జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పోయినేడాది కూడా బాలయ్య పుట్టిన రోజు నాడు మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా తారక్ రాజకీయ అరంగేట్రంపై ప్రశ్న ఎదురైంది. అప్పుడాయన ఎవరిష్టం వాళ్లదన్నట్లుగా ఒక కామెంట్ చేసి వదిలేశాడు. అప్పుడు దాని గురించి పెద్ద చర్చ జరగలేదు. కానీ ఈసారి పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్ గురించి …
Read More »జూ.ఎన్టీఆర్ పార్టీలో రావటంపై బాలయ్య వ్యాఖ్యలు ప్లస్సా.. మైనస్సా?
సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు అడ్డాలోనూ జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరటం కలకలం రేపింది. రాజకీయ చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ …
Read More »చంద్రబాబుకు బాధే అయినా.. ఇది పచ్చినిజం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బాధ కలిగించే అంశం ఇది. అయినా.. ఎక్కడా ఎవరూ నోరు మెదపడం లేదు. పార్టీ నేతలు గుర్రు పెట్టి మరీ నిద్ర పోతున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు పుట్టిన నియోజకవర్గంలో, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం పురుడు పోసుకున్న చోట.. ఇప్పుడు ఆ పార్టీ జాడలు కనిపించడం లేదు. ఇది పచ్చి నిజం. అయినప్పటికీ.. టీడీపీ నేతలు ఎవరూ నోరు …
Read More »కామెడీ అయిపోయిన వైసీపీ మంత్రి
చేసినవి చెప్పుకుంటేనే అతిశయోక్తిగా చూసే రోజులివి. సామాజిక మాధ్యమాల్లో శూల శోధన చేసి ఆ గొప్పల్లో ఉన్న తప్పులేంటో బయటికి తీసి పెట్టేస్తారు నెటిజన్లు. అలాంటిది చేయనివి చెప్పుకుంటే వాళ్లు ఊరుకుంటారా? ఇలా చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని, ఉన్న కంపెనీలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం …
Read More »తెలంగాణలో స్కూళ్లు .. సర్కారు షాకింగ్ డెసిషన్!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తిరిగి తెరిచేందుకు తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని బావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కూడా భావిస్తోందని అన్నారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు .. వచ్చే నెల 5వ తేదీ తర్వాత స్కూళ్లను …
Read More »సచిన్ విషయంలో పెరిగిపోతున్న టెన్షన్
రాజస్ధాన్ రాజకీయాల్లో యంగ్ టర్క్ గా పెరున్న సచిన్ పైలెట్ విషయంలో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏదో రోజు సచిన్ కాంగ్రెస్ కు జైకొట్టి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం పెరిగిపోతోంది. దానికితోడు కాంగ్రెస్ అధిష్టానంపై సచిన్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయటంతో సచిన్ విషయంలో సస్పెన్స్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో రాజస్ధాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సచిన్ పైలెట్ దే …
Read More »సీఎం జగన్కు ఆర్ ఆర్ ఆర్ లేఖ.. డిమాండ్ ఏంటంటే
సీఐడీ పోలీసుల అరెస్టు.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వాదన.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖలో ఎక్కడా తనపై సీఐడీ అధికారుల దౌర్జన్యం కానీ, ప్రభుత్వం పరంగా తనపై చూపిస్తున్న వివక్షను కానీ.. ఎంపీ ప్రస్తావించకపోవడం గమనార్హం. …
Read More »జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి
పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగిపోతోంది. తెలంగాణాలో ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సహజంగానే జగన్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎందుకంటే ఏపిలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కారణాలు స్పష్టంగా తెలియకపోయినా ప్రభుత్వం కూడా పరీక్షల రద్దు చేయటానికి పెద్దగా …
Read More »శివుడి చేతిలో మద్యం గ్లాసు.. చిక్కుల్లో ఇన్ స్టాగ్రామ్
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ హిందూవుల ఆగ్రహానికి బలౌతోంది. మా దేవుడినే కించపరుస్తారా అంటూ.. ప్రస్తుతం ఇన్ స్టాపై అందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్ఫోన్ ఉన్నాయంటూ ఓ బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ …
Read More »షర్మిలది మరీ అత్యాసేనా ?
‘టీఆర్ఎస్ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ వస్తానంటే పార్టీలోకి ఆహ్వానిస్తాం’ ..ఇది తాజాగా ఈటల గురించి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురి అర్హతతో తెలంగాణా రాజకీయ పార్టీ పెట్టాలని షర్మిల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గడచిన ఐదుమాసాలుగా తెలంగాణా రాజకీయాల్లోకి ఇపుడే ఆమె అడుగుపెట్టారు. ఇంకా పార్టీ పెట్టలేదు, అజెండా ఏమిటో తెలేదు, కనీసం జెండా ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. ఇలాంటిది తొందరలో …
Read More »జగన్ అజెండా ఇదేనా ?
జగన్మోహన్ రెడ్డి రెండు మూడు అంశాల అజెండాతోనే ఢిల్లీ పర్యటన ఉండబోతోందని సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అంశాలపై క్లారిటి తీసుకోవటానికి లేదా ఇవ్వటానికే జగన్ హోంమంత్రితో భేటీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇంతకీ అంతటి కీలకమైన అంశాలేమిటంటే మొదటిది పోలవరం సవరించిన అంచనాలపై స్పష్టత. పోలవరం అంచనాల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య …
Read More »వైఎస్ షర్మిలకు సలహా ఇవ్వాలనుకుంటున్నారా?
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. త్వరలో కొత్త పార్టీ పేరును.. జెండా.. ఎజెండాను ప్రకటించనున్న ఆమె.. తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ సమాజంలోని వారు తమ పార్టీకి ఏమైనా సలహాలు.. సూచనలు ఇవ్వాలనుకుంటే అందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ ను షేర్ చేశారు. అంతేకాదు.. ఈమొయిల్ ఐడీని ఇచ్చారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావటమే లక్ష్యమన్న షర్మిల.. అందుకు తగ్గట్లుగా తనకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates