Political News

క‌రోనాకు ఈసీనే కార‌ణం.. మ‌ర్డ‌ర్ కేసు బుక్ చేస్తాం: హైకోర్టు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర‌స్థాయిలో విజృంభించింది. ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా బాధితుల‌తో దేశం అల్లాడి పోతోంది. ప్ర‌పంచంలో ఇప్పుడు క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న దేశం.. కేవ‌లం భార‌తే. ఒక‌ప్పుడు క‌రోనాపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేశామ‌ని చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అయితే.. రెండో ద‌శ క‌రోనా వ్యాప్తికి కార‌ణం ఎవ‌రు? అనే విష‌యంపై ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అటు కేంద్ర ప్ర‌భుత్వాలు మౌనంగా ఉన్నాయి. గ‌తంలో …

Read More »

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న సీఎం

తెలుగురాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అడ్డుకుంటున్నారు. తమిళనాడు నుండి తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ నిల్వలను నిలిపేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాయటం ఇఫుడు సంచలనంగా మారింది. తమిళనాడులో కూడా ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగిపోతున్న కారణంగా తెలుగురాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయటం కుదరదంటు సీఎం నిక్కచ్చిగా తన లేఖలో స్పష్టంచేశారు. ఆక్సిజన్ అవసరమైన పాజిటివ్ కేసులు తమిళనాడులో కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయట. శ్రీపెరుంబదూరులో ఉన్న …

Read More »

విశాఖ ఉక్కు రికార్డు

ఆక్సిజన్..ఇపుడిది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోగులకు అత్యవసరంగా మారిపోయింది. అందరు రోగులకు ఆక్సిజన్ అవసరం ఉండదన్నది వాస్తవం. కానీ కరోనా కారణంగా జ్వరం తగ్గకపోయినా, శ్వాశతీసుకోవటంలో ఇబ్బందులు మొదలైనా వెంటనే ఆక్సిజన్ చాలా అవసరం అన్నది కూడా వాస్తవమే. ఈ కారణంగానే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో కరోనా రోగంతో చనిపోతున్న వారికన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతోది. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గడచిన …

Read More »

తొందరలోనే మినీ లాక్ డౌన్ ?

దేశవ్యాప్తంగా తొందరలోనే మినీ లాక్ డౌన్ విధించే సూచనలు కనబడుతున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతంగా పెరిగిపోతుండటం, ఆక్సిజన్ నిల్వలు లేక చాలామంది రోగులు చనిపోతుండటం లాంటి ఘటనల కారణంగా లాక్ డౌన్ తప్పని పరిస్దితులు కనబడుతున్నాయి. ఇదే సమయంలో మినీ లాక డౌన్ పెట్టడానికి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం గడచిన వారంరోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య …

Read More »

మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం

కరోనా వైరస్ చిన్నా పెద్దా.. రాజు పేదా అనే తేడాలేమీ చూడట్లేదు. ఆరోగ్యం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టగల వాళ్లు కూడా వైరస్ ధాటికి నిలవలేకపోయారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కరోనాకు తలవంచాల్సి వచ్చింది. మరెంతో మంది విషమ స్థితిని ఎదుర్కొన్నారు. తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నేత ఆరోగ్యం కరోనా వల్ల విషమించింది. ఆయనే.. మాజీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం నేత …

Read More »

జగన్‌ దిగి రాక తప్పదా?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవాన్ని చూస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు తీవ్రత చాలా ఎక్కువ అన్నది స్పష్టం. ఒకప్పుడు రోజుకు గరిష్టంగా లక్ష కేసులు వస్తేనే గుండెలు బాదేసుకున్నాం. కానీ ఇప్పుడు రోజువారీ కేసులు 4 లక్షలకు చేరువగా ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలోనే రోగులు ప్రాణాలు వదులతున్నారు. ప్రభుత్వాలు మరణాల విషయంలో సరైన డేటా ఇవ్వకపోవడం వల్ల కొందరికి తీవ్రత అర్థం కాక పోతుండొచ్చు. ఈ …

Read More »

వైసీపీ ఖాతాలో మూడు ఎంఎల్సీలు

YS Jagan Mohan Reddy

వచ్చే నెలలో అధికార వైసీపీ ఖాతాలో మూడు ఎంఎల్సీలు జమకాబోతోంది. మే నెల 24వ తేదీన ముగ్గురు ఎంఎల్సీల పదవులు ముగియబోతున్నాయి. ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్, టీడీపీ ఎంఎల్సీ ఎంఏ షరీఫ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోమువీర్రాజు, వైసీపీ ఎంఎల్సీ డీసీ గోవిందరెడ్డి పదవీకాలం అయిపోతోంది. వీరిలో డీసీ గోవింద రెడ్డికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో టర్మ్ రెన్యువల్ చేస్తారని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్ధితుల్లో షరీఫ్, …

Read More »

సోము దూరం దూరం… ఏపీ బీజేపీలో కొత్త ఫైట్ ?

రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దే ప‌దే వ్యాఖ్య‌లు సంధిస్తున్న బీజేపీ నేత‌ల‌కు ఎక్క‌డిక‌క్క‌డ ఎదుర వుతున్న వ‌ర్గ పోరు త‌ల‌నొప్పిగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీలో అనేక మార్పులు తీసుకువ‌చ్చారు. ప్ర‌క్షాళ‌న పేరుతో.. రాజ‌కీయంగా దూకుడు గా ఉన్న నేత‌ల‌ను సైలెంట్ చేశారు. అదే స‌య‌మంలో ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. ఇలా వ‌చ్చిన వారికి …

Read More »

వారిని వ‌ద‌ల్లేరు.. వీరిని న‌మ్మ‌లేరు.. టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి..!

టీడీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌జాబలం ఉన్న నాయ‌కులు ప‌నిచేయ‌డం లేదు. ప్ర‌జ‌ల బ‌లం లేనివారు… ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. పోనీ.. వీరిని న‌మ్ముకుని చంద్ర‌బాబు ముందుకు న‌డిచే ప‌రిస్థితి ఉందా? అంటే.. అది కూడా లేదు. దీంతో పార్టీ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. నిత్యం మీడియాలో క‌నిపిస్తున్న మొహాల‌ను చూస్తే.. టీడీపీ త‌ర‌ఫున బాగా మాట్లాడుతున్నారు. మంచి …

Read More »

రూ.7వేలు ఉండే దుబాయ్ టికెట్ రూ.40వేలు ఎందుకైంది?

హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి. తాజాగా పెరిగిపోతున్న …

Read More »

ఆ విషయం లో మాత్రం జగన్ చాలా సీరియస్

వారాంతంలో తనకు తెలిసిన సమాచారాన్ని.. తాను అనుకున్న విషయాన్ని.. తనకు తానుగా ఎంపిక చేసుకున్న ఎజెండాను తన అక్షరాల రూపంలో సంధించే ఆంధ్రజ్యోతి యజమాని ఆర్కే.. ఒక వారం తన ఆర్టికల్ కు విశ్రాంతి ఇచ్చారు. ఆయన కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆయన దేని మీదా ఫోకస్ చేయలేకపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాను రాసిన వీకెండ్ కామెంట్ లో ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. …

Read More »

టీడీపీ పై ఫ్రైడే ఎఫెక్ట్‌.. అన్న‌దే జ‌రిగిందా ?

టీడీపీ ఏమ‌ని విమ‌ర్శ‌లు గుప్పించిందో .. జ‌గ‌న్ ఇప్పుడు అదే చేస్తున్నారా ? టీడీపీ నేత‌లు.. ఏయే విష‌యాల‌పై త‌న‌ను విమ‌ర్శించారో.. ఖ‌చ్చితంగా ఆయా అంశాల‌పైనే .. వారిపై జ‌గ‌న్ క‌సి తీర్చుకుంటున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. టీడీపీ అధికారంలో ఉన్ప‌ప్పుడు.. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూసేవి. ముఖ్యంగా అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌ను ఆట‌ప‌ట్టించేందుకు టీడీపీ నేత‌లు వ‌రుస …

Read More »