సంక్షేమానికే జ‌గ‌న్ పెద్ద‌పీట‌.. బ‌డ్జెట్‌లో భారీ కేటాయింపులు

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. దీనిలో ఎక్కువ‌గా వివిధ వ‌ర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. భారీ ఎత్తున నిధులు కేటాయించింది. పింఛ‌న్లు, రైతు భ‌రోసా, ఉన్న‌త విద్య‌, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు సంబంధించిన సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేసింది. ఈ వివ‌రాలు.. ఇలా ఉన్నాయి..

కేటాయింపులు..

*వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
*వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
*పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖకు రూ.1568 కోట్లు
*ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు కేటాయింపు
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 10, 201 కోట్లు కేటాయింపు
*వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు
*వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ. 20,962 కోట్లు
*వ్యవసాయం మార్కెటింగ్‌, సహకారశాఖకు రూ. 11,387 కోట్లు

పలు విభాగాలకు కేటాయింపులు

వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు