేమి చేస్తార్లే అని కౌంటింగును వదిలేశారు..మీకు చాలాసార్లు చెప్పాను న్యాయం కోసం పోరాడాలని..ఇది చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. కుప్పంలో పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఘోర ఓటమిపై శనివారం చంద్రబాబు నియోజకవర్గంలోని నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో కుప్పానికి వచ్చి పరిస్దితిని చక్కదిద్దుతానని ధైర్యం చెప్పారు. అధికారపార్టీ నేతలు డబ్బులు వెదజల్లి, ధౌర్జన్యాలు చేసి, అధికార దుర్వినియోగంతో పంచాయితీ ఎన్నికల్లో గెలిచారని చంద్రబాబు కామెంట్ చేశారు. …

Read More »

నరేంద్రమోడికి లీగల్ నోటీసులు ?

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవటంపై ప్రదానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ కో కు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఏపీసీసీ లీగల్ సెల్ తీర్మానించింది. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి డెవలప్మెంటుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అందులో ప్రత్యేకహోదా అనేది చాలా కీలకం. ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదాను ఐదేళ్ళ పాటు అమలు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. …

Read More »

షర్మిల భేటీలో అడుగుతున్న ఆ 11 ప్రశ్నలేమిటి?

పార్టీ పెట్టాలన్న ఆలోచన కష్టం కాదు కానీ.. పార్టీని పక్కా ప్లాన్ తో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ కారణంతోనే చాలామంది పార్టీలు పెడతారు కానీ.. దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత చాలామంది చాలా పార్టీలే పెట్టారు. కానీ.. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినవి రెండు పార్టీలే. అందులో ఒకటి టీఆర్ఎస్.. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. మిగిలిన పార్టీల్లో కొన్నింటికి …

Read More »

ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నివ్వం

ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో లోక‌ల్ ఫీలింగ్ పెద్ద‌గా క‌లిగించ‌ని వాటిలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఒక‌టి. చెన్నై సూప‌ర్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబ‌యి ఇండియ‌న్స్ మాదిరి స్థానికంగా ఇది అంత బ‌లంగా లేద‌న్న‌ది వాస్త‌వం. త‌మిళ‌నాడుకు చెందిన స‌న్ టీవీ వాళ్ల ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ ఫ్రాంఛైజీలో ఆట‌గాళ్లు కూడా అంతా నాన్ లోక‌లే. వేరే ఫ్రాంఛైజీల్లోనూ నాన్ లోక‌ల్ ఆట‌గాళ్లే ఎక్కువ ఉంటారు కానీ.. ఇక్క‌డి అభిమానుల‌తో క‌నెక్ట్ …

Read More »

సచివాలయంలో అడుగు పెడతారట ! మరి రాపాక ?

జనసేనలో అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఓ విచిత్రమైన కామెంట్ చేశారు. ఇపుడు పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఆదరణతోనే వచ్చే సాధారణ ఎన్నికల్లో సచివాలయంలో కూడా జనసేన అడుగుపెడుతుందన్నారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు గెలుస్తారన్నది నాదెండ్ల మాటలకు అర్ధం. అసెంబ్లీలోకి తమ పార్టీ అభ్యర్ధులు అడుగుపెట్టాలని నాదెండ్ల కోరుకోవటంలో తప్పేలేదు. అయితే నాదెండ్ల ఒక విషయం మరచిపోయినట్లున్నారు. వచ్చే అసెంబ్లీ సంగతి దేవుడెరుగు. మొన్నటి ఎన్నికల్లోనే జనసేన …

Read More »

విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు తగ్గిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ఆందోళనలను గమనించిన కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కుకు ధక్షిణకొరియాలోని పోస్కో సంస్ధకు …

Read More »

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి …

Read More »

పంచాయ‌తీ చిత్రం: ఓటు కోసం.. శ్రీవారి ల‌డ్డూ ఎర‌..!!

ఓట్ల కోసం.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు వేయ‌ని ఎత్తులు లేవు. ఈ క్ర‌మంలోనే బంగారం నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. న‌గ‌దు నుంచి చీర‌ల వ‌ర‌కు ఇలా.. అనేక రూపాల్లో.. రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ ప‌రుచుకుని.. త‌మ ప‌బ్బం గ‌డుపుకొన్న విశేషాలు అనేకం.. తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లోనూ మ‌న‌కు క‌నిపించాయి. అయితే.. ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూను కూడా ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం వాడుకున్న ప్ర‌బుద్ధులైన నాయ‌కులు ఉన్నారా? …

Read More »

టీడీపీలో సామంతరాజులెవరబ్బా ?

విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగ ఫీలైపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ? అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ? సామంతరాజుల్లాగ ఫీలైపోతున్న వారెవరు ? అనే విషయాలను మాత్రం కేశినేని చెప్పలేదు. ఎంపిగా …

Read More »

తిరుప‌తిపై చింత మోహ‌న్ ఎఫెక్ట్‌.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావ‌డం, వ‌రుస‌గా దీనిని గెలుచుకుంటూ ఉండ‌డం(2014, 2019)తో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లోనూ దీనిని కైవ‌సం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించుకుంది. ఇక‌, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి ప‌ట్టుబ‌డుతోంది. అయితే.. ఈ పార్టీల మ‌ద్య టికెట్ వివాదం …

Read More »

తమ్ముళ్ళ గొడవలో చంద్రబాబుకే షాకిచ్చిన కేశినేని

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకే విజయవాడ ఎంపి కేశినేని నాని షాకిచ్చారు. విజయివాడ మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్ అభ్యర్ధి ఎంపిక గొడవలో పాత విషయాలన్నీ బయటకు వచ్చాయి. దాంతో మండిపోయిన ఎంపి గతంలో చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టి వాయించేశారు. అప్పట్లో ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడిన సమయంలో మేయర్ అభ్యర్ధిగా 39వ డివిజన్ అభ్యర్ధి పూజితను ఫోకస్ చేశారు. అయితే తాజాగా మరో డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి శివను ప్రకటించారట. పూజితేమో …

Read More »

వైసీపీ ఫుల్లు హ్యాపీ

కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే శాసనమండలిలో ఖాళీగా ఉన్న, ఖాళీ అవబోతున్న స్ధానాలను భర్తీ చేయటమే ఇందుకు కారణం. మార్చి 29వ తేదీకి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి రిటైర్ అవబోతున్నారు. ఇక వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగుస్తోంది. అలాగే మండలి సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్ …

Read More »