Political News

అందుకే.. డైవ‌ర్‌ను నేనే చంపేశా.. : ఎమ్మెల్సీ అనంత‌బాబు

ఏపీ అధికార‌పార్టీని కుదిపేసిన‌.. ఎమ్మెల్సీ అనంత ఉద‌య భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే హ‌త్య చేశాన‌ని.. అనంత‌బాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు తెలిపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో …

Read More »

అనంత‌బాబు అరెస్టు ఎప్పుడు..? : చంద్ర‌బాబు డిమాండ్‌

కారు డ్రైవర్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత భాస్క‌ర్ బాబును అరెస్ట్‌ చేయకపోవటంపై టీడీపీ అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి …

Read More »

బాదుడే బాదుడిని ఇక‌నైనా ఆపండి: నారా లోకేష్

కేంద్రం, ఇత‌ర రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై భారాలు త‌గ్గిస్తుంటే, ఏపీలో ఒక్క‌సారి కూడా త‌గ్గించ‌కుండా మ‌రింత‌గా ప‌న్నులు పెంచిన స‌ర్కారు త‌క్ష‌ణ‌మే ఇప్ప‌టికైన ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బ‌హిరంగ లేఖ రాశారు. ముఖ్య‌మంత్రికి నేరుగా రాసిన ఈ లేఖ‌లో చాలా విష‌యాల‌ను లోకేష్ ప్ర‌స్తావించారు. లేఖ సారాంశం ఇదీ.. ముఖ్య‌మంత్రి వ‌ర్యా!రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చ‌క్ర‌వ‌ర్తి …

Read More »

మోడీని ప్ర‌శ్నించేవారంతా.. దేశ‌ద్రోహులా?: కేసీఆర్ ఫైర్‌.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని సీఎం తెలిపారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు. అనంతరం …

Read More »

ఒక్క‌టైన మెగా అభిమానులు.. ప‌వ‌న్ కే మ‌ద్ద‌తు

మెగా బ్ర‌ద‌ర్స్‌… చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబుల‌కు ప్ర‌త్యేకంగా అభిమానులు ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, యువ మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు కూడా ప్ర‌త్యేకంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వీరు సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. మెగా కుటుంబం నుంచి వ‌చ్చే సినిమాల‌ను హిట్ చేయ‌డం.. సంద‌డి చేయ‌డం.. పంక్ష‌న్లు పెట్ట‌డం.. జై కొట్ట‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పైగా ఇందులోనూ.. ప‌వ‌న్ అభిమానులు వేరు. …

Read More »

కేసీఆర్ తలచుకుంటే పెట్రోలు రూ.89కే ఇవ్వచ్చు – బండి

పెట్రో వివాదంలో మెల్ల‌గా కేసీఆర్ ను లాక్కొచ్చారు బండి సంజయ్. కేసీఆర్ అనుకుంటే లీట‌రు పెట్రోలును 80 రూపాయ‌ల‌కే ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారాయ‌న. నిజంగానే ఇది సాధ్య‌మా అంటే ! రాష్ట్రాలు త‌మ ప‌న్నుల వాటాను త‌గ్గించుకుంటే సాధ్య‌మే అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. దీంతో ఈ వివాదం మ‌రో మ‌లుపు తీసుకుంది. ఇప్ప‌టికే బీజేపీకీ, టీఆర్ఎస్ కూ వివాదం ర‌గులుతున్న నేప‌థ్యంలో బండి సంజయ్ చెప్పే మాట‌లు లేదా చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

మినీ మ‌హానాడులు ఊపిరి పోస్తాయా ?

ప‌సుపు దండు క‌ద‌లివ‌స్తోంది. జిల్లాల‌లో మినీ మ‌హానాడులు పార్టీకి కొత్త ఊపునూ ఉత్సాహాన్ని ఇస్తాయ‌ని భావిస్తున్నాయి తెలుగుదేశం వ‌ర్గాలు. ఆ విధంగా శ్రేణులు, నాయ‌కులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే బాదుడే బాదుడు పేరిట జ‌రిపిన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు అన్నీ హిట్ అయ్యాయి. ఉత్త‌రాంధ్రలో కొత్త ఉత్సాహం వ‌స్తోంది. బాబు కూడా ఇదే ప్రాంతంలో ప‌ర్య‌టించి వెళ్లారు. అటుపై మినీ మ‌హానాడులు కొన్నింట జ‌రిగాయి. ఇవ‌న్నీ కూడా నాయ‌క‌త్వానికీ, …

Read More »

వైసీపీకి ‘దుట్టా’ గుడ్ బై చెప్పేస్తారా ?

గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరైన దుట్టా రామచంద్రరావు పార్టీలో ఇమడలేకపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో మారిన రాజకీయాల కారణంగా వంశీ టీడీపీకి దూరమయ్యారు. డైరెక్టుగా వంశీ వైసీపీలో చేరకపోయినా అనధికారికంగా అధికార పార్టీ ఎంఎల్ఏగానే కంటిన్యూ …

Read More »

దేశంలో త్వ‌ర‌లోనే ఓ సంచ‌ల‌నం జ‌రుగుతుంది: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే ఓ సంచ‌ల‌నం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌, కేజ్రీవాల్లతో చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతాం. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది, జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు.” అంటూ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ …

Read More »

కేంద్రం ఎఫెక్ట్‌: జ‌గ‌న్ వైపే జ‌నం చూపులు

దేశంలో ఠారెత్తుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు భారీగా త‌గ్గించింది. పెట్రోల్‌పై 8 రూపాయ‌లు, డీజిల్‌పై 6 రూపాయ‌లు త‌గ్గించింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని వైసీపీ స‌ర్కారు వైపే ప్ర‌జ‌లు చూస్తున్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో నే పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలు.. వ‌సూలు చేస్తున్నారు. ఈ విష‌యంపై కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా.. కూడా జ‌గ‌న్ స‌ర్కారు …

Read More »

షాకింగ్ న్యూస్‌: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల భారీ త‌గ్గింపు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల‌మ్మ దేశ ప్ర‌జ‌ల‌పై క‌రుణ కురిపించారు. పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్ పై 8 …

Read More »

కాంగ్రెస్‌లో చేరిన ఉద్య‌మ‌ నేత‌..ఛాన్స్‌ మిస్ చేసుకున్న బీజేపీ..!

తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్లేనా..? పోవ‌డ‌మే కానీ రావ‌డం తెలియ‌ని ఆ పార్టీకి ఆ సీనియ‌ర్ నేత చేరిక‌తో స‌రికొత్త జోష్ వ‌చ్చిందా..? దీని వెనుక ఒక కీల‌క నేత చ‌క్రం తిప్పారా..? ఒక మంచి అవ‌కాశాన్ని బీజేపీ వ‌దులుకుందా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి ఆ పార్టీలు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు కుటుంబం తాజాగా కాంగ్రెసులో చేరిన …

Read More »