భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందన్న మాట పెద్ద వారి నోట తరచూ వస్తుంటుంది. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోరు. వారి మాటల్లోని మర్మాన్ని గుర్తించేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. నిజాయితీగా ఉండటం మంచిదే. ఉత్త నిజాయితీకి ప్రజలు నీరాజనాలేమీ అర్పించరు. ఆ మాటకు వస్తే అధికారాన్ని కూడా ఇవ్వరు. ఇవ్వలేదని బాధ పడరు కూడా. చూస్తుంటే..జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నిజాయితీని తరచూ ప్రదర్శించుకునే అలవాటును ఎంత త్వరగా …
Read More »కరోనాపై పోరు.. ఢిల్లీ సీఎం అద్భుతాలు చేస్తున్నాడు
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో మొదట బాగా విమర్శలు ఎదుర్కొన్న వాళ్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకరు. దేశంలో మొదట వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ ఒకటి. అక్కడ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే.. కేజ్రీవాల్ను చేతకాని సీఎంగా విమర్శించారు చాలామంది.కానీ ఆయన సమర్థత ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసులతో అల్లాడుతున్నాయి. …
Read More »అమరావతి ఉద్యమంపై రఘురామకృష్ణం రాజు కామెంట్
రఘురామ కృష్ణంరాజు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా నిలుస్తున్న వ్యక్తి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ నాయకత్వాన్ని, నేతల్ని ఏమాత్రం లెక్క చేయకుండా చెడామడా తిట్టేస్తున్నారాయన. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు చాలా సూటిగా ఉంటూ.. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాయి. కొన్ని నెలల కిందట్నుంచే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణం …
Read More »టిక్ టాక్ డేటా ఎక్కడుందో తెలిసిపోయింది
మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి …
Read More »తెలంగాణలో కేసులు మరింత పెరుగుతాయి
తెలంగాణలో శుక్రవారం నాడు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే 1,892 కేసులు నమోదు కాగా…వాటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు ఉండడం కలవరపెడుతోంది. మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా 4,073 మందికి నెగటివ్గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటింది. మరోవైపు, శుక్రవారం నాడు జరిపిన …
Read More »బీజేపీ – జగన్ బంధాన్ని తేల్చనున్న ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇపుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీలు కోరారు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడి స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. అయితే, …
Read More »నిన్న జయరాజ్-ఫీనిక్స్.. నేడు శశికళ.. అట్టుడుకుతున్న తమిళనాడు
దేశమంతా కరోనాతో అల్లాడుతోందిప్పుడు. వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాత లక్ష కరోనా కేసులు దాటిన రాష్ట్రం అదే. ఐతే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం కరోనా కాదు. శశికళ అనే అమ్మాయికి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. రెండు వారాల కిందట పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్-ఫీనిక్స్ కేసు తమిళనాడును ఒక కుదుపు కుదిపేయగా.. దాని తాలూకు మంటలు …
Read More »మళ్లీ చెబుతున్నా.. ఏపీ రాజధాని అంగుళం కూడా కదలదు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు అసెంబ్లీలో ఒకటికి రెండుసార్లు తీర్మానం జరిగింది. మండలిలో బ్రేక్ పడినా.. దాన్ని రద్దు చేసి అయినా తీర్మానం పాస్ అయిపోయేలా చేయడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేందుకు భవనాలు సిద్ధమవుతున్నాయి. పేరుకు శాసన రాజధానిగా అమరావతి ఉన్నప్పటికీ.. దాన్ని నామమాత్రం చేయడానికి జగన్ సర్కారు ఏం చేయాలో అన్నీ చేస్తోంది. కరోనా వల్ల బ్రేక్ పడింది కానీ.. లేకుంటే …
Read More »తెలంగాణది నెం.1 స్థానం… పాజిటివ్ రేటు చూడండి
తెలంగాణలో ఒక్క రోజులో మునుపటి రోజుపై 40 శాతం కేసులు పెరగడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కరోనా రోగుల సంఖ్యలో తెలంగానది ఐదో ఆరో స్థానమో కావచ్చు గాని పాజిటివిటీ రేటు అటూ చాపకింద నీరులా అది వ్యాపించిన తీరు ఘోరంగా ఉంది. టెస్టుల్లో వచ్చే పాజిటివ్ కేసుల పర్సెంటీజేలో దేశంలో తెలంగాణది నెం.1 స్థానం. అంటే డేంజర్ పరంగా మహారాష్ట్రకు తెలంగాణ ఏం తీసిపోదు అని దీనర్థం. …
Read More »వైసీపీలో నెంబర్ 2 స్థానాన్ని జగన్ ఎలిమినేట్ చేశారా?
వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి సీఎం వైఎస్ జగన్ కీలక నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు ముఖ్య నేతలకు అప్పగించిన విషయం విదితమే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అప్పగించగా….ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డికి….కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాలను సజ్జల రామకృష్ణారెడ్డికి …
Read More »ఇలాంటి విమర్శలు చంద్రబాబు నోటి నుంచా?
సంచలన ఆరోపణ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయానికి అవసరానికి మించి స్పందించే ఆయన తీరుతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనలో అభద్రతా భావం అంతకంతకూ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. అవసరం లేకున్నా అదే పనిగా మాట్లాడే ధోరణి ఎక్కువ అవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేసేటప్పడు తగిన ఆధారాలతో ప్రజల ముందుకు రావటం బాగుంటుంది. …
Read More »ఆ ఫార్ములా వర్కవుట్ అయితే…కాబోయే సీఎం పవన్?
రాజకీయాల్లో అనుభవం చాలా ముఖ్యం…ఇదే విషయం చాలా సార్లు నిరూపితమైంది కూడా. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉంటే ఎంతోకొంత రాజకీయ అనుభవం వస్తుంది. అయితే, రాజకీయ అనుభవంతోపాటు ప్రజల కష్టాలను అతి దగ్గరగా చూసిన రాజకీయ నాయకులు ప్రజల నాడిపట్టడంలో సక్సెస్ అయ్యారు. పాదయాత్రల ద్వారా ఏపీలోని పల్లె పల్లెకు వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకొని తమ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన వారున్నారు. దివంగత నేత, ఏపీ …
Read More »