Political News

రఘురామ పై వైసీపీ సీరియస్ యాక్షన్..!

నర్సాపురం ఎంపీ రఘురామ రాజుని ఏదో ఒకటి చేసేదాక.. వైసీపీ నేతలకు నిద్రపట్టేలా కనపడట్లేదు. ఇప్పటికే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసుతో అయినా.. ఆయన సైలెంట్ అవుతారని అందరూ భావించారు. అయితే.. ఆయన ఏమాత్రం తగ్గకుండా.. తిరిగి రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో.. ఈసారి వైసీపీ అధిష్టానం సీరియస్ యాక్షన్‌కు దిగింది. దీనిలో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. …

Read More »

ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. సీనియర్ నేత, సోనియా, రాహూల్ కోటరీలో ముఖ్యుడైన వీరప్ప మొయిలీ మాట్లాడుతు కాంగ్రెస్ పునరుజ్జీవనానికి పెద్ద ఆపరేషన్ అవసరమన్నారు. పనిలో పనిగా నాయకత్వం విషయంలో కేవలం వారసత్వంపైనే పార్టీ ఆధారపడేందుకు లేదని చెప్పటం ద్వారా తేనెతుట్టెను కదిపారనే అనుకోవాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్ధితికి సీనియర్లే కారణమని చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ పదవులు, అపరిమతమైన …

Read More »

సీఎం పదవి పోవడం ఖాయమేనా?

కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు పదవీగండం పొంచుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. చాలాకాలంగా యడ్డీని సీఎంగా దింపేందుకు ప్రత్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎంఎల్ఏల సంతకాల సేకరణ కూడా ఊపందుకుంది. యడ్డీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎంఎల్ఏల సంతకాలతో ఇటీవలే కొందరు నేతలు ఢిల్లీ వెళ్ళి అగ్రనేతలను కలిసినట్లు సమాచారం. యడ్డీ ఎప్పుడు సీఎంగా ఉన్నా ఇదే సమస్య మొదలవుతోంది. …

Read More »

బీజేపీలో చేరేందుకు చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లనున్న ఈటల

కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రాజేందర్ మీద సారుగుస్సా అయిపోవటం.. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవిపై వేటు వేయటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు డిసైడ్ కావటం పాత విషయమే. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయిన ఈటల రాజేందర్ పార్టీకి వచ్చేందుకు తన సంసిద్ధతను తెలియజేయటంతో పాటు.. తనకున్న …

Read More »

మోడి, షా కు ‘ మమత ‘ టెన్షన్

ఫిరాయింపులంటే పిరాయింపులే అనటంలో రెండో సందేహం లేదు. ఎందుకంటే తమ అవసరాలు తీరుతాయని అనుకుంటే పార్టీలో ఉంటారు లేకపోతే లేదంతే. ఇపుడీ విషయం పశ్చిమబెంగాల్ విషయంలో మరోసారి రుజువవుతోంది. మొన్నటి ఎన్నికలకు ముందునుండి బీజేపీ ఫిరాయింపులకు తెరెత్తింది. మమతాబెనర్జీని దెబ్బ కొట్టడమే టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ నుండి కొందరు నేతలను ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసి బీజేపీలోకి లాక్కున్నది. తృణమూల్ కు చెందిన 29 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలతో …

Read More »

ఎన్టీఆర్‌పై బాలయ్య ఉద్దేశమేంటి?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పోయినేడాది కూడా బాలయ్య పుట్టిన రోజు నాడు మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా తారక్ రాజకీయ అరంగేట్రంపై ప్రశ్న ఎదురైంది. అప్పుడాయన ఎవరిష్టం వాళ్లదన్నట్లుగా ఒక కామెంట్ చేసి వదిలేశాడు. అప్పుడు దాని గురించి పెద్ద చర్చ జరగలేదు. కానీ ఈసారి పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్ గురించి …

Read More »

జూ.ఎన్టీఆర్ పార్టీలో రావటంపై బాలయ్య వ్యాఖ్యలు ప్లస్సా.. మైనస్సా?

సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు అడ్డాలోనూ జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరటం కలకలం రేపింది. రాజకీయ చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ …

Read More »

చంద్ర‌బాబుకు బాధే అయినా.. ఇది ప‌చ్చినిజం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాధ క‌లిగించే అంశం ఇది. అయినా.. ఎక్క‌డా ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. పార్టీ నేత‌లు గుర్రు పెట్టి మ‌రీ నిద్ర పోతున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అన్న నంద‌మూరి తార‌క రామారావు పుట్టిన నియోజ‌క‌వ‌ర్గంలో, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదం పురుడు పోసుకున్న చోట‌.. ఇప్పుడు ఆ పార్టీ జాడ‌లు క‌నిపించ‌డం లేదు. ఇది ప‌చ్చి నిజం. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నేత‌లు ఎవ‌రూ నోరు …

Read More »

కామెడీ అయిపోయిన వైసీపీ మంత్రి

చేసినవి చెప్పుకుంటేనే అతిశయోక్తిగా చూసే రోజులివి. సామాజిక మాధ్యమాల్లో శూల శోధన చేసి ఆ గొప్పల్లో ఉన్న తప్పులేంటో బయటికి తీసి పెట్టేస్తారు నెటిజన్లు. అలాంటిది చేయనివి చెప్పుకుంటే వాళ్లు ఊరుకుంటారా? ఇలా చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని, ఉన్న కంపెనీలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం …

Read More »

తెలంగాణ‌లో స్కూళ్లు .. స‌ర్కారు షాకింగ్ డెసిష‌న్‌!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో మూత‌బ‌డిన స్కూళ్ల‌ను తిరిగి తెరిచేందుకు తెలంగాణ స‌ర్కారు అడుగులు వేస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గిన నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని బావిస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై ప్ర‌భుత్వం తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని.. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాల‌ని కూడా భావిస్తోంద‌ని అన్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం మేర‌కు .. వ‌చ్చే నెల 5వ తేదీ త‌ర్వాత స్కూళ్ల‌ను …

Read More »

సచిన్ విషయంలో పెరిగిపోతున్న టెన్షన్

రాజస్ధాన్ రాజకీయాల్లో యంగ్ టర్క్ గా పెరున్న సచిన్ పైలెట్ విషయంలో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏదో రోజు సచిన్ కాంగ్రెస్ కు జైకొట్టి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం పెరిగిపోతోంది. దానికితోడు కాంగ్రెస్ అధిష్టానంపై సచిన్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయటంతో సచిన్ విషయంలో సస్పెన్స్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో రాజస్ధాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సచిన్ పైలెట్ దే …

Read More »

సీఎం జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. డిమాండ్ ఏంటంటే

సీఐడీ పోలీసుల అరెస్టు.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే వాద‌న‌.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ లేఖ‌లో ఎక్క‌డా త‌న‌పై సీఐడీ అధికారుల దౌర్జ‌న్యం కానీ, ప్ర‌భుత్వం ప‌రంగా త‌న‌పై చూపిస్తున్న వివ‌క్ష‌ను కానీ.. ఎంపీ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. …

Read More »