Trends

స్టార్ మా లో “సూపర్ సింగర్ జూనియర్

ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది  “స్టార్ మా”. ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా. స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పైన పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ పరంపరలో స్టార్ మా ఇప్పుడు కేవలం పిల్లల కోసం “సూపర్ సింగర్ జూనియర్”  పేరుతో ఓ కొత్త …

Read More »

ధోనీ ఫ్యాన్స్‌.. టెన్ష‌న్ తీరిపోయింది

ఇండియ‌న్ క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్‌లో ఒక‌డైన‌ మ‌హేంద్ర‌సింగ్ ధోని.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి రెండేళ్లు కావ‌స్తోంది. ఐపీఎల్‌లో కూడా అత‌ను ఒక‌ట్రెండేళ్ల‌కు మించి కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌ని అప్పుడే అనుకున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు టాటా చెప్పాక ధోని రెండు ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఆడాడు. 2020లో ఐపీఎల్ ఆల‌స్యంగా, యూఏఈలో జ‌ర‌గ‌గా.. గ‌త ఏడాది స‌గం సీజ‌న్ ఇక్క‌డ‌, స‌గం యూఏఈలో నిర్వ‌హించారు. మ‌ళ్లీ ఏ ఏడాది ఐపీఎల్ స్వ‌దేశానికి తిరిగొచ్చింది. …

Read More »

‘దిశ ఎన్‌కౌంట‌ర్‌’ కేసులో దోషి ఎవ‌రో తేలిపోయింది: సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఎన్‌కౌంట‌ర్ కు సంబంధించి దోషి ఎవ‌రో తేలిపోయింద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. దిశ హత్యాచార …

Read More »

మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతాల్లో కోతలా ?

బస్సుల మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతాల నుంచి రికవరీ చేయబోతున్నారా ? అనకాపల్లి బస్ డిపో అధికారుల ఓవర్ యాక్షన్ తో ఈ విషయం బయటపడింది. విశాఖపట్నం నగర పరిధిలో సింహాచలం, అనకాపల్లి డిపోల్లో పనిచేస్తున్న కొందరు డ్రైవర్లకు సంబంధిత డిపో అధికారుల నుండి నోటీసులు అందాయి. మైలేజీ తగ్గింది కాబట్టి డీజల్ కు అయిన అదనపు ఖర్చులను మీ జీతాల్లో నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో చెప్పాలంటు అధికారులకు …

Read More »

దెబ్బకు అల్లాడిపోతున్న ఉత్తరకొరియా

కరోనా వైరస్ దెబ్బకు ఉత్తర కొరియా అల్లాడిపోతోంది. దేశం మొత్తం మీద కరోనా అనుమానిత కేసులు సుమారు 8.5 లక్షలుగా రికార్డయ్యాయి. వీటిల్లో సుమారు 3.5 లక్షల మంది కరోనా నిర్ధారణై ఆసుపత్రుల్లో ఐసీయూలో వైద్యం చేయించుకుంటున్నారు. గడచిన రెండు రోజుల్లో దేశంలో కరోనా వల్ల మాత్రమే సుమారు 100 మంది చనిపోయినట్లు సమాచారం. ఇంతకాలం లేని సమస్య ఒక్కసారిగా వచ్చి మీదపడటంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ …

Read More »

హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు: మంత్రి

హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ‍్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ‍్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్‌, సీఎం స్టాలిన్‌ ఖండించిన విషయం తెలిసిందే. హిందీ అస‌లు భాషే కాద‌ని..అది సంస్కృతం లోంచి వ‌చ్చిన ద‌త్త భాష అని దీనిని ప్ర‌త్యేకంగా చ‌ద‌వాల్సిన అస‌వ‌రం లేద‌ని.. ప్ర‌త్యేకంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే స‌హా.. …

Read More »

పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి

ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా కోర్టులో అరుదైన పిటిషన్ దాఖలైంది. హరిద్వార్ కు చెందిన వృద్ధ దంపతులు.. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని డిమాండ్ చేశారు. అది నెరవేర్చ కపోతే.. వారిపై తాము ఖర్చు చేసిన రూ.5 కోట్లను పరిహారంగా చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు. హరిద్వార్కు చెందిన సంజీవ్ రంజన్ ప్రసాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం తన భార్య సాధనతో కలిసి హౌసింగ్ …

Read More »

జిన్ పింగ్ ఆరోగ్యం విషమం?

