ఆయన ఎమ్మెల్యే. పైగా.. ఇద్దరు ఉద్ధండులను(కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి)లను ఓడించి మరీ విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత. అయినా.. ఎక్కడా ఆయన గర్వం లేదు. అధికార దర్పం అంతకన్నా లేదు. పైగా.. అధికారంతో సిఫారసులు చేసుకునో.. గద్దించో కూడా పనులు చేయించుకోవాలని ఆలోచించడం లేదు. ప్రజల చేత, ప్రజల వలన అన్నట్టుగా.. ప్రజల మనిషిగా గెలుపొందిన ఆయన ప్రజల కోసం.. తను ఎంత …
Read More »కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆయన నిలబడ్డారు. గజ్వేల్లో ఓటమి సంకేతాలు రావడంతో ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. అయితే, చిత్రంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయిన ఆయన.. గజ్వేల్ నుంచే వరుసగా విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. …
Read More »ఐదు వ్యూహాలతో ఎన్నికలకు వైసీపీ.. ‘సిద్ధం’
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఐదు వ్యూహాలతో రెడీ అయింది. వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల యుద్ధంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో ఈ ఐదు వ్యూహాలను పార్టీ ప్రకటించింది. సీఎం జగన్ ‘సిద్ధం’ పేరుతో తన మొదటి అధికారిక రాజకీయ ప్రచారానికి విశాఖలో శ్రీకారం చుట్టారు. ఇక, నుంచి ఈ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఈసారి సీఎం జగన్ …
Read More »నేను అభిమన్యుడిని కాదు.. అర్జనుడిని: సీఎం జగన్
“నేను అభిమన్యుడిని కాదు.. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి, అర్జనుడిని. ఎలాంటి యుద్ధంలో అయినా..ఎంతటి యుద్ధంలో అయినా.. తట్టుకుని విజయం దక్కించుకున్న అర్జనుడిగా ముందుకు వచ్చాను. కృష్ణుడిలా మీరంతా(ప్రజలు) నాకు అండగా ఉన్నారు. విజయం మనదే. 175 కు 175 సీట్లలో విజయం దక్కించుకుని తీరాలన్న అజెండాతో ముందుకు వెళ్తున్నాం” అని సీఎం జగన్ తీవ్రస్థాయిలో గర్జించారు. విశాఖపట్నం శివారు భీమిలిలోని సింగివలసలో తాజాగా నిర్వహించిన వైసీపీ ‘సిద్ధం’ పేరిట నిర్వహించిన భారీ …
Read More »జగన్..నాది సీమ రక్తం: చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు …
Read More »జగన్ పొలిటికల్ ఆయువుపట్టుపై షర్మిల దాడి!
ఏపీ సీఎం జగన్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. గత రెండు రోజులుగా ఆమె పర్య టనలు చేస్తూ.. వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సానుభూతి ఓటు బ్యాంకును కార్నర్ చేసుకుని షర్మిల దూకుడుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సింపతీ సహా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వైసీపీకీ ఆయువుపట్టుగా ఉంది. దీనిపైనే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేశారు. …
Read More »వైసీపీ సభలో చంద్రబాబు, పవన్ కటౌట్లు.. చాలా సీరియస్!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎన్నికలకు ముందు.. విశాఖ నగర శివారులోని భీమిలి నియోజకవర్గంలో నిర్వహి స్తున్న భారీ బహిరంగ సభకు అంతే భారీగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 3 లక్షల మంది ప్రజలను తరలించడంతోపాటు.. వారి మద్దతు కూడా తమకే ఉందని చెప్పేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలో అనూహ్యంగా ప్రతిపక్ష నాయకుల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన …
Read More »వైసీపీ నేతల్లో మరో టెన్షన్.. పార్టీ విధానంపై తర్జన భర్జన
వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుందా? పార్టీ అనుసరిస్తున్న విధానంపై నాయకులు తర్జన భర్జన పడు తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు టికెట్ల వ్యవహారంలో నరాలు తెగే ఉత్కంఠను చవిచూసిన నాయకులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కొందరికిటికెట్ దక్కక పోయినా.. సర్దుకుపోయే ధోరణికి వచ్చేశారు. మరికొందరు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమన్వయ కర్తలుగా నియమితులైన వారు.. ఇప్పుడు కొత్త టెన్షన్ను ఎదుర్కొంటు …
Read More »అటు వైసీపీ-ఇటు టీడీపీ ఒకే సారి రాష్ట్రంలో విజృంభణ!
ఏపీలో ఎన్నికల ప్రకటనకు ముందే.. ప్రచార పర్వం దాదాపు ప్రారంభమైపోయింది. ఇప్పటికే టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు రా..కదలిరా! సభను రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఆయన ఈ సభలు పెడుతూ.. పార్టీపరంగా నాయకులను నడిపిస్తున్నారు. ఇదేసమయంలో అభ్యర్థుల ఎంపికపైనా.. ఆయన దృష్టి పెట్టారు. అంటే దాదాపు రా..కదలిరా! సభ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు వైసీపీ ఎన్నికల …
Read More »బీజేపీలో తెలంగాణా సెంటిమెంటు
బీజేపీ అగ్రనేతల్లో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా నాటుకుపోయినట్లు అర్ధమవుతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తెలంగాణా నుండే పూరించబోతోంది. జాతీయస్ధాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వీలుగా ఉంటుందని దేశంలోని అన్నీ పార్లమెంటు నియోజకవర్గాలను 143 క్లస్టర్లుగా విభజించింది నాయకత్వం. ఇందులో తెలంగాణాలోని 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. దేశంలోని మొదటి క్లస్టర్ మీటింగ్ పాలమూరు …
Read More »జంగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ?
మాజీ ఎంఎల్ఏ, వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? అవుననే వినిపిస్తోంది రెండు ప్రధాన పార్టీల నుండి. 1999, 2004లో గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. 2009లో వైసీపీలో చేరారు. 2014లో గురజాలలో పోటీచేసినా ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు ఫ్యాన్ పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయితే …
Read More »చంద్రబాబుకు జగన్ ఫ్రీ హ్యాండ్.. అదే ఇబ్బందవుతోందా..!
రాజకీయాలు ఒక్కొక్కసారి గమ్మత్తుగా ఉంటాయి. కంచంలో అన్నీ వడ్డించినట్టు కనిపిస్తున్నా.. ఏం చేయాలో ఆలోచన తట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏపీలోనూ.. అలాంటి పరిస్థితే ఎదురైంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దింపేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న టీడీపీకి.. కీలకమైన వ్యవహారంలో వైసీపీ నుంచి రూట్ క్లియర్ అయిపోయింది. సీఎం జగన్.. ఒకరకంగా.. చంద్రబాబుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చేశారు. అంటే.. వైసీపీని ఓడించాలంటే.. టీడీపీ సరైన అభ్యర్థులను …
Read More »