Political News

జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు, పార్టీ నేత‌ల‌కు ఆయ‌న 48 గంట‌ల గ‌డువు విధించారు. ఈ లోగా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌డు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత షాకిస్తోంది. కొన్నాళ్లుగా జ‌రుగుతున్న …

Read More »

ఆర్ఆర్ఆర్ విషయంలో ఏమి జరుగుతోంది ?

అవును వైసీపీ అధికారిక వెబ్ సైట్లో ఎంపిల జాబితాలో నుండి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు పేరు మాయమైపోయిందట. లోక్ సభ+రాజ్యసభలో వైసీపీకి 28 మంది ఎంపిల బలముంది. మొన్నటి తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును కూడా పార్టీ అప్ డేట్ చేసింది. అయితే ఇదే సమయంలో నరసాపురం ఎంపి రఘురామ పేరు మాయమైపోయింది. ఇందుకు ప్రత్యేకించి కారణం ఇది అని తెలీటంలేదు. ఒకసారి చరిత్రను గమనిస్తే …

Read More »

హుజురాబాద్ లో కేటీఆర్ కు షాక్ అనుకోవ‌చ్చా?

మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసేయ‌డం, అది ఆమోదం పొంద‌డం గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిన నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి చూపు హుజురాబాద్ ఉప ఎన్నిక‌పై ప‌డింది. బీజేపీలో చేర‌నున్న ఈట‌ల ఆ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దిగ‌నున్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, మిగ‌తా పార్టీల సంగ‌తి ఏంటి? అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు? ప‌్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పోటీ పెట్టేది ఎవ‌రిని వంటి …

Read More »

సంచ‌ల‌నంః దేశంలో మ‌రో మూడు కొత్త రాష్ట్రాలు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు భిన్న‌మైన నిర్ణ‌యం జ‌ర‌గ‌బోతోందా? అంటే అవున‌నే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు, క్యాబినెట్ విస్తరణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని చెప్తున్నప్పటికీ అస‌లు కథ యూపీని విభ‌జించ‌డ‌మ‌ని …

Read More »

ఈటల ఇలా చేయడం ఇది మూడోసారి..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. కాగా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఈటలకు ఇది మూడోసారి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీకాలాం ఉండగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడో సారి కావడం …

Read More »

నిముషానికి 1000 మంది సెర్చ్‌.. జ‌గ‌న్ గురించే..

ఆన్‌లైన్‌లో అనేక విష‌యాల‌పై సెర్చ్ చేస్తుంటారు. కానీ, కొన్ని మాత్ర‌మే రికార్డు సృష్టిస్తాయి. ఇలాంటి వాటిలో మ‌రోసారి.. ట్రెండింగ్‌లో ఉన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. దాదాపు మూడేళ్ల కింద‌ట‌.. ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో ఒక‌సారి.. జ‌గ‌న్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన వారు.. నిముషానికి 1000 మంది అని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎంచుకున్న సుదీర్ఘ పాద‌యాత్ర‌, ఆయ‌న‌పై ఉన్న కేసులు. …

Read More »

నాతో అంత ఈజీ కాదు.. జగన్ కి ఆర్ఆర్ఆర్ మరో లేఖ

వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు పై అనర్హత వేటు వేయాల్సిందిగా వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం …

Read More »

కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌… పార్టీకి ప్ర‌ణ‌బ్ కుమారుడి గుడ్ బై?

దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎదురుగాలిని ఎదుర్కోవ‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీగా పుంజుకోవాల్సింది పోయి బ‌ల‌హీన‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ ఎదురుకానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బెంగాల్ లో అధికార పార్టీ అయిన టీఎంసీలో చేర‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీలో చేరిక‌ల విష‌యంలో సీరియ‌స్ గా ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ని …

Read More »

శరద్ పవార్ టార్గెట్ ఏమిటో తెలుసా ?

మహారాష్ట్రలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశ అత్యున్నత పదవిపై కన్నేశారా ? అవునే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. 2022లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై పవార్ కన్నేసినట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పవార్ భేటీ అయ్యారట. రాష్ట్రపతి ఎన్నికకు వ్యూహకర్త ప్రశాంత్ కు ఏమిటి సంబంధం ? అనే డౌట్ రావచ్చు. తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ …

Read More »

మ‌న‌సులో మాట‌ మొహ‌మాటం లేకుండా చెప్పేసిన జ‌గ‌న్‌.. !

కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ అగ్ర‌నాయ‌కుల ద‌గ్గ‌ర ఏపీ సీఎం జ‌గ‌న్ మొహ‌మాటం లేకుండా మాట్లాడేశారా ? ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారా ? ఇక‌, ఆలోచిస్తూ.. కూర్చుంటే.. రోజులు నెల‌లు సంవ‌త్స‌రాలు కూడా జ‌రిగిపోతాయ‌ని.. ఈ క్ర‌మంలో ఏదైతే అదే జ‌రుగుతుంద‌ని ఆయ‌న కేంద్రం వ‌ద్ద ఉన్న విష‌యాల‌ను క‌క్కేశారా ? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా. నిజానికి జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. …

Read More »

మండలి ఛైర్మన్ ఈయనేనా ?

శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి నాలుగుపేర్లు గవర్నర్ పరిశీలనకు పంపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటినుండి పదవుల భర్తీలో సామాజికవర్గాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్న జగన్ ఈ జాబితా విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించినట్లు …

Read More »

బీజేపీలోకి హరీష్ రావు కీలక అనుచరుడు..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మ‌న్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు …

Read More »