అప్పుల తిప్పలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూ వేధిస్తున్నాయి. తలకు మించిన సంక్షేమ పథకాల అమలుతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. అప్పుల మీద అప్పులు తీసుకొస్తూ బండి నడిపే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రూ.7వేల కోట్ల అప్పు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చే కొత్త గ్యారెంటీకి అవకాశం లేకున్నా.. ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. …
Read More »ఉద్యోగి ఫిట్ గా ఉంటే నెల జీతం బోనస్
కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా …
Read More »రేవంత్ రెడ్డి కి చెక్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో కేసీఆర్ కి పంటికింద రాయిలాగా.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తగులుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా… కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. రేవంత్ ని ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ కి కంచుకోటలా ఉండే కొడంగల్ లోనే.. ఆయనను స్వల్ప మెజార్టీతో ఓడించారు. …
Read More »బ్రేకింగ్.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధర్ టాటా
ఈనాడు పత్రికలో వార్తలకంటే ముందు పాఠకులు ఎంతో ఆసక్తిగా చూసే అంశం.. కార్టూన్. తెలుగులో దశాబ్దాలుగా నంబర్ వన్ కార్టూనిస్ట్గా కొనసాగుతున్న శ్రీధర్ ఈ కార్టూన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనాడుతో శ్రీధర్ది విడదీయరాని అనుబంధం. ఈనాడు పత్రిక వయసు 41 ఏళ్లయితే.. అందులో 40 సంవత్సరాలు శ్రీధర్ పని చేయడం విశేషం. అంటే ఈనాడుతో ఆరంభం నుంచి కొనసాగుతున్నారన్నమాట. ఆయన కార్టూన్ల స్థాయి గురించి.. అవెంతగా తెలుగు పాఠకులకు …
Read More »వైఎస్ సన్నిహితులతో విజయమ్మ భేటీ ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులకు ఆయన భార్య విజయమ్మ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లో విజయమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కు సన్నిహితులుగా ఉన్నవారిని, మంత్రివర్గంలో కలిసి పనిచేసిన వారిని, గట్టి మద్దతుదారులుగా ఉన్నవారికి విజయమ్మ ఇప్పటికే ఫోన్లుచేసి ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ప్రత్యేక కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనే విషయంలో క్లారిటీలేదు. అయితే కార్యక్రమానికి …
Read More »తెలంగాణలో టీడీపీ లేదు, బాబుకు పనిలేదు! .. రేవంత్ హాట్ కామెంట్స్
రేవంత్రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. అదేసమయంలో ఆయన రాజకీయంగా అడుగులు వేసింది.. టీడీపీ నుంచే. అంతేకాదు.. తనకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా చంద్రబాబేనని ఆయన పదేపదే చెప్పుకొన్నారు కూడా! అయితే.. తాజాగా రేవంత్ రెడ్డి.. అదే టీడీపీపైనా.. అదే చంద్రబాబుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణలో టీడీపీనే లేదని.. ఆయన చెప్పడం.. రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు.. టీడీపీని పరిపుష్టం చేసేందుకు చంద్రబాబు …
Read More »బొత్స వేస్ట్.. తేల్చి పారేసిన ఆర్ ఆర్ ఆర్!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ తరచుగా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడు మాట్టాడినా.. అమరావతి ఉండదని.. మూడు రాజధానులే రాష్ట్రానికి శాశ్వతమని ప్రకటిస్తున్నారు. తాజాగా కూడా రెండు రోజుల కిందట బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 20 గ్రామాల ప్రజల కోసం.. ఒక సామాజిక వర్గం ప్రయోజనం కోసం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నాశనం చేయమంటారా? అంటూ.. …
Read More »ఒక సామాన్యుడి ఆలోచన టాంక్ మీద రేర్ సీన్
ఒకరి ఆలోచన కోట్లాది మంది మీద ప్రభావితం చూపిస్తుందన్న మాట తెలిసిందే. ఒక సామాన్యుడి మదిలో మెదిలిన ఆలోచనకు మంత్రి కేటీఆర్ వత్తాసు పలకటం.. ఆ సంగతేదో కాస్త చూడండి అన్న ట్వీట్ మాటతో అధికార బలగం మొత్తం కదిలి.. మంత్రి అభీష్టాన్ని వారంలోపే నెరవేర్చటంతో టాంక్ బండ్ మీద ఇంతకు ముందెప్పుడూ చూడని ఒక రేర్ సీన్ అవిష్కృతమైంది. రోడ్డు మధ్యలో కూర్చొని పిల్లలతో.. కుటుంబ సభ్యులతో సెల్పీలు …
Read More »ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ షాక్
తెలంగాణా ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాది విద్యాసంవత్సరం జరగలేదని అందరికీ తెలిసిందే. కేజీ టు పీజీ వరకు విద్యార్ధులందరినీ ఆటోమేటిక్ పాస్ అని ప్రభుత్వం ప్రకటించేసింది. కాబట్టి విద్యార్థులంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అలాంటిది తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఓ ప్రకటనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా మండిపోతున్నారు. ఇంతకీ వీళ్ళ కోపానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇంటర్మీడియట్ సెకండ్ …
Read More »విశాఖ రాజధాని కాదు.. కేంద్రం సవరణ..!
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనగానే ఎవరైనా అమరావతి అని చెప్పేవారు. అయితే.. జగన్ సర్కార్ మాత్రం విశాఖ ను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం.. విశాఖను ఏపీ రాజధానిగా పేర్కొంటూ కామెంట్స్ చేసింది. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. అందుకే.. …
Read More »ఆఫ్ఘాన్ పరిస్థితి రివర్స్: ప్రజలకు భయపడుతున్న తాలిబాన్లు
ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి రివర్స్ అయిందా? ఇప్పటి వరకు తాలిబాన్లకు భయపడుతున్న ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధమయ్యారా? ఎవరు తమను నిర్బంధించినా.. ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు ప్రజలు రెడీగా ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఈ క్రమంలో తాలిబాన్లు ఇప్పుడు.. మరో వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు. అక్కడి ప్రజలకు తాలిబన్లు డెడ్లైన్ విధించారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని …
Read More »మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు తీసుకున్నవా లేదా రేవంత్?
మోత్కుపల్లి నర్సింహులు.. ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ దళిత నాయకుడు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఒక్కసారిగా అందరూ మోత్కుపల్లివైపు చూసేలా చేశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష విరమించిచారు. దళిత బంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ దీక్ష ఆరు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates