తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు.. సామాన్యులకే కాదు.. అన్ని వర్గాల వారికీ ఇక్కట్లు తెచ్చి పెడుతు న్నాయి. తాజాగా అద్దంలాంటి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మునిగిపోయింది. దీంతో రేపు ఉదయం వరకు కూడా రాకపోకలను నిషేధించడం గమనార్హం. మరోవైపు.. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు ఏపీ పరిధిలో ఉన్న రహదారిపై ఏపీ పోలీసులు.. అటు తెలంగాణ పరిధిలో ఉన్న రహదారిపై ఆ రాష్ట్ర పోలీసులు …
Read More »నీళ్లు తాగుతున్న నంది విగ్రహం
దేవుళ్ల విగ్రహాలు పాలు, నీళ్లు తాగుతున్నాయన్న వీడియోలు, వార్తలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదారాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో జరిగింది. చిన్న అనంతగిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుందనే విషయం వైరల్గా మారింది. ఉదయం పూజలు చేసిన తర్వాత పూజారి ఆ విగ్రహానికి నీళ్లు తాగించారు. విగ్రహం మూతి దగ్గర స్పూన్ పెట్టగానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన …
Read More »టీవీ ప్రసారాలకు షాక్ తప్పదా ?
రియాల్టీషోలు, ఓటీటీల పేరుతో విచ్చలవిడిగా హింస, బూతులు, శృంగారం నట్టింట్లోకి వచ్చేసింది. టీవీలు పెడితే చాలు ఏదో ఒక రియాల్టీషో, ఓటీటీల్లో వెబ్ సీరీసులు, సినిమాల పేరుతో బూతులు, సెక్స్ సీన్లు ప్రసారాలైపోతున్నాయి. వీటన్నింటినీ చూడలేరు అలాగని టీవీలను మూసుకుని కూర్చోలేరు. ఇంటిల్లిపాది రియాల్టీషోలు, ఓటీటీల్లో సినిమాలు చూడాలంటేనే ఇబ్బందిగా తయారైంది. అలాంటి ఇబ్బందులకు హైకోర్టు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీషోలకు, ఓటీటీలో వచ్చే వెబ్ సీరీసులు, …
Read More »జీహెచ్ఎంసీ ఆఫీసులో పామును వదిలిన యువకుడు
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో ప్రజలు పని చేయించుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం. తమ ప్రాంతంలో ఈ సమస్య ఉంది మహాప్రభు అంటూ విన్నపాల మీద విన్నపాలు చేసుకుంటే సంబంధిత అధికారులలో మెజారిటీ అధికారులు, సిబ్బంది తమకు కుదిరినప్పుడు లేదా తీరికగా ఉన్నప్పుడు వచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవారు. ముఖ్యంగా మున్సిపాలిటీకి చెందిన అధికారులు, సిబ్బంది అయితే డ్రైనేజీ సమస్య, చెత్తను శుభ్రం చేయడం వంటి పనుల్లో చాలాసార్లు …
Read More »వీడియోలు పెట్టడమే శాపం.. చెల్లిని చంపిన అన్న
పాటలకు అనుగుణంగా డ్యాన్స్లు చేస్తూ వీడియోలు.. రీల్స్ చేయడం.. డైలాగ్లు చెప్పడం.. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. ఇప్పుడు పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఇదే ట్రెండు నడుస్తోంది. కానీ ఇలా వీడియోలు తీసి.. యూట్యూట్ సహా సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆ యువతి పాలిట శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు పెట్టడం మానట్లేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఆ అన్న.. తన సొంత సోదరిని హత్య చేశాడు. …
Read More »ఈ సారి హైదరాబాద్లో బస్సు కింద తల
బస్సు కింద పడి చనిపోతే వచ్చే నష్ట పరిహారంతో తన కొడుకు కళాశాల ఫీజు కట్టుకుంటాడని భావించిన ఓ తమిళనాడు మహిళ.. కదులుతున్న బస్సుకు ఎదురుగా వెళ్లి తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాకముందే హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద తలపెట్టి చనిపోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన …
Read More »‘టమాటాల ధరలు పెరిగితే.. తినడం మానేయ్యండి’
టమాటా.. ఇది లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదనడంలో అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుతం దేశంలో టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు టమాటలకు మునుపెన్నడూ లేనంత విలువ రావడంతో వీటిని సైతం దొంగిలించడం చూస్తున్నాం. అంతే కాకుంటా టమాట పండించిన కొంతమంది రైతులు రూ.కోట్లలో సంపాదిస్తున్నారనే మాటలూ వింటున్నాం. మరోవైపు మునుపెన్నడూ లేని రీతిలో దీని ధర అమాంతం …
Read More »లవర్ను కలిసేందుకు పవర్ కట్.. చివరకు ఇద్దరికి పెళ్లి
లవర్ను కలిసేందుకు తన ఊర్లో రోజూ పవర్ కట్ చేసే ఓ యువతి.. వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్థులు.. ఆ యువకుడిని చితకబాదితే కాపాడేందుకు ప్రయత్నించిన యువతి.. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఇదేం సినిమా కథ కాదు. కానీ మూవీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన బిహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది. బెటియాకు చెందిన ప్రీతి …
Read More »అన్నం పెట్టలేదని భార్యని చంపేసిన భర్త
రాత్రి అన్నం పెట్టలేదని కట్టుకున్న భార్యను చంపాడో ప్రబుద్ధుడు. ప్రస్తుత కాలంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్న మనుషులు చేస్తున్న అమానవీయ ఘటనకు ఇదో నిదర్శనం. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి వచ్చిన భార్యను.. ఓ భర్త బండరాయితో మోదీ చంపాడు. అందుకు కారణం కూడా పెద్దదేమీ కాదు. అన్నం పెట్టలేదని గొడవ పెట్టుకుని.. ఆగ్రహంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్పూర్లోని మాతా కా థాన్ ఏరియాలో జరిగింది. …
Read More »వారం వారం సొంత విమానంలో వాడపల్లి వస్తున్న బెంగుళూరు భక్తుడు
కలియుగం దైవం వెంకటేశ్వరుడంటే కోరిన కోర్కెలు తీర్చే దేవంగా ప్రశస్తి. అందుకే తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయాలు పలు ఇతర చోట్ల కూడా వాటివాటి మహాత్మ్యం కొద్దీ పేరుపొందాయి. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని వీసా బాలాజీ ఆలయం కూడా అంతే. అలాగే.. కోనసీమ జిల్లా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల నుంచి అలాంటి గుర్తింపే వస్తోంది. వాడపల్లి వెంకన్న …
Read More »కైలాసానికి డైరెక్ట్ రోడ్డు
తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు …
Read More »గిన్నిస్ రికార్డు ‘స్మాష్’ చేసిన సాత్విక్
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మెరుపు వేగంతో స్మాష్ కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను స్మాష్ చేశాడు. బ్మాడ్మింటన్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగంగా స్మాష్ కొట్టిన షట్లర్ గా సాత్విక్ సాయిరాజ్ వరల్డ్ రికార్డు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates