Political News

Big News: ఓవైసీతో కమల్ హాసన్ దోస్తీ?

ఇది ఎవ్వరూ ఊహించని కలయికే. తమిళ నాట రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న కమల్ హాసన్.. ఒక మతానికి ముఖచిత్రంగా, ప్రతినిధిగా మారిన పార్టీతో దోస్తీ కట్టబోతున్నారట. ఆ పార్టీ.. హైదరాబాద్ పరిధిలో తిరుగులేని ఆదరణ ఉన్న ఎంఐఎంయేనట. హైదరాబాద్‌లో బలమైన పార్టీగా ఎదిగిన ఎంఐఎం.. దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటికీ పార్టీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ముస్లింలు ఎక్కువుంటే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. …

Read More »

పాదయాత్రలతో వేడెక్కిపోనున్న తెలంగాణా

‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగ పాదయాత్ర చేయటానికి రెడీగా ఉన్నాను’ ..కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘రైతులు, జనాల సమస్యలు తెలుసుకునేందుకే తొందరలో పాదయాత్ర చేయబోతున్నాను’ జగ్గారెడ్డి ‘పీసీసీ ప్రెసిడెంట్ గా చేస్తే పాదయాత్ర చేస్తాను’.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇది పాదయాత్రకు సంబంధించిన లేటెస్టు హాట్ టాపిక్. విచిత్రమేమిటంటే పాదయాత్ర చేయటానికి రెడీ అవుతున్న ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ వాళ్ళే. కోమటిరెడ్డి ఏమో మాజీమంత్రి భువనగిరి ఎంపి. …

Read More »

కొత్త పద్దతిలో రైతు సంఘాల ధర్నా

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొత్త పద్దతులను సంతరించుకుంటోంది. కొత్త చట్టాలను నిరసిస్తు గడచిన 17 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర వేలాదిమంది రైతులు క్యాంపు వేసి మరీ ఉద్యమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వీళ్ళు ఎంతగా పట్టుబడుతున్నారో కేంద్రప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్దితుల్లోను నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని తెగేసి చెప్పేసింది. …

Read More »

బీజేపీ ఒత్తిడికి లొంగిపోయిన పవన్

మరోసారి జనసేన అధినేత బీజేపీ ఒత్తిడికి లొంగిపోయినట్లే అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. శనివారం తిరుపతిలో మొదలైన రెండురోజుల పార్టీ కార్యవర్గ సమావేశాల్లో వీర్రాజు మాట్లాడుతు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారంటు చేసిన ప్రకటన ఒక్కసారిగా సంచలనమైంది. తిరుపతిలో మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేయబోయేది …

Read More »

ప‌వ‌న్ అభిమానుల ఒళ్లు మండించేసిన బీజేపీ

ప‌వ‌న్ అభిమానులు భ‌య‌ప‌డిందే జ‌రిగేట్లుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు గండి కొట్టిన బీజేపీ.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీకి మొండి చేయి చూపించేట్లే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఒక్క రోజుకే ఆయ‌న పార్టీని ఎన్నిక‌ల బ‌రి నుంచి ఉప‌సంహ‌రింప‌జేయ‌డం, ఆ త‌ర్వాత జ‌న‌సేన‌తో త‌మ‌కు పొత్తు లేద‌ని ఆ పార్టీ నేత మాట్లాడ‌టం ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంత‌గా బాధించిందో తెలిసిందే. ఐతే పెద్ద‌గా …

Read More »

ఆ మంత్రులను త‌ప్పించ‌క్క‌ర్లేదు.. వాళ్లే వెళ్లిపోతారు.. వైసీపీలో గుసగుస‌

అదేంటి? ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఒకింత‌ ఆశ్చ‌ర్యంగా కూడా ఉందా? కానీ.. అధికార పార్టీ వైసీపీలో ఈ వ్యాఖ్య‌లే హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేస్తార‌ని తెలిసిందే. స‌గం మంది ఇప్పుడున్న వారిని ప‌క్క‌న పెట్టి.. కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి జ‌గ‌న్ చెప్పింది కూడా ఇదే. అయితే.. సాధార‌ణంగా .. మంత్రులుగా ఉన్న‌వారు ఎవ‌రైనా.. …

Read More »

త‌మ్ముళ్లూ.. ఇది త‌గునా?

ఔను! టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం గురించి.. ఆ పార్టీకి ఎంతో ఇష్ట‌మైన‌.. ఆ పార్టీ నేత‌లు నిత్యం ఫాలో అయ్యే సోష‌ల్ మీడియాలోనే ఇలా కామెంట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా కురుస్తున్నాయి. త‌మ్ముళ్లూ.. ఇది త‌గునా?! అంటూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. టీడీపీలో అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్న‌వారు.. మ‌ధ్య‌లో వ‌చ్చిన వారు.. ఇలా చాలా …

Read More »

కేంద్రానికి వేడి పుట్టించేస్తున్న రైతుల ఆందోళనలు

ఒకవైపు తీవ్రమైన చలి మరోవైపు రైతుల ఆందోళనలు ఢిల్లీని కమ్ముకుంటున్నాయి. గడ్డకట్టించే చలిలో కూడా కేంద్రప్రభుత్వానికి రైతుల ఆందోళన చెమటలు పట్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆందోళనలు ఏకంగా కేంద్రానికే వేడిపుట్టించేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈనెల 19వ తేదీన తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు మొదలుపెడతామంటూ రైతుసంఘాలు పంపిన అల్టిమేటమ్ సంచలనంగా మారింది. ఇప్పటివరకు పంజాబ్, హర్యానా, రాజస్ధాన్ లోని రైతుసంఘాలు మాత్రమే …

Read More »

స్క్రీనింగ్ ముగిసింది… టీ కాంగ్‌ చీఫ్ ఎవ‌రో?

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ శాఖ అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మిస్తార‌న్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. టీ పీసీసీ చీఫ్ గా ఎవ‌రు ఎంపిక అవుతారు? యువ‌నేత రేవంత్ రెడ్డినా? లేదంటే సీనియ‌ర్ గా పేరున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డినా?. ఈ విష‌యంపై నిజంగానే ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. పొమ్మ‌నే దాకా కుర్చీని ప‌ట్టుకు వేలాడిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి… మొన్న‌టి గ్రేట‌ర్ …

Read More »

బాప‌ట్లలో డిప్యూటీ స్పీక‌ర్ హ‌వాకు బ్రేకులు.. విష‌యం ఏంటంటే!

గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌, స్థానిక ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి ఎదురుగాలి వీస్తోందా? ఆయ‌న‌ను వ‌రుస‌గా గెలిపించిన‌ప్ప‌టికీ.. స్థానిక స‌మ‌స్య‌ల‌ను ఆయన ప‌రిష్క‌రించ‌లేపోతున్నారా? దీంతో ప్ర‌జ‌ల్లో ఓవిధ‌మైన అసంతృప్తి పెల్లుబుకు తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కోన ర‌ఘుప‌తి వార‌స‌త్వ రాజ‌కీయాల నుంచి పాలిటి క్స్‌ను అందిపుచ్చుకున్నారు. వ‌రుసగా విజ‌యాలు సాధిస్తున్నారు. వివాద ర‌హితుడు, నిదాన‌స్తుడు, దూకుడు లేని …

Read More »

రేవంత్ ను టార్గెట్ చేసిన సీనియర్లు

రేవంత్ రెడ్డి..పరిచయం అవసరం లేని పేరిది. కేసీయార్ అన్నా ఆయన కుటుంబం అన్నా ఒంటికాలిపై లేచి ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతుంటారు. ఒకానొక దశలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిన తర్వాతే కదలికొచ్చింది. టీడీపీలో బాగా యాక్టివ్ గా ఉండే రేవంత్ కాంగ్రెస్ లో చేరిన కొద్దిరోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. రేవంత్ పార్టీలో చేరేనాటికి కేసీయార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది హైడవుట్లోకి వెళ్ళిపోయున్నారు. …

Read More »

ఎట్టకేలకు ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మీ వచ్చేశారు

ఐఏఎస్ శ్రీలక్ష్మీ… ఈ పేరు వింటేనే ఓ సమర్థవంతమైన అధికారిణి మన కళ్ల ముందు కదలాడతారు. అదే సమయంలో వివాదాల్లో కూరుకుపోయి ఏకంగా జైలుకు వెళ్లి వచ్చిన అధికారిణిగా కూడా ఠక్కున గుర్తుకు వస్తారు. అదంతా గతం అనుకుంటే… ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన మహిళా అధికారిణిగా గుర్తుకొస్తారు. అయినా ఇప్పుడు మరోమారు ఈమె ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే.. శుక్రవారం దాకా తెలంగాణ కేడర్ అధికారిణిగా ఉన్న శ్రీలక్ష్మీ …

Read More »