Political News

టెస్టుల్లో ఏపీ రికార్డు – అది మాయంటున్న చంద్రబాబు

దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ …

Read More »

హైద‌రాబాద్‌పై ఓ క‌న్నేయండి కేసీఆర్ సార్‌

తెలుగువార‌నే కాకుండా దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు అత్య‌ధికంగా జీవిస్తున్న హైద‌రాబాద్ నగ‌రంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌నోళ్ల చూపు ప‌డుతోంది. అయితే, ఇది పెట్టుబ‌డుల కోణంలోనో లేక హైద‌రాబాద్ అంటేనే గుర్తుకువ‌చ్చే ఇంకేదైనా వివాదాస్ప‌ద‌ అంశంతో కాదు. క‌రోనాతో. ఈ మ‌హ‌మ్మారి విస్తృతి, ఇక్క‌డి కేసుల తీరుతో. న‌గ‌రంలోని ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోవ‌డం, ఊరు వ‌దిలిపోతున్న తీరుతో. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకి విస్త‌రించుకుంటు పోతున్న‌ది. …

Read More »

ఇటు #whereiskcr.. అటు #10millioncovidtestsinap

రెండు నెలల కిందట తెలుగు రాష్ట్రాల జనాలు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెగ పొగుడుతుండేవాళ్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తుండేది. కరోనా నియంత్రణలో కేసీఆర్ చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించేది. ఈ విషయంలో ఏపీ సీఎం ఫెయిలైనట్లే అని అంతా తీర్మానించేశారు. కానీ అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్నారు. జగన్‌పై …

Read More »

చంద్రబాబు నిజంగా ఆ మాట అన్నారా?

Chandrababu

మన గొప్పదనాన్ని మనం చెప్పడం కన్నా ఇతరులు చెబితే బాగుంటుంది. మనం నిజంగా ఎంత గొప్ప పని చేసినా.. నేను ఇంత చేశా అంతా చేశా అని చెప్పుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. అదే విషయం వేరే వాళ్ల నోటి నుంచి వస్తే దాని విలువ రెట్టింపవుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య బాగా అన్‌పాపులర్ అయ్యారు. అంతా …

Read More »

కువైట్: 8 లక్షల మంది ఎన్నారైలకు నరకం

కువైట్ భారతీయులకు, భారత ప్రభుత్వానికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. సగం ఇండియన్లను దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కువైట్ జాతీయ అసెంబ్లీ శాసనసభ కమిటీ ఆమోదించింది. దీని ఫలితంగా 8 లక్షల మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళకతప్పదు. ఈ బిల్లు ప్రకారం, భారతీయులు కువైట్ జనాభాలో 15 శాతానికి మించరాదు. ప్రస్తుతం అక్కడ 30 శాతానికి పైగా ఇండియన్లు ఉన్నారు. ఈ బిల్లు కారణంగా ఆ …

Read More »

వైసీపీ ఎంపీలు కేంద్రం పెద్దలను కలిసింది రెండేసార్లు.. ఎందుకంటే

YSRCP MPs

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు. అది కూడా …

Read More »

పవన్ లక్ష్యం జేపీనా? కేజ్రీవాలా?

భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందన్న మాట పెద్ద వారి నోట తరచూ వస్తుంటుంది. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోరు. వారి మాటల్లోని మర్మాన్ని గుర్తించేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. నిజాయితీగా ఉండటం మంచిదే. ఉత్త నిజాయితీకి ప్రజలు నీరాజనాలేమీ అర్పించరు. ఆ మాటకు వస్తే అధికారాన్ని కూడా ఇవ్వరు. ఇవ్వలేదని బాధ పడరు కూడా. చూస్తుంటే..జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నిజాయితీని తరచూ ప్రదర్శించుకునే అలవాటును ఎంత త్వరగా …

Read More »

క‌రోనాపై పోరు.. ఢిల్లీ సీఎం అద్భుతాలు చేస్తున్నాడు

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో మొద‌ట బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న వాళ్ల‌లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక‌రు. దేశంలో మొద‌ట వైర‌స్ వ్యాప్తి చాలా ఎక్కువ‌గా జ‌రిగిన రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ ఒక‌టి. అక్క‌డ కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోతుంటే.. కేజ్రీవాల్‌ను చేత‌కాని సీఎంగా విమ‌ర్శించారు చాలామంది.కానీ ఆయ‌న స‌మ‌ర్థ‌త ఏంటో ఇప్పుడు అంద‌రికీ తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసుల‌తో అల్లాడుతున్నాయి. …

Read More »

అమ‌రావ‌తి ఉద్య‌మంపై ర‌ఘురామ‌కృష్ణం రాజు కామెంట్

ర‌ఘురామ కృష్ణంరాజు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా నిలుస్తున్న వ్య‌క్తి. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధిక్క‌రిస్తూ ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. పార్టీ నాయ‌క‌త్వాన్ని, నేత‌ల్ని ఏమాత్రం లెక్క చేయ‌కుండా చెడామ‌డా తిట్టేస్తున్నారాయ‌న‌. వివిధ అంశాల‌పై ఆయ‌న అభిప్రాయాలు చాలా సూటిగా ఉంటూ.. పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాయి. కొన్ని నెల‌ల కింద‌ట్నుంచే ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ర‌ఘురామ‌కృష్ణం …

Read More »

టిక్ టాక్ డేటా ఎక్కడుందో తెలిసిపోయింది

మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి …

Read More »

తెలంగాణలో కేసులు మరింత పెరుగుతాయి

తెలంగాణలో శుక్రవారం నాడు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే 1,892 కేసులు నమోదు కాగా…వాటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు ఉండడం కలవరపెడుతోంది. మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటింది. మరోవైపు, శుక్రవారం నాడు జరిపిన …

Read More »

బీజేపీ – జగన్ బంధాన్ని తేల్చనున్న ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇపుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీలు కోరారు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడి స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. అయితే, …

Read More »