Political News

బాబుపై ‘ఫ్యామిలీ టిక్కెట్స్’ ప్రెజర్

రాబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో సూపర్ సీనియర్ల కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు రెండు టికెట్ల కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తులోనే టీడీపీ పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతున్నాయి. తాజా డెవలప్మెంట్లలో బీజేపీ కూడా చేరుతుందనే అంటున్నారు. ఒకవేళ కమలంపార్టీ కూడా పొత్తులో …

Read More »

ఆ రెడ్డిగారి రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా?

ఔను.. గుంటూరు జిల్లాలో ఈ మాటే వినిపిస్తోంది. “రెడ్డిగారు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న రాజ‌కీయం మాటేంటి? ” అని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. పార్టీలు మారిన ఫ‌లిత‌మో.. లేక వ్యూహం లేక పోవ‌డ‌మో.. ఇవ‌న్నీ కాకుండా.. తాను ప‌ట్టిన కుందేలు కు మూడుకాళ్లే అన్న‌టైపులో రాజ‌కీయాలు చేయ‌డ‌మో.. ఏదేమైనా.. మోదుగుల రాజ‌కీయాలు ముందుకు సాగ‌డం లేదు. తొలుత ఈయ‌న రాజ‌కీయం టీడీపీతో …

Read More »

క‌మ్మ వ‌ర్సెస్ బీసీ.. జ‌గ‌న్ ఫార్ములా ఇది..!

రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అవి కూడా పార్ల‌మెంటు స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేసిన మార్పులు.. రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అవే.. ఒక‌టి ఏలూరు పార్ల‌మెంటు స్థానం, రెండు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌మ్మ నేత‌ల చేతిలోనే …

Read More »

కాంగ్రెస్ లో హాట్ సీటిదేనా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై సీనియర్ నేతలు, వాళ్ళ వారసులు దృష్టి కేంద్రీకరించారు. ఉన్న 17 పార్లమెంటు సీట్లలో టికెట్ కోసం పార్టీలో బాగానే పోటీ మొదలైపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అన్నీ నియోజకవర్గాల్లోకి ఖమ్మం పార్లమెంటు సీటే చాలా హాట్ సీటట. ఎందుకంటే ఇక్కడ నామినేషన్ వేస్తే చాలు కాంగ్రెస్ గెలుపు గ్యారెంటీ అనే ప్రచారం ఉంది కాబట్టే. నిజానికి ఖమ్మం పార్లమెంటు సీటు అంటేనే …

Read More »

‘ దేవినేని అవినాష్‌ ‘ … అసెంబ్లీలో అడుగు పెడతాడా ?

తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన యువ నాయ‌కుడు… దేవినేని అవినాష్ అనతి కాలంలోనే  సీఎం జ‌గ‌న్‌కు  స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారని లోకల్ టాక్. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌యక‌ర్త దేవినేని అవినాష్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఆయ‌న ఈ సారి విజ‌యంతో అసెంబ్లీలో అడుగు పెట్ట‌నున్నార‌న్న టాక్ బెజ‌వాడ రాజ‌కీయాల్లో బ‌లంగా వినిపిస్తోంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన దివంగ‌త నేత దేవినేని నెహ్రూ రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్  ఇప్ప‌టికే రెండుసార్లు ఎన్నిక‌ల్లో పోటీ …

Read More »

వారి చెంప ప‌గ‌ల‌గొట్టండి.. ప్ర‌జ‌ల‌కు నాగ‌బాబు పిలుపు

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నటుడు నాగ‌బాబు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌కుండా.. క‌నీసం రోడ్డు కూడా వేయ‌కుండా.. నాయ‌కులు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లిలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “క‌నీసం ఒక్క రోడ్డు కూడా వేయ‌ని వైసీపీ నాయ‌కులు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు త‌యార‌య్యారు. ఓటువేయాలంటూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌జ‌లు వాళ్ల చెంప ప‌గ‌ల‌గొట్టి.. కాల‌ర్ ప‌ట్టుకుని, మాకు ఏం చేశారో చెప్పండి! …

Read More »

కాంగ్రెస్ ఇక‌, ఒంట‌రి పోరే.. తేలిపోయింది!

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రి పోరు చేయాల్సి రావ‌డం ఖాయ‌మైపోయింది. ఇండియా కూట‌మిని ఏర్పాటు చేసి కేంద్రంలోని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన కాంగ్రెస్‌కు అడుగ‌డుగునా సంక‌టం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. పొత్తుల‌కు.. టికెట్ల కేటాయింపు ప్ర‌ధాన అవ‌రోధంగా మారిన ద‌రిమిలా.. ఒక్కొక్క పార్టీ క‌ట్టుత‌ప్పి.. ప‌క్క‌కు జ‌రిగిపోయాయి. మొత్తం 28 పార్టీల స‌మాహారంగా ఉన్న ఇండియా కూట‌మిలో కీల‌క‌మైన పెద్ద‌పార్టీలు దాదాపు త‌ప్పుకొన్నాయి. …

Read More »

రేవంత్ ఫోకస్ తో బీఆర్ఎస్ లో టెన్షన్

రాజ్యసభ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ లో ఖాళీ అవబోయే మూడు స్ధానాలను భర్తీచేసేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈనెల 27వ తేదీ ఎన్నిక నిర్వహించబోతోంది. మూడు స్ధానాల్లో రెండింటిలో కాంగ్రెస్, ఒకదాన్ని బీఆర్ఎస్ గెలుచుకోగలవు. ఈ విషయంలో పై రెండు పార్టీలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే మూడోసీటును కూడా గెలుచుకునేందుకు రేవంత్ రెడ్డి …

Read More »

టీడీపీతో పొత్తుపై అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు విష‌యంపై బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వ‌స్తున్నారు“ అని  వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకు న్న‌ట్టు షా తెలిపారు.  400 స్థానాలు ద‌క్కించుకుని మ‌రోసారి విజ‌యం …

Read More »

పొత్తులపై కామెంట్లు చేసే జనసేన నేతలకు పవన్ వార్నింగ్

ఏపీలో త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, టీడీపీ జనసేనలతో బిజెపి కూడా కలిసే అవకాశాలపై ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం …

Read More »

కాంగ్రెస్ తొలి బడ్జెట్..ఎలా ఉంది?

ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో తొలిసారిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు భట్టి.  ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతోన్న పథకాల గురించి వివరించారు. రైతులకు రుణమాఫీ అమలు చేయబోతున్నామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు.ప్రతి పంటకు …

Read More »

ఒక్క ఉచితం.. ఎన్ని తిప్ప‌లు పెడుతోంది!

రాజ‌కీయ పార్టీలు ఉచిత హామీలు ఇచ్చేందుకు, ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఎంతో ఉబ‌లాట ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే.. వైసీపీ అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి త‌దిత‌ర ప‌థ‌కాల‌కు దీటు గా తాము మ‌రిన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని టీడీపీ చెబుతోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఉచితాల బాట ప‌డితే ఎలా ఉంటుందో.. ఏం జ‌రుగుతుందో.. ఏపీనే ఉదాహ‌ర‌ణ‌. ఏపీలో ప్ర‌భుత్వం అప్పుల‌పై అప్పులు చేస్తోంది. కానీ, …

Read More »