Political News

అట్టుడుకుతున్న ఏపీ : నిన్న అంగ‌న్ వాడీలు నేడు ఆశాలు

ఆంధ్రావ‌నిలో అటు అంగ‌న్ వాడీలు ఇటు ఆశావ‌ర్క‌ర్లు వ‌రుస నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. సోమ‌వారం నాడు అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లంతా క‌నీస వేత‌నాలు 26 వేలుగా నిర్ణ‌యించాల‌ని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వాల‌ని, అదేవిధంగా కోవిడ్ టైంలో ప్రాణాలు విడిచిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతూ రోడ్డెక్కారు. దీంతో జిల్లా క‌లెక్ట‌రేట్లు అన్నీ నిర‌స‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోయాయి.చాలా చోట్ల పోలీసు నిర్బంధాల‌ను దాటి మ‌రీ! అంగ‌న్ వాడీలు రోడ్డెక్కారు. కానీ …

Read More »

వివేకా హత్య ఘటనలో బిగుసుకుంటున్న ఉచ్చు?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను అప్పట్లో సీఐగా పనిచేసిన శంకరయ్య బయటపెట్టారు. వివేకా హత్య జరిగినపుడు పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ విచారించింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ వివేకా హత్యపై అసలు కేసే నమోదు చేయద్దని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, హత్యకేసులో అనుమానితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు శంకరయ్య తెలిపారు. అసలు మృతదేహాన్ని పోస్టుమార్టం కు …

Read More »

కేసీఆర్ అసలు ప్లాన్.. అడ్డంకులివేనా?

నాన్ బీజేపీ,  నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కొందరితో ఫోన్లో మాట్లాడారు మరికొందరిని నేరుగా కలిశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. మొదటి నుండి జాతీయపార్టీలైన కాంగ్రెస్, …

Read More »

తెలంగాణ మ‌న‌దే.. అధికారం ఖాయం: బండి సంజ‌య్

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని  అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పదాధికారుల భేటీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదని  సంజయ్‌ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని… ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలంటూ కొత్త …

Read More »

ప్రశాంత్ కిశోర్ ఉచ్చులో చిక్కుకోనిది జగన్ ఒక్కడే

ఒకప్పుడు మోదీ కోసం పనిచేసి, ఆ తరువాత మోదీకి బద్ధ విరోధిగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాయలో పడుతున్న ప్రాంతీయ పార్టీల నేతల లిస్టులో తాజాగా కేసీఆర్ కూడా చేరిపోయారు. తనకున్న మోదీ, బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని తన క్లయింట్ పార్టీలకు ఎక్కిస్తారని ప్రశాంత్ కిశోర్‌కు పేరు. దీంతో ఎంతోకొంత మోదీ, బీజేపీ వ్యతిరేకత ఉన్న నేతలు ప్రశాంత్ కిశోర్ ప్రభావంలో పడి మోదీతో కయ్యానికి కాలు …

Read More »

వివేకా హ‌త్య‌.. 10 ఎక‌రాల భూమి ఇస్తామ‌న్నారు

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన‌ దస్తగిరి వాంగ్మూలం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్‌ యాదవ్‌ అడిగినట్లు తెలిపాడు. అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు …

Read More »

ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!

ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచారు.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ కండువాను కూడా క‌ప్పుకొన్నారు. ఇంత వ‌రకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న క‌ల‌వ‌లేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు ఆయ‌న వైసీపీలోనే ఉంటారా?  లేక వ‌చ్చే …

Read More »

మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు!

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ.. కాస్త తక్కువగా అయినా రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకించి ఒక చరిష్మా ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరగటం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నట్లుగా మారిపోవటం.. వార్తల విషయంలోనూ ఒకే మీడియా సంస్థ ఏ రాష్ట్రానికి చెందిన వార్తల్ని ఆ రాష్ట్రానికి పరిమితం చేస్తూ..పెద్ద అడ్డుగోడ కట్టేయటం తెలిసిందే. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరో …

Read More »

తొలి భేటీలోనే గులాబీ బాస్ క్రెడిట్ పోగొట్టుకున్నారా?

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బోలెడన్ని అనుమానాలు.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన జరిపిన మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి తెలుగు మీడియా మొత్తం కేసీఆర్ అండ్ కో వినిపించిన వాదననే ప్రముఖంగా అచ్చేశాయి. ఆ మాటకు వస్తే.. మహారాష్ట్రకు తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధుల్ని రెండు రోజుల ముందు నుంచే పంపి.. గ్రౌండ్ స్టడీ చేయించి.. పర్యటన …

Read More »

పెరిగిపోతున్న ఆనం-నేదురుమల్లి పోరు

వెంకటగిరిలో అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పోరు పెరిగిపోతోంది. రోజు రోజుకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. జిల్లాల పునర్విభజన అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి ప్రధాన కారణమవుతోంది. ముందు నుండే ఆనం రామనారాయణరెడ్డికి ప్రభుత్వంపైన మండిపోతోంది.  ప్రభుత్వం అనేకన్నా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెక్టుగా ఉంటుంది. తనంతటి సీనియర్ ను పక్కన పెట్టేసి, జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటంపైన ఆనం అలిగారు. …

Read More »

ప్రకాశ్ రాజ్‌, కేసీఆర్.. ఎవరి బుట్టలో ఎవరు పడుతున్నారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసినప్పటి నుంచి ఓ వార్త మీడియాలో కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్‌ను కేసీఆర్ రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీని ఎలాగైనా దించేస్తానంటూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఎలా ఉందో ఏమో కానీ ఈ ప్రయాణంలో కేసీఆర్ వెంట కనిపిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ చిత్తం మాత్రం మాత్రం వేరే లక్ష్యంపై ఉందని …

Read More »

గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు?

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ సరి కానప్పటికీ కీలక మంత్రిత్వ శాఖ కావడంతో వీలైనంత వేగం భర్తీ చేయడం తప్పనిసరి. అయితే, ఎలాగూ జగన్ మంత్రివర్గాన్ని మారుస్తారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఇది భర్తీ చేస్తారని తెలుస్తోంది. అయితే, గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పదవిని …

Read More »