Political News

త‌ప్పు చేసిన వారిని వ‌ద‌లేది లేదు: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో ఓడిపోయింది. ఇక‌, కూట‌మిలోనూ ప్ర‌తిపార్టీ ఘ‌నంగానే సీట్లు ఓట్లు రాబ‌ట్టుకుంది. దీంతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన తర్వాత‌.. వైసీపీ హ‌యాంలో త‌ప్పుచేసిన వారిని వ‌దిలేది లేద‌ని తేల్చి చెప్పారు. అయితే.. ఇది క‌క్ష సాధింపు …

Read More »

టీడీపీ వేడుకల్లో కాంగ్రెస్ మంత్రి !

ఏపీ‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా అధికార వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఏపీలో చంద్రబాబు గెలవడంపై ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించాయి. ఈ …

Read More »

ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టను !

‘ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను. నేను ప్రజల సొమ్మును తింటున్నాను అనే బాధ్యతను ప్రతి క్షణం గుర్తుంచుకోవాలనే ఈ జీతం తీసుకుంటున్నాను. నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే ఈ జీతం తీసుకుంటున్నాను. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను. ఇంతకు వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ …

Read More »

ఏపీ ఎన్నికల సెంటిమెంట్.. ఒకటి బ్రేక్.. మరొకటి కంటిన్యూ !

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు. ఫలానా చోట ఫలానా పార్టీ గెలిస్తే.. అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ అని.. ఫలానా చోట ఏ పార్టీ అయితే ఓడితే.. ఆ పార్టీ ఖాయంగా గెలుస్తుందని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే.. ఇలాంటి నమ్మకాలకు ఆయుష్షు పెద్దగా ఉండదు. కానీ.. కొన్ని సెంటిమెంట్లు మాత్రం దశాబ్దాలకు దశాబ్దాలుగా సాగుతూ ఉంటుంది. అలాంటి …

Read More »

మోదీ ముహూర్తం ఖరారు .. టీడీపీకి ఎన్ని మంత్రి పదవులంటే ?!

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కనున్నాడు. 2014 తరువాత తొలిసారిగా బీజేపీ పార్టీ అధికారం అందుకోవడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. దాంతో ఎన్డీయే …

Read More »

ఇక‌.. ముద్ర‌గ‌డ ‘ప‌ద్మ‌నాభ రెడ్డి’!!

తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవరూ ఊహించ‌ని తీర్పు.. నాయ‌కుల‌కు.. పార్టీల‌కు కూడా అంతు చిక్క‌ని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు తుఫానులో అతిర‌థ మ‌హార‌థులు కొట్టుకుపోయారు. చివురు టాకులు అనుకున్న నాయ‌కులు నిలిచి గెలిచారు. అయితే… నాయ‌కుల ప‌రంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప టికీ.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్ర‌భావితం చేస్తార‌ని భావించిన నాయ‌కులు కూడా.. ఈ ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డ్డారు. త‌మ త‌మ పార్టీల త‌ర‌ఫున బ‌రిలో …

Read More »

మీడియా, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: చంద్రబాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా …

Read More »

మోదీ మానియా వట్టి మాయే !

‘అబ్ కీ బార్ .. చార్ సౌ పార్’ అంటూ 400 ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ ఊదరగొట్టింది. మోడీ మానియాతో లోక్ సభ ఎన్నికలను ఒంటిచేత్తో చుట్టేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అదంతా ఒట్టి మాయేనని తేలిపోయింది. కేరళలో సినీనటుడు సురేష్ గోపీ ఆ రాష్ట్రంలో బీజేపీకి తొలి విజయం అందిచారు. అక్కడ సురేష్ గోపి విజయం కేవలం ఆయన వ్యక్తిగతమే. గత మూడేళ్లుగా …

Read More »

జగన్ అసలు అక్కడికి వస్తాడా?

గత ఎన్నికల్లో మామూలుగా గెలిచి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో కానీ.. 151 సీట్లతో అసాధారణ విజయం సాధించడంతో ఆయనకు, వైసీపీ నేతలకు గర్వం తలకెక్కిందనే అభిప్రాయం జనాల్లో బలంగా కలిగింది. జగన్ ఒక నియంత పాలించినట్లుగా రాష్ట్రాన్ని పరిపాలించడం.. ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం.. అసెంబ్లీలో టీడీపీని, బయట జనసేనను చూసి వైసీపీ నేతలు విపరీతంగా …

Read More »

జగన్ మాట దేనికి సంకేతం?

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన విజయం చూసే.. ఇలాంటి గెలుపు నభూతో నభవిష్యతి అనుకున్నారందరూ. కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. అంతకు మించిన విజయంతో సంచలనం సృష్టించింది. జగన్ పార్టీ ఓటమి గురించి సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని.. మరీ 11 సీట్లకు పరిమితం అయిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓటమి అనంతరం నిన్న జగన్ పెట్టిన ప్రెస్ మీట్‌తోనే ఆయన …

Read More »

రాజకీయాల్లోను మెరిసిన తారలు ఎవరో తెలుసా ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినా 2024 వరకు విజయం దక్కలేదు. చివరకు ఈ ఎన్నికల్లో తొలిసారి తను పిఠాపురం శాసనసభ్యుడిగా 70 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడమే కాకుండా పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే దేశంలో అనేక మంది సినీతారలు ఎన్నికల్లో పోటీ చేసి విజేతలు పరాజితులుగా …

Read More »

చంద్రబాబుకు ఇది గొప్ప ఊరటే..

విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని …

Read More »