తమిళనాడు రాజకీయాల్లో వీకే శశికళ అలియాస్ చిన్నమ్మ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా ? అవుననే అంటున్నాయి ఏఐఏడీఎంకే వర్గాలు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అన్నా డీఎంకే ప్రస్తుతం నాయకత్వలేమితో ఇబ్బందులు పడుతోంది. ఉండటానికి మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ ఇద్దరిలో ఎవరికి కూడా ప్రజాకర్షణ శక్తి అంతగా లేదన్నది వాస్తవం. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా శశికళే వీళిద్దరికన్నా నయం అనే పరిస్ధితి ఇపుడు పార్టీలో మొదలైంది. …
Read More »ఈటల రాజీనామాకి ముహూర్తం ఖరారు..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరడం ఖాయమైంది. అయితే.. ఆయన ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ ని వీడనున్నారనే విషయంపై తెలంగాణలో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. తాజాగా.. ఆయన తన రాజీనామాకి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఢిల్లీ వెళ్లి.. బీజేపీ పెద్దలందరితో చర్చలు జరిపిన ఆయన కంషాయ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దానికన్నా ముందు.. కారులో నుంచి …
Read More »మరో వ్యాక్సిన్ రెడీ.. కేంద్రం అడ్వాన్స్..!
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా జరగడంలేదనే సంతృప్తి చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించడంతో పాటు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. దీంతో.. సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో.. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వ్యాక్సిన్లను పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్ -ఈ కి వ్యాక్సిన్ల కోసం రూ. 1500 కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపింది. యూఎస్లోని …
Read More »విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం
ఆమధ్య వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ పెట్టినా జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందో చూడమంటు సస్పెన్సులో పడేశారు విజయసాయిరెడ్డి. అయితే విశాఖపట్నంలో ఆయన చేసిన ప్రకటన చూసిన తర్వాత జూలై 23వ తేదీకి వైజాగ్ పాలనా రాజధానిగా మారబోతోందా ? అనే సందేహాలు మొదలయ్యాయి. విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం రోజున అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి మారిపోతుందేమో …
Read More »జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా రఘురామ తాజా ప్లానింగ్
మెరుగైన వైద్యం కోసం.. అందునా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందేందుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దేశ రాజధానికి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇప్పుడో అర్థం కాని ప్రశ్నగా మారారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఎంతన్నది పక్కన పెడితే.. తనను అరెస్టు చేసి.. జైలుకు పంపే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలకు బదులు తీర్చుకోవాలని …
Read More »యోగి పాలనకు జీరో మార్కులు.. బీజేపీ గెలుపు కష్టమేనా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. ఇప్పుడు బీజేపీ నేతల ఆశలు.. ఊసులు అన్నీ కూడా ఉత్తరప్రదేశ్పైనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావడం, ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ..కేంద్రంలో చక్రం తిప్పుతుందనే.. నానుడి ఉండడం.. పైగా భారీ సంఖ్యలో పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రంలో అధికారంలోకి రావడం ద్వారా .. ఆయా ఎంపీ స్థానాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉండడంతో జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై పెద్ద ఎత్తున దృష్టి …
Read More »కేటీఆర్ ను వినూత్న కోరిక కోరిన కుర్రాడు..
వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా …
Read More »కేసీఆర్ కి షాక్.. ఈటల వెంట మరో నేత..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో.. టీఆర్ఎస్ నుంచి తప్పుకొని.. బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు. ఒకవైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే… మరోవైపు టీఆర్ఎస్ లోని కీలక నేతలను కూడా పార్టీకి దూరం చేసేపనిలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా …
Read More »ఏపీలో లిక్కర్ బ్రాండ్ల పేర్లు…జగన్ పాలనపై సెటైర్లు?
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు….ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేవరకు నిద్రపోమంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని, కేంద్రం మెడలు వంచైనా హోదా తీసుకువస్తామని ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైతేనేం…మాట తప్పని మడమ …
Read More »ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎవరికీ పెద్దగా పరిచయం లేని నెల్లూరులోని ఒక కుగ్రామం కృష్ణపట్నం ఇపుడు దేశమంతటా తెలిసిపోయింది. ఆ గ్రామానికి చెందిన ఆనందయ్య ప్రకృతి మూలికలతో చేసిన మందు వాడితే కరోనా ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతుందని ప్రచారం జరగడంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన విపరీతంగా పాపులర్ అయ్యారు. అది పల్లెటూరిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితికి దారితీసింది. ఆయనేమీ అనుమతి పొందిన ఆయుర్వేద వైద్యుడు కాకపోవడంతో తర్వాత …
Read More »ఈటలకు గ్యారెంటీ కావాలట
రెండు+రెండు= 4 అని లెక్కల్లో కరెక్టే. కానీ రాజకీయాల్లో ప్రతిసారి 2+2=4 అవుతుందని చెప్పేందుకు లేదు. కొన్నిసార్లు జీరో కూడా కావచ్చు. రాజకీయాలే అంత ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో, ఎవరిని ఎందుకు అదఃపాతాళంలోకి తొక్కేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడింతా దేనికంటే తెలంగాణా రాజకీయాల్లో ఈ రోజుకి హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో …
Read More »ఈటల బీజేపీలో చేరిక ఆలస్యానికి కారణం ఇదేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమని ఇప్పటికే అందరికీ అర్థమయ్యింది. వరసగా ఈటల ఢిల్లీలోని బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. ఈపాటికి ఆయన ఢిల్లీలోనే కషాయ కండువా కప్పుకున్నట్లు వార్తలు రావాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఈటల కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరడం ఖాయం. అయితే.. ఎప్పుడు చేరాలనే విషయమై మరి కొద్ది రోజులు ఆలోచించి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates