Political News

హైదరాబాద్ ఆసుపత్రిలో అనారోగ్యంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

జర్నలిస్టుగా సుపరిచితుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత విధేయుుడు.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త నియోజకవర్గ ప్రజల్లోనే కాదు.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి షాకింగ్ గా మారింది. దుబ్బాక నియోజకవర్గంలో గడిచిన నాలుగు దఫాలుగా గెలుస్తూ వస్తున్న రామలింగారెడ్డి మరణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ …

Read More »

బీర‌ట్‌లో ఆ భారీ ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింది?

నిన్న సాయంత్రం నుంచి సోష‌ల్ మీడియా నిండా అవే ఫొటోలు.. వీడియోలు. లెబనాన్ రాజధాని బేరూత్‌లో జ‌రిగిన‌ భారీ పేలుడు తాలూకు దృశ్యాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 100 మందికిపైగా చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్ల‌డించిన తాజా స‌మాచారం. మృతుల సంఖ్య ఇంకా పెర‌గొచ్చు. అక్క‌డ జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్టంగా ఉంది. కొన్ని కిలోమీట‌ర్ల …

Read More »

పాపం.. చంద్ర‌బాబును ప‌ట్టించుకునే వాళ్లు లేరు

జగ‌న్ స‌ర్కారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని నుంచి త‌ర‌లించ‌డం.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నకు ఆమోద ముద్ర వేయించుకోవ‌డం మీద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఈ అంశం మీద అసెంబ్లీని ర‌ద్దు చేసి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్దామ‌ని.. మ‌ళ్లీ ఎన్నిక‌లు జరిపించి ఎవ‌రి స‌త్తా ఏంటో తేల్చుకుందామ‌ని స‌వాలు విసురుతూ వీరావేశంతో 48 గంట‌ల గ‌డువు ప్ర‌క‌టించారు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. కానీ ఆయ‌న స‌వాల్ …

Read More »

అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామని అధికార పార్టీ వైసీపీ అంటోంది. మరోవైపు, అమరావతి రాజధాని అని రైతులు వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికే అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు సగం పూర్తయ్యాయని విపక్ష టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు …

Read More »

కరోనా కోసం చేరితే.. అగ్నికి ఆహుతయ్యారు

దురదృష్టం అంటే ఇదే. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలై.. దాన్నుంచి కోలుకునేందుకు ఆసుపత్రిలో చేరితే అక్కడ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం. అహ్మదాబాద్‌లోని కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న శ్రేయ ఆసుపత్రి ఐసీయూ వార్డులో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ‌ ఆసుపత్రిలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. …

Read More »

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే పదవులు వదిలేస్తామన్న బాబు

ఒక అంశం మీద పోరాడుతున్నప్పుడు ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలంటే.. వ్యూహం పక్కాగా ఉండాలి. మాటలు గంభీరంగా ఉండి.. చేతలు చులకన చేసేలా ఉంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. తాజాగా ఏపీ విపక్ష నేత కమ్ టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఇదే రీతిలో ఉంది. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల అంశంపై ఏపీ సర్కారు దూకుడుగా దూసుకెళుతున్న …

Read More »

మోకాళ్లపై మానవహారం.. అందరిని కదిలించేసిందా?

వారెవరికి రాజకీయ నేపథ్యంలో లేదు. ఆ మాటకు వస్తే పార్టీ కార్యకర్తలు కూడా కాదు. ఒక ప్రభుత్వం పిలుపునిస్తే.. తమ బతుకులు బాగుపడటంతో పాటు.. తమ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయన్న ఆశతో తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రపంచ చరిత్రలో చుక్క నెత్తురు కారకుండా 33వేల ఎకరాల భూమిని రైతులు తమకు తాముగా ప్రభుత్వానికి ఇచ్చిన అద్భుతమైన ఘట్టం అమరావతి సందర్భంగా చోటు చేసుకుందని చెప్పాలి. ప్రభుత్వాలు మారి.. …

Read More »

కరోనా బిల్లు చూసి.. ఆఫీసును ఆసుపత్రిగా మార్చేశాడు

Corona Hospital

విన్నంతనే నమ్మలేం. కానీ.. ఇది నిజంగా నిజం. కరోనా పాజిటివ్ కావటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఒక వ్యాపారవేత్త.. ఎట్టకేలకు కోలుకోవటం బాగానే ఉన్నా.. అతగాడి చేతికి ఇచ్చిన బిల్లును చూసి గుండె ఆగినంత పనైందట. దాంతో ఆ వ్యాపారస్తుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఉదంతం గురించి చెబితే.. గుజరాత్ లోని సూరత్ పట్టణానికి చెందిన ఖాదర్ షేక్ అనే బడా వ్యాపారికి కరోనా …

Read More »

మంత్రి స్టేట్మెంట్.. కరోనా చికిత్స ఖర్చు వెయ్యే

Eetela Rajendra

కొంచెం ఆలస్యంగా అయినా సరే.. తెలంగాణలో కరోనా చికిత్స పేరుతో బాధితుల్ని దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే అయినకాడికి ఫీజులు దండుకుంటున్న డెక్కన్ హాస్పిటల్ కరోనా చికిత్స చేయకుండా లైసెన్స్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు జూబ్లీ హిల్స్‌లోని విరించి ఆసుపత్రి మీదా ఇలాగే వేటు వేసింది ప్రభుత్వం. కార్పొరేట్ ఆసుపత్రులకు ఇంకా బలమైన హెచ్చరిక జారీ చేసే ఉద్దేశంతో ఆరోగ్య …

Read More »

పీపీఈ కిట్ ధరించిన కేటీఆర్ !

KTR

కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. నలుగురిని కలిసే విషయంలో కేసీఆర్ కు చాలానే లెక్కలు ఉంటాయని చెబుతారు. అందుకు భిన్నంగా ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మాత్రం.. వీలైనంత ఎక్కువమందిని కలుస్తుంటారు. ఎవరైనా.. ఏదైనా కొత్త కార్యక్రమం చేపడుతుంటే.. దాని గురించి తెలుసుకోవాలనే తపనతో పాటు.. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా? …

Read More »

ఆయన అద్వానీ పేరెత్తగానే..

2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య …

Read More »

ఐపీఎల్ నుంచి వివో ఔట్‌.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

మొత్తానికి బీసీసీఐ దిగి రాక త‌ప్ప‌లేదు. చైనా వ్య‌తిరేక ఉద్య‌మం జోరుగా సాగుతున్న వేళ ఆ దేశానికి చెందిన వివో మొబైల్ కంపెనీని ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగించాల‌ని భార‌త క్రికెట్ బోర్డు నిర్ణ‌యించ‌డంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. బోర్డు వ‌ర్గాలు మాత్రం వివో …

Read More »