Political News

యూట్యూబ్ లో పద్యం పాడిన జొన్నవిత్తుల మీద కేసు నమోదు

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై తాజాగా కేసు నమోదైంది. సాత్వికుడిగా పేరున్న ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ కావటం సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటన్న విషయంలోకి వెళితే.. యూట్యూబ్ లో పద్యం పాడటమే నేరమైందన్న మాట వినిపిస్తోంది. ఏంటి? యూట్యూబ్ లో పద్యం పాడి.. అప్ లోడ్ చేసినందుకే కేసు పెడతారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇక్కడ జరిగింది …

Read More »

హైకోర్టు ఈసారి జ‌గ‌న్ స‌ర్కారుకు ఝ‌ల‌క్ ఇవ్వ‌లేదు

YS-Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు షాక్.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు మ‌రో ఝ‌ల‌క్.. ఇలా గ‌త ఏడాది కాలంలో ఎన్ని వార్త‌లు చూశామో. ఏడాది వ్య‌వ‌ధిలో 60 సార్ల‌కు పైగా హైకోర్టులో జ‌గ‌న్ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను పున‌ర్నియ‌మించాల‌ని, ఆయ‌న్ని తొల‌గించేందుకు తీసుకొచ్చిన ఆర్డిన‌న్స్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని హైకోర్టు తీర్పిస్తూ ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వానికి …

Read More »

జగన్‌ ఆయనొక్కడి మాటే వింటాడంటున్న జేసీ

ఆంధ్రప్రదేశ్ మీడియా వాళ్లు, జనాలు చాలా ఆసక్తిగా ఏం మాట్లాడతారా అని చూసే నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. స్వపక్షం, విపక్షం అని లేకుండా పెద్ద నాయకులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగుదేశంలో ఉంటూ చంద్రబాబును వేదిక మీద పెట్టుకుని ఆయన్ని విమర్శించడం జేసీకే చెల్లింది. ఇప్పుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌పై, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తరచుగా వాగ్బాణాలు విసురుతున్నారు. తాజాగా జగన్‌ను మరోసారి …

Read More »

గ్రేట్ న్యూస్ – తెలంగాణకు ఇక నో పాస్

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో 30 వరకు లాక్ డౌన్ పొడగించారు. అదే సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని సడలింపులు ఇచ్చారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇక్కడి నుంచి పోవచ్చు. కేంద్రం ఆయా రాష్ట్రాల సరిహద్దులను తెరిచే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ వెల్ కం చెప్పారు. ఇతర రాష్ట్రాలకు …

Read More »

తెలంగాణ‌లో క‌రోనా రికార్డ్ డే

క‌రోనా వైర‌స్‌ను ప్ర‌భుత్వాలు, జ‌నాలు ఎంత లైట్ తీసుకుంటే అది అంత‌గా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వంద‌లు, వేల‌ల్లో కేసులు న‌మోద‌వుతున్న‌పుడు రోజూ ప‌దుల సంఖ్య‌లో కేసుల‌తో తెలంగాణ‌లో అదుపులోనే ఉన్న‌ట్లు క‌నిపించిన వైర‌స్.. కొన్ని రోజులుగా త‌న ఉద్ధృతి చూపిస్తోంది. ఇటీవ‌లే ఒక్క రోజులో 169 కేసుల‌తో హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ న‌మోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డు బ‌ద్ద‌లైంది. శ‌నివారం సాయంత్రం నుంచి …

Read More »

శ్రీవారి దర్శనానికి డేట్ ఫిక్సయింది

Tirumala

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలన్నీ తెరుచుకోబోతున్నాయి. జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మిగతా వాటి కంటే దేశంలో అత్యధికంగా ఎదురు చూస్తున్నది తిరుమల శ్రీవారి దర్శనం కోసమే. రోజూ లక్ష మందికి పైనే దర్శించే శ్రీవారి ఆలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు పైగా మూత పడి ఉంది. ఐతే ఎప్పుడు పున:ప్రారంభించినా …

Read More »

ఏపీ ఎమ్మెల్యే కారు నెంబరు.. ‘ఏపీ సీఎం జగన్’

అధికారంలో చేతిలో ఉంటే ఏమైనా చేస్తామన్నట్లుగా వ్యవహరించే తీరు కొందరిలో ఉంటుంది. నిజానికి ఇలాంటివారి కారణంగా ప్రభుత్వానికి కొత్త తలనొప్పులే కాదు.. అనవసరమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరి అత్యుత్సాహం ప్రభుత్వాధినేత ఇమేజ్ ను సైతం డ్యామేజ్ చేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలో చోటు చేసుకుంది. సాధారణంగా కారు నెంబరు అంకెల్లో ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. కానీ.. పదాల్లో.. పేర్లలో ఉన్న కార్ …

Read More »

థియేటర్లు తెరుచుకునేది ఎఫ్పుడంటే?

లాక్ డౌన్ ఐదో దశ మొదలవుతోంది. ఐతే మూడో దశ లాక్ డౌన్ నుంచి మినహాయింపులు మొదలవడం.. ఐదో దశలో మరిన్ని సడలింపులు ఇవ్వడంలో జనాలు ఇంతకుముందులా ఇబ్బంది పడటం లేదు. దాదాపుగా సాధారణ జీవనంలోకి వచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే కొన్ని షరతుల మధ్య గుళ్లు గోపురాలు, షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోబోతున్నాయి. ప్రస్తుతానికి షరతులున్నది స్కూళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు లాంటి వాటిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాఠశాలలు …

Read More »

వైకాపా ట్రాప్ లో నాగబాబు?

నిన్నటికి నిన్న మెగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగబాబు ఉన్నట్లండి రెచ్చిపోయి, తెలుగుదేశం పార్టీ మీద ట్వీట్ల వర్షం కురిపించారు. ఉరుము ఉరిమి దేనిమీదో పడినట్లు బాలయ్య ఏదో ఆవేశంలో మెగాస్టార్ మీద ఓ మాట విసిరారు. దానికి నాగబాబు అంతకన్నా ఘాటుగా సమాధానం ఇచ్చారు. సారీ చెప్పాలని డిమాండ్ చేసారు. అక్కడితో అయిపోయింది. సారీ చెప్పలేదు అలా అని మళ్లీ గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేదు. పైగా నాగబాబు లైన్ …

Read More »

షాక్.. శ్రామిక్ రైళ్లలో 80 మంది చనిపోయారు

షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంతకాలం గుట్టుగా ఉంచిన ఈ వ్యవహారం ఇప్పుడు కలకలంగా మారుతోంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు.. సందేహాలకు తావిస్తోంది. లాక్ డౌన్ వేళ.. సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు కాలి నడకన వలసకార్మికులు వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా ఆలస్యంగా.. అలాంటి వలసకూలీల్ని వారి స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా కేంద్రం శ్రామిక్ …

Read More »

మహానాడు వేదికను బాబు సరిగా వాడుకున్నారా?

యావత్ ప్రపంచం ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. ఏపీలో రాజకీయం మాత్రం మే ఎండల్ని తలపించేలా హాట్ హాట్ గా ఉండటం ఆ రాష్ట్రానికి మాత్రమే సాధ్యమేమో? ప్రజల ఆరోగ్యం మీద చూపే శ్రద్ధ కంటే తమ రాజకీయాల చుట్టూనే చర్చను పరిమితం చేయటం కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన చర్చల్ని పక్కన పెట్టి.. ప్రజారోగ్యానికి మేలు చేసే సలహాలు సూచనలు.. పాలకులకు ఇవ్వాల్సిన ప్రతిపక్షం.. ఆ ఊసునే ఎత్తకపోవటం …

Read More »

జగన్ భుజం తట్టిన బీజేపీ

ఇటీవలి వరకు టీటీడీ ఆస్తుల అంశంపై పలువురు బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు రామ్ మాధవ్. …

Read More »