డ్రాగన్ దేశపు అధినేత జిన్ పింగ్ ఆరోగ్యం విషమించినట్లు స్ధానిక మీడియా ప్రకటించింది. మెదడుకు సంబంధించిన ‘సెరిబ్రల్ అనూరిజం’ అనే వ్యాధితో బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ సమస్యతో జిన్ పింగ్ మూడేళ్ళుగా బాగా ఇబ్బంది పడుతున్నారట. సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధి మెదడుకు సంబంధించినదట. ఈ సమస్య జిన్ పింగ్ లో చాలా ఎక్కువై పోయిందని స్ధానిక మీడియా వెల్లడించింది. వ్యాధి ముదిరి పోవటంతో 2021 చివరలో కొద్దిరోజులు ఆసుపత్రిలో …

Read More »

రష్యాలో ఉక్రెయిన్ రహస్య ఆపరేషన్ ?

గడచిన రెండు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని అనేక కీలక నగరాలు రష్యా దెబ్బకు ధ్వసమైపోయాయి. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇదే సమయంలో రష్యా భూభాగంపై ఈ మధ్య విధ్వంసాలు మొదలయ్యాయి. ఒకచోట చమురు నిల్వకేంద్రంలో నిప్పులు ఎగిసిపడ్డాయి. మరోచోట ఆయుధ డిపో పేలిపోయింది. ఇంకోచోట పేలుళ్ళు జరిగి మొత్తం నాశనమైపోయింది. ఇలాంటివి రష్యాలో జరుగుతుండటంతో అందరికీ ఒక అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే …

Read More »

650 రైళ్ళ సర్వీసుల రద్దు

చాలామందికి ఉండే అనుమానం ఏంటంటే… రైళ్లకు డిమాండ్ ఉన్నా ఎందుకు పెంచరు అని. ఎపుడు చూసినా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది… ఇంకో రైలు వేస్తే వీళ్లకే లాభం కదా అనుకునే సామాన్యులు చాలా మంది ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే… ప్రస్తుతం ఉన్న రైల్ రోడ్ నెట్ వర్క్, సిగ్నలింగ్ నెట్ వర్క్ కెపాసిటీకి అనుగుణంగా రైళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఒక కొత్త రైలు నడపాలన్నా… ఏదో ఒక …

Read More »

ఏంటి కరోనాతో ఇంత మంది చనిపోయారా !!

కరోనా మరణాలపై నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన దేశాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కారణంగా చనిపోయిన వారికి.. ప్రభుత్వం చెప్పే దానికి ఏ మాత్రం పొంతన లేదన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఎవరేం చెప్పినా.. ప్రభుత్వాలు మాత్రం కరోనాతో చోటు చేసుకున్న మరణాల్ని చాలా తక్కువ చేసి చూపించినట్లుగా చెప్పే సందేహాలకు సమాధానాలు …

Read More »

స్మితకు హైకోర్టు షాక్

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. తనపై ఒక మ్యాగజైన్ లో వచ్చిన ఒక స్టోరీపై ఆమె 2015లో పరువు నష్టం దావా వేశారు. సదరు మ్యాగజైన్ పై రు. 10 కోట్లకు పరువు నష్టం దావాను వేసిన స్మిత అందుకు అయ్యే కోర్టు ఖర్చులను ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ఆమె ప్రభుత్వానికి రిక్వెస్టు చేసుకోగానే వెంటనే ప్రభుత్వం కూడా రు. 15 లక్షలు …

Read More »