సూపర్ స్టార్ రజినీకాంత్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారిప్పుడు. తన అభిమానులను ఎలా నియంత్రించాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకోవడం, కానీ తన అనారోగ్యం దృష్ట్యా కరోనా సమయంలో ఇది ప్రాణానికే ప్రమాదం అన్న ఆలోచనతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రానని, పార్టీ పెట్టబోనని, అభిమానులు అర్థం చేసుకోవాలని ఆయన వినమ్రంగా …
Read More »రైతుల్లో ఇంత ఆగ్రహముందా ?
మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఎంత ఆగ్రహం పేరుకుపోతోందో తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలిచింది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా హర్యానా ప్రభుత్వం కర్నల్ జిల్లాలోని కైమ్లాలో సభ నిర్వాహించాలని డిసైడ్ అయ్యింది. దీనికి ముఖ్య అతిధిగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హాజరవ్వాల్సుంది. భారీ సభకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే ఊహించని మలుపుతో మొత్తం సభ రద్దయిపోయింది. ఇంతకీ ఏమి జరిగిందంటే కైమ్లాలో సభ …
Read More »ట్రంప్ పై అభిశంసన తీర్మానం ?
గడచిన కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాను యావత్ ప్రపంచం ముందు తలొంచుకునేట్లుగా వ్యవహరించిన ఔట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాలడ్ జే ట్రంప్ పై అభిశంసన తీర్మానం రెడీ అయింది. తీర్మాన్ని ప్రవేశపెట్టడమే మిగిలిందని స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు. నాలుగురోజుల క్రితం అమెరికన్ పార్లమెంటు భవనమైన క్యాపిటిల్ బిల్డింగ్ పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులు, బీభత్సకాండ చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అమెరికాలోని అన్నీ రాష్ట్రాల నుండి తన మద్దతుదారులను …
Read More »నిమ్మగడ్డ నిర్ణయానికి వ్యాక్సినేషన్ అడ్డు పడుతోందా ?
పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామే అడ్డుగా నిలుస్తుందా ? తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 16వ తేదీ నుండి కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సినేషన్ దేశమంతా మొదలవుతోంది. ఈ కార్యక్రమానికి అన్నీ రాష్ట్రాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రాలను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం చివరకు …
Read More »భార్య, తమ్ముడు, మేనల్లుడు.. ఇప్పుడు కొడుకు.. మంత్రిగారి రాజకీయం అదరహో!
రాజకీయాల్లో వారసులకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అయితే.. ఒకే కుటుంబం నుంచి వరుస పె ట్టి.. నాయకులుగా రంగ ప్రవేశం చేయడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరు కాదు. ఇద్దరుకాదు.. ఏకంగా ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వారే.. విజయ నగరం జి ల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం. సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ …
Read More »నరసాపురం వైసీపీలో ఫైర్బ్రాండ్ కావలెను.. రీజనేంటంటే!
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం నరసాపురం పార్లమెంటు. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటుకు కూడా నరసాపురం నియోజకవర్గంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ స్థానం నుంచి ముదునూరు ప్రసాదరాజు విజయం సాధించారు. అయితే, వీరిద్దరిలో ఎంపీ.. అసమ్మతి బావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జ్ విషయంలో జగన్ హుటాహుటిన నిర్ణయం …
Read More »వైసీపీలో చిచ్చు.. రగులుతున్న నాలుగు నియోజకవర్గాలు
అధికార వైసీపీలో నాయకుల మధ్య వివాదాలు, ఆధిపత్య పోరు కామన్గా మారింది. అయితే.. మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి నిత్యం రగులుతూనే ఉండడం పార్టీ పెద్దలకు కూడా తలనొప్పి గా పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వారిని వైసీపీకి మద్దతు దారులుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన వారిలో ఇద్దరు పార్టీకి తలనొప్పిగా మారారు. అదే సమయంలో సొంత పార్టీ తరఫునే …
Read More »అఖిల ప్రియకు సింపతీరాలేదు.. రీజనేంటి? ఒంటరయ్యారా?
దూకుడు మంచిదే.. కానీ, ఆ దూకుడు అర్ధవంతంగా ఉండాలి. అందరూ మెచ్చేదిగా కూడా ఉండాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుందని అంటున్నారు పరిశీలకులు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తనదైన శైలిలో దూకుడు చూపించారు టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. గట్టి వాయిస్ వినిపించారు. నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్రాతిపదికగా చేసుకునిదానిలోని లోపాలను ఎత్తి …
Read More »జనసేన బ్లాక్ బస్టర్ షో
ఎప్పుడూ జనాల్లో ఉండటం.. ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం.. అధికార పక్షంలో వైఫల్యాల్ని ఎండగట్టడం ప్రధాన బాధ్యత. ఈ పని చేస్తే ఆటోమేటిగ్గా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంటుంది. ఈ పని ఎన్నికల ముందు కాకుండా.. ముందు నుంచే చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. జనసేన పార్టీకి ఈ విషయంలో ఆలస్యంగానే బోధపడిందని చెప్పాలి. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే పవన్ …
Read More »కేంద్రం వద్దన్నా సై అంటున్న ఆ సీఎం
దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి ససేమిరా అంటోంది కేంద్ర ప్రభుత్వం. 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇస్తూ ఇచ్చిన జీవోలో ఇప్పటిదాకా ఏ మార్పూ చేయలేదు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం సొంతంగా తమ రాష్ట్రం వరకు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులు ఇవ్వడం.. తర్వాత కేంద్రం ఇందుకు అంగీకరించకపోవడంతో …
Read More »జగన్…ప్రజలకు ముద్దులు కాదు..పాలసీలు కావాలి: పవన్
తుని నియోజకవర్గం కొత్తపాకలలో దివీస్ పరిశ్రమ ఏర్పాటుపై ఆందోళన జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివీస్ బాధితుల నిరసనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు తెలుపుతూ ఈరోజు తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాదయాత్రలు చేసే జగన్ ప్రజలపై ప్రేమను ముద్దులతో చూపుతారని, కానీ ఆయన ప్రేమ పాలసీల రూపంలో చూపించాలని ఎద్దేవా చేశారు. లక్షలాది …
Read More »బీజేపీలోకి గిడ్డి ఈశ్వరి.. ముహూర్తం ఖరారు!
గిరిజన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే.. గిడ్డి ఈశ్వరి బీజేపీలో చేరబోతున్నారు. విద్యావంతురాలు, వినయశీలిగా పేరున్న ఈశ్వరి.. ఇప్పటికి మూడు పార్టీలు మారారు. ఆమె తండ్రి గిడ్డి అప్పలనాయుడు రాజకీయ వారసురాలిగా అరంగేట్రం చేసిన ఈశ్వరి.. పూర్వాశ్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 1978 ఎన్నికల్లో గిడ్డి అప్పలనాయుడు.. గిరిజన నియోజకవర్గం పాడేరు నుంచి జనతా పార్టీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత చానాళ్లకు ఈశ్వరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates