దేశంలో కరోనా సెకండ్ వేవ్తో ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలోని మేధావులు, ప్రపంచ స్థాయి విశ్లేషకులు కూడా.. భారత్లో ఈ రేంజ్లో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన మంత్రి మోడీ విధానాలే కారణమని చెబుతున్నారు. అదేసమయంలో దేశంలోనూ అంతే వ్యతిరేకత ఉందని లోకల్ మీడియా కూడా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం సరైన దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం.. లాక్డౌన్, కర్ఫ్యూ వంటి విషయాల్లో రాష్ట్రాలను దిశానిర్దేశం చేయలేక పోవడం.. ఆర్థికంగా రాష్ట్రాలకు భరోసా …
Read More »మంత్రైపోతున్నారా… ఆ లక్కీ ఎమ్మెల్యే ఎవరు ?
ఏపీ సీఎం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన తొలి కేబినెట్ను ఏర్పాటు చేసిన రోజు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసిన కేబినెట్లో 90 శాతం మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని… 10 శాతం మంత్రులు మాత్రమే కంటిన్యూ అవుతారని చెప్పారు. తొలి టర్మ్లో జగన్ చాలా మంది జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్ …
Read More »బ్రేకింగ్: టీకాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వండి- సుప్రీం కోర్టు
“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా …
Read More »ఆ ఎమ్మెల్యే ‘సొంత’ ప్రచారంపై జగన్ ఆరా ?
రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం.. సీఎం జగన్కు చికాకు కలిగిస్తోందని అంటున్నారు పార్టీ సీనియర్లు. కొందరు ఎమ్మెల్యేలు జగన్ అభిమతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే.. వీరిలో అందరూ కూడా జగన్కు కావాల్సిన వారు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో జగన్ అడుగులు ముందుకు వేసి .. ఎలాంటి చర్యలూ తీసుకోలేక పోతున్నారని, ఈ క్రమంలోనే వారిని చిరునవ్వుతో హెచ్చరిస్తున్నారని …
Read More »టీడీపీకి పనికల్పిస్తున్న ఏపీ సీఎం..!
సాధారణంగా.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా.. ప్రతిపక్షాలను సాధ్యమైనంత వరకు సైలెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎక్కడ విమర్శలు చేస్తారో.. ఎక్కడ తాము ఇప్పటి వరకు పడిన కష్టం పాడైపోతుందో అని పార్టీలు అల్లాడిపోతుంటాయి. దీంతో దాదాపు ప్రతిపక్షాలకు పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో ప్రతిపక్షాలే.. కొత్త సమస్యలు వెతికి మరీ తెరమీదికి తెచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. తెలంగాణను తీసుకుంటే..అక్కడ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలకు ఎలాంటి పని దొరకదు. కానీ.. …
Read More »కడప ఆసుపత్రులే ప్రభుత్వాన్ని లెక్క చేయటంలేదా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు. అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను …
Read More »టీకాలపై చేతులెత్తేసిన ప్రభుత్వాలు
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు చేతులెత్తేశాయి. కోట్లాది డోసులు ఉత్పత్తి చేయలేక కంపెనీలు కూడా అవస్తలు పడుతున్నాయి. మొదట్లో 60 ఏళ్ళ వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం నిర్ణయించినపుడు డిమాండ్ ఒకమాదిరిగా ఉండేది. అప్పట్లో డిమాండ్ కు మించి సప్లై ఉన్న కారణంగా రిజిస్టర్ చేసుకున్న వారందిరికీ టీకాలు వేసే అవకాశం ఉండేది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు టీకాల కార్యక్రమం చాలా స్లోగా …
Read More »ఇది.. మోడీ పెట్టిన మంటే: కన్నీరు పెట్టిస్తున్న ‘TIME’ కథనం!
“అది భారత దేశ రాజధాని ఢిల్లీలోని సబర్బ్ ప్రాంతం. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. సంధ్యా సమయం ఆవరిస్తోంది. వాతావరణంలో మెల్లగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ, సబర్బ్ హిందూ శ్మశాన వాటిక నుంచి నిరంతరాయంగా గాలిలోకి ధూళి లేస్తూనే ఉంది. భగభగమని మండుతున్న చితుల మంటలు.. ఉప్పొంగి భోగి మంటలుగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. వీటి నుంచి వస్తున్న బూడిద, దుర్వాసన.. పర్యావరణంలో కలిసిపోయి.. ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యపు …
Read More »మమత హ్యాట్రిక్ ఖాయమేనా ?
తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవుననే అనుకోవాలి. పశ్చిమబెంగాల్లో చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సర్వే, మీడియా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరుసంస్ధల్లో మూడింటి ప్రకారమైతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ఇదే సమయంలో మిగిలిన మూడు సంస్ధల అంచనాల ప్రకారం మమతబెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి …
Read More »టెన్షన్లో వైసీపీ.. సైలెంట్గా టీడీపీ.. ఇదో చిత్రమైన పాలిటిక్స్ ?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర టెన్షన్ నెలకొంది. మంత్రులు, నాయకులు కూడా తీవ్ర టెన్షన్కు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. మరో నాలుగు రోజుల్లో .. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది. వచ్చే నెల 2న తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీంతో వైసీపీలో టెన్షన్ కనిపిస్తోంది. కానీ, అదే సమయంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ …
Read More »అందరి చూపులు జగన్ పైనే
పార్టీలో ఇపుడందరి చూపులు జగన్ పేనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే నిర్వహించాలని అనుకున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ విషయం ఇపుడు సందిగ్దంలో పడింది. అధికారంలోకి రాగానే పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమైతే 2020, జూలై 8వ తేదీన నాలుగో ప్లీనరీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. సరే అప్పుడంటే …
Read More »టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కాగిత మృతి
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా దెబ్బతో.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు.. ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. విశాఖ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై పార్టీలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆయాన ఘటనలపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మరో కీలక నేత, పార్టీలో చాలా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates