రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం సాధారణం. అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రతి పక్ష పార్టీలు గొంతు పెంచడం అందుకు తగినట్లుగా ప్రభుత్వంలో ఉన్న నేతలు స్పందించడం చూస్తూనే ఉంటాం. కానీ తెలంగాణలో తన తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల విమర్శలపై అధికార టీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీఆర్ఎస్ అనే కాదు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ …
Read More »టీటీడీపీ కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ…!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మల్కాజ్గిరి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి కూడా పార్టీ మారిపోయారు. చివరకు 2018 ముందస్తు ఎన్నికలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాత్రమే …
Read More »ఇది జగన్ వైఫల్యం.. గెజిట్పై చంద్రబాబు ఫైర్
కృష్ణా, గోదావరి నదుల జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సింది పోయి.. ఏకంగా.. తనే పెత్తనం చేసేలా నిర్ణయం తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేయగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తీవ్ర అభ్యంతరం.. వ్యక్తం చేశారు. అంతేకాదు, దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకొనేది …
Read More »రఘురామ విషయంపై టీడీపీలో చర్చా ?
చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19 వ తేదీనుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టేకప్ చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం జరిగింది. సరే ఇలాంటి సమావేశాలు అన్నీ పార్టీల్లోను జరగటం సహజమే కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి …
Read More »పవన్కు టైం లేదు.. మరి రాజకీయాలు?
ప్రజల కోసమే తన జీవితమని.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించి రెండేళ్ల పాటు జనసేనను ప్రజల్లో పరుగులు పెట్టించిన జనసేనాని పవన్ కళ్యాణ్కు ఇప్పుడు రాజకీయాలు చేసే టైం లేదా? పూర్తిగా సినిమాలతోనే బిజీ అయిపోయారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పుడు వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రాజకీయాల్లో ఎదిగేది ఎప్పుడనే మాటలు …
Read More »వైవీకే టీటీడీ పగ్గాలు.. జగన్ వ్యూహాత్మక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే ముఖ్యమంత్రి జగన్ మొగ్గు చూపారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో జగన్ నిర్ణయంపై ఒకవైపు సంతోషం వ్యక్తమవుతున్నా.. వైవీ వర్గంలో మాత్రం ఒకింత నిరుత్సాహం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ బోర్డు పదవికి ఇటీవల సమయం గడిచిపోవడంతో జగన్.. బోర్డు ను రద్దు చేశారు. దీంతో వైవీ.. అటు రాజ్యసభ కానీ, ఇటు …
Read More »అమరావతి ఐకానిక్ వంతెన.. ముగలెట్టకుండానే కూల్చేస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఆయన దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధానిని మారుస్తూ.. మూడు రాజధానులుగా నిర్ణయించారు. దీనిపై ప్రజలు, రైతుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా తిరిగితోడుతున్న జగన్.. రాజధాని పరిధిలోని కరకట్ట సమీపంలో చంద్రబాబు ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను …
Read More »రోజాకి ఊహించని షాకిచ్చిన జగన్..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం. ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. …
Read More »శ్మశానాన్నీ అమ్మేయాలనుకున్న కేసీఆర్.. కానీ.. బిగ్ బ్రేక్!
ప్రస్తుతం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములను వేలానికి పెట్టింది. కోకాపేట్లో ప్రారంభమైన ఈ భూములమ్మే ప్రక్రియ.. ఖానామెట్వరకు పెరిగింది. కోకా పేటలో కోట్ల రూపాయలు పలికిన ప్రభుత్వ భూముల ధరలు.. ఖానామెట్లోనూ అదే పరంపరను కొనసాగించాయి. ‘ఇ-ఆక్షన్’లో ఎకరానికి అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. కోకాపేటలో ఎకరానికి అత్యధికంగా రూ.60.20 కోట్లు రాగా.. ఇక్కడ రూ.5 కోట్లు తగ్గాయి. ఖానామెట్లో 14.91 …
Read More »జగన్ బెయిల్ రద్దయితే ఏమవుతుందో తెలుసా ?
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే జరగబోయేదేమిటో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఎలాగైనా బెయిల్ రద్దుచేయించి జగన్ను మళ్ళీ జైలుకు పంపేందుకు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నారాయణ మీడియాతో మాట్లాడుతు రఘురామ తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దుచేయించి మళ్ళీ జైలుకు పంపాలన్న రఘురామ ప్రయత్నాన్ని తప్పుపట్టారు. ఎంపి ప్రయత్నాలు ఫలించి ఒకవేళ …
Read More »సీఎం పేషీ పరువు తీస్తున్న జగన్ ఆప్తులు..!
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం అంటే.. కేవలం పాలనకు మాత్రమే కేంద్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కార్యాలయంలో అయినా.. జరిగేదే. పాలనకు సంబంధించిన కార్యక్రమాలకు, విధివిధానాల నిర్ణయాలకు సీఎంవో వేదికగా ఉండాలి. అయితే.. కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్ కార్యాలయం మాత్రం రాజకీయాలకు వేదికగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు అధికారులు.. సలహాదారులు పైచేయిసాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి …
Read More »పవన్ వ్యూహాత్మక రాజకీయం.. సక్సెస్ అయ్యేనా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? రాజకీయాల్లో ఎప్పుడు ఎలా వ్యవహరిస్తే బాగుంటుందనే విషయంలో ఆయన స్పష్టమైన క్లారిటీతో ఉన్నారా ? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జల వివాదాలు సహా అనేక విభజన సమస్యల విషయంపై అంతర్గత చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా.. తెలంగాణతో బంధాలు తెంపుకోవాల్సి ఉంటుంది. బహుశ అందుకే.. ప్రధాన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates