ఈ విషయమే తెలుగుదేశంపార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధికారానికి దూరమైనా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ లో గెలిచారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే గంటా తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. టీడీపీకి రాజీనామా చేస్తారని, వైసీపీలో చేరుతారనే ప్రచారం గంటా విషయంలో జరిగినట్లుగా మరే టీడీపీ నేతపైనా జరగలేదంటే …
Read More »మాజీ మంత్రికి తప్పని సెగ.. టీడీపీలో రచ్చరచ్చ
టీడీపీలో అసంతృప్తులను తగ్గించాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ, వ్యూహాలపై వ్యూహాలు అమలుచేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో చంద్రబాబు వ్యూహాలు ఫలించడం లేదని అంటున్నారు సీనియర్ నాయకులు. ముఖ్యంగా మాజీ మంత్రి జవహర్ విషయంలో చంద్రబాబు ఆలోచనా విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నేతలు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. తాజాగా జవహర్కు వ్యతిరేకంగా లేఖల యుద్ధాన్ని ప్రారంభించారు. దీంతో కొవ్వూరు టీడీపీ రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. 2014 …
Read More »జగన్ను కాదని..బాబుపై బీజేపీ యుద్ధం. రీజనేంటి?
రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడం కష్టం. గతంలో చంద్రబాబు సర్కారు ఏపీలో పాలన సాగిస్తున్న సమయంలో రంగంలోకి దిగిన జనసేన నాయకుడు పవన్.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడం మానేసి.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత జగన్ పైనా విరుచుకుపడ్డారు. అప్పట్లో అందరూ దీనిని చిత్రంగా చర్చించుకున్నారు. వ్యూహం ఏమిటనేది ఇప్పటికీ చాలా మందికి అంతుపట్టదు! కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ …
Read More »ఈనేత పక్క చూపులు చూస్తున్నారా ?
పార్టీలో ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇపుడిదే చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ మాజీ ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు @ మాగంటి బాబు ఇప్పుడెక్కడా కనబడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎంపి కనబడటం లేదంటే సరేలే అని సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు దగ్గర కూడా కనబడటం లేదట. జిల్లాలోని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు …
Read More »టీడీపీలో ముగ్గురు మహిళల పంతం.. హామీ ఇస్తేనే.. అడుగు బయటకు!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసంతృప్తులు, అసమ్మతులు, నిరసన గళాలు ఎక్కడా సర్దుమణగడం లేదు. పదువుల పందేరాలు జరిగినా.. జంబో కమిటీలను ఏర్పాటు చేసి.. నాయకులకు, నాయకురాళ్లకు బాధ్యతలు అప్పగించినా.. ఇంకా ఏదో కావాలనే ఆరాటం మాత్రం వారిలో ఎక్కడా తగ్గక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ముగ్గురు కీలక మహిళా నాయకురాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో చర్చకు వచ్చింది. వీరిలో గుమ్మడి సంధ్యారాణి, తోట …
Read More »‘బ్యాంకు ఫ్రాడు’చౌదరిను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు
కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఢిల్లీ ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. అమెరికాకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వచ్చిన సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనేక బ్యాంకు ఫ్రాడు కేసుల విచారణను ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రిపై లుకవుట్ నోటీసు ఉన్న కారణంగా దేశం విడిచి వెళ్ళే అవకాశాలు లేవని అడ్డుకున్నారు. దాంతో అత్యతవసరంగా లంచ్ మోషన్ పద్దతిలో కోర్టులో పిటీషన్ వేసిన సుజనా చివరకు అమెరికాకు వెళ్ళటానికి రెండు వారాల అనుమతిని …
Read More »పండగ మూడ్ లో ఉండగా పాక్ భారీ దొంగదెబ్బ
దేశమంతా దీపావళి ఉత్సవాలు జరుపుకుంటుంటే దాయాది దేశం పాకిస్ధాన్ భారత్ ను సరిహద్దుల్లో దొంగదెబ్బ తీసింది. అయతే పాకిస్దాన్ దొంగదెబ్బను పసిగట్టిన మన సైన్యం వెంటనే తేరుకుని చావుదెబ్బ కొట్టింది. మన సైన్యం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.45-2.45 మధ్య భారత్-పాకిస్ధాన్ సరిహద్దుల్లోని దేవార్, కేరన్, ఊరి, నౌగమ్ ప్రాంతాల్లో పాకిస్ధాన్ హఠాత్తుగా దొంగదెబ్బ మొదలుపెట్టింది. సరిహద్దుల్లో కాపలాగ ఉన్న మన సైన్యంపై ఒక్కసారిగా …
Read More »విశాఖ ఎఫెక్ట్: జగన్… సాయిరెడ్డిని కాపాడుతున్నారా?
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన జిల్లాఅభివృద్ధి సమీక్షామండలి(డీడీఆర్సీ) సమావేశంలో.. భూముల వ్యవహారంపై ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల ఇన్చార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ల మధ్య ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలతో ధర్మశ్రీ, అమర్నాథ్ విభేదించారు. ఈ సందర్భంగా విజయసాయిపై ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం.. నేతలు నేతలు అనడం కాదు.. ఎవరు భూములు ఆక్రమిస్తున్నారో.. చెప్పాలంటూ.. ధర్మశ్రీ …
Read More »ఎంఎల్ఏలకు జగన్ క్లాసు పీకారా ?
ఇద్దరు ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకారా ? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. విశాఖపట్నం జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఎంఎల్ఏలు, ఎంపి మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. భూమి లావాదేవీల విషయంలో చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ-రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద వాగ్వాదమే జరిగింది. జిల్లాలోని అధికారులు, టీడీపీ ఎంఎల్ఏల మందు వీళ్ళద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అయితే ఇద్దరిలో …
Read More »బీజేపీది ఆశనా? దురాశనా? అసలు డిపాజిట్ వస్తుందా ?
తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచినట్లే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా బీజేపీ గెలుస్తుందని ఏపి ఇన్చార్జీ సునీల్ దేవదర్ ప్రకటించేశారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం జరిగింది లేండి. ఈ సందర్భంగా కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలనో ఏమో కానీ సునీల్ చాలా పెద్ద మాటలే మాట్లాడేశారు. ఏకంగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ సుమారు 2.28 …
Read More »జగన్కు పొంచి ఉన్న మిత్రుడి ముప్పు!
రాజకీయాల్లో నిన్నటి మిత్రుడు రేపటికి శత్రువు కావొచ్చు. లేదా ఈరోజు శత్రువు.. రేపటికి మిత్రుడూ కావొ చ్చు. ఏ నిముషానికి ఏమి జరుగుతుందో.. రాజకీయాల్లో ఏ ఒక్కరూ చెప్పే పరిస్థితి లేదు. అధికారం.. పరమావధి.. అవకాశం ప్రతి ఒక్కరి అవకాశం! ఈ పరిస్థితే.. ఏపీఅధికార పార్టీలోనూ గుబులు రేపుతోంది. బిహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అసలు ఏపీతో సంబంధం లేని ఈ ఎన్నికలపై ఇక్కడ ఏపీలో వైసీపీ తర్జన …
Read More »12 వేల ఓట్లు.. ఆ యువనేతను సీఎం కాకుండా చేశాయ్
ఎన్నికల్లో అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. గెలుపు.. ఓటముల మధ్య రేఖ ఎంత పలుచగా ఉందో కొన్ని సందర్భాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. తాజాగా బిహార్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే మరింత బాగా అర్థం కావటం ఖాయం. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాస్తంత మెజార్టీ అంటేనే పదివేల ఓట్ల అధిక్యత ఉంటుంది. అలాంటి పన్నెండు వేల ఓట్లు.. ఒక యువనేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డాయంటే పరిస్థితి ఎలా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates