అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను అంటిపెట్టుకుని ఉంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది టీడీపీనే అని చెప్పారు. గత 17 మాసాల్లో ప్రతి నెలా ప్రజలను పలకరిస్తూనే ఉన్నారు సీఎం చంద్రబాబు అంతేకాదు.. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అవుతూనే ఉన్నారు. తాజాగా.. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతన్న మీకోసం …
Read More »గూగుల్ డేటా సెంటర్.. ఊహించనంత వేగంగా!
విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించని వేగంగా ముందుకు కదులుతోంది. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 506 ఎకరాలను గూగుల్ డేటా కేంద్రం, దాని అనుబంధ సంస్థలకు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కొంత భాగాన్ని భీమిలి నియోజకవర్గం పరిధిలో కూడా సమీకరిస్తున్నారు. అమరావతి రాజధానిని ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఇప్పటికే ప్రభుత్వం …
Read More »బీజేపీ దయవల్ల నా ఇమేజ్ నార్త్లోనూ పెరిగింది: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దయవల్ల తన ఇమేజ్ నార్త్ వరకు పాకిందని.. ఒకప్పుడు తానెవరో.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలకు తెలియదని… కానీ.. బీజేపీ నాయకు లు ఇప్పుడు చేస్తున్న అతి ప్రచారం కారణంగా.. తన పేరు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోడీ.. ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా వారికి …
Read More »గ్లోబల్ సమ్మిట్ కోసం గ్లోబును చుట్టేస్తున్న రేవంత్ సర్కార్
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి ఆయా …
Read More »పార్లమెంటులో కరిచే కుక్కలు ఉన్నాయి – కాంగ్రెస్ ఎంపీ
కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె పార్లమెంటుకు తన కారులో ఒక శునకాన్ని తీసుకువచ్చారు. గమనించిన భద్రతా సిబ్బంది ఆమె కారును నివాసానికి తిరిగి పంపారు. ఈ సందర్భంలో ఆమె కొంత వివరణ ఇచ్చారు. తాను ఆ కుక్కపిల్ల కనిపించిందని, రోడ్డు ప్రమాదం నుంచి రక్షించి, పార్లమెంట్కు వచ్చానని అన్నారు. వెంటనే వెనక్కి పంపించినట్లు వివరణ …
Read More »శ్రీవారి వైకుంఠ దర్శనం… సెకనుకు 8 మంది!
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అనుమతిస్తున్నారు. ఇది సాధ్యమేనా? కనీసం.. శ్రీనివాసుని రూపు రేఖలైనా కనిపిస్తాయా? కనీసం ఆయన తిరునామం అయినా గోచరిస్తుందా? అంటే.. అది `భక్తికి` సంబంధించిన విషయం. ఎవరి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల …
Read More »సచివాలయంలో బ్యారికెట్లపై సీఎం బాబు ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు కట్టుకుని తిరిగారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పదేపదే చెబుతూ ఉంటారు. తాను పర్యటనలకు వెళ్ళినప్పుడు పరదాలు, బారికేడ్ల వంటివి ఉంటే ఒప్పుకోరు. అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లను అలాగే చేస్తుంది. అదే ఆయన ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. పింఛన్ల పంపిణీకి తాను వెళ్తున్న ఊళ్లలోనే ఏర్పాట్లు …
Read More »ఆ ముగ్గురు అనుకుంటే ప్రభుత్వంలో జరగనిది ఏది లేదు
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిందని, తమ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచే ప్రతి పథకం ప్రారంభించామని …
Read More »ఏపీలో ఏంటీ ‘చిన్న పురుగు’ టెన్షన్
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు ఏమిటీ పురుగు..? దాని వల్ల జ్వరాలు రావడం ఏమిటి..? ఓ మహిళ మరణించింది అనే వార్తలు రావడం ఏమిటి..? అనే అంశాలపై ఏకంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసినా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీలో వస్తున్నాయి. ఈ వ్యాధికి …
Read More »పవన్ సినిమాలను ఆయనేంటి ఆపేది – పేర్ని నాని
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి పరోక్షంగా గోదావరి ప్రాంతం కారణమని.. ఇక్కడి పచ్చదనం చూసి దిష్టి పెట్టారని.. అందువల్లే ఇప్పడు కోనసీమ దెబ్బ తిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వారికి ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు పవన్ మీద విరుచుకుపడుతున్నారు. అందులో …
Read More »అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోం శాఖ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి అనిత, పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు తో కలిసి లోకేష్.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నానికి గూగుల్ డేటా …
Read More »జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి…’ ఇంటూ వైఎస్జగన్ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిజంగా ఇక్కడ కిలో అరటి పండ్ల ధర 50 పైసలేనా..? …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates