ఏపీ ప్రతిపక్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేసే చంద్రబాబు తాజాగా జోకులు పేల్చారు. అమరావతిపై సమీక్ష చేస్తున్న సమయంలో మంత్రి నారాయణకు ఓ మెసేజ్ వచ్చింది. ‘పులివెందులలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ నుంచి మంత్రి నారాయణకు మెసేజ్ వచ్చింది. దీనిని ఆయన …
Read More »అమరావతి పనుల్లో ఊహించని వేగం: చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి పనుల్లో ఊహించని వేగం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతి పనులపై ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత సాధికార అథారిటీ (సీఆర్డీఏ) అధికారులు, అదేవిధంగా రాజధానిలో పనులు చేస్తున్న వివిధ కాంట్రాక్టర్లు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనుల పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టారని, అయితే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని …
Read More »బాబు కోరకుండానే మోడీ వరం.. ఏపీకి కీలక ప్రాజెక్టు
ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్న పనులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చకచకా చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతికి రుణం ఇప్పించడంతో పాటు కేంద్రం కూడా గ్రాంట్లు ఇస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూరుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఇస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆపేసిన పథకాలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది. వీటికి సైతం కేంద్రం నిధులు …
Read More »మేం వస్తే.. మీ ఉద్యోగాలు తీసేస్తాం: పోలీసులపై వైసీపీ నేత ఫైర్
పోలీసులపై వైసీపీ నాయకులు మరోసారి నోరు వేసుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ అధినేత జగన్ పోలీసులను తరచుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రోడ్ల వెంబడి తిప్పారని పేర్కొంటూ ప్రొద్దుటూరు …
Read More »‘అన్న’గారిపై ఈమె అభిమానం అజరామరం!
నాగిరెడ్డి సంగీత… ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని నిమ్మకూరు వాసి. నిమ్మకూరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, పేదల సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావే కదా. అంటే ఈ సంగీతది కూడా ఎన్టీఆర్ స్వగ్రామమే అన్నమాట. యావత్తు తెలుగు జాతికే కాకుండా సినీ జగత్తులో ఉత్తుంగ తరంగాలకు ఎదిగిన …
Read More »నా సహనం పరీక్షిస్తున్నారా!
గత నాలుగు రోజులుగా స్వరం పెంచి వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజా మరింత దూకుడు పెంచారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నారా లేదా అని నిలదీశారు. దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ “ఔను …
Read More »సీబీఐకి వామనరావు దంపతుల హత్య కేసు: సుప్రీం
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి దారుణ హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం సీబీఐని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమకే అందించాలని ఆదేశించడం గమనార్హం. అంతేకాదు, ఈ దారుణ హత్య కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టకూడదని, రాజకీయ ఒత్తిళ్లు, అధికారిక పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు …
Read More »పులివెందుల టెన్షన్: అవినాష్ రెడ్డి అరెస్టు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికివారు ఈ ఎన్నికలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దాడులు జరిగే అవకాశముందని సూచనలతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వీరిలో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీకి …
Read More »పులివెందులలో వైసీపీ ముందే చేతులెత్తేసిందా?
పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైసీపీ ముందే చేతులెత్తేసిందా? గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత ప్రతిఘటనను ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఎదుర్కొంటుందా? అంటే పులివెందుల తాజా రాజకీయ వాతావరణం చూస్తుంటే అవుననే చెప్పాలి. పులివెందుల జెడ్పిటిసికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జెడ్పిటిసి పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏజెంట్లను బూత్లలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల …
Read More »‘లిక్కర్ కేసు’: ఆ డబ్బంతా ఎవరికి చేరింది?
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా మరో చార్జిషీట్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గతంలోనే సుదీర్ఘ చార్జిషీట్ను అధికారులు సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అనుబంధ చార్జిషీట్ను ఇచ్చారు. దీనిలో అసలు నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఈ నగదు చివరి లభ్ధిదారువరకు ఏయే మార్గాల్లో తరలింది? అనే …
Read More »ఓటర్లే మైనా.. మీకే ఓటేస్తామని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. “సమయం లేదు. ఇప్పుడు ఏం చేయలేం” అని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఉప పోరును టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తమ సత్తా చాటుకునేందుకు …
Read More »టార్గెట్ రోజా.. ఇక యాక్షనే!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు టెన్షన్ పట్టుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు నిర్వహించారు. దీనికి సంబంధించి 150 కోట్లకు పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. కేవలం రెండేళ్ల కాలంలో ఏడాది పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడం, ఈ నిధులు కూడా చాలవని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates