Political News

క‌మెడియ‌న్ స్టార్‌కి ఈసారి వైసీపీ సీటు గ్యారెంటీనా..!

సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. అనేక మంది స్టార్లు.. వివిధ పార్టీల త‌ర‌ఫున గ‌ళం వినిపించిన విష‌యం తెలిసిందే. ఇలాంటి వారిలో స్టార్ క‌మెడియ‌న్‌.. ఆలీ ఒక‌రు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఈయ‌న టికెట్ ఆశించార‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు.. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. త‌న‌కు అభిమానమ‌ని ప‌దే ప‌దే చెప్పిన ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌ని అనుకున్న …

Read More »

వైసీపీలో సాయిరెడ్డి జోరుకు బ్రేక్‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాత‌.. జ‌గ‌న్‌గా పిలుచుకునే నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి దూకుడు త‌గ్గింది. గ‌తంలో ఆయ‌న ఉత్త‌రాంద్ర జిల్లాల్లోని విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని రెచ్చిపోయారనే టాక్ ఇంటా బ‌య‌టా కూడా వినిపించింది. అంతేకాదు.. విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న దూకుడు మ‌రింత పెంచారు. పాదయాత్ర చేశారు. అంతేకాదు.. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం.. ఆయ‌న ఇక్క‌డి కార్మికుల‌తో క‌లిసి ఉద్య‌మానికి కూడా కూర్చున్నారు. …

Read More »

జగన్ గుర్తించకపోతే అంతే సంగతులు

ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు. రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ …

Read More »

ఏపీ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది ఏపీ సర్కారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్ తో గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు..హెచ్ఆర్ఏ మీద ఆశ పెట్టుకున్నారు. ఆ విషయంలోనూ వారికి నిరాశ తప్పలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ షాక్ నుంచి కోలుకోని ప్రభుత్వ ఉద్యోగులకు.. తాజాగా హెచ్ఆర్ఏ షాక్ తో దిమ్మ తిరిగేలా చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ …

Read More »

చంద్రబాబుకు కరోనా పాజిటివ్ పై సీఎం జగన్ ట్వీట్

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారు.. మిగిలిన పనుల విషయంలో ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం మహా చురుగ్గా ఉండటం కనిపిస్తుంది. తానుస్పందించాల్సిన కీలక విషయాల్ని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి ఒక్క క్లిక్ తో చేర్చేసే సోషల్ మీడియాను కీలక మాధ్యమంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా ఒకలా వ్యవహరిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి. …

Read More »

కోర్టులో కేసు వేసిన ఎంపీ రఘురామ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో కేసు వేశారు. తనపై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్నారు. తనపై దురుద్దేశ్యంతో సీఐడీ ఏడీజీ పెట్టిన కేసు కాబట్టి దానికి విచారణ అర్హత లేదని రాజు తన పిటీషన్లో చెప్పారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాలని, తనను విచారణ పేరుతో ఇకముందు నోటీసులు కూడా ఇవ్వకుండా సీఐడీని నిలుపుదల చేయాలని కూడా ఎంపీ తన పిటిషన్లో అభ్యర్ధించారు. …

Read More »

చంద్రబాబుకు కరోనా

కరోనా వైరస్ తీవ్రత ఈసారి చాలామంది ప్రముఖులను ఇబ్బంది పెడుతోంది. తాజాగా చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా చెప్పారు. తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు.  రెండు రోజుల క్రితం నారా లోకేష్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మంత్రి కొడాలినానికి, సీనియర్ నేత వంగవీటి రాధాకు …

Read More »

సాయిరెడ్డిపై ఆర్ఆర్ఆర్ ఫైర్‌.. వివేకా కేసులో సూటి ప్ర‌శ్న‌

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హత్య తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారని విజయసాయి ప్రకటించారని, తర్వాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారని అన్నారు. అసలు వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల …

Read More »

తెలంగాణ బడుల కోసం సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగు భాష‌పై త‌న‌కు ఎంతో మ‌క్కువ‌ని.. తాను పోత‌న భాగవతం, భార‌తం, రామాయ‌ణం వంటివాటిని ఔపోస‌న ప‌ట్టాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ విష‌యాన్ని.. కేసీఆర్ మంత్రుల‌కు వివ‌రించ‌డం.. గ‌మ‌నార్హం. మ‌రో 5 మాసాల్లో …

Read More »

ఎంపీ అభ్య‌ర్థి కోసం వైసీపీ వేట‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి కొత్త‌గా ఎంపీ అభ్య‌ర్థి ఒక‌రు అవ‌స‌రం అయ్యేలా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఉన్న ఎంపీల‌ను తీసుకుంటే.. పార్ల‌మెంటు స‌భ్యులుగా 22 మంది ఉన్నా రు. వీరిలో మెజారిటీ అంతా కూడా .. యువ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఒక‌రిద్ద‌రు మాత్రం వ‌యోభా రంతో ఇబ్బంది ప‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది వారిలోనూ ముఖ్యంగా చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. …

Read More »

అన్ని పార్టీలది అదే జపం?

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ ఓబీసీ జపాన్ని పెంచేస్తున్నాయి. యూపీలో ఓబీసీలు 37 శాతమున్నారు. వీరిలో యాదవుల బలం 12 శాతం. యాదవుల్లో అత్యధికులు ఎస్పీ మద్దతుదారులే అన్నది అందరికీ తెలిసిందే. మిగిలిన 25 శాతం యాదవేతర బీసీల ఓట్లు ఎవరికి పడతాయన్నదే కీలకమైపోయింది. 25 శాతం ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకనే అన్ని పార్టీలు ప్రధానంగా బీజేపీ, ఎస్పీ ఓబీసీల …

Read More »

YSRCP: ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందో ?

తొందరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో వైసీపీ తరపున ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపు జూన్ మాసంతో ఏపీలోని నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు. విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగిసిపోతుంది. వీరిలో విజయసాయి వైసీపీ తరపున ఇఫ్పటికే రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్, సురేష్ ముగ్గురు టీడీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరి …

Read More »