పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రోడ్డున పడుతున్న విభేదాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రజా ప్రతినిధులందరూ క్రమశిక్షణతోనే ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారిలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గతంగా ఉన్న గొడవలు ఇప్పుడిప్పుడే బయటపుడుతున్నాయి. ఆమధ్య వైజాగ్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవను మరచిపోకముందే తాజాగా కాకినాడలో పెద్ద గొడవైంది. మధ్యలో కూడా కడప, కర్నూలులో కూడా …
Read More »అస్త్రాలన్నింటినీ మోహరిస్తున్న బీజేపీ
ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక లక్ష్యంగా బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. మామూలుగా అయితే మేయర్ పీఠం కోసం ఇంతగా కష్టపడేది కాదేమో. ఈ మధ్యనే జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలవటంతో పార్టీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దుబ్బాకలో గెలుపుతో కమలనాథులు రచ్చ రచ్చ చేస్తన్నారు. ఎప్పుడు లేని గోల మొదలపెట్టేశారు. దుబ్బాక విజయం తాలూకు హ్యాంగోవర్ తగ్గక ముందే …
Read More »పవన్ పరిస్దితి ఇంత అన్యాయమైపోయిందా ?
ఇదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అర్జంటుగా బీజేపీ నాయకత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి రమ్మని కబురుచేసింది. దాంతో సోమవారం రాత్రికి జనసేన లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ ను తీసుకుని పవన్ హడావుడిగా సోమవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో అగ్ర నేతల నుండి కబురు వచ్చిందని అందుకనే పవన్ అర్జంటుగా బయలుదేరి వెళ్ళిపోయారంటు సోమవారం సాయంత్రం నుండి మీడియా ఒకటే ఊదరగొట్టేసింది. దాంతో ఢిల్లీలో ఏమో …
Read More »పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను తొలగించాలి – అక్బరుద్దీన్
వెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట పడితే అంత మాటను అనేసే ఓవైసీ ఫ్యామిలీ.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల వేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వేళలో తన నోటికి పని చెప్పారు మజ్లిస్ అధినేత అసద్ సోదరుడు అక్బరుద్దీన్. గడిచిన రెండు రోజులుగా పాతబస్తీపైనా.. మజ్లిస్ పార్టీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కమలనాథులకు ఏ మాత్రం తగ్గని రీతిలో తాజాగా ఆయన …
Read More »బీజేపీని ఖంగారు పెడుతున్న పవన్, విజయశాంతి
పార్టీలో ఎంత మంది కీలక నాయకులు ఉంటే.. అంత బలం అనుకునే పార్టీలు.. వచ్చిన వారిని వచ్చినట్టు.. నచ్చిన వారినీ వచ్చేట్టు చేసుకుని చేర్చుకుంటున్నాయి. ఇలా.. బీజేపీ వ్యూహంలో ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ప్రజలు, మహిళలు, యువతలో మంచి గుర్తింపు, రేంజ్ ఉన్న వీరిని వాడుకుని గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్కాలనేది బీజేపీ వ్యూహం. అయినా.. ఎక్కడో పార్టీలో కలవరం కనిపిస్తోంది. ఇద్దరు కీలక నేతలు ఉన్నా.. ఎక్కడా …
Read More »మాట మార్చేసిన వీర్రాజు..ఢిల్లీలో ఏమైంది ?
కమలంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చేశారు. తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి జనసేన నుండి బీజేపీ నుండా అనే విషయాన్ని తొందరలోనే ప్రకటిస్తామంటూ చెప్పారు. నిన్నటి వరకు తిరుపతి ఉపఎన్నికలో బీజేపీనే పోటి చేస్తుందని పది సార్లయినా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నెల రోజుల క్రితమే ఉపఎన్నికలో బీజేపీ నే పోటీ చేస్తుందని వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించేసిన విషయం అందరు …
Read More »ఒత్తిడికి తలొంచిన ట్రంప్
మొత్తానికి అగ్రరాజ్యంలో అనిశ్చితికి తెరపడినట్లే ఉంది. ఓటమిని అంగీకరించకపోయినా అధికార మార్పిడికి మాత్రం ఒప్పుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గోల చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో డెమక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ స్పష్టమైన విజయం సాధించినా ట్రంప్ అంగీకరించలేదు. కోర్టుల్లో కేసులు వేయించారు. పోలింగ్ ప్రక్రియను ఆమోదించనంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఎన్నికల్లో ఓడిపోగానే అధికార మార్పిడికి ట్రంప్ …
Read More »మోడీని జగన్ ఓవర్ టేక్ చేస్తారా? సోషల్ మీడియా చర్చ
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ గట్టి పోటీ ఇస్తున్నారు. మోడీ తన వాక్చాతుర్యంతో దూసుకు పోతుంటే.. జగన్ మాత్రం మౌనంగా పరుగులు పెడుతున్నారు. ప్రజల అభిమానాన్ని.. పాలనలో మెరుపులను మోడీ ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా అంతే రేంజ్లో ప్రజాభిమానానని ఆస్వాదిస్తున్నారు. దీంతో ఇద్దరు నాయకుల మధ్య భారీ పోటీ ఏర్పడింది. ఈ పోటీలో మోడీ ఒకింత ముందున్నా.. జగన్ ఆయనను ఓవర్ టేక్ చేసే …
Read More »బీజేపీ ‘రోహింగ్యాల’ వ్యూహం ఫలించేనా?
హోరా హోరీ ర్యాలీలు.. పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మేనిఫెస్టోల హామీల మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎట్టి పరిస్థితిలోనూ పట్టు జారకూడదన్న ఉద్దేశంతో అధికార టీఆర్ ఎస్, ఎట్టిపరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కి..గ్రేటర్ను చేజిక్కించుకోవడమే ధ్యేయంగా బీజేపీలు ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి ఎక్కడ పట్టుందో.. అక్కడ బలమైన ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ …
Read More »బీజేపీలో బాబు వర్గం.. ఏమైంది?
పార్టీలు వేరైనా.. చంద్రబాబుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గమనే కా కుండా.. బాబు విజన్ నచ్చిన వాళ్లు.. ఆయన దూరదృష్టి.. సంయమనం, ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన విధానం.. ఆచితూచి వేసే అడుగులు వంటివి రాజకీయంగా చంద్రబాబును హైలెట్ చేస్తాయి. అప్పటికి .. ఇప్పటికి.. బాబు విజన్ను కొట్టిన వారు లేరు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా కూడా బాబు ను అభిమానించేవారు …
Read More »మంచి అవకాశాన్ని చేజార్చుకున్న జగన్ ప్రభుత్వం
అవును ఓ ప్రాజెక్టు గురించి పాజిటివ్ వార్తను జనాల్లోకి తీసుకెళ్ళే బంగారం లాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేజార్చుకున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు వివాదం లేని రోజు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు పేరుతో ఏదో ఓ వివాదం నలుగుతునే ఉంది. తమ హయాంలో 70 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 2 శాతం పనులు కూడా …
Read More »తిరుపతి ఉప పోరు: స్థానిక నేతలపై జగన్ నమ్మకం కోల్పోయారా?
రాజకీయాల్లో పార్టీల అధిపతులు.. క్షేత్రస్థాయిలో నాయకులపై చాలానే నమ్మకాలు పెట్టుకుంటారు. దిగువ నుంచి సమాచారం .. ఎగువన ఉన్న పార్టీ అధిష్టానానికి అందించే ప్రధాన ఛానెల్ వీరే కనుక.. స్థానిక నేతల పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ప్రక్రియ సహజంగా అన్ని పార్టీల్లోనూ జరిగేదే. గతంలో టీడీపీ కూడా స్థానిక నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. అయితే, అనూహ్యంగా వైసీపీలో ఈ విధానానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates