తిరుపతి పార్లమెంటు స్థానం విషయంలో దూకుడుగా ఉన్న బీజేపీ-జనసేన పార్టీలు అనధికార ప్రచారం మొదలు పెట్టేశాయి. పైకి తిరుపతి ఉప ఎన్నికను ప్రస్తావించకుండానే.. ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రచారం ప్రారంభించాయనే చెప్పాలి. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను ఓదార్చుతా నంటూ.. జనసేన అధినేత పవన్ ప్రచారం ప్రారంభించేశారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేవలం తుఫాను బాధితులను ఓదార్చేందుకే అయితే.. ఆయన చేస్తున్న విమర్శల్లో సగం చాలు. కానీ, …
Read More »భారత్ బంద్ కు పెరుగుతున్న మద్దతు
కేంద్రప్రభుత్వం ఆమోదించిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు నెలరోజులకు పైగా పంజాబ్, హర్యానాల్లో రైతులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా పై రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఛలో డిల్లీ కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో …
Read More »అమ (రావతి) రులైన రైతులకు నివాళి
అమరులైన అమరావతి రైతులను ఆదుకోవటానికి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని అశ్విన్ అట్లూరి మిత్రబృందం రామారావు కాజా ద్వారా 15 లక్షల ఆర్థిక సహాయం డిసెంబర్ 6 న ఉదయం 10 గంటలకు అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో అమరులైన రైతు కుటుంబాలకు అందజేశారు. ఉన్న ఎకరం ఊడ్చి ఇచ్చి ఉద్యమానికి ఊపిరిచ్చి శరీరాన్ని భూమికిచ్చి కుటుంబానికి మాత్రం కోత మిగిల్చి మనకి మాత్రం జవాబు లేని ప్రశ్ననిచ్చి జీవితాల్ని త్యాగం చేసిన అమరావతి రైతుల కుటుంబాల …
Read More »మానసిక ప్రక్షాళనా?.. మంత్రుల ప్రక్షాళనా?
అనూహ్య విజయంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార టీఆర్ఎస్ పార్టీకి అంతే అనూహ్యమైన పరాభవం తాజా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎదురైంది. “తెలంగాణ కోసం.. తెలంగాణ బిడ్డల కోసం.. ఎంతకైనా సిద్ధమే!” అన్న ఒకనాటి కేసీఆర్కు ఇప్పటి కేసీఆర్కు మాటల మధ్య వ్యత్యాసం లేకపోయినా.. చేతల్లో స్పష్టమైన వ్యత్యాసం కొట్టొ చ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలను తోసిపుచ్చిన ఫలితంగానే ఇప్పుడు పార్టీ పరిస్థితి …
Read More »ఏలూరు నీళ్లలో ఏం కలిసింది?
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన ఏలూరు ప్రజలు నిన్నట్నుంచి భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడి నీళ్లు కలుషితమై జనాల్లో విచిత్ర లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఏలూరు మున్సిపాలిటీ అందించే నీళ్లను ఎవరూ తాగొద్దంటూ జనాలకు హెచ్చరికలు జారీ అవుతుండటం కలకలం రేపుతోంది. ఏలూరులో శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోవడంతో అక్కడి ప్రజల్లో భయం మొదలైంది. శనివారం …
Read More »ఏపీ టీడీపీకి బంధు గణమే శాపమా?
ఏపీ టీడీపీలో ప్రతి జిల్లాలోనూ నేతల బంధులు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారి వియ్యంకు లు, బావమరుదులే చక్రం తిప్పుతున్నారు. జిల్లాలకు జిల్లాను పంచుకున్న వారి నుంచి నియోజకవర్గాల్లో తిష్టవేసి.. పార్టీని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నవారు ఉన్నారు. పోనీ.. వీరివల్ల పార్టీ ఏమైనా.. పుంజుకుందా? అంటే.. పెద్ద ప్రశ్నే! మరి ఈ నేతల బంధువులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ఎప్పటి వరకు ఇలా ఉపేక్షిస్తారు? వారు మైనస్ అని తెలిసి కూడా …
Read More »ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య మొదలైన అసెంబ్లీ చిచ్చు
ఇటు రాష్ట్రప్రభుత్వం అటు స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య ఏదో ఓ చిచ్చు లేకపోతే రెండువైపుల పెద్దలకు తోస్తున్నట్లు లేదు. నిత్యం ఏదో ఓ వివాదాన్ని రేకెత్తించటం దాని తర్వాత గవర్నర్ దగ్గరకో లేకపోతే హైకోర్టు, సుప్రింకోర్టులోనో పంచాయితీలు చేసుకోవటం మామూలైపోయింది. స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై తాజాగా అధికారపార్టీ అసెంబ్లీలో చేసిన తాజా తీర్మానంపై ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మండిపోతున్నారు. ఎన్నికల నిర్వహణ, తేదీల అధికారాలను …
Read More »ఈ ఎలివేషన్కి పవన్ నవ్వాలా.. ఏడవాలా?
మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ పడితే అందులో రెబల్ క్యాండిడేట్లే 415 మందట. తమ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు.. ఇండిపెండెట్లుగా బరిలోకి దిగి ఎవరికి చేయాల్సిన నష్టం వాళ్లు చేశారు. ఈ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు అయిపోయాయి. ఐతే ఇందులో టీఆర్ఎస్ వాళ్లున్నారు. బీజేపీ వాళ్లున్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ వాళ్లూ ఉన్నారు. కానీ ఈ …
Read More »రెండు సార్లు పవన్ కు ఛాన్స్ మిస్సయిపోయిందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండుసార్లు గోల్డెన్ ఛాన్స్ మిస్సయిపోయినట్లే ఉంది. మొదటిసారి దుబ్బాక ఉపఎన్నిక, రెండోది తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలు. ఎంతో ఉత్కంఠకు గురిచేసిన రెండు ఎన్నికలకు పవన్ దూరంగానే ఉండిపోయారు. మరి యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ రెండింటిలోను బీజేపీ మంచి ఫలితాలనే రాబట్టింది. దాంతో కమలంపార్టీ విజయాల్లో తన వంతు పాత్రుందని చెప్పుకోవటానికి పవన్ కు వీల్లేకపోయింది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీకి ప్రచారం …
Read More »రైతుల ఎఫెక్ట్: వైసీపీ కూడా దోషేనా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రారంభమైన రైతుల ఉద్యమం.. ఇప్పుడు మెల్లమెల్లగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో మోడీ సర్కారు తీసుకువచ్చిన.. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలనేది ఆయా రైతుల ప్రధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు సరికొత్త అంశం తెరమీదికి తెచ్చింది.. మోడీ ప్రభుత్వం. రైతుల …
Read More »రెండు మాసాల తర్వాతే కొత్త పాలకవర్గం
ఎంతో ఉత్కంఠ రేకెత్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్నికల ఫలితాల్లో గెలిచిన వారు మరో రెండుమాసాల పాటు వెయిట్ చేయాల్సిందేనా ? అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఎందుకంటే గ్రేటర్ పాలకవర్గానికి ఇపుడున్న పాలకవర్గానికి మరో రెండు నెలలు కాలపరిమితి ఉంది. అంటే ఇపుడున్న మేయర్, డిప్యుటి మేయర్, కార్పొరేటర్లే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కంటిన్యు అవ్వచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అర్జంటుగా ప్రస్తుత …
Read More »గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచిందా ? ఓడిందా ?
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పరిస్దితి ఏమిటో బహుశా కేసీయార్ కే అర్ధమవుతున్నట్లు లేదు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో సింగిల్ లార్జెస్టు పార్టీగా గెలిచినందుకు ఆనందించాలా ? మేయర్ పీఠాన్ని కో ఆప్షన్ ఓట్లతో గెలుచుకున్నందుకు సంతోషించాలా ? లేకపోతే పార్టీబలం 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయినందుకు బాధపడాలో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ఎన్నికలకు ముందుకానీ ప్రచారం సందర్భంలో కానీ కేటీయార్ దగ్గర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates