Political News

ఎమ్మెల్యే రోజా పొరపాటు చేసిందా ?

నిజమైన రాజకీయ నేతలెవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడరు. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళదే అంతిమ విజయం అని తెలుసుకోవాలి. ఇదంతా ఎవరి విషయంలో అంటే నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా విషయంలోనే. కొద్దిరోజులుగా రోజాను ఇబ్బందిపెడుతున్న నిండ్ర మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఎలాగైతేనేమి తన మద్దతుదారుకే ఇప్పించుకున్నారు. కాస్త ఆలస్యమైనా తన మద్దతుదారు దీపకే ఎంపీపీ పదవి వచ్చేట్లు చేసుకున్న …

Read More »

ఇళ్ల పట్టాలు అందరికీ అందేనా ?

అందరికీ ఇళ్ల పట్టాలు అనే విషయంలో ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా ఆచరణలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు అందరికీ అందించేందుకు రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు కొట్టేసింది. ప్రధానంగా రెండు మూడు అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. దీంతో కోర్టు తప్పు పట్టిన అంశాలను సరిచేసి మళ్ళీ మార్గదర్శకాలను జారీచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొత్తగా జారీ చేయబోయే మార్గదర్శకాలు ఎలాగుంటాయో ? వాటిని మళ్ళీ ఇంకెవరైనా కోర్టులో సవాలు చేస్తారా …

Read More »

సొంతింటికే నిప్పంటించుకుంటున్నారా ?

ఆప్ఘనిస్థాన్ లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు వ్యవహారం చూసిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న దేశం ఆఫ్ఘన్ మాత్రమే. ఇలాంటి దేశంలోనే బాంబులు పేలడమంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేలుస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ ఇపుడు మాత్రం తమ దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలే టార్గెట్ గా బాంబులు పేల్చడం గమనార్హం. …

Read More »

మోడీకి రివర్స్ షాకిస్తున్న సొంత ఎంపి

ఉత్తరప్రదేశ్ ఘటన విషయంలో నరేంద్ర మోడీకి సొంత పార్టీ ఎంపీయే రివర్స్ షాకిస్తున్నారు. మొన్నటి ఆదివారం యూపీలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కార్లు దూసుకెళ్ళిన ఘటన ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఘటనలో నలుగురు రైతులు మరణిస్తే తర్వాత జరిగిన గొడవల్లో మరో నలుగురు మరణించారు. ఘటన జరిగిన రోజు నుంచి బీజేపీ పిలిబిత్ ఎంపి పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ …

Read More »

కోరి తెచ్చుకున్న‌వాళ్లు.. కంగారు పెడుతున్నారే!

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌లో ఎలాగైనా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించి.. టీఆర్ఎస్‌ను గెలిపించుకోవాల‌నే సీఎం కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు. అందుకే విజ‌యం కోసం సర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఈట‌ల టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై కేసీఆర్ దృష్టి సారించారు. నోటిఫికేష‌న్ రాక‌ముందే అక్క‌డి ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. అందులో …

Read More »

ఈ పదవులతో ఏమన్నా ఉపయోగముంటుందా ?

గురువారం మధ్యాహ్నం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే తొలిసారి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీతో పాటు ఆఫీస్ బేరర్లలో తెలుగు నేతలకు చోటు దక్కిందట. ఏపి నుండి కన్నా లక్ష్మీనారాయణకు తెలంగాణా నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు కు అవకాశం వచ్చిందట. ఇక ఆఫీసు బేరర్లుగా తెలంగాణా …

Read More »

బీజేపీ అన్నంత ప‌ని చేసింది

రాజ‌కీయ పార్టీలు ఒక్కోసారి తీసుకునే నిర్ణ‌యాలు ఎవ‌రికి అంతు చిక్క‌వు. ఆ నిర్ణ‌యం వెన‌కాల ఎలాంటి వ్యూహం ఉందో క‌నిపిపెట్ట‌డం అంత సులువ‌గా ఉండ‌దు. ఎన్నిక‌లో పోటీ చేస్తే ఓడిపోతామ‌ని తెలిసినా కొన్ని సార్లు త‌మ ఉనికిని చాటుకోవ‌డానికి బ‌లం పెంచుకోవ‌డానికి బ‌రిలో దిగుతారు. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అనూహ్యంగా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించి రాష్ట్ర …

Read More »

ఉద్యోగ సంఘాల నేతలకు లైవ్‌లో వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే అంతే సంగతులు అన్నట్లే ఉంటోంది పరిస్థితి. ప్రతిపక్ష నేతలను ఈ విషయంలో ఎంతగా అణగదొక్కారో, ఎదురు దాడి చేసి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారో చెప్పడానికి గత రెండున్నరేళ్లలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక సామాన్య జనాలెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వాళ్లకు మరింత దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు తమకెన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నోరు విప్పకుండా …

Read More »

పవన్ సర్ప్రైజ్.. తెలంగాణ కార్యకర్తలతో సమావేశం

తెలంగాణలో చాలా నామమాత్రంగా ఉంది జనసేన పార్టీ. గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోటీకి సై అన్నట్లే అని వెనక్కి తగ్గడం ఇక్కడి నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యానికి దారి తీసింది. ఆ సందర్భంగా జనసేనాని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి కూడా ఈ విషయంలో నిరసన గళాలు వినిపించాయి. ఆ తర్వాత తెలంగాణలో జనసేన కార్యకలాపాలపై పెద్దగా చర్చే లేదు. మొదట్నుంచి ఏపీ రాజకీయాల …

Read More »

మోడీకి షాక్‌.. ఈ వేలంలో నిరాశే!

మోడీ ప్ర‌భ‌తో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించి కేంద్రంలో అధికారాన్ని ద‌క్కించుకుంది. మోడీ తొలిసారి ప్ర‌ధాని అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ప్ర‌భ‌తో దేశ‌వ్యాప్తంగా కాషాయ ప‌వ‌నాలు వీచాయి. మ‌ళ్లీ గెలిచి రెండో సారి ప్ర‌ధాని ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌నే చెప్పొచ్చు. దేశ‌మంతా మోడీ ప్ర‌భ క్ర‌మంగా ప‌డిపోతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా మోడీకి వివిధ సంద‌ర్బాల్లో వ‌చ్చిన …

Read More »

కేసీఆర్ ముంద‌స్తు వ్యూహాలు

KCR

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన పార్టీగా టీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. ఇక రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లార‌నే అభిప్రాయాలున్నాయి. 2018లోనే …

Read More »

ఈ నష్టాన్ని బీజేపీ పూడ్చుకోవడం అసాధ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటన వల్ల బీజేపీకి బాగా డ్యామేజి జరిగేట్లుంది. నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన జరిగిన డ్యామేజీని భర్తీ చేసుకోవటం సాధ్యమయ్యేది కాదు. నాలుగు రోజుల క్రితం లఖింపూర్ ఖేరిలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతుల మీదకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కొడుకు వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించటంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో …

Read More »