Political News

ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే ఉపఎన్నికలు జరగబోతున్న హూజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్రంలోని సుమారు 30 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు జనాలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలు రాబట్టే ఎవరూ ఊహించని విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనాలకు అర్ధమైపోయింది. హుజూరాబాద్ లో జరుగుతున్నట్లే తమ నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే అని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అందుకనే …

Read More »

రాజీవ్ ఆన‌వాళ్లు లేకుండా.. ప్ర‌జ‌ల పేరుతో మోడీ ‘రాజ‌కీయం’

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. వ‌రుస విజ‌యాలు సాధించి.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఊపిరి స‌ల‌ప‌నీయ‌ని విధంగా ఇరుకున పెడుతోంది. అంతేకాదు.. బ‌ల‌మైన కాంగ్రెస్ కంచుకోట‌ల‌ను కూడా ద‌క్కించుకుని.. కాంగ్రెస్ ఉనికినే ప్ర‌శ్నార్థకం చేస్తోంది. క‌నుచూపు మేర‌లో.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా ప్ర‌ధాని మోడీ- కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఇర‌కాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ను మాత్ర‌మే కాకుండా.. కాంగ్రెస్ వెనుక …

Read More »

అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

బాలీవుడ్ మెగస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఒక్క కాల్ తో.. ముంబయి పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అమితాబ్ ఇంటితోపాటు.. ముంబయిలోని మూడు రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామంటూ బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అమితాబ్ ఇంటికి వెళ్లారు. పలు రైల్వే స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు …

Read More »

పీకే ఎందుకు రాజీనామా చేశాడు ?

పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే. అదే పీకేని ఈమధ్యనే …

Read More »

ఏపీలో థియేట‌ర్ల స‌మ‌స్య కొలిక్కి?

తెలుగు ప్రేక్ష‌కుల సినీ అభిమానం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఏమున్నా లేకున్నా మ‌న జ‌నాల‌కు సినిమా ఉండాలి. అందుకే గ‌త ఏడాది క‌రోనా వ‌ల్ల త‌లెత్తిన లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూత ప‌డితే మ‌న జ‌నాలు అల్లాడిపోయారు. విరామం త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్లు తెరిస్తే కొత్త చిత్రాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కానీ మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చి థియేట‌ర్ల‌ను మూత వేయించింది. గ‌త నెల‌లోనే థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు …

Read More »

వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?

ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది. …

Read More »

పరకాల వెర్సస్ జనసైనికులు.. రచ్చ రచ్చే

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఏమాత్రం నచ్చని వ్యక్తుల్లో పరకాల ప్రభాకర్ ఒకరు. పొలిటీషియన్ కమ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన పరకాల ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చిన షాక్ ఎలాంటిదో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీలో చేరిన మేధావి వర్గంలో ఒకడిగా పరకాలకు మంచి గౌరవమే దక్కింది. కానీ కొంత కాలానికే ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చేసిన ఆయన.. తాను నిష్క్రమిస్తున్న విషయాన్ని అదే పార్టీ ఆఫీస్‌లో కూర్చుని వెల్లడించారు. …

Read More »

విశాఖ టీడీపీ ఎంపీ క్యాండెట్ భ‌ర‌త్ కాదా… !

విశాఖ టీడీపీ వచ్చే ఎన్నికల మీద దృష్టి పెడుతోంది. దాని కోసం తగిన కసరత్తు కూడా చేస్తోంది. ఆ మధ్యన టీడీపీ పార్టీ కార్యవర్గాలు ప్రకటించడం వెనక కూడా కొత్త ముఖాలను రంగంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుని ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలి అని టీడీపీ పంతం పడుతోంది. 1999 తరువాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. చివరిసారిగా ఎంవీవీఎస్ మూర్తి ఆనాడు గెలిచారు. …

Read More »

రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చేశారు..!

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ పురస్కారాలలో ఒకటైన రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై దీనిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలుస్తారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఖేల్ రత్న …

Read More »

‘పెగాసస్’ విచారణలో ఆ లాయర్ కు అక్షింతలు వేసిన సుప్రీం

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కొత్త తలనొప్పులకు కారణమైన పెగాసస్ ఉదంతంపై తాజాగా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయల్ కు చెందిన ఎన్ఎస్వోకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌తో పలు రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెడుతున్నట్లుగా ఆరోపణలు రావటం.. సంచలన కథనాలతో పాటు.. ప్రముఖుల పేర్లు బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. …

Read More »

ప్రతిపక్షాలను ఫేస్ చేయలేకపోతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వైఖరి గురివిందగింజ లాగే తయారైంది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలన్నింటినీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతల, ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే అంశం ఉభయసభలను ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జూలై 19వ తేదీన పార్లమెంటు వర్షాకల సమావేశాలు మొదలైనప్పటినుండి మొబైల్ ట్యాపింగ్ అంశంపై ఉభయసభల్లోను ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ట్యాపింగ్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత గోల …

Read More »

హాకీ టీమ్ కి భారీ నజరానా.. ఒక్కొక్కరికి కోటీ..!

టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల జట్టు అదరగొట్టింది. హాకీ చరిత్రలో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డును బద్దలు కొట్టింది. దీంతో హాకీ టీమ్‌పై ప్రశ్నంసలు కురుస్తున్నాయి. ఈ గెలుపుతో దేశ ప్రజలు గర్వంగా ఫీలవుతున్నారు. ఇంతటి ఘనమైన చరిత్రను భారత్‌కు అందించిన హాకీ టీమ్‌కు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టీమ్‌లోని ప్రతి సభ్యుడికి కోటి చొప్పున నజరానా ఇస్తామని వెల్లడించింది. హాకీ టీమ్‌కు భారత్ …

Read More »