Political News

బస్సు దెబ్బ మెట్రో మీద పడిందా ?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రభావం మెట్రో ట్రైన్ మీద బాగానే పడినట్లుంది. రోజువారి ప్రయాణించే వారి సంఖ్య బాగానే తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నివేల బస్సులున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని బస్సులున్నా ప్రయాణీకులకు సరిపోవటంలేదు. అందుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాగా ఆలోచించి మెట్రో రైలు ప్రాజెక్టును ఓకే చేశారు. అయితే ప్రాజెక్టుకు డీపీఆర్ తయారై తొందరలోనే ప్రాజెక్టు …

Read More »

మాజీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఎంఎల్ఏల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. నిజామాబాద్ అసెంబ్లీ నుండి రెడ్డి పదేళ్ళు ఎంఎల్ఏగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ ఎందుకనో జీవన్ రెడ్దిని దూరంపెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కొందరి బండారం బయటపడుతోంది. ఇందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యవహారమంతా ఒక్కోటిగా వెలుగుచూస్తోంది. తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన విషయం బయటపడింది. ఇప్పటికే ఆర్టీసీ …

Read More »

నాయ‌కులా… పార్టీలా… ఈ సారి జై కొట్టేదెవ‌రికి… !

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌లు అత్యంత వాడివేడిగా సాగ‌నున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మించి.. ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతాయ‌ని.. ఎన్నిక‌లు స‌ల‌స‌ల మ‌రుగుతాయ‌ని అంటు న్నారు. ఇదిలావుంటే.. అస‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు ఈ సారి ఎవ‌రిని ఎంచుకుంటారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. పార్టీల‌ను చూసి ఓటేస్తారా? లేక‌.. ఎమ్మెల్య అభ్య‌ర్థుల‌ను చూసి ఓటేస్తారా? లేక పార్టీల అధినేత‌ల‌ను బ‌ట్టి ఓటెత్తుతారా? అనేది కీల‌క చ‌ర్చ‌గా మారింది. …

Read More »

చీరాల హోరు మామూలుగా ఉండేలా లేదే..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోరు మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ రాజ‌కీయాలు తెర‌మీదికి రావ‌డం.. నాయ‌కులు మార‌డంతో పోరు తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన‌కు త్యాగం చేసింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చీరాలపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి. ఇక‌, వైసీపీ కూడా యువ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీంతో ప్ర‌కాశం …

Read More »

వైసీపీపై ఇక యుద్ధ‌మే: ప‌వ‌న్ ఫైర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఇక‌, యుద్ధం చేయ‌క త‌ప్ప‌దు” అని హెచ్చ‌రించారు. జ‌న‌సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అరెస్టును ఆయ‌న‌ ఖండించారు. నాదెండ్ల అరెస్టు అప్రజాస్వామికమ‌ని, విశాఖలోని టైకూన్‌ జంక్షన్‌ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని నిప్పులు చెరిగారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ప‌వ‌న్ …

Read More »

సిట్టింగ్‌ల‌ను మార్చేస్తే ప‌న‌వుతుందా? వైసీపీలో హాట్ టాపిక్‌!

రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జం. ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న‌వారి గ్రాఫ్‌ను ఆలంబ‌నగా చేసుకుని మార్పుల‌కు పార్టీలు శ్రీకారం చుడ‌తాయి. మ‌రో కొత్త నాయ‌కుడిని నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకువ‌స్తాయి. ఇది స‌హ‌జ‌మే. అయితే.. అన్ని వేళ‌లా ఈ మార్పులు చేసినా.. ఫ‌లించే అవ‌కాశం త‌క్కువ‌గానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగుల‌ను మార్చేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేల సంగ‌తి ఎలా ఉన్నా.. ఎంపీల విష‌యాన్ని తీసుకుంటే.. …

Read More »

రేవంత్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

రేవంత్ రెడ్డిపై అప్పుడే ఒత్తిడి మొదలైపోయిందట. ఇపుడు మొదలైన ఒత్తిడి ఏ విషయంలో అంటే ఎంఎల్సీ పదవుల విషయంలోనే. ఆరు ఎంఎల్సీ పదవులను భర్తీచేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. ఇందులో గవర్నర్ కోటాలో రెండు, ఎంఎల్ఏల కోటాలో మరో రెండు, స్ధానిక సంస్ధలు, పట్టబద్రుల కోటాలో ఇంకో రెండు ఎంఎల్సీ స్ధానాలు భర్తీకి అవకాశమొచ్చింది. ఎంఎల్ఏల కోటా, లోకల్ బాడీస్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు స్ధానాలకు కేంద్ర …

Read More »

యువగళం@3000 కి.మీ..చారిత్రక ఘట్టం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు పాదయాత్ర 219వ రోజు సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, లోకేష్ తోడల్లుడు భరత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకను …

Read More »

నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్టు.. ఎక్క‌డ‌? రీజ‌నేంటి?

జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్‌.. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్ట‌య్యారు. విశాఖ ప‌ట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న వెంచ‌ర్‌కు ముందు భాగంలో ఉన్న రోడ్డును వాస్తు కార‌ణాల‌తో మూసేయ‌డంపై ఉద్య‌మిస్తున్న నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టిన నిర‌స‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే నాదెండ్ల స‌హా.. అనేక మంది జ‌న‌సేన నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏం జ‌రిగింది? ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న వెంచ‌ర్ వ‌ద్ద‌.. …

Read More »

ఆళ్ల రాజీనామా.. పైకి చెప్ప‌ని కార‌ణాలు ఎన్నో!

వైసీపీ కీల‌క ఎమ్మెల్యే, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హ‌ఠాత్తుగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా వ్య‌వ‌హ‌రించి సంచ‌ల‌నం సృష్టించారు. త‌న శాస‌న స‌భ్య‌త్వానికి, అదేవిధంగా వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. దీనిని బ‌హుశ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కాక‌పోతే.. అదినేత జ‌గ‌న్‌కు చెప్ప‌కుండా ఆయ‌న ఏమీ చేయ‌రు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ముందుగానే చెప్పి ఉంటార‌ని కూడా ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇదిలావుంటే.. త‌న రాజీనామాలో ఆళ్ల.. …

Read More »

రేవంత్ ప్రభుత్వం పనికి జనాలు ఫిదా

కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి జనాలు ఫిదా అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ హామీలు చాలా కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. ఆ సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ప్రభుత్వం 9వ తేదీన అంటే శనివారం ప్రారంభించింది. అవిరెండు ఏమిటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను రు 5 లక్షల నుండి రు. 10 లక్షలకు …

Read More »

షర్మిల ఎంట్రీ పక్కానా ?

ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏపీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి షర్మిల ఎంట్రీ నిజమే అని అనుకోవాలి. అయితే షర్మిల ఏ హోదాలో అడుగుపెట్టబోతున్నారన్నదే అర్ధం కావటంలేదు. పార్టీ పగ్గాలు అందుకుంటేనే …

Read More »