ఆపద రావడం ఒక ఎత్తు.. ఆపద అనంతరం ప్రభుత్వాలు, నాయకులు, వ్యక్తులు, అధికారులు వ్యవహరించే తీరు మరొక ఎత్తు. తాజాగా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని గుర్తించడానికి కూడా పరిస్థితి మారిపోయింది. ఎక్కడెక్కడి వారు బెన్గలూరుకు వెళ్తున్నారో తెలియదు. వీరిలో …
Read More »ఈసీ ఎఫెక్ట్: సోషల్ మీడియా ప్రభావం అంతంతే!
బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి, అదేవిధంగా మరొక నియోజకవర్గం నగ్రోతాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా …
Read More »కవిత ‘వయసు’ వ్యాఖ్యలు.. ఏం చెప్పాలని?
రాజకీయాల్లో ఉన్నవారే కాదు.. సహజం ఏ మహిళ కూడా తన వయసును బయటకు వెల్లడించరు. ఇక, పురుషులు కూడా ఇటీవల కాలంలో వయసును చెప్పడానికి మొహమాట పడుతున్నారు. ఏదైనా పెద్ద అవసరం ఉంటే తప్ప.. ఎవరూ వయసు విషయంలో బయటకు చెప్పరు. ఇక, రాజకీయాల్లో ఉన్నవారు.. ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్లలో తప్ప.. ఎక్కడా వయసును బయట పెట్టుకోరు. అలాంటిది జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె …
Read More »ఎస్! అందుకే లొంగిపోయాం: మావోయిస్టు ఆశన్న వీడియో
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుడు, సిద్ధాంత కర్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాల రావు, అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు.. ఇటీవల ప్రభుత్వాలకు లొంగిపోయారు. మల్లోజుల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు, ఆశన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు.. భారీ బలగాలతో వచ్చి.. లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వందలాది తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ ఘటన తర్వాత.. వారికి …
Read More »అమరావతికి కీలక సంస్థ… జగన్ వెనక్కి తగ్గాల్సిందే!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన నిర్ణయమే కరెక్ట్ అన్న ధోరణితో ఉన్నారు. ఈ విషయం ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టమైంది. నిజానికి కాలం మారుతోంది. ప్రజల ఆలోచనా ధోరణులు కూడా మారుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా.. నాయకులు మంకు పట్టు పడితే.. కుదరదు. ఒక సందర్భంలో కాకపోతే.. మరో సందర్భంలో అయినా.. ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ, ఈ …
Read More »హైకోర్టు ఎఫెక్ట్: ‘లిక్కర్’ టెండర్లపై డోలాయమానం
హమ్మయ్య.. లిక్కర్ టెండర్ల వ్యవహారం పూర్తయింది.. సర్కారుకు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ, అసలు తంతు ఇప్పుడే స్టార్టయింది. ఈ వ్యవహారంపై లెక్కకు మిక్కిలిగా రెండు కారణాలతో హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు.. ఈ పిటిషన్లపై తాజాగా శనివారం హోరా హోరీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. లిక్కర్ షాపులకు సంబంధించిన టెండర్ల …
Read More »జూబ్లీహిల్స్ పోరు: అభ్యర్థుల అసలు బెంగ ఇదే!
హైదరాబాద్లోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 11న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే.. ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారని తేల్చి చెప్పింది. ఇక, నామినేషన్ల ఘట్టం అనంతరం.. వడబోతలు కూడా పూర్తయ్యాయి. వీటి ప్రకారం.. మొత్తం 58 మంది అభ్యర్థులు …
Read More »బీహార్లో ప్రచారం చేస్తా: చంద్రబాబు
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కీలకమైన రాష్ట్రం బీహార్లో తాను కూడా ప్రచారం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ దశాబ్దపు నాయకుడిగా అభివర్ణించిన ఆయన, సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ పురోభివృద్ధిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పారు. బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు అవుతుందని అన్నారు. దీనికి సంబంధించి …
Read More »లిక్కర్ అమ్మకుండానే.. తెలంగాణ ఖజానకు కాసుల కిక్కు!
ఔను! నిజమే. ఎక్కడైనా లిక్కర్ విక్రయిస్తేనే సొమ్ములు వస్తాయి. కానీ, లిక్కర్ అమ్మకుండానే తెలంగాణ సర్కారుకు కాసుల మోత మోగింది. రెండేళ్లకు ఒకసారి వైన్స్ దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తుంది. అదే బార్లయితే.. 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు వైన్స్ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి కొన్నాళ్ల కిందటే తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 వైన్స్ షాపులను ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చిన దరఖాస్తు …
Read More »దేశంలో ఏపీకే ఆ ఘనత దక్కింది.. : చంద్రబాబు
దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఘనత ఏపీకి మాత్రమే దక్కిందని, ఇది తెలుగు నేల చేసుకున్న అదృష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. అది క్వాంటమ్ వ్యాలీ అని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఈ వ్యాలీకోసం ప్రయత్నించాయని.. కానీ, కేంద్రం సహకారంతో దీనిని అమరావతికి తీసుకువచ్చామని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే దీనిని ప్రారంభిస్తున్నమాన్నారు. ఇది దేశంలోని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థకు కీలక చోదక శక్తిగా మారుతుందన్న ఆయన.. భారీ …
Read More »అప్పటి అటవీ మంత్రే.. అడవులు ఆక్రమించారు: పవన్ ఫైర్
ఏపీకి గ్రేట్ గ్రీన్ వాల్(హరిత గోడ) అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవులు జాతీయ ఆస్తి అని పేర్కొన్న ఆయన… వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. అటవీ సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అటవీ రక్షణలో రాజకీయలకు తావుండదన్న డిప్యూటీ సీఎం.. ప్రతి అంగుళం అమూల్యమేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడవుల రక్షణ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ …
Read More »జూబ్లీహిల్స్లో ఫస్ట్ టైమ్: బరిలో 58 మంది అభ్యర్థులు
హైదరాబాద్లోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్లో అన్ని వడబోతల తర్వాత.. 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నిజానికి నామినేషన్ల గడువు ముగిసే సరికి 211 మంది అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేశారు. ఆ మరుసటి రోజు చేపట్టిన స్క్రూటినీలో 81 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ధ్రువీకరించారు. అయితే.. ఇంత మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates