Political News

సైనా ట్వీట్ వివాదం.. ట్రోల్ చేస్తున్న విపక్షాలు..!

భారత షట్లర్ సైనా నెహ్వాల్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్వీట్ చేసి..సైనా నెహ్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు.. సైనా ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం …

Read More »

జగనన్న వర్సెస్ లోకేష్ అన్న…వర్కౌట్ అవుతుందా..?

గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్, అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. ఇక ఆ పాదయాత్ర ద్వారానే జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. అప్పుడు ఏ సమస్య ఉన్న జగన్ అన్న ఉన్నారనే విధంగా రాజకీయం నడిచింది. జగన్ అన్న అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తొలగిపోతాయి అనేలాగా వైసీపీ కార్యకర్తలుగానీ, నేతలుగానీ ప్రచారం చేశారు. …

Read More »

ఇమేజ్ డ్యామేజీ కాకుండా.. మోడీ ఎత్తులు.. ఇవేనా?

వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపేయాలి! ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మోడీని వ్య‌తిరేకించే ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేత‌ర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల వ్యూహం!! ఈ క్ర‌మంలోనే గ‌తంలో మోడీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి.. త‌ర్వాత విభేదించిన ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌లు.. త‌మ గూటికి చేర్చుకుని మంత్రాంగం నెరుపుతున్నాయి. ఇదీ గుస‌గుస‌! ఈ క్ర‌మంలోనే బ‌ల‌మైన థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా.. …

Read More »

ష‌ర్మిల‌కు త‌క్ష‌ణం కావాల్సింది ఇదేనా?

Sharmila

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ… కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైఎస్ త‌న‌య ష‌ర్మిలకు త‌క్ష‌ణం ఏం కావాలి? కీల‌క నేత‌ల నుంచి మ‌ద్ద‌తు చాలా? లేక ఇంకేమైనా కావాలా? అంటే.. దీనికి మించి.. ఆమెకు ఇప్పుడు ప్ర‌చారం కావాల‌ని.. మీడియా మ‌ద్ద‌తు అత్యంత ముఖ్య‌మని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో పార్టీలు స్థాపించుకునే స్వేచ్ఛ ఎవ‌రికైనా ఉంటుంది. సో.. ష‌ర్మిల కూడా పార్టీ పెట్టుకునేందుకు అన్ని అర్హ‌త‌లు …

Read More »

మమతకు కష్టాలు తప్పవా ?

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి తొందరలో పదవీ గండం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరద్ సింగ్ రావత్ రాజీనామా నేపధ్యంలో ఇపుడందరి దృష్టి మమతా బెనర్జీపై పడింది. ఎంపిగా ఉన్న రావత్ ఆరుమాసాల్లో ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశం లేకపోవటంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏగా కానీ లేదా ఎంఎల్సీగా కానీ నేత ముఖ్యమంత్రి అయితే ఆరుమాసాల్లో ఏదో …

Read More »

ఎదురుదాడికి ఇండియా రెడీ అయిపోయిందా ?

ఇజ్రాయెల్ సంస్ధ చేసిన తాజా ప్రకటనతో అందరికీ ఇదే అనిపిస్తోంది. ఇజ్రాయెల్ నుండి మనదేశం డ్రోన్ గార్డ్ వ్యవస్ధను కొనుగోలు చేసినట్లే సమాచారం. నమ్మకమైన భాగస్వామికి తాము డ్రోన్ గార్డ్ వ్యవస్ధ టెక్నాలజీని అమ్మినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఏఐ) చేసిన ప్రకటనతో అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య రక్షణ వ్యవస్ధల టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏఐ …

Read More »

బాల‌య్య చిన్న‌ల్లుడి సీటు మారుతోందా ?

ఇప్పుడు ఏపీలో విశాఖ వేదిక‌గానే ఇప్పుడు రాజ‌కీయం అంతా న‌డుస్తోంది. విశాఖ‌లో టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ రాజ‌కీయం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఒక వైపు… ఇటు ఎగ్జిగ్యూటివ్ కేపిట‌ల్‌గా విశాఖ వ‌స్తుంద‌న్న వార్త‌లు మ‌రోవైపు… ఇక విజ‌య‌సాయి దూకుడు ఇలా అనేక అంశాలు ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల్లో మరో ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది …

Read More »

మోడి సర్కార్ పై అవినీతికి పాల్పడిందా ?

తమది మచ్చలేని ప్రభుత్వమని, అవినీతి మకిలి అంటని ప్రభుత్వమని గడచిన ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడి సర్కార్ పైన కూడా అవిని ముద్రపడిందా ? అవుననే అర్దమవుతోంది తాజాగా వెల్లడైన అంశాలతో. ఇంతకీ విషయం ఏమిటంటే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైంది. ఫ్రాన్స్ లో ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ …

Read More »

కేసీయార్ వితండ వాదన

కృష్ణా జలాల వినియోగంపై కేసీయార్ వితండ వాదన మొదలుపెట్టారు. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగం విషయంలో విభజన చట్టం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రధానంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం, ఏపి 66 శాతం వాడుకునేట్లు ఒప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు విభజన చట్టాన్ని అంగీకరించేది లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. కృష్ణాజలాల వినియోగాన్ని 50:50 శాతం అంటే 405.5 నిష్పత్తి …

Read More »

గాంధీ భవన్ లో రేవంత్ వాస్తు మార్పులు..?

ఈ రోజుల్లో ఎందులో విజయం సాధించాలన్నా.. కష్టంతో పాటు.. లక్ కూడా ఉండాలి. అదృష్టం కలిసొచ్చి.. విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఫేట్ మార్చి.. అంతా మంచి జరిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే… రేవంత్ రెడ్డి.. ఈ నెల 7వ …

Read More »

కత్తి మహేష్‌కు సాయం కరెక్టేనా?

ప్రముఖ క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్‌ గత వారం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తలతో పాటు కళ్లు, ముక్కుకు తీవ్ర గాయాలవడంతో ఆయా ప్రదేశాల్లో శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు భారీగానే ఖర్చవుతున్నట్లు వార్తలొచ్చాయి. మహేష్‌ వైద్య ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

రేవంత్ ముందు జాగ్రత్త

కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగానే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే నూరుశాతం ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడిని తిడతారు, జాతీయ అధ్యక్షురాలిపై నోటికొచ్చింది మాట్లాడేస్తారు. మళ్ళీ ఎన్నికల్లో టికెట్ తెచ్చేసుకుంటారు. కోపం వచ్చినపుడు తిట్టేయటం, ఆరోపణలు చేసేయటం మళ్ళీ టికెట్ తెచ్చేసుకోవటం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సహజం. అందుకనే పార్టీ నుండి నేతలెవరినీ అధిష్టానం బయటకు పంపేయటం చాలా చాలా తక్కువనే చెప్పాలి. …

Read More »