అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మామూలుగా అయితే ఇప్పటివరకు బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నుండి ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు. విషయం ఏదైనా ఏదో సర్దుబాటు ధోరణిలోనో, లేదా రిక్వెస్టింగ్ గానో వైసీపీ ఎంపిలు, నేతలు మాట్లాడుతున్నారు. కానీ మొదటిసారి కేంద్రంపై విజయసాయి ఇంతస్ధాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నుండి పార్లమెంటు …
Read More »మోడీ పక్కా ప్లాన్.. వివాదాస్పద బిల్లులకు ఆమోద ముద్ర ఖాయం!
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు.. ప్రబుత్వానికి ఒక పరీక్ష పెడుతుంటే.. విపక్షాలకు మరో పరీక్ష పెట్టనున్నాయని అంటున్నారు పరిశీలకులు. సమావేశాల నేపథ్యంలో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పక్షం బరిలోకి దిగుతోంది. చట్టాలకు సంబంధించి భారీ అజెండా రూపొందించుకుంది. 17 కొత్త బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. కత్తులు నూరుతున్న విపక్షాలు మరోవైపు, ప్రధాన సమస్యలపై సర్కారును …
Read More »తెలంగాణలో టీడీపీ కొత్త బాస్ ఎవరో తెలుసా?
తెలంగాణలో టీడీపీకి కొత్త బాస్ ని ఎంపిక చేశారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీకి నమ్మకంగా పనిచేస్తున్న బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరటంతో ఆ అవకాశం బక్కని నరసింహులుకు దక్కింది. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినా …
Read More »రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్.. ఢిల్లీ పర్యటన ఆపేందుకేనా?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారా..? ఆయన ఇంటి వద్ద ఉన్న పోలీసు బలగాలను చూస్తుంటే.. అదే నిజమని ఎవరికైనా అర్థమౌతుంది. కాగా.. ఇప్పుడు ఆయనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకే ఈ హౌస్ అరెస్టు చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వేలం వేసిన కోకాపేట భూముల వేలంలో …
Read More »టీడీపీకి దేవేందర్ గౌడ్ గుడ్ బై చెబుతారా?
టీడీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దేవేందర్ గౌడ్ మరోసారి టీడీపీకి గుడ్ బై చెబుతారా? త్వరలోనే ఆయన పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దేవేందర్గౌడ్.. అన్నగారు ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, తర్వాత చంద్రబాబు హయాంలో రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా తర్వాత స్పీకర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ …
Read More »జర్నలిస్టులు, సుప్రీం కోర్టు జడ్జిలే లక్ష్యంగా ఫోన్ల ట్యాపింగ్
'పెగాసస్' ఫోన్ ట్యాపింగ్.. కీలక నేతలే టార్గెట్! కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్.. పెగాసస్ తొలుత వెలుగులోకి తెచ్చిన వాట్సాప్ తాజాగా వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ల కథనాలు సుబ్రమణ్య స్వామి సహా కీలక నేతల ఆందోళన దేశంలోని కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయా? ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్ ‘పెగాసస్’ ఫోన్లను ట్యాప్ చేస్తోందా? ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర …
Read More »రేవంత్ బిజీబిజీ
ప్రతిపక్షంలో ఉన్న పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు.. ప్రజా సమస్యలపై పోరాటంతో అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎప్పడూ సిద్ధంగా ఉండే నాయకుడిగా ఆ దిశగా అవకాశం వస్తే ఎలా దూకుడు చూపిస్తారో అనేదానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోరే నిదర్శనం. ఇటీవల టీపీసీసీ కొత్త అధ్యక్షుడు ఎంపికైన ఆయన పార్టీ అధిష్ఠానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా సరికొత్త ఉత్సాహంతో …
Read More »‘కాపు’ కోటా లో రాజాకు మంత్రి పదవి?
తాజాగా జగన్ సర్కారు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో అనేక సంచనాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది కీలక నేతలను ఆయన ప్రస్తుతం ఉన్న పదవుల నుంచి తప్పించారు. ఇలా తప్పించిన వారికి కేబినెట్లో చోటు కల్పిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయా పదువుల్లో ఉన్న వీరంతా.. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. ఇలాంటి వారిలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్పంపూడి రాజా ఒకరు. గత రెండేళ్లుగా …
Read More »పవార్ కు మోడి గాలమేస్తున్నారా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మహారాష్ట్రలోని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీయే కు బలమైన ప్రత్యర్ధిగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అందరు చూస్తున్నదే. ఇలాంటి నేపధ్యంలో మోడి-పవార్ భేటీ జరగటం సంచలనంగా మారింది. ఎలాగైనా …
Read More »బైరెడ్డికి బంపర్ పదవి ఇచ్చేసిన జగన్..!
హమ్మయ్యా ఎట్టకేలకు కర్నూలు జిల్లాకు చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డికి సీఎం జగన్మోహన్రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. బైరెడ్డికి కర్నూలు జిల్లాకు చెందిన యువనేతే కావచ్చు. కానీ తన వాక్చాతుర్యం.. రాజకీయ చతురతతో రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హైలెట్ అయిపోయాడు. బైరెడ్డి ఏం చేసినా… ఏం మాట్లాడినా ఓ సంచలనమే అవుతూ వచ్చింది. చిన్న వయస్సులోనే జగన్ దగ్గర తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి అంటే పార్టీలోనే …
Read More »ఆ మూడు కార్పొరేషన్లూ.. రెడ్లకే.. రీజనేంటి?
రాష్ట్రంలో జరిగిన నామినేటెడ్ పదవుల పందేరంలో మహిళలకు పెద్దపీట వేశామని.. మహిళా సాధికారతకు ఇవి నిదర్శనమని చెబుతున్న సర్కారు.. వ్యూహాత్మకంగా వేసిన అడుగుల పై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెబుతున్నా.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకొంటున్నా.. కీలకమైన పదవులను మాత్రం తన సొంత సామాజిక వర్గానికే అప్పగించారని.. సీఎం జగన్పై ఇటు రాజకీయంగా.. అటు సోషల్ మీడియా పరంగా కూడా …
Read More »జగన్ వ్యూహాత్మక నిర్ణయం
ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంఎల్ఏల్లో ఎవరినీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లను నియమించారు. అప్పట్లో నియమించిన కార్పొరేషన్లకు ఛైర్మన్లకు ఎంఎల్ఏలను మాత్రమే నియమించారు. ఏపీఐఐసీ, తుడా, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మల్లాది విష్ణు, రాజాలను నియమించారు. అప్పట్లో ఛైర్మన్లుగా ఎంఎల్ఏలను నియమించటానికి కారణం మంత్రివర్గంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates