ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోమారు తెర మీదకు వచ్చింది. సాక్షాత్తు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ కీలక అంశాన్ని ఏపీ ప్రజలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి, కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితుల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్తో సన్నిహితంగా మెలిగే తెలంగాణ సీఎం …
Read More »ఏపీ ఎమ్మెల్సీ కోడలి కారు.. జూబ్లీహిల్స్ లో రెండు ప్రాణాల్ని తీసింది
ఎక్కడ ఏపీలోని కర్నూలు జిల్లా? ఎక్కడ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్. ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేదు. కానీ.. అక్కడి కారు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చేసిన రచ్చకు రెండు నిండు ప్రాణాలు పోయిన ఉదంతం శనివారం తెల్లవారుజామున జరిగింది. గంటల పాటు గుట్టుగా ఉంచిన ఈ ఉదంతం మీడియా పుణ్యమా అని బయటకు వచ్చింది. అతి వేగం.. అంతకు మించిన నిర్లక్ష్యం.. రెండు ప్రాణాలు పోయేందుకు …
Read More »యామినిపై కేసు…సోము వీర్రాజు ఆన్ ఫైర్
ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యామినిపై కేసు …
Read More »ఏపీ ప్రభుత్వం కూలిపోతుంది – RRR
ఏమాటకు ఆమాట… ఇంతవరకు వైఎస్ జగన్ కి రఘురామరాజు ఒక్క తప్పుడు సలహా ఇవ్వలేదు. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు నిజమైన అభిమాని అవునో కాదో తెలియదు గాని రఘురామరాజు మాత్రం… వైసీపీని, జగన్ ని తప్పు దోవ పట్టించే సలహా ఎపుడూ ఇవ్వలేదు. వారి తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపుతూ వచ్చారు. వాటిని సరిదిద్దుకుని 30 ఏళ్లు అధికారంలో ఉండమని జగన్ ను కోరారు. కానీ అలా కోరిన …
Read More »రమేష్ హాస్పిటల్ ఎండీ లైన్లోకొచ్చాడు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్లోని రమేష్ కోవిడ్ కేర్ సెంటర్లలో కొన్ని రోజుల కిందట భారీ అగ్ని ప్రమాదం జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే హాస్పిటల్ ఎండీ రమేష్ బాబు మాత్రం అదృశ్యమయ్యారు. ఆయన కోసం కొన్ని ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దుర్ఘటన జరిగిన తర్వాతి రోజు అండర్ గ్రౌండ్కు …
Read More »స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారతీయుల్ని ఉతికారేసిన పూరి
ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. అందరూ భారతీయత గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. భారతీయులైనందుకు గర్విస్తూ ఉంటారు. ఎక్కడలేని దేశభక్తి నింపుకొని ఉప్పొంగిపోతుంటారు. ఇలాంటి సమయంలో భారతీయులందరినీ ఉతికారేస్తూ మరో భారతీయుడు పెట్టిన ఆడియో సందేశం గురించి తెలుసుకోవాల్సిందే. ఆ భారతీయుడు మరెవరో కాదు.. మన తెలుగు అగ్ర దర్శకుల్లో ఒకడైన పూరి జగన్నాథ్. కొన్ని రోజులుగా పాడ్ కాస్ట్లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి వివిధ అంశాలపై ఆసక్తికర ఆడియో …
Read More »రఘురామకృష్ణరాజు జగన్ కాళ్లు పట్టుకున్నారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ గా మారిన ఆర్ఆర్ఆర్…సందర్భానుసారంగా సొంత పార్టీపై, ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కేంద్ర బలగాల భద్రత ఏరికోరి తెప్పించుకున్న రఘురామకృష్ణరాజు ….వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల బెదిరింపులకు భయపడబోనంటూ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఫోన్ చేసి రాజీనామా చేయమని కోరేవాళ్లకు డెడ్లీ వార్నింగ్ కూడా …
Read More »అమరావతికి వ్యతిరేకుల మద్దతు వెనుక కారణమిదే!!
2014లో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రకటించిన తర్వాత కొందరు వ్యతిరేకించారు. 33 వేల ఎకరాల భూమి అవసరం లేదని, పచ్చని పొలాలు బీడు భూములుగా మారతాయని వామపక్షాలతో పాటు మరి కొందరు వ్యతిరేకత చూపారు. జస్టిస్ గోపాల గౌడ, మేధా పట్కర్ లాంటి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, అన్నా హజారే పంపిన బృందాలు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్ లు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ నక్సలైట్లు, …
Read More »మోదీజీ టూర్ల కోసం 8458 కోట్లతో రెండు విమానాలు
అన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లింక్ పెట్టడం ఏంటని ఆయన అభిమానులు ఫీలవుతుండవచ్చు కానీ…ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న చర్చ మాత్రం హాట్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది. దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ …
Read More »సంచలనంగా మారిన చినరాజప్ప క్వశ్చన్లు
ప్రశ్నలు ఎవరైనా వేయొచ్చు. కానీ.. అందులో పస ఉండాలి. నిత్యం గంటల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బాబు మాటల్లో పస కంటే ఎక్కువగా నస ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా టీడీపీకి చెందిన కొందరు నేతల మాటలు సూటిగా.. స్పష్టంగా ఉంటాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు ఏపీ మాజీ హోం మంత్రిగా వ్యవహరించిన నిమ్మకాయల చినరాజప్ప. చాలా తక్కువ సందర్భాల్లోనే రియాక్టు అవుతారన్న …
Read More »రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ దొరికి పోయాడు
లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకీ దొరికిపోవటం చాలా కామన్. అయితే.. సదరు అధికారి స్థాయికి.. తీసుకునే లంచానికి పెద్ద పోలిక లేని రీతిలో చాలా సందర్భాల్లో దొరికిపోతుంటారు. రూ.10 వేలు మొదలు రూ.10 లక్షల లోపు లంచం తీసుకుంటూ దొరికే అధికారులు కోకొల్లలు. అందుకు భిన్నంగా ‘రియల్’ తిమింగళ అధికారులు ఎలా ఉంటారన్న వాస్తవానికి దగ్గరగా ఉండే భారీ అనకొండ ఒకటి తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిన వైనం షాకింగ్ …
Read More »కేటీఆర్ పట్టాభిషేకం జరగనుందా?
ఏది ఉత్తనే జరగదు. అందునా.. రాజకీయాల్లో జరిగే ప్రతి అంశానికి వెనుక ఒక లెక్క ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాంహౌస్ లో గడిపే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ తన పరిధిని పెంచుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా.. అధికారం కాకున్నా అనధికారికంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates