Political News

ఆ ఎంపీ.. జ‌గ‌న్ మీద మ‌ళ్లీ ఎక్కేశాడుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్న అదే పార్టీ రెబ‌ల్ ఎంపీ.. క‌నుమూరి ర‌ఘురామ కృష్ణ‌రాజు.. ఒక‌వైపు త‌న వ్యాఖ్య‌ల‌తోను, మ‌రోవైపు చ‌ర్య‌ల‌తోనూ పార్టీ నేత‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నారు. ఎక్క‌డ… ఎందుకు.. ఎలా.. మొద‌లైందో తెలియ‌దు కానీ.. చిలికి చిలికి గాలివాన‌గా మారిన.. ఈ వివాదంలో ర‌ఘురామ‌రాజు త‌న‌దైన స్ట‌యిల్‌లో దూకుడుగా వెళ్తూ.. వైసీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏకంగా సీబీఐ …

Read More »

అందరి కళ్ళు ఆమెపైనే

తెలంగాణాలో ఇపుడందరి కళ్ళు వైఎస్ షర్మిల మీదే పడ్డాయి. తొందరలో జరగబోయే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటి ఎన్నికల విషయంలో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐదు మున్సిపాలిటిలు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, అచ్చంపేటతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేయగానే ఒక్కసారిగా ఎన్నికల …

Read More »

ఈ ఈక్వేష‌న్‌.. జ‌గ‌న్‌కు బెడిసి కొడుతోందా ?

రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్లు.. కలిసి వ‌స్తాయ‌ని నాయ‌కులు భావిస్తుంటారు. అవి పొలిటికల్ కావొచ్చు లేదా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. ఏవైనా.. అంతిమ ల‌క్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న కొన్ని ఈక్వేష‌న్లు.. బెడిసి కొడుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్రంలో ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ క్ర‌మంలో 50 శాతం కార్పొరేష‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి ఇచ్చారు. మిగిలిన వాటిలో కొన్ని మ‌హిళ‌ల‌కు, కొన్ని …

Read More »

షర్మిల దీక్ష సక్సెస్సా ? ఫెయిలా ?

ఇప్పుడిదే విషయం చాలామందికి అర్ధం కావటంలేదు. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల 72 గంటల పాటు ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర సమస్యల నేపధ్యంలో పోలీసులు కేవలం గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకే అనుమతించారు. సరే షర్మిల కూడా అనుమతి ప్రకారమే ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షచేశారు. వ్యక్తిగతంగా చూస్తే షర్మిల దీక్ష ఓకేనే. కానీ …

Read More »

అందరి ఆశలు హైకోర్టుపైనే

ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవీటకరణపై ఇప్పటికే కేంద్రమంత్రులు చాలాసార్లు పార్లమెంటులోనే చాలా ప్రకటనలు చేశారు. ప్రైవేటకరణను నిరసిస్తు విశాఖపట్నంలోని ప్రజాసంఘాలు, పార్టీలు ఎంతగా ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేడీ దాఖలు చేసిన పిటీషన్ …

Read More »

శపథం చేస్తున్నా.. తెలంగాణకు ఏదో ఒక రోజు సీఎం అవుతా

వైఎస్ కుమార్తె.. తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె.. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయటం తెలిసిందే. గురువారం ఉదయం మొదలైన ఆమె ధర్నా.. సాయంత్రం వరకు సాగటం.. తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆమె.. లోటస్ పాండ్ వద్ద నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. రోడ్డు …

Read More »

నెల్లూరు రెడ్ల రూటు మారుతోందా? ‌

రాష్ట్రంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జిల్లా నెల్లూరు. రాజ‌కీయాల్లో కానీ, వ్యాపారాల ప‌రంగా కానీ.. నెల్లూరు రెడ్ల‌కే ప్ర‌ధాన ప్రాధాన్యం ఉంటుంది. ఇటు వైసీపీలోను.. అటు టీడీపీలోను.. ఇత‌ర పార్టీల్లోనూ రెడ్డి సామాజిక వ‌ర్గ‌మే నెల్లూరును శాసిస్తోంది. అయితే.. వెంక‌ట‌గిరి, నెల్లూరు సిటీ.. వంటి కొన్ని చోట్ల చంద్ర బాబు ప్ర‌యోగాలు చేసి.. కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి టికెట్లు ఇచ్చినా.. కొన్నాళ్లు ఫ‌లితం …

Read More »

షర్మిల చేతికి ఫ్యాక్చర్.. లోటస్ పాండ్ లో అనూహ్య దీక్ష

తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. తన అనూహ్య నిర్ణయాలతో రాష్ట్రంలో వేడి రగులుస్తున్నారు. ఉద్యోగాల నోటిఫిషన్ విడుదల చేయని తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టిన ఆమె.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు సంధించటం తెలిసిందే. ఒక రోజు దీక్ష కాస్తా అనూహ్యంగా పాదయాత్రగా మారటం.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తొలుత బొల్లారం పోలీస్ స్టేషన్ కు తీసుకెళతారని.. తర్వాత బేగంపేట …

Read More »

నాయ‌కుల‌కు రెస్ట్ లేదు.. తెలంగాణ‌లో మళ్లీ ఎన్నిక‌ల పోరు!

తెలంగాణలో వ‌రుస ఎన్నిక‌లు రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఇంక రిలాక్స్ అవుదామ‌ని అనుకున్న రాజ‌కీయ నేత‌ల‌కు ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక ఎన్నిక ‌ల ప‌ర్వం ప్రారంభం అవుతుండ‌డంతో జెండా భుజానేసుకుని.. మైకు చేత‌ప‌ట్టుకుని ప్ర‌చారంలోకి దిగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, జడ్చర్ల, అచ్ఛంపెట్, నకిరేకల్ మున్సి పల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగనుంది. సీడీఎంఎ అధికారుల …

Read More »

జ‌గ‌న‌న్న రాజ్యంలో ‘చెప్పుల‌’ నిర‌స‌న‌

ఏపీలో త‌మది సంక్షేమ పాల‌న‌.. అని ప్ర‌చారం చేసుకుంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి న‌లుదిక్కుల నుంచి ‘చెప్పుల’ నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ రెండేళ్ల పాల‌న‌తో అద్భుత‌మైన సంక్షేమాన్ని అందిస్తున్నామ‌ని ఇటు సీఎం, అటు మంత్రులు ఊద‌ర గొడుతున్నారు. ఎన్న‌డూ చేయ‌ని సంక్షేమం అమ‌లు చేస్తున్నామ‌ని.. అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నామ‌ని.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక వంటి అనేక ప‌థ‌కాలు.. అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ …

Read More »

వైసీపీ తిరుప‌తి ల‌క్ష్యంపై పెద్దిరెడ్డి సంచ‌ల‌న కామెంట్లు

Peddi Reddy

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ ల‌క్ష్యంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ టార్గెట్ ఇక్క‌డ 5 ల‌క్ష‌ల ఓట్ల‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా పార్టీ నేత‌ల‌కు, మంత్రుల‌కు 5 ల‌క్ష‌ల టార్గెట్ విధించార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఏడుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారంలో పాల్గొన‌గా.. …

Read More »

ఏపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ప‌రిష‌త్ రిజ‌ల్ట్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే!

ఏపీలో పొలిటిక‌ల్ టెన్షన్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నెల 8న జ‌రిగిన జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సం బంధించిన ఫ‌లితాల వెల్ల‌డి ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ‌ను హుటాహుటిన రాత్రికి రాత్రి జారీ చేయ‌డంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స‌హా పలువురు కోర్టుకెక్కారు. ఈ నేప‌థ్యంలో విచారించిన కోర్టు.. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చినా.. ఓట్ల లెక్కింపు, ఫ‌లితం మాత్రం …

Read More »