Trends

క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్..

క్రికెట్ లో మీరు ఎన్నో రికార్డుల గురించి విని ఉంటారు. కానీ..ఇది అన్నింటికన్నా.. పరమ చెత్త రికార్డు కావడం గమనార్హం. కేవలం ఏడు పరుగులకే ఓ జట్టు మొత్తం అవుట్ కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకెళితే.. యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత రికార్డ్ నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే …

Read More »

సౌండ్ చేస్తే.. రూ.లక్ష ఫైన్..!

ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి …

Read More »

జమ్మూలో ఎన్ కౌంటర్.. తెలుగు జవాన్ వీరమరణం..!

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో ఒకరు తెలుగు జవాను కూడా ఉండటం గమనార్హం. రాజౌరీ జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్ లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో …

Read More »

ఇక 12ఏళ్లు దాటిన చిన్నారులకు కూడా వ్యాక్సిన్..!

దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే. మూడో దశ ముప్పు కూడా త్వరలోనే ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడో దశ వచ్చేలోగా.. అందరికీ వ్యాక్సిన్ అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. కాగా.. సెప్టెంబర్ నుంచి 12ఏళ్లు దాటిన చిన్నారులందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారట. ఈ మేరకు జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ …

Read More »

దేశంలో జికా వైరస్ కలకలం.. తొలికేసు నమోదు..!

ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. కరోనా లోనూ కొత్త రకం వేరియంట్లు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. దేశంలో జికా వైరస్ కలకలం రేపడం మొదలుపెట్టింది.. తాజాగా.. కేరళ రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు వెలుగు చూసింది. 24ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని.. వాటికి సంబంధించి …

Read More »

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. అక్టోబర్ లో థర్డ్ వేవ్..!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ‌త 50 రోజుల నుంచి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు.. గ‌త 24 గంట‌ల్లో పెర‌గ‌డం క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఈ క్ర‌మంలో నేష‌న‌ల్ కోవిడ్‌-19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ వ్యాఖ్య‌లు కాస్త ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. అక్టోబర్-నవంబర్ మధ్య …

Read More »

హిందువులు అత్యధికంగా ఆరాధించే దేవుడు ఎవరంటే?

హిందువులు అన్నంతనే గుర్తుకు వచ్చే దైవం శ్రీరాముడు. అందులో నిజం ఎంతన్న దానిపై ఎవరూ ఇప్పటివరకు అధ్యయనం చేయలేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక సంస్థ చేసిన సర్వే ఫలితం షాకిచ్చేలా ఉంది. హిందువులు ఎక్కువగా కొలిచే దేవుడు ఎవరన్న అంశంపై పీవ్ రీస‌ర్చ్ సెంట‌ర్ సర్వే నిర్వహించింది. హిందువులు అన్నంతనే శ్రీరాముడి పేరు వినిపించటం.. దాని చుట్టూ కొన్నేళ్లుగా బోలెడంత రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయం …

Read More »

కరోనా దెబ్బ.. జట్టు జట్టునే మార్చేశారు

కరోనా కాలంలో క్రీడా రంగంలో ఎన్నెన్నో చిత్రాలు చూశాం. బయో బబుల్ అంటూ కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి.. అందులోనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులను ఉంచి.. వాళ్లు బయటికి రాకుండా, బయటివాళ్లు లోపలికి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం ఏడాది కిందట్నుంచే చూస్తున్నాం. వివిధ క్రీడల్లో లీగ్స్, టోర్నీలు, సిరీస్‌లు ఇలాగే నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే ఈ బబుల్‌ను పకడ్బందీగా నిర్వహించకుంటే ఏం జరుగుతుందో …

Read More »

పోలీసు ఇంటికి కన్నం.. సారీ ఫ్రెండ్ అంటూ దొంగ లెటర్..!

తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడటం.. ఆ ఇంట్లో దొరికినదంతా దోచుకెళ్లడం చాలా సహజం. ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ.. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి.. దర్జాగా లో లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా..వెళ్లే ముందు… ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అందులో.. తాను కావాలని దొంగతనం చేయలేదని.. …

Read More »

చేతులెత్తేసిన అపర కుబేరుడు.. సాధ్యం కాదని తేల్చేశాడు

చేతి నిండా డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతినైనా తేవొచ్చన్న నమ్మకం చాలామందికి ఉంటుంది. ఊహకు వాస్తవానికి మధ్య అంతరాన్ని చాలామంది మిస్ అవుతారు. టెక్నాలజీతో ఏదైనా సాధ్యమని నమ్మేవారికి.. కాలమే వారికి సరైన అవగాహన కల్పిస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది అపర కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు. తన ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆయనకు తీరని కలల్లో …

Read More »

ఫేస్ బుక్ కొత్త రూల్స్..!

Facebook

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న కంటెంట్స్ పై ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ ఫేస్ బుక్ చ‌ర్య‌ల‌కు రెడీ అయ్యింది. ఈ ఏడాది మే 15 నుండి జూన్ 15 మ‌ధ్య నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న మూడు కోట్ల కంటెంట్స్ పై చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది. ఈ మూడు కోట్ల‌లో కొన్నింటిని తొల‌గించ‌గా… మ‌రికొన్నింటిని క‌వ‌ర్ చేశామ‌ని …

Read More »

టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డ్..!

టీ20 చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ టీ20 ఫార్మాట్ లో క్రికెటర్లు సెంచరీలు చేయడానికే చాలా కష్టపడుతుంటారు. అలాంటిది ఓ క్రికెటర్ డబుల్ సెంచరీ చేశాడు. అది కూడా మన దేశ క్రికెటర్ కావడం విశేషం. టీ 20 క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. 79 బంతుల్లో 205 పరుగులు చేసి ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర …

Read More »