Trends

బెజవాడలో అంతలా పాకేసిందా?

అంతకంతకూ విస్తరిస్తున్న పాజిటివ్ కేసులు కొన్ని నగరాలు.. పట్టణాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ నగరంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో బెజవాడ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం బెజవాడలో సగానికి పైగా ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించిందని చెబుతున్నారు. అంతేకాదు.. కంటైన్మెంట్ జోన్లు కూడా భారీగా పెరిగాయి. విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉంటే.. అందులో 62 …

Read More »

అట్లాస్ సైకిల్.. ఇక కనిపించదు

అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు. సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ …

Read More »

చైనాకు చెక్.. ఎనిమిది దేశాలు చేతులు కలిపాయ్

ప్రస్తుత ప్రపంచంలో చైనా అంతటి తెంపరి దేశం మరొకటి లేదనే విషయాన్ని మెజారిటీ దేశాలు అంగీకరిస్తాయి. భారత్‌ను దెబ్బ తీయడానికి చైనా నుంచి సాయం పొందే పాకిస్థాన్ లాంటి ఒకటీ అరా దేశాలు మినహాయిస్తే చైనాను అన్నీ వ్యతిరేకించేవే. తన స్వప్రయోజనాల కోసం ఎవ్వరినైనా చిక్కుల్లోకి నెట్టడానికి ఆ దేశం వెనుకాడదు. అభివృద్ధిలో తనకు దీటుగా ఉన్న, తనకంటే మెరుగ్గా ఉన్న దేశాల్ని దెబ్బ తీయడానికి చైనా ఎప్పుడూ కుట్రలు …

Read More »

ఆత్మ ఉందా లేదా?

ఈ సిరీసులో మునుపటి రెండు వ్యాసాల్లోనూ జీవితానుభవాల్లో కనిపించిన రెండు భగవద్గీతా శ్లోకాల్ని పంచుకున్నాను. ఇక్కడ ఆలోచించి చర్చించుకోదగిన ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వేల ఏళ్లనాటి భగవద్గీతలోని రెండు శ్లోకాలు ఇప్పటి సైన్సు సూత్రాలనే చెబుతున్నాయనే చర్చను మాత్రమే నా పరిధిలో ఆలోచించి నాకు అనిపించింది రాస్తున్నాను. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకఃన చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ఇది భగవద్గీత 2 …

Read More »

తెలుగు జర్నలిస్టు మృతి.. విషాదకర కోణం

కోవిడ్-19 అన్ని రంగాల వాళ్లనూ కబలిస్తోంది. సామాన్య జనంతో పాటు సినిమా వాళ్లు, వైద్యులు, పోలీసులు అందరూ దీని బారిన పడ్డారు. ఆయా రంగాల వాళ్లు ప్రాణాలూ కోల్పోయారు. కరోనాకు ఎదురెళ్లి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు సైతం పెద్ద ఎత్తునే కరోనా బారిన పడ్డారు. కొందరు మృత్యువాత పడ్డారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తాజాగా మనోజ్ కుమార్ అనే టీవీ5 జర్నలిస్టు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. …

Read More »

ఆసుపత్రి బిల్లుబకట్టలేదని తాళ్లతో కట్టేశారు

చికిత్స సంగతి ఎలా ఉన్నా.. బిల్లు కట్టించుకునే విషయంలో ఆసుపత్రులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనిషి ప్రాణం పోయినా.. బిల్లు లెక్క తేలే వరకూ డెడ్ బాడీని ఇచ్చేందుకు సైతం ఒప్పుకోని దవాఖానాల గురించి తెలిసిందే. తాజాగా.. ఒక ఆసుపత్రి వ్యవహారం షాకింగ్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.సదరు ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు …

Read More »

ఈ రోజు నుంచి గుళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఓపెన్.. రూల్స్ ఇవే

Temples

అన్ లాక్ 1.0లో భాగంగా ఈ రోజు నుంచి గుళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్ని పక్కాగా పాటించాలని చెబుతున్నారు. తెలంగాణలోని ప్రార్థనాలయాలు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. షాపింగ్ మాల్స్ ను తెరుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏమేం రూల్స్ ను …

Read More »

క‌రోనా దేవికి పూజ‌లు పున‌స్కారాలు

చాలామందిలో భ‌యం నుంచి భ‌క్తి పుడుతుంది. భ‌యం వ‌ల్ల భ‌క్తి ఇంకా పెరుగుతుంది కూడా. క‌ష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ న‌మ్మ‌కాలున్న వాళ్ల‌యితే మ‌రీనూ. ఈ క్ర‌మంలో వాళ్లు చేసే ప‌నులు మ‌రీ త‌మాషాగా కూడా త‌యార‌వుతాయి. ఈ స్థితిలో వారి అమాయ‌క‌త్వానికి న‌వ్వుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం. ఉత్త‌రాదిన బాగా వెనుక‌బ‌డిన రాష్ట్రాల్లో ఒక‌టైన‌ బీహార్‌లో క‌రోనా వైర‌స్ భ‌యంతో గ్రామీణ మ‌హిళ‌లు చేస్తున్న …

Read More »

పెట్స్ కోసం స్పెషల్ ఫ్లైట్.. టికెట్ రేటు తెలిస్తే అవాక్కే..

రోజులు మారాయి. కలలో కూడా ఊహించని రోజులు వచ్చేశాయి. మనిషి మనిషి చూసుకోని.. కలుసుకోని రోజులే కాదు.. కలిసినా గతంలో మాదిరి చనువుగా ఉండలేని పరిస్థితి. కాలంతో పాటు పరుగులు పెట్టే మనిషి జీవితం సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగింది. లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ప్రయాణాలు షురూ అయ్యాయి. అయితే.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఏ మూల …

Read More »

దావూద్ ఇబ్రహీంకి కరోనా !!

అండర్ వరల్డ్ మాపియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కరోనా సోకింది. అతనితో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకడం గమనార్హం. పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొందరు అధికారుల ద్వారా ఈ సమాచారం మాకు అందినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. దీంతో దావూద్ భద్రతా సిబ్బంది మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇతను కరాచీలో ఉన్నట్లు మనకు తెలిసిన సమాచారమే. దావూద్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడు. ఇతని …

Read More »

తిరుమల శ్రీవారి దర్శనం.. నియమ నిబంధనలివే

ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ తెరుచుకోబోతున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీ ఉండే ఆలయం అయిన తిరుమల శ్రీనివాసుడి గుడి కూడా ఇదే రోజు తెరుచుకోబోతంది. సోమవారం నుంచే దర్శనాలు మొదలవుతున్నప్పటికీ.. సాధారణ భక్తులకు దర్శనాలు 11న ఆరంభించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలయ దర్శనానికి సంబంధించి నియమ నిబంధనలు.. ఇతర మార్గదర్శకాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దాని ప్రకారం జూన్ …

Read More »

కేరళ ఏనుగు కథలో అసలు నిజం

Kerala

కేరళలో ఓ ఏనుగు విషాదాంతం దేశాన్ని కదిలించింది. ఓ ఏనుగుకు స్థానికులు ఆహారం ఆశ చూపి పైనాపిల్ ఇవ్వగా.. అది తినబోతుండటా దాని లోపలున్న పేలుడు పదార్థాలు పేలి అది తీవ్రంగా గాయపడి.. కొన్ని రోజుల పాటు నొప్పితో అల్లాడి ప్రాణాలు వదిలిందని వార్తలొచ్చాయి. దీనిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు స్పందించారు. జంతువుల పట్ల మనిషి క్రూరత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు వేశారు. ఈ క్యాంపైన్ అంతర్జాతీయ …

Read More »