Political News

లగచర్ల ఘటనలో కేటీఆర్ రహస్య సంభాషణలు?

లగచర్ల ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్స్‌లో కనిపించిందని, అంతేకాకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కూడా మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాడులకు …

Read More »

నాడు సభ, నేడు మండలి. రెండూ వద్దంటున్న వైసీపీ

శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని కుంటి సాకులు చెబుతున్న అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే, అసెంబ్లీకి వెళ్లని వైసీపీ…శాసన మండలికి మాత్రం వెళ్లడంపై కూడా విమర్శలు వచ్చాయి. సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడకు వెళుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు.  కానీ, అది కూడా ఒక్క రోజు ముచ్చటే …

Read More »

ఫైర్ బ్రాండ్ల‌కు పెద్ద‌పీట‌.. ఏపీ రాజ‌కీయం మ‌రింత సెగే!

టీడీపీ ఫైర్ బ్రాండ్ల‌కు సీఎం చంద్ర‌బాబు మ‌రింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌డంతో పాటు.. తాజాగా ప్ర‌క‌టించిన ‘విప్’ల స్థానంలోనూ వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు విప్ ప‌ద‌వి ద‌క్కింది. ఈయ‌న పొలిటిక‌ల్‌గా ఫైర్ బ్రాండ్ అన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీపై ఒంటికాలిపై విరుచుకు ప‌డ‌డంలో బొండా ఉమా స్ట‌యిలే వేరు. గ‌తంలోనూ.. బొండా ఉమా దూకుడుగా …

Read More »

ర‌ఘురామ‌కు డిప్యూటీ స్పీక‌ర్ వెన‌క ఏం జ‌రిగింది..?

క‌నుమూరు రఘురామ కృష్ణంరాజు తెలుగు రాజ‌కీయాల్లో ఎలాంటి సంచ‌ల‌న‌మో… ఎంత పాపుల‌రో తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా గ‌త ఐదేళ్లు వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీని.. ఆ పార్టీ అధినేత‌.. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓ ఆటాడుకుని హైలెట్ అయ్యారు. ర‌ఘురామ మాట్లాడినా.. ప్రెస్‌మీట్ పెట్టినా కూడా మీడియాకు.. సోష‌ల్ మీడియాకు సంచ‌ల‌న‌మే. అలాంటి ర‌ఘురామ ఈ యేడాది ఎన్నిక‌ల‌కు ముందు అస‌లు ఏ పార్టీ నుంచి పోటీ …

Read More »

మ‌రో వారంలో మ‌హాయుద్ధం.. గెలుపెవ‌రిది?

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ వ‌చ్చే బుధ‌వారం(న‌వంబ‌రు 20) జ‌ర‌గ‌నుంది. అంటే.. ప్ర‌చారానికి ప‌ట్టుమ‌ని 5 రోజులు మాత్ర‌మే ఉంది. మొత్తం ఆరు రీజియ‌న్లు, 36 జిల్లాలు, 288 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌రుగుతుండ‌డం ఒక చిత్రం. నిజానికి ఇక్క‌డ కూడా మావోయి స్టు ప్ర‌భావిత‌.. విద్రోహ శ‌క్తుల ప్ర‌భావిత జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ ప‌రిణామాలు ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల సంఘం ఒకే …

Read More »

శాసనసభలో ప్రతిపక్షం లేదు : చంద్రబాబు

విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీకి టాటా వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజన్ 2047 సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పార్టీల …

Read More »

నన్నూ మా అమ్మని తిట్టించింది జగనే : షర్మిల

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో  విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు బర్నింగ్ టాపిక్ లపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ క్రమంలోనే జగన్ పై షర్మిల మరోసారి సంచలన …

Read More »

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా పీకేశారు..!

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా దించేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కార్పొరేష‌న్ వెలుప‌ల ప్ర‌హ‌రీ ని ఆనుకుని ఉన్న జెండా దిమ్మెపై వైసీపీ ఎన్నిక‌ల జెండాను ఎగుర‌వేశారు. అయితే.. సోమ‌వారం మాత్రం జెండాను తీసేశారు. దీంతో ఏం జ‌రిగింద‌న్న చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. జ‌న‌ర‌ల్‌కు కేటాయించి మేయ‌ర్ ప‌ద‌విని కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి కేటాయించి మ‌రీ …

Read More »

‘నా పై ఎవరూ దాడి చెయ్యలేదు’

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూముల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌ పై మ‌హిళ ఒక‌రు చేయి చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ దాడిలో క‌లెక్ట‌ర్ ప‌క్క‌నే ఉన్న నీటి మ‌డుగులో కూడా ప‌డిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక‌, …

Read More »

ఫొటోల పిచ్చి..జగన్, లోకేష్ ల మధ్య తేడా ఇదే

వైసీపీ పాలనలో రంగుల పిచ్చిపై కోర్టులు సైతం జగన్ సర్కార్ కు పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తీరు మారని గత ప్రభుత్వం…చిన్న పిల్లలు తినే ఫల్లీ చిక్కీలు మొదలు పాఠ్యపుస్తకాల వరకు అవకాశమున్న అన్ని చోట్ల వైసీపీ జెండా రంగులు..జగన్ ఫొటో ముద్రించింది. విద్యా వ్యవస్థను రాజకీయాల్లోకి గత ప్రభుత్వం లాగిందని ఉపాధ్యాయులు కూడా పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ …

Read More »

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్

ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. …

Read More »

అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌.. అభివృద్ధి ప‌రుగులే!

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బ‌డ్జెట్ కేటాయింపులు మ‌రికొంత‌.. బాండ్లు విక్ర‌యించ‌డం ద్వారా ఇంకొంత సొమ్మును స‌మీక‌రించుకునేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్నీ స‌మ‌కూ రేందుకు మార్గం రెడీ అయింది. అమ‌రావ‌తి పూర్తిస్థాయి నిర్మాణానికి ల‌క్ష కోట్ల వ‌ర‌కు కావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని రెండు ద‌శ‌లుగా విభ‌వించారు. తొలి …

Read More »